-
బాబు కావాలంటే బైక్ పాప కావాలంటే స్కూటీ
-
కుర్చీతాత బూతు పురాణం.. పోలీసులకు ఫిర్యాదు!
వెంగళరావునగర్(హైదరాబాద్): బూతు పురాణాలతో మరోసారి కుర్చీతాత రచ్చకెక్కాడు. గతంలో అనేకమార్లు ప్రముఖ యూట్యూబ్ స్టార్స్ స్వాతినాయుడు, వైజాగ్ సత్యపై దుర్భాషలాడి పలు కేసుల్లో ఇరుక్కున్నాడు. చివరకు క్షమాపణలు కోరుతూ కేసులు లేకుండా చేసుకున్నాడు. అయితే మళ్లీ అదే తరహాలో బూతులు మాట్లాడుతున్నాడని బాధితులు మంగళవారం మధురానగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలియజేసిన వివరాలు.. రహమత్నగర్కు చెందిన కాలా పాషా అలియాజ్ కుర్చీ తాత మహేశ్బాబు సినిమాలోని కుర్చీ పాట ద్వారా యూ ట్యూబ్లో ఫేమస్ అయ్యాడు. అయితే, యూ ట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ తీసే స్వాతినాయుడు, వైజాగ్ సత్యతో గతంలో సన్నిహితంగా ఉండేవాడు. అతని చెడు ప్రవర్తన కారణంగా వారు అతనిని దూరంగా ఉంచారు. దాంతో గతంలో వారిని తీవ్ర అసభ్య పదజాలంతో దుర్భాషలాడటంతో బాధితులు జూబ్లీహిల్స్, తర్వాత మధురానగర్ పీఎస్లో కేసులు పెట్టారు. అనంతరం కుర్చీతాత వారితో రాజీ కుదుర్చుకున్నాడు. తాజాగా మళ్లీ తమను తిడుతున్నాడంటూ స్వాతినాయుడు, వైజాగ్ సత్యలు మంగళవారం మధురానగర్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, రెండు రాష్ట్రాలకు చెందిన ప్రస్తుత, మాజీ సీఎంలను, సినీరంగ ప్రముఖులను సైతం తిడుతున్నాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
హైదరాబాద్లో హైఅలర్ట్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. శుక్రవారం సాయంత్రం నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులను అప్రమత్తం చేశామని.. కీలక ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. బెంగళూరు కేఫ్ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామని చెప్పారాయన. జూబ్లీ బస్టాండ్, ఎంజీబీఎస్తో పాటు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసి.. అనుమానాస్పద వెహికిల్స్ను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం మధ్యాహ్నాం బెంగళూరులోని కుండలహళ్లిలోని ఫేమస్ రామేశ్వరం కేఫ్ వద్ద టిఫిన్ బాక్స్ బాంబ్తో ఆగంతకులు బ్లాస్ట్ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. ఐఈడీతో దాడి జరిపారని.. పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని చెప్పారాయన. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ప్రకటించారాయన. ఇదీ చదవండి: బెంగళూర్ కేఫ్లో పేలిన టిఫిన్ బాక్స్ బాంబ్ -
ప్రజాభవన్ ఎదుట రోడ్డుప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరం
-
Hyderabad City Police: హాజరవలేని ఆహ్వానం
సోషల్ మీడియా వైరల్: ఏదైనా విందుకో, వేడుకకో ఎవరైనా ఆహ్వానపత్రిక పంపితే మనం వెళ్లకతప్పదు. కాని ఓ ఆహ్వనపత్రిక మనం హాజరవలేని విధంగా వచ్చిందనుకోండి అదే విడ్డూరం. డిసెంబర్ 31న హైదరాబాద్ సిటీ పోలీస్ హైదరాబాద్ నగరవాసులకు ఇటువంటిదే ఓ ఆహ్వానపత్రిక పంపింది. అదేమిటో మీరూ ఓ లుక్కేయండి. ఈ నూతన సంవత్సర వేడుకలకు మీరు మా అతిధి అవ్వకూడదని ప్రార్ధించండి. కాకపోతే రాష్ డ్రైవర్లకు, తాగి నడిపే వాహనదార్లకు, ఇతర రూల్స్ అతిక్రమించేవారికి మా ఆతిధ్యం ఉచితం. వారికి మాత్రమే స్పెషల్ లాకప్ డీజె షో ఏర్పాటు చేయబడుతుంది. ఇకపోతే మా ఆతిధ్యం స్వీకరించేవారికి రుచికరమైన కాప్ కేక్ , ప్రత్యేకంగా మా డెజర్ట్లో పొందుపరిచిన కష్టడీ వడ్డించబడుతుంది. ఆఖరుగా ఈ పార్టీ వేదిక మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ అని వినూత్నంగా డిజైన్ చేసిన ఈ ‘హాజరవలేని ఆహ్వానం’ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. Please dont be our Guest, our Service is Quite Complicated, Rest on you...#DontDrinkAndDrive#DrunkenDrives pic.twitter.com/9eEvjJhiU5 — Hyderabad City Police (@hydcitypolice) December 31, 2023 చదవండి: Hyd: భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. మద్యం ఎంత తాగారంటే? -
మోస్ట్ వాంటెడ్గా నాడు తండ్రి.. నేడు కొడుకు
