-
ఈవీ రూ.10 లక్షల లోపయితే ఓకే
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. పెరుగుతున్న వాయు కాలుష్యం..మండుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ 2023లో రూ.16,675 కోట్లు ఉండగా..2025 నాటికి రూ. 62,532 కోట్లకు చేరే అవకాశముంది. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్ల విషయంలో వాహనదారులు భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారి అభిప్రాయాల్లో మెజారిటీ వ్యక్తులు రూ.8 నుంచి రూ.10 లక్షలలోపు ధర ఉంటే ఎలక్ట్రిక్ కారు కొనుగోలు సులువు అవుతుందనే అభిప్రాయపడ్డారు. ► పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తాము ఎలక్ట్రిక్ కారు కొనాలని భావిస్తున్నట్టు 44 శాతం మంది చెప్పారు. ►పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ఉపశమనం పొందేందుకు 31% మంది ఎలక్ట్రిక్ వాహనాలకు మారేందుకు ప్రయతి్నస్తున్నట్టు తెలిపారు. ►2023లో మనదేశంలో 72,321 ఎలక్ట్రిక్ కార్లు రిజిస్టర్ అయ్యాయి. లోకల్ సర్కిల్స్ సర్వేలో పాల్గొన్న వారిలో 5 శాతం మంది ఎలక్ట్రిక్ కారు కొనేందుకు ఆసక్తి చూపారు. ఈ లెక్క ప్రకారం 2024లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ 2,00,000కు చేరే అవకాశముంది. ►ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు సంబంధించి దేశవ్యాప్తంగా 319 జిల్లాల్లో లోకల్ సర్కిల్స్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో 40 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ►తెలంగాణలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలపైనే ప్రస్తుతం రిజి్రస్టేషన్ జీవితకాలపు ఫీజు రాయితీ ఉండగా, ఏపీలో కార్లు, జీపులపై కూడా రిజి్రస్టేషన్ ఫీజు పూర్తిగా రాయితీ ఇస్తున్నట్టు అధికారవర్గాల సమాచారం. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకోవడానికి కారణం? ► పర్యావరణ హితంగా ఉండాలని.. 44% ►పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను తట్టుకునేందుకు 31% ►తక్కువ ధరలు 15% ►ఇతర కారణాలు 5% ►చెప్పలేం 5% ఎలక్ట్రిక్ కారు కొనకపోవడానికి కారణాలు ? ►సాధారణ కార్లతో పోలిస్తే అధిక ధర 21 శాతం ►మా ప్రాంతంలో సరిపడా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం 21 శాతం ►ఎలక్ట్రిక్ కార్ల గురించి అవగాహన లేదు 12 శాతం ►ఈ సమయంలో కారు కొనాలనుకోవడం లేదు 26 శాతం ►నా బడ్జెట్కు తగిన మోడల్స్ ఈవీలో లేవు 7 శాతం ►ఇతర కారణాలు, కొనేంత డబ్బు లేదు 8 శాతం ►ఇది నాకు వర్తించదు 5 శాతం -
బ్యాంక్ లాకర్లపై అనాసక్తి
ముంబై: బ్యాంక్ లాకర్లు.. ఒకప్పుడు వీటిని పొందడం కష్టంగా ఉండేది. డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువగా అన్నట్టు గతంలో పరిస్థితి. కానీ, ఇప్పుడు బ్యాంక్ లాకర్లు అంటే చాలా మందిలో అనాసక్తి నెలకొంది. లాకర్ చార్జీలు గణనీయంగా పెరిగిపోవడం, క్లిష్టమైన కేవైసీ ప్రక్రియ తదితర ఎన్నో అంశాలు లాకర్లు అంటే మొహం మొత్తిపోయేలా చేస్తున్నాయి. 50 శాతం మంది కస్టమర్లు లాకర్లను ఇటీవలి కాలంలో మూసివేయడం, లేదంటే మూసివేయాలనే యోచనతో ఉన్నారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. 11,000 మంది అభిప్రాయాలను తెలుసుకుని లోకల్ సర్కిల్స్ ఈ వివరాలను విడుదల చేసింది. లాకర్లను మూసివేసినట్టు 36 శాతం మంది చెప్పగా.. అధిక చార్జీల కారణంగా లాకర్లను మూసివేయాలని అనుకుంటున్నట్టు 4 శాతం మంది పేర్కొన్నారు. 16 శాతం మంది లాకర్ సైజును తగ్గించుకున్నట్టు చెప్పారు. నూతన చార్జీలు తమకు సమ్మతమేనని, లాకర్లను కొనసాగిస్తామని 36 శాతం మంది వెల్లడించారు. ‘‘బ్యాంక్ సేఫ్ డిపాజిట్ లాకర్లకు సంబంధించి కొత్త నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. దీంతో శాఖకు వచ్చి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలంటూ కస్టమర్లను బ్యాంక్లు కోరుతున్నాయి. డిసెంబర్ 31 నాటికి కస్టమర్లు బ్యాంక్కు వెళ్లి లీజ్ డాక్యుమెంట్పై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో లాకర్ చార్జీలు కూడా పెరిగాయి’’అని లోకల్ సర్కిల్స్ తెలిపింది. చార్జీలు గణనీయంగా పెరగడం వల్లే తాము లాకర్లను రద్దు చేసుకున్నామని, లేదంటే మూసివేయాలని అనుకుంటున్నామని, లేదంటే సైజును తగ్గించుకుంటామని 56 శాతం మంది చెప్పినట్టు ఈ సంస్థ వెల్లడించింది. -
ప్రతి పది మందిలో నలుగురికి టోపీ! సర్వేలో విస్తుగొలిపే విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో 39 శాతం మంది గడిచిన మూడేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. అంటే ప్రతి పది మందిలో నలుగురు మోసపోయినట్టు తెలుస్తోంది. ఇలా మోసపోయిన వారిలో కేవలం 24 శాతం మందికే తిరిగి ఆ మొత్తం చేరింది. సర్వే వివరాలను లోకల్ సర్కిల్స్ విడుదల చేసింది. ► 23 శాతం మంది క్రెడిట్ లేదా డెబిట్ కార్డు మోసాలను ఎదుర్కొన్నట్టు తెలిపారు. ► 13 శాతం మంది కొనుగోళ్లు, అమ్మకాలు, ప్రకటనల వెబ్సైట్ల ద్వారా మోసపోయారు. ► 10 శాతం మంది వెబ్సైట్లలో కొనుగోళ్లకు డబ్బులు చెల్లించినా, అవి డెలివరీ చేయలేదు. ► 10 శాతం మంది ఏటీఎం మోసాల బారిన పడగా, 10 శాతం మంది బ్యాంకు మోసాలు, 16 శాతం మంది ఇతర మోసాల బారిన పడినట్టు తెలిసింది. ► దేశవ్యాప్తంగా 331 జిల్లాల్లో 32,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. 66 శాతం పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. ► మోసపోయిన మొత్తం తిరిగి తాము వెనక్కి పొందామని 24 శాతం మంది తెలిపారు. 70 శాతం మంది తమ ఫిర్యాదులకు ఇంత వరకు పరిష్కారం లభించలేదని చెప్పారు. ► సంబంధిత ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయడం ద్వారా 18%మంది మోసపోయిన మొత్తాన్ని వెనక్కి పొందగా, 6 శాతం మంది అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన మొత్తాన్ని రాబట్టుకున్నారు. ► 41 శాతం మంది తమ ఫిర్యాదు అపరిష్కృతంగా ఉందని చెప్పగా, 17 శాతం మంది ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇక 12 శాతం మంది ఫిర్యాదు చేయకూడదనే నిర్ణయం తీసుకోగా, 6 శాతం మంది ఏమీ చెప్పలేదు. ► సర్వేలో పాల్గొన్న 30% కుటుంబాల్లో కనీసం ఒక సభ్యుడు మోసపోగా, 9 శాతం కుటుంబాల్లో ఒకరికి మించి బాధితులుగా మారారు. ► 57 శాతం మంది ఆర్థిక మోసాల నుంచి తప్పించుకున్నామని తెలిపారు. ► కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే 2022లో మోసపోయిన, తిరిగి వెనక్కి పొందిన వారు 17 శాతంగా ఉంటే, 2023లో ఇలా వెనక్కి పొందిన వారి శాతం 24 శాతానికి చేరింది. -
వాట్సాప్ యూజర్లను తెగ విసిగిస్తున్న కాల్స్, మెసేజ్లు!