హైదరాబాద్: అప్పట్లో మహ్మద్ షకీల్ ఆమీర్ అలియాస్ బోధన్ షకీల్... ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడు సాహిల్... హైదరాబాద్ పోలీసులు వాంటెడ్గా మారారు. 2007 నాటి నకిలీ పాస్పోర్ట్స్ కేసులో షకీల్, తాజాగా ప్రజాభవన్ వద్ద చోటు చేసుకున్న బీఎండబ్ల్యూ కారు ప్రమాదం, తదనంతర నాటకీయ పరిణామాల కేసులో సాహిల్ నిందితులుగా ఉన్నారు. పదహారేళ్ళ క్రితం తండ్రి కోసం పరుగులు పెట్టిన సిటీ కాప్స్ ఇప్పుడు కుమారుడి కోసం వెతుకుతున్నారు. సాహిల్ దుబాయ్కి పారిపోవడంతో అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. పంజగుట్ట ప్రమాదం నేపథ్యంలో వెస్ట్జోన్ పోలీసులు గతేడాది జూబ్లీహిల్స్ పరిధిలో జరిగిన మరో యాక్సిడెంట్ ఫైల్ను బయటకు తీస్తున్నారు. ముప్పతిప్పలు పెట్టిన షకీల్... మనుషుల అక్రమ రవాణాలో భాగమైన నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ 2007లో వెలుగులోకి వచ్చింది. అమెరికా సహా కొన్ని దేశాల్లో గుజరాతీయులకు ఎంట్రీ ఉండేది కాదు. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళను అక్రమంగా దేశం దాటించడానికి దేశ వ్యాప్తంగా ముఠాలు ఏర్పడ్డాయి. వీరు కొందరు ప్రజాప్రతినిధులతో ఒప్పందాలు చేసుకుని గుజరాతీయులను వాళ్ళ కుటుంబీకులుగా మార్చారు. ఆయా ప్రతినిధుల సిఫారసుల ఆధారంగా మారు పేర్లతో గుజరాతీయులకు పాస్పోర్టులు అందించారు. సుదీర్ఘకాలం జరిగిన ఈ స్కామ్లో ఢిల్లీలో ఎంపీ బాబూభాయ్ కటారా అరెస్టుతో వెలుగులోకి వచ్చింది. నగరంలో నమోదైన కేసులో బోధన్ షకీల్ నిందితుడిగా మారాడు. అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో షకీల్ కోసం హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముమ్మరంగా గాలించి పట్టుకున్నారు. కారు కేసులో కుమారుడి కోసం... నకిలీ పాస్పోర్ట్స్ స్కామ్ జరిగిన దాదాపు పదహారేళ్ల తర్వాత ‘బీఎండబ్ల్యూ కారు’ కేసు చోటు చేసుకుంది. పంజగుట్ట ఠాణా పరిధిలోని ప్రజాభవన్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరగడం, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి అంశాలతో ముడిపడి ఉన్న ఈ కేసు నుంచి సాహిల్ను తప్పించడానికి పోలీసులు ప్రయతి్నంచడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పంజగుట్ట ఇన్స్పెక్టర్ బి.దుర్గారావును సస్పెండ్ చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి పరారీలో ఉన్న సాహిల్ కోసం పంజగుట్టతో పాటు వెస్ట్జోన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తు అతడిపై ఎల్ఓసీ జారీ చేశారు. షకీల్ ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాడని, అక్కడ నుంచే కుమారుడని తప్పించే కథ మొత్తం నడిపి, అతడినీ అక్కడికే రప్పించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. నాటి కేసులోనూ గోల్మాల్ జరిగిందా? తాజాగా పంజగుట్ట పరిధిలో జరిగిన ఈ ప్రమాదం కేసు గతేడాది నాటి జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ను మరోసారి తెరపైకి తెచ్చింది. 2022 మార్చి 17 రాత్రి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు నుంచి జూబ్లీహిల్స్ దూసుకువచ్చిన మహేంద్ర థార్ కారు రోడ్డుపై బుడగలు విక్రయించే వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన కాజల్ చౌహాన్, సారికా చౌహాన్, సుష్మ భోస్లే గాయపడగా.. కాజల్ కుమారుడు అశ్వతోష్ (రెండు నెలలు) మృతి చెందాడు. ఈ థార్ కారుపై ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉండటంతో అప్పట్లో సాహిల్పై ఆరోపణలు వచ్చాయి. మరుసటి రోజు స్పందించిన షకీల్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. జూబ్లీహిల్స్లో ప్రమాదానికి కారణమైన కారు తన సోదరుడిదని (కజిన్), తానూ అప్పుడప్పుడు వాడుతుంటానని పేర్కొన్నారు. సోదరుడి కుటుంబం కారులో ప్రయాణిస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 వద్ద సిగ్నల్ సమీపంలో బెలూన్లు అమ్ముకునే యువతికి కారు వల్ల గాయమైందని, ఆ భయంలో ఆమే పసిపాపను పడేయడంతో దుర్ఘటన జరిగిందని చెప్పుకొచ్చారు. ఆ ఉదంతం చాలా బాధాకరమంటూ జరిగిన విషయాన్ని తాను తన కజిన్తో మాట్లాడి తెలుసుకున్నానని షకీల్ పేర్కొన్నారు. పసిపాపను కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పానని అన్నారు. ఈ కేసులో పోలీసులు సైతం సాహిల్కు క్లీన్చిట్ ఇచ్చేశారు. తాజాగా పంజగుట్ట కేసులో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఉన్నతాధికారులు నాటి జూబ్లీహిల్స్ కేసును తిరగదోడుతున్నారు. అప్పట్లో జరిగిన ప్రమాదంలోనూ సాహిల్ పాత్ర ఉందా? ఏదైనా గోల్మాల్ జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తామని పశి్చమ మండల డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్ మీడియాకు వెల్లడించారు. -