వాట్సాప్ యూజర్లను వ్యాపార సంబంధమైన కాల్స్, మెసేజ్లు తెగ విసిగిస్తున్నాయట. వాట్సాప్ బిజినెస్ ఖాతాలతో చేసిన సంభాషణలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కార్యాచరణ ఆధారంగా విసిగించే కాల్స్ లేదా ఎస్ఎంఎస్ ఎక్కువైనట్లు 76 శాతం మంది యూజర్లు పేర్కొన్నట్లు లోకల్ సర్కిల్స్ అనే ఆన్లైన్ సర్వే సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి 20 మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం.. 95 శాతం వాట్సాప్ వినియోగదారులకు ప్రతిరోజూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇబ్బందికరమైన మెసేజ్లు వస్తున్నాయి. వీరిలో 41 శాతం మందికి రోజూ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి. వాట్సాప్ బిజినెస్ యూజర్లతో సంభాషణ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కార్యాచరణ ఆధారంగానే వాట్సాప్లో ఇలాంటి విసిగించే మెసేజ్లు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు 12,215 మంది అదే కారణమని బదులిచ్చారు. దేశంలోని 351 జిల్లాల్లో 51 వేల మంది యూజర్లను ఈ సంస్థ సర్వే చేసింది. ఇటువంటి మెసేజ్లకు అడ్డుకట్ట వేయడానికి బ్లాకింగ్, ఆర్కైవింగ్ వంటి అందుబాటులో ఉన్న సాధనాలను ఉపయోగిస్తున్నా వాటి అవి ఆగడం లేదు. వాటిని పంపేవారు కూడా నంబర్లు మారుస్తుండటంతోనే ఇలా జరుగుతోందని తెలుస్తోంది. ఇలాంటి అయాచిత వాణిజ్య సందేశాలు రాకుండా మెరుగైన బ్లాకింగ్ ఆప్షన్ కోసం చూస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నవారిలో 73 శాతం మంది పేర్కొన్నారు. వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ప్రతినిధి దీనిపై స్పందిస్తూ.. రోజుకు నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే మెసేజ్లు పంపించడానికి తాము వ్యాపార సంస్థలకు అనుమతిస్తామని, యూజర్లు ఇటువంటి మెసేజ్లు స్వీకరించడం లేదా మానేయడానికి చాట్లోనే సులభమైన ఆప్షన్ను జోడించినట్లు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Nandan Nilekani: ఎఎ నెట్వర్క్తో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు ఊతం) -
‘డు నాట్ డిస్టర్బ్’ అన్నా తప్పని బెడద: కీలక సర్వే
న్యూఢిల్లీ: ‘డు నాట్ డిస్టర్బ్’ లిస్టులో నమోదు చేసుకున్నప్పటికీ మొబైల్ ఫోన్ యూజర్లకు అవాంఛిత కాల్స్ బెడద తప్పడం లేదు. ఏకంగా 92 శాతం సబ్స్క్రయిబర్స్కు రోజుకు కనీసం 1 కాల్ అయినా అలాంటిది వస్తోంది. ఆన్లైన్ సంస్థ లోకల్సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఆర్థిక సేవలు, రియల్ ఎస్టేట్ రంగాల సంస్థల నుంచి తమకు అత్యధికంగా అవాంఛిత కాల్స్ వస్తున్నాయని 78 శాతం మంది వెల్లడించారు. మొత్తం 11,157 మంది ఇందుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానమివ్వగా వారిలో 66 శాతం మంది తమకు రోజుకు సగటున 3 లేదా అంతకు మించి ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు 96 శాతం మంది తమకు అటువంటి కాల్ ఏదో ఒకటి ప్రతి రోజూ వస్తూనే ఉంటుందని వివరించారు. ఇక 16 శాతం మంది తమకు రోజుకు సగటున 6 10 కాల్స్ వస్తుంటాయని చెప్పగా 5 శాతం మంది 10 పైగా అవాంఛిత ఫోన్స్ వస్తుంటాయని వివరించారు. -
గూగుల్ రేటింగ్లను నమ్మలేం
న్యూఢిల్లీ: సమాచారం కోసం ఒకప్పుడు తెలిసిన వారిని అడిగే వాళ్లం. ఇంటర్నెట్ అందరికీ చేరువ అయిన తర్వాత గూగుల్ సెర్చింజన్ సమాచార వారధిగా మారిపోయింది. ఫలానా రెస్టారెంట్లో రుచులు ఎలా ఉంటాయి? ఫలానా హాస్పిటల్లో ఏ విధమైన స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నారు, వైద్యం ఎలా ఉంటుంది? ఫలానా సూపర్ మార్కెట్లో అన్నీ లభిస్తాయా? ఇలా ఒక్కటని కాదు ఏది అడిగినా సమాచారాన్ని ముందుంచుతుంది గూగుల్. కానీ, గూగుల్ ప్లాట్ఫామ్ అందించే రివ్యూల్లో నిజం పాళ్లు ఎంత? ఇదే తెలుసుకుందామని లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా ఒక సర్వే నిర్వహించింది. 