హైదరాబాద్: పోలీసులకు చిక్కిన వెరైటీ దొంగ
సాక్షి, హైదరాబాద్: ఓయూ పోలీసులకు ఓ వెరైటీ దొంగ చిక్కాడు. ఆ ఇంట్లో ఎంత దొంగతనం చేశాడో చీటీ కూడా రాసి పెడతాడు శంకర్ నాయక్.. అలాగే డైరీలో ఏ రోజు ఎవరి ఇంట్లో దొంగతనం చేశాడో కూడా రాసుకుంటాడు. ఇలా ఎందుకు చేస్తాడు అనుకుంటారా? పోలీసులకు తనపై తప్పుడు ఫిర్యాదు ఇవ్వకుండా ఇలా చేస్తాడని ఓయూ పోలీసులు తెలిపారు. దొంగిలించబడ్డ సొమ్ముతో ముత్తూట్ గోల్డ్ లోన్లో తాకట్టు పెట్టి హోటల్స్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ, మిగిలిన ఆ డబ్బుతో మళ్లీ దొంగతనం చేయడానికి ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి, ఆ బండ్లపై దొంగతనం చేసే వెరైటీ దొంగ ఈ శంకర్ నాయక్. మహబూబ్నగర్కి చెందిన దొంగ శంకర్ నాయక్ గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పీడీ యాక్ట్ కేసు నమోదైంది. అయినా దొంగ బుద్ది మారలేదు, హబ్సిగూడ పరిధిలో మూడు దొంగతనాలు చేయడం దొంగిలించిన సొమ్ము ఎంత అనేది ఆ ఇంట్లో చీటీ రాసి మరి వెళతాడు. ఇప్పటివరకు 94 దొంగతనాలు చేసిన శంకర్ నాయక్ చివరికి ఓయూ పోలీసులకు చిక్కి మళ్లీ రిమాండ్ అయ్యాడు. అయితే రిమాండ్ చేసిన శంకర్ నాయక్ నుంచి 20 తులాల బంగారం, 2 బైక్స్, 3 మొబైల్ ఫోన్లు, డైరీ, చోరీకి ఉపయోగించిన వస్తువులు ఓయూ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడిపై కక్షతో -
హైదరాబాద్ పబ్స్పై పోలీసుల ఫుల్ ఫోకస్
-
హైదరాబాద్ లో డ్రగ్స్ నిర్మూలన పై స్పెషల్ డ్రైవ్
-
సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడొద్దు: సీపీ శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రెండు నెలల్లో హైదరాబాద్లో డ్రగ్స్ను పూర్తిగా నిర్మించాలని సీటీ పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అన్నారు. హైదరాబాద్ సీటీ పోలీసు బృందంతో ఆయన ఆదివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. డ్రగ్స్ను పూర్తిగా కట్టడి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సిటీలో డ్రగ్స్, గంజాయి మాట వినపడద్దని తెలిపారు. నిజమైన బాధితుడికి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ కమిషనర్ పేరు చెప్పి పైరవీలు చేసే వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇటీవల హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. చదవండి: TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా? -
TS Election 2023: ఢిల్లీకి చేరిన ప్యానల్ జాబితా..!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్పై ఆకస్మికంగా వేటు పడింది. దీంతో తక్షణ కొత్త కొత్వాల్ నియామకం అనివార్యంగా మారింది. ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన ప్యానల్ లిస్ట్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఈసీకి పంపారు. ఈ ముగ్గురిలో ఒకరిని హైదరాబాద్ పోలీసు కమిషనర్గా ఎంపిక చేస్తుందా? లేక మరికొన్ని పేర్లు పంపాల్సిందిగా కోరుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా.. నేటి సాయంత్రానికి కొత్త కొత్వాల్ పేరు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) హోదాలో ఉన్న సీవీ ఆనంద్ 1991 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. సీనియారిటీ ప్రకారం ఆయన తర్వాత స్థానాల్లో జితేందర్ (1992 బ్యాచ్), సందీప్ శాండిల్య (1993 బ్యాచ్), విజయ్ ప్రభాకర్ ఆప్టే (1994 బ్యాచ్) ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆప్టే కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో అదే బ్యాచ్కు చెందిన కొత్తకోట శ్రీనివాస్రెడ్డి పేరును ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జితేందర్, సందీప్ శాండిల్య, శ్రీనివాస్రెడ్డి పేర్లతో రూపొందించిన ప్యానల్ లిస్టును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. గతంలోనూ ఐదు సందర్బాల్లో.. హైదరాబాద్ పోలీసు కమిషనర్ పోస్టు అదనపు డీజీ క్యాడర్ అధికారికి సంబంధించింది. ఆనంద్ 2021 డిసెంబర్ 25 నుంచి నగర పోలీసు కమిషనర్గా పని చేశారు. ఆయనకు ఈ ఏడాది ఆగస్టు 8న డీజీపీగా పదోన్నతి వచ్చినప్పటికీ ఎక్స్ క్యాడర్ పోస్టు సృష్టించిన ప్రభుత్వం హైదరాబాద్ కొత్వాల్గా కొనసాగించింది. గతంలోనూ ఐదు సందర్భాల్లో డీజీపీగా పదోన్నతి పొందిన అధికారులు హైదరాబాద్ సీపీగా పని చేశారు. ఈ హోదాలో ఉన్న వారిని నగర కొత్వాల్గా నియమించిన దాఖలాలు లేవు. కేవలం ఈ పోస్టులో పని చేస్తూ, పదోన్నతి పొంది, ఎక్స్ క్యాడర్ పోస్టులో కొనసాగిన వారే ఉన్నారు. తెరపైకి కొత్త పేర్లు? ఆనంద్తో పాటు పదోన్నతి పొందిన వారిలో జితేందర్ కూడా ఉన్నారు. ఈయన గతంలో నగర ట్రాఫిక్ చీఫ్గా, పోలీసు అకాడమీ డైరెక్టర్గా, అదనపు డీజీపీగా (శాంతిభద్రతలు) పని చేసి ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన పేరును కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుందా? లేక అదనపు డీజీ హోదాలో ఉన్న మరో అధికారి పేరును పంపాల్సిందిగా కోరుతుందా? అనే సందేహం నెలకొంది. అలా కోరితే 1994 బ్యాచ్కే చెందిన బి.శివధర్రెడ్డికి జాబితాలో చోటు దక్కుతుంది. సందీప్ శాండిల్యకు దక్షిణ మండల డీసీపీ, సైబరాబాద్ సీపీ, రైల్వేస్ డీజీగా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం ఏడీజీ ఆపరేషన్స్ హోదాలో ఉన్న కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సుదీర్ఘకాలంగా లూప్లైన్లోనే ఉన్నారు. ఎన్నికల సంఘం సీనియారిటీ, గతంలో చేసిన పోస్టులు, సమర్థత ఆధారంగా హైదరాబాద్ సీపీని ఎంపిక చేయాలని భావిస్తే కొత్తగా మరికొన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
బంజారాహిల్స్ లో 3.35 కోట్ల హవాలా నగదు పట్టివేత
-
హైదరాబాద్లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా.. శుక్రవారం పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండోరోజు నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలు కదులుతుండడంతో.. పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఇంకా అమలు చేస్తున్నారు. నిమజ్జనం కోసం ఇంకా వందల సంఖ్యలో విగ్రహాలు రోడ్ల వెంట బారులు తీరాయి. ఈ క్రమంలో పోలీసులు కీలక సూచన చేశారు. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్లో వెళ్లే వాహనాలు.. ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. నగరంలో నిన్న(గురువారం) ఉదయం నుంచి విగ్రహాల నిమజ్జనం మొదలైంది. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం తర్వాత చాలాసేపు విగ్రహాల నిమజ్జనం జరగలేదు. సాయంత్రం నుంచి విగ్రహాలు ట్యాంక్బండ్ వైపు రావడం మొదలైంది. ఈ క్రమంలో ఇవాళ రెండో రోజూ కూడా ట్యాంక్బండ్లో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. లిబర్టీ మీదుగా హిమాయత్ నగర్, నారాయణగూడ, తిలక్నగర్.. కోరంటి ఆస్పత్రి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అబిడ్స్, లక్డీకాపూల్ వైపు భారీగానే ట్రాఫిక్ ఉంది. మరోవైపు ట్యాంక్బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్బండ్పై గణనాథులు బారులు తీశారు. మధ్యాహ్నాంలోగా నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. -
సినిమాల్లోని సీన్ల పైనా నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు మాదాపూర్లోని విఠల్నగర్లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో గత నెల 31న జరిగిన ఓ డ్రగ్ పార్టీపై దాడి చేశారు. ఆ ఫ్లాట్లో కనిపించిన సీన్... ఇటీవల విడుదలైన ‘బేబీ’ సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, టీఎస్ నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్కు నోటీసులు ఇచ్చామని, వారు తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని గురువారం చెప్పారు. అందులో ఉన్న సీన్లపై తాము చెప్పిన తర్వాతే సినిమాలో వార్నింగ్ నోట్ పెట్టారని, అప్పటివరకు అలాంటిది కూడా లేదని అన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాల్లో పెట్టవద్దని ఆనంద్ హితవు పలికారు. వీటి ద్వారా స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇలాంటి సీన్లతో కూడిన సినిమాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పిన ఆనంద్.. ఇకపై ఈ తరహాలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘టాలీవుడ్ లింకులు ఉన్న డ్రగ్స్ కేసు’లో పరారీలో ఉన్న సూర్య.. స్నాట్ అనే పేరుతో పబ్ నిర్వహిస్తున్నాడని, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్నాటింగ్ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారని చెప్పారు. దీన్ని బట్టి సూర్య తన వద్ద మాదకద్రవ్యాలు లభిస్తాయని అర్థం వచ్చేలా తన పబ్కు పేరు పెట్టాడని భావించాల్సి వస్తోందని ఆనంద్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్ను ప్రేరేపించే సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరతామన్నారు. ఎన్సీబీ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని, దీన్ని సీరియస్గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. తాము ఇటీవల కాలంలో 33 మంది నైజీరియన్లను అరెస్టు చేయగా, వారిలో 18 మంది బెంగళూరులో స్థిరపడిన వారిగా తేలిందన్నారు. టీఎస్ నాబ్ సేవల విస్తరణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరతామని చెప్పారు. -
బేబీ సినిమాపై హైదరాబాద్ సీపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో సంచలనాలకు నెలవైన బేబీ సినిమాపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఫైర్ అయ్యారు. సినిమా డ్రగ్స్ కల్చర్ను ప్రొత్సహించేలా ఉందంటూ మండిపడ్డారాయన. సినిమాలో డ్రగ్స్ను ప్రొత్సహించేలా సన్నివేశాలు ఉన్నాయి. ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో రైడ్లు నిర్వహించినప్పుడు.. బేబీ సినిమాలోని సీన్లలాంటివి కనిపించాయి. ఆ సినిమాను చూసే నిందితులు అలా పార్టీ చేసుకున్నారు. సినిమాల్లో అలాంటి సన్నివేశాలు పెట్టినప్పుడు.. కనీస హెచ్చరిక(కింద మూలన వేసే ప్రకటన) కూడా వెయ్యికుండా డైరెక్ట్ ప్లే చేశారు. ( బేబీ చిత్రంలోని అభ్యంతరకర సీన్లుగా చెబుతున్నవాటిని మీడియాకు ప్లే చేసి చూపించారాయన). మళ్లీ మేం హెచ్చరిస్తేనే హెచ్చరిక వేశారు. ఇందుకుగానూ.. బేబీ సినిమా టీంకు నోటీసులు జారీ చేస్తాం అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇక నుంచి ప్రతీ సినిమాపై నిఘా వేస్తామని.. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఊరుకునేది లేదని నగర సీపీ స్పష్టం చేశారు. -
నా భర్త మృతికి కారణం వాళ్లిద్దరే: రవీందర్ భార్య
సాక్షి, హైదరాబాద్: హోంగార్డ్ రవీందర్ సూసైడ్ కేసు ఊహించని మలుపు తిరిగింది. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే అధికారుల వేధింపులూ కూడా తన భర్త మరణానికి కారణమంటూ చెబుతూ వచ్చిన రవీందర్ భార్య సంధ్య.. తాజాగా సంచలన ఆరోపణలకు దిగారు. ‘‘నా భర్తను తగలబెట్టారు. కానిస్టేబుల్చందు, ఏఎస్ఐ నర్సింగరావులు కలిసి నా భర్తపై పెట్రోల్ పోశారు. కానీ, ఈ ఇద్దరూ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. హోంగార్డ్ ఆఫీస్ సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదు. అది దొరికితే అసలు వాస్తవాలు బయటకు వస్తాయి’’ అని పేర్కొన్నారామె. తన భర్తను తీవ్రంగా వేధించారన్న ఆమె.. ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. "నా భర్త ఫోన్ అన్లాక్ చేసి మొత్తం డేటా డిలీట్ చేశారు. హమీద్ అనే అధికారి నా దగ్గరకు వచ్చి పెట్రోల్ బంక్లో ప్రమాదం జరిగిందని చెప్పాలన్నారు. అలా అయితేనే బెనిఫిట్స్ వస్తాయని చెప్పి.. నన్ను పక్కదారి పట్టించే యత్నం చేశారు" అని సంధ్య ఆరోపించారు. తన భర్తను చంపిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని కన్నీళ్లతో డిమాండ్ చేస్తున్నారామె. జీతం పడకపోవడంతో.. మనస్తాపానికి గురైన రవీందర్.. మంగళవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందారు. రవీందర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో రవీందర్ భార్య కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె సంతకం చేస్తేనే మృతదేహానికి పోస్ట్మార్టం చేస్తారు వైద్యులు. దీంతో ఉస్మానియా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆమె ఆరోపణలపై పోలీస్ శాఖ స్పందించాల్సి ఉంది. -
‘సిటీ పోలీస్’లో అటాచ్మెంట్లకు చెల్లు!