357 జిల్లాల పరిధిలో నివసించే 56,000 మంది అభిప్రాయాలను తెలుసుకుంది. ♦ 45 శాతం మంది గూగుల్లో రివ్యూలు కచ్చితమైనవి కావని తేల్చి చెప్పారు. ♦ మరో 37 శాతం మంది రివ్యూలు ఎక్కువగా సానుకూలంగా ఉంటున్నట్టు తెలిపారు. ♦ గూగుల్ రివ్యూలను, రేటింగ్లను తాము పూర్తిగా విశ్వసిస్తామని చెప్పిన వారు కేవలం 3 శాతం మందే ఉన్నారు. ♦ 7% మంది గూగుల్ రివ్యూలు, రేటింగ్లను ఎంత మాత్రం నమ్మబోమని స్పష్టం చేశారు. ♦ హోటల్, రెస్టారెంట్, స్టోర్, సర్వీస్ గురించి గూగుల్కు వెళ్లిన సమయంలో కనిపించే రివ్యూల్లో నిజం ఎంత? అని సర్వేలో పాల్గొన్న వారిని అడగ్గా పై విధంగా చెప్పారు. ♦ సమాచార అన్వేషణకు గూగుల్కు వెళుతున్న వారిలో 88 శాతం మంది రివ్యూలను చూస్తూ, రేటింగ్ గురించి తెలుసుకుంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. ♦ సర్వేలో భాగంగా 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు తమ అభిప్రాయాలు తెలియజేశారు. ♦ ఇందులో 47 శాతం మంది టైర్–1, 33% మంది టైర్–2, మిగిలిన 20% మంది ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నారు. నకిలీ రివ్యూలపై నిషేధం: గూగుల్ ఈ సర్వే చివరిగా గూగుల్ అభిప్రాయాలను కూడా తెలుసుకుంది.యూజర్ల వాస్తవిక అనుభవం ఆధారంగా వారు అందించే సమాచారం ఇతరులకు సాయంగా ఉండాలన్నదే గూగుల్ రివ్యూల ఉద్దేశ్యమని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. ‘‘నకిలీ, మోసపూరిత కంటెంట్ను అందించే, ఉద్దేశపూర్వకమైన, కచ్చితత్వం లేని కంటెంట్ను నిషేధించే విధానాలు అమల్లో ఉన్నాయి. యూజర్ల నుంచి హెచ్చరికలకు తోడు, రోజులో అన్ని వేళలా ఆపరేటర్లు ఆటోమేటెడ్ సిస్టమ్లను పర్యవేక్షిస్తూ ఉంటారు. అనుమానిత ప్రవర్తనను గమనిస్తుంటారు. ఎవరైనా యూజర్ ఏదైనా రివ్యూ/కంటెంట్ను మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత రివ్యూలను కనిపించకుండా నిలిపివేసే చర్యలు అమల్లో ఉన్నాయి. గూగుల్పై విశ్వసనీయ సమాచారం అందించేందుకు టెక్నాలజీపై మా పెట్టుబడులు కొనసాగిస్తాం’’అని గూగుల్ అధికార ప్రతినిధి వెల్లడించారు. తాజాగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో రివ్యూలకు సంబంధించి భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) ‘ఐఎస్ 19000:2022’ను అమల్లోకి తీసుకురావడం గమనార్హం. రివ్యూలు తీసుకోవడం, వాటిని ప్రచురించడం, రివ్యూలు రాయడం అన్నది నిర్ధేశిత ప్రమాణాల ప్రకారం ఉండాలని ఇది సూచిస్తోంది. సరిగ్గా ఇదే తరుణంలో లోకల్ సర్కిల్స్ సర్వే ఫలితాలు విడుదల కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
కాలుష్య వ్యాధుల కోరల్లో ఢిల్లీ
న్యూఢిల్లీ: కాలుష్యకాసారంగా మారిన ఢిల్లీ–రాజధాని ప్రాంత పరిసరాల (ఎన్సీఆర్) ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొద్ది వారాలుగా ప్రతి ఐదింట నాలుగు కుటుంబాలు కాలుష్య సంబంధ వ్యాధులపాలవుతున్నాయని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వేలో తేలింది. అందులో పాల్గొన్న వారిలో 18 శాతం ఇప్పటికే గాలి కాలుష్యంతో అస్వస్థులై ఆస్పత్రికి వెళ్లొచ్చారు. 80 శాతం కుటుంబాల్లో కనీసం ఇంటికొకరు ఒకరు శ్వాససంబంధ సమస్యను ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యంతో బెంబేలెత్తిపోయిన ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంత ప్రజలు కొందరు స్వస్థలాలు వదిలి వేరే ప్రాంతాలకు తాత్కాలికంగా తరలిపోయారు. ఇటీవల దీపావళి పర్వదినం సందర్భంగా బాణసంచా వినియోగంతో వెలువడిన దుమ్ము ధూళీతో పొగచూరిన ఢిల్లీలో ఐదు రోజుల తర్వాత ప్రజాభిప్రాయం తీసుకున్నారు. అప్పుడు సైతం ఇదే తరహా కాలుష్య సంబంధ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయని 70 శాతం మంది పౌరులు ఆవేదన వ్యక్తంచేయడం గమనార్హం. ప్రభుత్వ పాలన, ప్రజాసంబంధాలు, పౌరుల, వినియోగదారుల ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న కష్టాలపై సామాజిక మాధ్యమ వేదికగా లోకల్సర్కిల్స్ సంస్థ సర్వేలు చేస్తుంటుంది. -
ఇంటి బడ్జెట్కు ఇంధన సెగ..