హైదరాబాద్: ఓ అధికారికి లేదా సిబ్బందికి ఉన్నతాధికారులు ఒక పోలీసుస్టేషన్లో పోస్టింగ్ ఇస్తారు. సర్దుబాట్లు, అప్పటి అవసరాల్లో భాగంగా ఆయన/వాళ్ళు మరో చోట పని చేస్తుంటారు. తాత్కాలిక ప్రాతిపదికన పని చేయాల్సిన వీళ్ళు నెలలు, ఏళ్ళ తరబడి అక్కడే ఉండిపోతున్నారు. ఫలితంగా వీరికి పోస్టింగ్ ఇచ్చిన ఠాణాలో సిబ్బంది కొరతో పని తీరు మందగిస్తోంది. సాంతికేంగా అటాచ్మెంట్గా పిలిచే ఈ విధానానికి నగర కొత్వాల్ సీవీ ఆనంద్ స్వస్తి పలికారు. దీనికి తోడు సిబ్బందికి కచ్చితంగా మూడు షిఫ్టుల విధానం అమలు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. నగర పోలీసు విభాగంగాలో పోలీసుస్టేషన్లను పరిధి, ప్రాధాన్యత తదితరాల ప్రాతిపదికన ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తారు. కేటగిరీని బట్టే అందులో సిబ్బంది సంఖ్య ఆధారపడి ఉంటుంది. అటాచ్మెంట్ల కారణంగా పోలీసుస్టేషన్లలో పోస్టింగ్ ఇచ్చిన వాస్తవ సిబ్బందికి, అక్కడ పని చేస్తున్న వారికి మధ్య పొంతన లేకుండా ఉంటోంది. ఈ ప్రభావం ఆ ఠాణాల పనితీరుపై పడి ఉన్న సిబ్బందిపై పని భారం తీవ్రంగా పెరుగుతోంది. ఏళ్ళుగా ఈ విధానం అమలులో ఉన్నా... ఇప్పటి వరకు ఉన్నతాధికారుల దృష్టికి రాలేదు. ఇటీవల జరిగిన హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణతో మ్యాన్పవర్ ఆడిట్ నిర్వహించిన అధికారుల దృష్టికి ఈ సమస్య వచ్చింది. ఈ నేపథ్యంలోనే దాదాపు వంది మందికి పైగా సిబ్బంది అటాచ్మెంట్లపై వివిధ విభాగాలు, కార్యాలయాల్లో పని చేస్తున్నట్లు గుర్తించి వారిని వెనక్కు రప్పించారు. కచ్చితంగా ప్రతి రోజూ అదనపు సిబ్బంది అవసరమైన చోట ఉన్న సివిల్ కానిస్టేబుళ్ళకు బదులు ఏఆర్ సిబ్బందిని మోహరిస్తున్నారు. నగర పోలీసు కమిషనర్ అనుమతి లేకుండా శాంతిభద్రతల విభాగం నుంచి ఒక్కరిని కూడా అటాచ్మెంట్పై పంపకూడదని స్పష్టం చేశారు. మరోపక్క క్షేత్రస్థాయి సిబ్బందికి కచ్చితంగా మూడు షిఫ్టుల విధానం అమలు పైనా కొత్వాల్ ఆనంద్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. -
మహేష్ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా
హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏపీ మహేష్ అర్బన్ కోపరేటవ్ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) భారీ విధించింది. సైబర్ భద్రతను నిర్లక్ష్యం చేసినందుకు గానూ రూ. 65 లక్షల జరిమానా విధిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జనవరి 24న మహేష్ బ్యాంక్ సర్వర్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఖాతాదారులకు సంబంధించిన రూ. 12.48 కోట్లను వివిధ ఖాతాలకు నైజీరియన్ ముఠా బదిలీ చేసుకుంది. బ్యాంకు ప్రతినిధుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహేష్ బ్యాంకు యాజమాన్యం సైబర్ భద్రతను పూర్తిగా గాలికొదిలేసినట్లు సైబర్ క్రైం పోలీసులు విచారణలో తేల్చారు. సైబర్ నేరగాళ్లు బ్యాంకు సిబ్బందికి ఫిషింగ్ మెయిళ్లు పంపించి సర్వర్ లోకి చొరబడినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ వద్ద హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రస్తావించి ఆ బ్యాంకు లైసెన్సును రద్దు చేయాలని సూచించారు. అయితే లైసెన్స్ రద్దు న్యాయపరంగా వీలు కాకపోవడంతో ఆర్బీఐ మహేష్ బ్యాంకుకు భారీ జరిమానా విధించింది. సైబర్ భద్రత లోపాల కారణంగా ఆర్బీఐ జరిమానా విధించడం దేశంలో ఇదే తొలిసారి అని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇదీ చదవండి: సైబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? రూ. కోటి వరకూ కవరేజీ.. -
థ్యాంక్యూ పోలీస్ అంకుల్..