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు, నిత్యావసరాల ధరలు ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్లో చాలా మటుకు కుటుంబాలు (సుమారు 60 శాతం) ఖర్చులు చేస్తున్నప్పటికీ.. కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. తమ బడ్జెట్ దాటిపోకుండా, పెట్టే ఖర్చుకు కాస్తంత ఎక్కువ విలువ దక్కేలా చూసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఆన్లైన్ ప్లాట్ఫాం లోకల్సర్కిల్స్ టాప్ 10 నగరాల్లో నిర్వహించిన ‘వినియోగదారుల ధోరణులు‘ అనే సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో సుమారు 61,000 కుటుంబాలు పాల్గొన్నాయి. సర్వే ప్రకారం వినియోగదారుల సెంటిమెంట్ గణనీయంగా మెరుగుపడింది. పండుగ సీజన్లో ఖర్చు చేయాలని భావిస్తున్న కుటుంబాల సంఖ్య సెప్టెంబర్లో 60 శాతానికి చేరింది. ఈ ఏడాది మే లో ఇది 30 శాతం. గడిచిన నాలుగు నెలల్లో కోవిడ్–19 కేసులు గణనీయంగా తగ్గడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం తదితర అంశాలు ఇందుకు కారణం. గడిచిన 30 రోజులుగా టాప్ 10 నగరాల్లోని కుటుంబాలు.. పెరిగిపోతున్న ఇంధనాలు, నిత్యావసరాల ధరల గురించి ఆందోళన, ఈ పండుగ సీజన్లో షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్కు ప్రాధాన్యం ఇవ్వనుండటం గురించి వివిధ ఆన్లైన్ కమ్యూనిటీల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నట్లు లోకల్సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపాడియా తెలిపారు. టాప్ 10 నగరాల్లోని ఏడు నగరాల ప్రజలు.. షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామంటూ వెల్లడించినట్లు వివరించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ తదితర నగరాల్లో ఈ సర్వే నిర్వహించారు. ఆన్లైన్కు హైదరాబాదీల మొగ్గు.. టాప్ 8 నగరాల్లోని వారు తమ పండుగ షాపింగ్కు సంబంధించి ఆన్లైన్లో ఆర్డర్లివ్వడం లేదా లోకల్గా హోమ్ డెలివరీ పొందడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ముంబై, కోల్కతా నగరాల్లో చాలా కుటుంబాలు ప్రత్యేకంగా స్టోర్స్, మార్కెట్కు వెళ్లడానికే మొగ్గు చూపుతున్నాయి. కానీ హైదరాబాద్ (75 శాతం), నోయిడా (72 శాతం), పుణె (67 శాతం), చెన్నై (60 శాతం) నగరాల్లో అత్యధిక శాతం మంది స్టోర్ట్స్, హైదరాబాద్, నోయిడాకు చెందిన కుటుంబాలు .. ప్రధానంగా స్మార్ట్ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లపై ఆసక్తిగా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న హైదరాబాదీ కుటుంబాలన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, సాంప్రదాయ స్వీట్లు, చాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులు, దుస్తులు మొదలైనవి కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. -
టీకా వద్దనేవారు తగ్గిపోతున్నారు!
న్యూఢిల్లీ: భారత జనాభాలో కోవిడ్ టీకాలపై అపనమ్మకం వేగంగా తగ్గుతోందని ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ తెలిపింది. దేశ జనాభాలో టీకాలపై సందేహాలున్న వారి సంఖ్య కేవలం 7 శాతానికి చేరిందని, టీకాలివ్వడం ఆరంభమయ్యాక ఇదే కనిష్ఠ స్థాయని సర్వే తెలిపింది. 301 జిల్లాల్లో 12,810 మందిని వ్యాక్సినేషన్పై ప్రశ్నించారు. వీరిలో 67 శాతం మగవారు కాగా 33 శాతం మంది మహిళలు. వీరిలో ఇప్పటివరకు టీకా తీసుకోనివారిని ప్రశ్నించగా 46 శాతం మంది కనీసం తొలిడోసైనా త్వరలో తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేవలం 27 శాతం మంది మాత్రం ఇంకా టీకాపై నమ్మకం కుదరడం లేదని, మరింత డేటా వచ్చాక టీకా తీసుకుంటామని చెప్పినట్లు సంస్థ అధిపతి సచిన్ తపారియా తెలిపారు. భారత్లో వయోజనుల జనాభా దాదాపు 94 కోట్లు కాగా వీరిలో 68 కోట్ల మంది కనీసం ఒక్కడోసైనా టీకా తీసుకున్నవారున్నారు. సర్వే ఫలితాలను దేశజనాభాతో పోల్చిచూస్తే 7 శాతం మంది అంటే సుమారు 26 కోట్లమంది ఇంకా ఒక్కడోసు కూడా తీసుకోలేదు. వీరిలో కొంతమంది త్వరలో టీకా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇండియాలో వ్యాక్సినేషన్ ఆరంభమైనప్పుడు దేశ జనాభా(వయోజన)లో దాదాపు 60 శాతం మంది టీకాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా సెకండ్వేవ్ అనంతరం టీకాలు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. దీనికితోడు ప్రభుత్వం ఉచితంగా టీకాల పంపిణీ ఆరంభించడం కూడా ప్రజల్లో వ్యాక్సినేషన్కు ప్రాచుర్యం లభించేందుకు కారణమైంది. ఎందుకు వద్దంటే... టీకాలను వద్దనే సందేహరాయుళ్లు తమ వ్యతిరేకతకు పలు కారణాలు చెబుతున్నారు. కొత్తవేరియంట్ల నుంచి టీకా కల్పించే రక్షణపై సందేహాలను వెలుబుచ్చుతున్నారు. వీరి అనుమానాల్లో కొన్ని... ► సరైన పరీక్షలు పూర్తికాకముందే హడావుడిగా టీకాలకు అనుమతులిచ్చారు, కాబట్టి వాటితో లభించే రక్షణపై సందేహాలున్నాయి. ► టీకాలతో సైడ్ఎఫెక్టులుంటాయి, కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు టీకాతో అనవసర సమస్యలు వస్తాయి. ► కొత్తగా వచ్చే వేరియంట్లను ప్రస్తుత టీకాలు ఎలాగూ రక్షించలేవు. అందువల్ల మరింత శక్తివంతమైన వ్యాక్సిన్లు వచ్చాక ఆలోచిద్దాం. ► మాకు బ్లడ్ క్లాటింగ్ సమస్యలున్నాయి అందుకే టీకాకు దూరంగా ఉంటున్నాము. ► మానవ పయ్రత్నం ఏమీ లేకుండా ఎలా వచ్చిందో అలాగే కోవిడ్ మాయం అవుతుంది, దానికోసం టీకాలు అవసరం లేదు. టీకాలపై మారుమూల ప్రాంతాల్లో వ్యాపించిన మూఢనమ్మకాలు, అభూత కల్పనలు కొందరిని టీకాకు దూరంగా ఉంచుతున్నాయి. వ్యాక్సినేషన్ తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలావరకు మారింది. జనాభాలో వీలైనంత ఎక్కువమందికి టీకాలు అందితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. -
టోక్యో ఒలింపిక్స్లో భారత్ మెరుగైన ప్రదర్శన.. క్రికెట్పై ఎఫెక్ట్?
సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ అనంతరం భారతీయ కుటుంసభ్యుల ఆలోచనల్లో మార్పులు వచ్చాయంటోంది కమ్యూనిటీ ప్లాట్ఫాం ‘లోకల్ సర్కిల్స్’ సర్వే. అధిక శాతం కుటుంబసభ్యులు తమ పిల్లలు, మనుమలు మనవరాళ్లు ఎవరైనా క్రికెట్ కాకుండా ఇతర క్రీడను కెరియర్గా ఎంచు కొంటే మద్దతిచ్చి ప్రోత్సహిస్తామని స్పష్టం చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 18 వేల మందితో ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు మొత్తం ఏడు పతకాలు వచ్చిన విషయం తెలిసిందే. నీరజ్ చోప్రా (జావెలిన్ త్రోలో స్వర్ణం), మీరాబాయి చాను (వెయిట్ లిఫ్టింగ్లో రజతం), హాకీ తదితర క్రీడల్లో భారతీయ క్రీడాకారుల రాణించిన నేపథ్యంలో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న కోణంలో సర్వే నిర్వహించింది. 71 శాతం కుటుంబ సభ్యులు క్రికెట్ కాకుండా ఇతర క్రీడల్లో పిల్లలకు మద్దతిస్తా మని పేర్కొన్నారు. దేశంలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబసభ్యులు క్రికెట్ కాకుండా మరో క్రీడ వల్ల ఆర్థికాభివృద్ధి ఉండదని, స్థిరమైన ఆదాయం ఉండదని భావిస్తారని... అయితే ఒలింపిక్స్ అనంతర సర్వేలో క్రికెట్యేతర క్రీడలకు మద్దతు ఉందని తేలిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఒలింపిక్స్ సమయంలోనే సర్వే నిర్వహించగా.. భారతీయ క్రీడాకారులు పాల్గొన్న క్రీడలను వీక్షించారా అన్న ప్రశ్నకు 51 శాతం అవునని, 47 శాతం మంది కాదని, రెండు శాతం ఎలాంటి అభిప్రాయం చెప్పలేదని సర్వే తెలిపింది. 51 శాతం మందిలో కుటుంబంలో ఎవరో ఒకరు ఒలింపిక్స్ వీక్షించారని తెలిపింది. 2016 ఒలింపిక్స్ సమయంలో 20 శాతం మందే భారతీయ క్రీడాకారుల పాటవాలను వీక్షించామని చెప్పగా తాజా సర్వేలో రెట్టింపునకు పైగా వీక్షించామని చెప్పడాన్ని బట్టి గణనీయమై స్థాయిలో మార్పులు వస్తున్నట్లుగా సర్వే అభివర్ణించింది. చిన్నారులు క్రికెట్ కాకుండా వేరే క్రీడను కెరియర్గా ఎంచుకుంటే మీ వైఖరి ఏంటి అని ప్రశ్నించగా.. 71 శాతం ప్రోత్సహిస్తామని చెప్పగా 19 శాతం మంది క్రికెట్కే ఓటు వేశారని, పది శాతం మంది ఎలాంటి అభిప్రాయం వెలుబుచ్చలేదని తెలిపింది. దేశవ్యాప్తంగా 309 జిల్లాల్లో 18వేల మంది కుటుంబసభ్యులు సర్వేలో పాల్గొన్నట్లు ‘లోకల్ సర్కిల్స్’ తెలిపింది. వీరిలో 9,256 మంది ఒలింపిక్స్ వీక్షించామని చెప్పారని తెలిపింది. 66 శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు పాల్గొన్నారని, టైర్–1 జిల్లాల నుంచి 42 శాతం, టైర్–2 నుంచి 29 శాతం, గ్రామీణ ప్రాంతాల నుంచి 29 శాతం మంది పాల్గొన్నారని లోకల్ సర్కిల్స్ వివరించింది. -