హైదరాబాద్: ‘‘హాయ్ పోలీసు అంకుల్స్. మీరు సమయానికి స్పందించి నన్ను హాస్పిటల్కు తీసికెళ్లకపోతే నేను చచ్చిపోయేవాడినని మా మమ్మీ, డాడీ చెప్పారు. నన్ను కాపాడినందుకు అందరికీ థ్యాంక్యూ’’ అంటూ ఓ ఐదేళ్ల చిన్నారి ముద్దొచ్చే మాటలతో నారాయణగూడ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈనెల 13న దత్తానగర్కు చెందిన బాలుడు దివ్యాన్ష్ ఇంట్లో ఉన్న పెయింట్ టిన్నర్ తాగడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో అతడి పిన్ని ఏం చేయాలో తోచక డయల్–100కు కాల్ చేసి బోరున విలపించింది. తక్షణమే స్పందించిన పెట్రోకార్ కానిస్టేబుల్ రాజు, ప్రమోద్, హోంగార్డు బాసిత్ క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. బాలుడిని పెట్రోకార్లో ఎక్కించుకుని ఐదు నిమిషాల్లో కింగ్కోఠి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అతడి పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందిస్తూ బాలుడిని అదే వాహనంలో నిలోఫర్కు తరలించారు. దాదాపు పదిరోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందిన దివ్యాన్ష్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పీఎస్కు వచ్చిన అతను ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఎస్ఐ నరేష్, ఆరోజు ప్రాణాలు కాపాడిన సిబ్బంది రాజు, ప్రమోద్, హొంగార్డు బాసిత్, తదితర సిబ్బందిని కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. -
Ambulance: అత్యవసరమైతేనే సైరన్ వాడండి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సంచరిస్తున్న అంబులెన్స్ల కారణంగా సాధారణ వాహనచోదకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యవసరమైన పేషెంట్లను తరలిస్తున్నవి మాత్రమే సైరన్ వినియోగించేలా ఆదేశాలు జారీ చేశారు. వీటిని అతిక్రమించిన వారిపై చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నార్త్ జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెడ్గే స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం బషీర్బాగ్లోని ఓల్డ్ కమిషనరేట్లో అంబులెన్స్ అసోసియేషన్లు, ఆస్పత్రుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అత్యవసర పేషెంట్లను తీసుకువెళ్లే అంబులెన్స్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రత్యేక ఫోన్ నంబర్తో ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో(టీసీసీసీ) స్పెషల్ సెల్ అందుబాటులోకి తెచ్చినట్లు వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ సైరన్లు వేసుకుని ఇష్టానుసారం దూసుకుపోతున్న అంబులెన్స్ల వ్యవహారంపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి పెట్టారు. దీనికోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అత్యవసరం కాని వాహనాలు, ఖాళీగా వెళ్తున్న అంబులెన్స్లతో పాటు మృతదేహాలను తరలిస్తున్న సమయంలోనూ కొన్ని అంబులెన్స్ లైట్లు, సైరన్లతో హడావుడి చేస్తూ ఇతర వాహనచోదకులకు ఇబ్బంది కలిగిస్తున్నాయని తేల్చారు. అనేక అంబులెన్స్లకు సరైన పత్రాలు, అనుమతులు లేవని, కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో ఉంటున్నారని వెలుగులోకి వచ్చింది. దీంతో సిటీలో సంచరిస్తున్న అంబులెన్స్లకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంపై ఓ విధానానికి రూపకల్పన చేశారు. ఆ అంశాలను రాహుల్ హెగ్డే ఈ సమావేశంలో ఆయా ప్రతినిధులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లోనే ఉన్న పేషెంట్లను తరలించడానికి ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేశారు. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పని చేసే దీనికోసం ప్రత్యేక సెల్ఫోన్ నంబర్ 8712660600 కేటాయించారు. అత్యవసర పేషెంట్లను తరలిస్తున్న లేదా వారి కోసం వెళ్తున్న అంబులెన్స్ల వివరాలను ఆస్పత్రులు లేదా నిర్వాహకులు ఈ సెల్తో పాటు ట్రాఫిక్ హెల్ప్లైన్ నంబర్ ఫోన్: 9010203626కు అందించాలని కోరారు. ఆస్పత్రుల నుంచి అందే వివరాల ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు అంబులెన్స్ ప్రయాణించే రూట్లోని జంక్షన్లను అప్రమత్తం చేస్తూ దాని ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చూడనున్నారు. ట్రాఫిక్ అదనపు డీసీపీ ఎస్.రంగారావు తదితరులు పాల్గొన్నారు. సమన్వయం కోసం ప్రత్యేక నంబర్లు 87126 60600, 90102 03626 -