టీకాపై ఎటూ తేల్చుకోలేక..
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంపై ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నవారు 69 శాతం మంది ఉన్నారని లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో తేలింది. ఆన్లైన్ మాధ్యమం ద్వారా మీరు టీకా తీసుకుంటారా? అని 8,723 మందిని ప్రశ్నించగా 26 శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కాగానే తాము తీసుకుంటామని స్పష్టం చేశారు. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ సంస్థ ప్రజల్లో టీకా ఆమోదంపై సర్వే చేçస్తూ ఫలితాల్ని ఆన్లైన్లో ఉంచుతోంది. రోజులు గడుస్తున్నప్పటికీ టీకాపై ఎటూ తేల్చుకోలేని వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్టోబర్లో 61 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోవడం గురించి ఇంకా ఆలోచిస్తున్నామని చెబితే నవంబర్ నాటికి వారి సంఖ్య 59 శాతానికి తగ్గింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) టీకాలకి పచ్చజెండా ఊపాక టీకాపై సందేహాలు వ్యక్తం చేసే వారి సంఖ్య కూడా పెరిగిందని ఆ సర్వే వెల్లడించింది. ఇక పిల్లలకి టీకా ఇవ్వడానికి 26% తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. వ్యాక్సిన్ సామర్థ్యంపై నెలకొన్న అనుమానాలు, హడావుడిగా అనుమతులివ్వడం, దుష్ప్రభావాలపై వస్తున్న వార్తలతో ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల ఆందోళన నెలకొని 69 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోతున్నారని లోకల్సర్కిల్స్ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, మరణాల రేటు చాలా తక్కువగా ఉండడంతో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్న వారు కూడా ఉన్నారు. -
ప్రైవేటు అయితే ఖరీదెక్కువ..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా చికిత్స అందించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ‘లోకల్సర్కిల్స్’ ఓ సర్వేను నిర్వహించింది. ఇందులో దాదాపు 40 వేల అభిప్రాయాలు వచ్చాయి. అందులో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స ప్రారంభిస్తే వైద్యం ఖర్చు విపరీతంగా పెరుగుతుందని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటే రెండోసారి కరోనా సోకే అవకాశం ఉందని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు. కరోనా చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే నిర్దేశించాలని 61 శాతం మంది కోరారు. కరోనాకు చికిత్స చేసేందుకు తగిన పరికరాలు ఆస్పత్రుల వద్ద లేవని 32 శాతం మంది చెప్పారు. చికిత్స ఎక్కడ చేయించుకోవాలనే విషయంపై 32 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులను, 22 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రులను, 32 శాతం మంది ఇళ్లలోనే ఉండి చికిత్స చేయించుకోవాలని అభిప్రాయపడ్డారు. మరో 14 శాతం మంది మాత్రం ఆ విషయం తమకు తెలియదని చెప్పారు. -
ఢిల్లీని వదిలేందుకు సిద్ధం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం నుంచి మరో నగరానికి తరలివెళ్లేందుకు 40%మందికి పైగా సిద్ధంగా ఉన్నారు. 16% మంది ప్రజలు మాత్రం ఈ కాలంలోనే ఢిల్లీని విడిచి వెళ్లాలనుకుంటున్నారు. ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ 17వేల మందితో నిర్వహించిన సర్వేలో ఈమేరకు వెల్లడైంది. 31%మంది మాత్రం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనే ఉండి వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా వారు ఎయిర్ ప్యూరిఫైర్స్, మాస్క్లు వినియోగించడం, మొక్కలు నాటడం వంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. 