వైఎస్ షర్మిలకు షరతులతో కూడిన బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బెయిల్ మంజూరు అయ్యింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమె నిన్ననే బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే.. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను కోరిన కోర్టు విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఈ ఉదయం పిటిషన్పై విచారణ కొనసాగగా.. షర్మిల కొట్టిందన్న వీడియోలను మాత్రమే పదే పదే చూపిస్తున్నారని, కానీ అంతకు ముందు ఆ తర్వాత ఏం జరిగిందనేది మాతంర చూపించడం లేదని ఆమె తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. చివరకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరుకు నిరసనగా వైఎస్సార్టీపీ తరపున రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు షర్మిల పిలుపు ఇచ్చారు. షర్మిలను పరామర్శించిన విజయమ్మ చంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్ షర్మిలను.. వైఎస్ విజయమ్మ మంగళవారం పరామర్శించారు. విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటోందని, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా? అని విజయమ్మ నిలదీశారు. ‘‘పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారు. షర్మిల పాదయాత్రను కూడా అడ్డుకున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా షర్మిలకు లేదా? ప్రజల కోసమే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ ఆశయ సాధన కోసమే షర్మిల పోరాటం చేస్తోంది. ప్రభుత్వాలను ప్రశ్నించడమే మా తప్ప. ప్రశ్నించే వారిని ఇంకా ఎంతకాలం అణచివేస్తారు? అని విజయమ్మ పేర్కొన్నారు. ఇదీ చదవండి: నాకు స్వేచ్ఛ లేదా?.. వైఎస్ షర్మిల -
అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణకు నగరం వేదిక కానుంది. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా.. అంబేద్కర్ మనువడు ప్రకాష్ ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమం జరగనుంది. అయితే విగ్రహావిష్కరణ సందర్భంగా ట్రాఫిక్ అంక్షలు ప్రకటించారు హైదరాబాద్ పోలీసులు. రేపు అంటే ఏప్రిల్ 14 శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంత్లాలో ఆంక్షలు అమలు చేయనున్నారు. దీంతో వాహనాల దారి మళ్లింపు ఉండనుంది. నెక్సెస్ రోడ్డు, ఖైరతాబాద్, లకిడీకపూల్, తెలుగుతల్లి జంక్షన్ రహదారుల్లో ట్రాఫిక్ అంక్షలు అమలు కానున్నాయి. నెక్లెస్ రోడ్డు - ఎన్టీఆర్ మార్గ్ - తెలుగుతల్లి జంక్షన్ వైపు వాహనాలకు నో ఎంట్రీ పంజాగుట్ట, సోమాజీగూడ, ఖైరతాబాద్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే వాహనాలు షాదన్ కళాశాల మీదుగా దారి మళ్లింపు సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు నుంచి ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాణిగంజ్ మీదుగా తరలింపు లక్డీకాపూల్ నుంచి ట్యాంకుబండ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలు తెలుగుతల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంకు బండ్ వైపు మళ్లింపు ట్యాంక్ బండ్, బీఆర్కె భవన్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలు లక్డీకాపూల్ వైపు మళ్లింపు మింట్ కౌంపౌండ్, నెక్లెస్ రోటరీ మార్గాల మూసివేత ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లుంబినీ పార్కులు మూసివేత ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఖైరతాబాద్, సైఫాబాద్, రవీంద్ర భారతి, మింట్ కంపౌండ్, నల్లగుట్ట, లోయర్ ట్యాంక్ బండ్, లిబర్టీ, తెలుగు తల్లి సిగ్నళ్ల వద్ద భారీ వాహనాల రద్దీ ఉండే అవకాశం. ప్రత్యామ్నయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇందుకోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో కావాలని నెటిజన్స్కు సూచిస్తున్నారు. ఏదైనా అత్యవసరం ఉంటే ట్రాఫిక్ కంట్రోల్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626 కు ఫోన్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. -
హైదరాబాద్: వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత
-
వైఎస్ షర్మిల ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇంటివద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి సందర్శన కోసం వెళ్లేందుకు యత్నించిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమెకు వాగ్వాదం చోటు చేసుకుంది. అంతకు ముందు షర్మిలను బయటకు రానివ్వకుండా షర్మిలను హౌజ్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బయటకు వచ్చేందుకు యత్నించిన వైఎస్ షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా, ఆమె కిందపడినట్లు తెలుస్తోంది. -
పోలీసుల అదుపులో తీన్మార్ మల్లన్న!
సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: తీన్మార్ మల్లన్నను మంగళవారం మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో దాదాపు 20 మంది పోలీసులు పీర్జాదిగూడలోని క్యూ న్యూస్ కార్యాలయంలో సోదాలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి క్యూ న్యూస్ ఆఫీస్పై సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయడంపై తీన్మార్ మల్లన్న రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నాటకీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం క్యూ న్యూస్ ఆఫీసును పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిని మేడిపల్లి పోలీసులు లేదా మల్కాజిగిరి ఏసీపీ ధ్రువీకరించడం లేదు. కాగా, తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ల అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు.
Pagination
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
Advertisement