13%మంది మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇక్కడ ఉండాల్సి వస్తోందని, అయితే పెరుగుతున్న వాయుకాలుష్యాన్ని ఎదుర్కోవడం తప్ప తమకు మరోమార్గం లేదని తెలిపారు. గతవారం వాయుకాలుష్యాన్ని మీరు, మీ కుటుంబ సభ్యులు ఎలా ఎదుర్కొన్నారు? అన్న ప్రశ్నకు..13%మంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువసార్లు వైద్యుల్ని కలిసినట్లు తెలిపారు. అయితే అప్పటికే వైద్యుల్ని కలిసిన వారిలో 29%మంది ఉన్నారు. వాయుకాలుష్యం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారెవరూ ఆస్పత్రికి గాని, వైద్యుల వద్దకు వెళ్లలేదని 44%మంది తెలిపారు. 14%మంది మాత్రమే వాయుకాలుష్యం వల్ల తమకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురుకాలేదని తెలిపారు. ఇదిలా ఉండగా ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం ఉదయం వర్షం పడినప్పటికీ కాలుష్యం తారాస్థాయిలోనే ఉంది. పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ ప్రజారోగ్యంపై అత్యవసరస్థితిని ప్రకటించడంతో ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లను మూసివేసింది. అదేవిధంగా ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్యకలాపాల్ని ఈపీసీఏ నిషేధించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తర్వాత మళ్లీ... కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సమాచారం మేరకు ఢిల్లీలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 494గా నమోదైంది. నవంబర్ 6, 2016న ఇది 497గా ఉండగా, మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ స్థాయిలో సూచీ నమోదైంది. ఈ సూచీ అధికస్థాయిలో పూసా ప్రాంతంలో 495, ఐటోలో 494, మండ్కా, పంజాబీ భాగ్ ప్రాంతాల్లో 493గా ఉంది. నిర్ధారిత ఏక్యూఐ ప్రామాణికాలివీ.. సూచీ 0–50 మధ్య ఉంటే మంచిగా ఉన్నట్లు, 51–100 సంతృప్తికర స్థాయి, 101–200 మోస్తర్లు, 201–300 బాగోలేదని, 301–400 అస్సలు బాగోలేదని, 401–500 అథమస్థాయి, 500 కంటే పైన తీవ్రమైన అథమస్థాయిగా పరిగణిస్తారు. -
నోట్ల రద్దుకు ప్రజలు సానుకూలమే
సగం మందికి పైగా ప్రజలు (51 శాతం మంది) పెద్ద నోట్ల రద్దు మంచిపనే అని చెబుతున్నారట. 25 శాతం మంది దాని అమలు ఓ మాదిరిగా ఉందని చెబితే, 24 శాతం మంది అసలు ఏమాత్రం బాగోలేదని పెదవి విరిచారు. దేశంలోని 200 నగరాల్లోని ప్రజలను సర్వే చేసిన లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. పెద్ద నోట్లను రద్దు చేయడం అనేది విప్లవాత్మక చర్య అయినా.. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గత పది రోజులుగా ఇంత పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండకుండా ప్రభుత్వం ముందుగా తగిన చర్యలు తీసుకుని ఉండాల్సిందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే వాళ్లలో దాదాపు మూడు వంతుల మంది ఇది మంచిపనే అని మాత్రం చెబుతున్నారు. వేలి మీద ఇంకు ముద్ర వేయడం, పెళ్లిళ్లు చేసుకునేవాళ్లకు రూ. 2.5 లక్షల చొప్పున విత్డ్రా చేసుకోడానికి అనుమతి ఇవ్వడం, మొబైల్ ఏటీఎంలు పంపడం, రైతులకు మరింత నగదు అందుబాటు లాంటి చర్యలను మెచ్చుకున్నా.. వాటిని మరింత ముందుగా అమలుచేసి ఉండాల్సిందని అన్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను బ్యాంకులు, పోస్టాఫీసులలో నియమించి, వారితో ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు, మహిళలకు సేవలు అందిస్తే బాగుంటుందని కొంతమంది సూచించారు. ఏటీఎంల వద్ద నిల్చుంటున్న వాళ్లలో 40 శాతం మంది వేరే వాళ్ల కోసం లైన్లో ఉండగా, 44 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదని కూడా ఈ సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎలా అనిపిస్తోందని అడిగినప్పుడు.. 79 శాతం మంది కొంత ఇబ్బందిగా ఉందని చెప్పగా, 18 శాతం మంది చాలా ఇబ్బందిగా ఉందన్నారు. కేవలం 3 శాతం మంది మాత్రమే ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement