-
అక్రమాలు కో‘కొల్లు’లు
విజయవాడ: కృష్ణాజిల్లాలోని తీరప్రాంత ముఖ్య పట్టణానికి ప్రాతినిధ్యం వహించిన ఆ టీడీపీ నేత అక్రమాలు కోకొల్లలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవీ వెలగబెట్టిన ఆయన హయాంలో ప్రజలు మౌలిక వసతులు లేక నరకం అనుభవించారు. గుక్కెడునీటికీ అంగలార్చారు. కానీ ఆయన మాత్రం భారీగా అక్రమాస్తులు మూటగట్టారు. మామ ద్వారా వసూళ్ల దందా సాగించారు. సెటిల్మెంట్లు చేశారు. ప్రభుత్వ స్థలాలూ కాజేశారు. అవినీతి సొమ్ముతో విజయవాడతో పాటు తీరప్రాంత మండలాలు, హైదరాబాద్లలో రూ.కోట్ల విలువ చేసే స్థలాలు కొన్నారు. ఎక్సైజ్లో భారీగా దోపిడీ ∗ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భారీగా దండుకున్నారు. ఒక్కో బదిలీకి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మంత్రిగా ఉన్న రెండేళ్లలోనే రూ.60 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు దోపిడీకి పాల్పడ్డారు. లిక్కర్ దందా నడిపారు. ∗ భీమవరంలో భార్యాభర్తల మ్యూచువల్ బదిలీ కోసం దాదాపు రూ.40 లక్షలు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ ఎక్సైజ్ శాఖలో డిజిటలైజేషన్ నిమిత్తం కాంట్రాక్టర్ నుంచి రూ.5 కోట్లు నాటి ప్రభుత్వ పెద్దలకు అందాయి. ఆ కాంట్రాక్టర్ నుంచి మాజీ మంత్రి రూ.2 కోట్లు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఎక్సైజ్ స్టేషన్ల నుంచి నెలవారీ మామూళ్లూ వసూలు చేశారని సమాచారం. ∗ ఇసుక రవాణాలోనూ వసూళ్ల దందాకు పాల్పడ్డారు. ఈ తంతు మొత్తం మాజీ మంత్రి అనుచరుడు దగ్గరుండి నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆయన అండతో ముఖ్యపట్టణంలో తెలుగు తమ్ముళ్లు భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్లాట్లుగా వేసి స్థలాలు అమ్ముకున్నారు. రూ.కోట్లకు పడగలెత్తారు. ∗ సొంత రైసు మిల్లును అడ్డుపెట్టుకుని ధాన్యం కొనుగోళ్లలో అక్రమ దందాకు పాల్పడ్డారు. రూ.3 కోట్ల వరకు ఇలా బొక్కేసినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండూ ప్రతిపక్షాల నుంచి వినిపించింది. ∗ కరకట్ట, చల్లపల్లి బైపార్ రోడ్డు, విజయవాడ – మచిలీపట్నం హైవే నిర్మాణ పనులకు సంబంధించిన మట్టి (బుసక) సరఫరాలో నాలుగున్నరేళ్లలో రూ.వందల కోట్లు మింగారు. పొక్లెయిన్ బుజ్జీని బినామీగా పెట్టి కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వి వచి్చన మట్టిని నిర్మాణాలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ∗ ప్రభుత్వ పథకాల మంజూరులోనూ భారీ వసూళ్లకు తెరతీశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీకి కమీషన్లు వసూలు చేసి తన కక్కుర్తి బుద్ధిని చాటుకున్నారు. రైతు రథం పంపిణీ, అదనపు తరగతుల నిర్మాణాల్లోనూ గడ్డికరిచినట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ బినామీల పేరుతో కాల్మనీ వ్యవహారం నడిపించి రూ.1.50 కోట్లు దండుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ∗ రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ అభ్యర్థి వద్ద రూ.5 లక్షలు వసూలు చేశారని సమాచారం. ఉద్యోగం రాకపోవడంతో ఆ అభ్యర్థి ప్రశి్నస్తే రూ.3 లక్షలు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పిస్తానని నచ్చజెప్పినట్లు సమాచారం. ∗ ముఖ్యపట్టణంలో డివైడర్ గ్రిల్ పనుల్లోనూ అవకతవకలకు పాల్పడ్డారు. బీచ్ ఫెస్టివల్, పోర్టు పనులు ప్రారంభం విషయంలో చంద్రబాబు పర్యటనలోనూ భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణంలోనూ భారీగా కమీషన్లు దండుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ∗ ఒక్కో వాటర్ ట్యాంక్ రూ.5 కోట్లతో 7 ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. ఒక్కో ట్యాంకుకు 10 శాతం చొప్పున రూ.3.50 కోట్లు దండుకున్నట్లు తెలిసింది. ∗ రైల్వే గేట్ నుంచి మంగినపూడి బీచ్ వరకు రూ.14 కోట్లతో చేపట్టిన రోడ్డు పనుల్లో 10 శాతం వాటా కింద రూ.1.40 కోట్లు వసూలు చేశారు. గుట్కా విక్రయదారుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ∗ జాతీయ తుపాను విపత్తుల నివారణ పథకం కింద రూ.36.45 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో మచిలీపట్నం నుంచి కృత్తివెన్ను మండల సమీపం వరకు 18.6 కిలోమీటర్ల మేర చేపట్టిన కరకట్ట నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. అనతి కాలంలో ఆ కరకట్ట బాగా దెబ్బతింది. ∗ మంత్రి రాజకీయ గురువు కూడా ఈ అక్రమాల్లో భాగం పంచుకున్నారు. తన పరిశ్రమలో నకిలీ ఎరువులు తయారు చేసి, వాటిని రైతులకు కట్టబెట్టి రూ.లక్షలు కొల్లగొట్టారు. ఈ విషయం అప్పట్లో దుమారం రేపింది. విజిలెన్స్ అధికారులు దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. హత్య సహా 25 కేసులు ఈ మాజీ మంత్రి 2020 జూలై 27న మచిలీపట్నం చేపల మార్కెట్లో జరిగిన వైఎస్సార్ సీపీ నాయకుడు మోకా భాస్కరరావు హత్య కేసులో ఏ–4 నిందితుడిగా ఉన్నారు. క్రైం నంబర్ 192/2020తో 120 బీ, 302 ఐపీసీ 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది. ఆయన పరారు కావడంతో పోలీసు ప్రత్యేక బృందం గాలించి అదుపులోకి తీసుకుంది. రెండు నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఈయనపై 2009 నుంచి ఇప్పటి వరకు హత్య, ఎస్సీ, ఎస్టీ కేసులతోపాటు మొత్తం 25 కేసులు నమోదయ్యాయి. అందులో 12 కేసుల నుంచి తన పలుకుబడి ఉపమోగించి బయటపడ్డారు. మిగిలినవి విచారణ దశలో ఉన్నాయి. -
భార్యను అతికిరాతకంగా చంపిన మాజీ మంత్రి
అస్తానా: మధ్య ఆసియా దేశం కజకస్తాన్ నిరసనలతో అట్టుడికిపోతోంది. ఓ మాజీ మంత్రి తన భార్యను అతికిరాతకంగా కొట్టి చంపిన వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ మానవ మృగం కోర్టు విచారణ ఎదుర్కొంటుండగా.. కఠిన శిక్ష పడాలంటూ ఆందోళనలు చేపట్టారు అక్కడి ప్రజలు.కువాన్దిక్ బిషింబయెవ్(44) కజకస్తాన్ దేశపు మాజీ ఆర్థిక మంత్రి. ఈయన బంధువు పేరిట ఉన్న ఓ రెస్టారెంట్లో గతేడాది నవంబర్లో ఆయన సతీమణి సల్తానత్ నుకెనోవా(31) అనుమానాస్పద రీతిలో మృతి చెందిది. అంతకు ముందు ఒకరోజు అంతా ఆ జంట ఆ హోటల్లోనే గడిపింది.అయితే విచారణలో ఆయనే ఆమెను దారుణంగా హింసించి చంపినట్లు తేలింది. దీంతో ఆయన కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈలోపు ఆ హోటల్ సీపీ టీవీ ఫుటేజీలు బయటకు వచ్చాయి. జుట్టుపట్టి ఈడ్చి కొట్టి.. ఇష్టానుసారం తన్ని.. సుమారు ఎనిమిది గంటల పాటు ఆ కిరాతకం కొనసాగింది. రక్తపు మడుగులో అచేతనంగా భార్య పడి ఉన్నప్పటికీ ఆమె బాగానే ఉందంటూ హోటల్ సిబ్బందితో బిషింబయెవ్ చెప్పడం కూడా వీడియోలో రికార్డయ్యింది. చివరకు 12 గంటల తర్వాత ఆంబులెన్స్ అక్కడికి చేరుకోగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు.తలకు, ముక్కుకు బలమైన గాయం కావడం, ఒంటిపై పలు చోట్ల గాయాల్ని శవ పరీక్షలో గుర్తించారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తులో.. సీసీ టీవీ ఫుటేజీ సహా సాక్ష్యాలన్నింటిని మాయం చేసేందుకు బిషింబయెవ్ ప్రయత్నించారని పోలీసులు తేల్చారు. అంతేకాదు.. తన భార్య మానసిక స్థితి బాగోలేదని, ఈ క్రమంలోనే తనకు తాను గాయాలు చేసుకుని ఆమె చనిపోయిందని న్యాయస్థానాల్ని నమ్మించే యత్నం చేశాడు కూడా.అయితే.. 8 గంటలపాటు సాగిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయటకు రావడంతో ఆ భర్త అకృత్యం వెలుగు చూసింది. భార్యను అలా ఎందుకు చంపాడో మాత్రం ఇంకా నోరు విప్పలేదు నిందితుడు. అయితే ఆమెను అంత క్రూరంగా చంపిన ఆ మాజీ మంత్రిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గృహ హింస చట్టం గురించి విస్తృతంగా చర్చ జరిగింది అక్కడ. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఆ దేశపు సుప్రీం కోర్టులో జరుగుతోంది. కజకస్తాన్ చరిత్రలోనే తొలిసారి ఈ కేసు విచారణను లైవ్ టెలికాస్ట్ చేయబోతోంది ఆ దేశ అత్యున్నన్యాయస్థానం. బిషింబయెవ్ నేరం గనుక రుజువు అయితే అక్కడి చట్టాల ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షపడుతుంది. -
కాంగ్రెస్ రెబల్కు బీజేపీ టికెట్.. మాజీ మంత్రి రాజీనామా
హిమాచల్ప్రదేశ్ మాజీ మంత్రి, లాహౌల్ - స్పితి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత రామ్లాల్ మార్కండ పార్టీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన కాంగ్రెస్ రెబల్కు తాజా అసెంబ్లీ ఉప ఎన్నకల్లో బీజేపీ టికెట్ ఇవ్వడంతో పార్టీ నుంచి రామ్ లాల్ మార్కండ వైదొలిగారు. అనర్హత వేటు పడిన ఆరుగురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే రామ్లాల్ మార్కండ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. లాహౌల్- స్పితి నుంచి ఉప ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించారు. అది కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సంకేతాలివ్వడం గమనార్హం. జై రామ్ ఠాకూర్ నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వంలో రామ్ లాల్ మార్కండ వ్యవసాయ, గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్లో ఉన్న ఠాకూర్ చేతిలో 1542 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఉప ఎన్నికల్లో లాహౌల్- స్పితి నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ అభ్యర్థుల జాబితాలో కాంగ్రెస్ రెబల్ ఠాకూర్ పేరు రావడంతో రామ్ లాల్ మార్కండ బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్రంలోని నాలుగు లోక్సభ స్థానాలైన హమీర్పూర్, సిమ్లా, మండి, కాంగ్రా స్థానాలతో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జూన్ 1న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లాహౌల్- స్పితి నుండి ఠాకూర్తో పాటు, ధర్మశాల నుండి సుధీర్ శర్మ, సుజన్పూర్ నుండి రాజిందర్ రాణా, బర్సార్ నుండి ఇందర్ దత్ లఖన్పాల్, గాగ్రెట్ నుండి చెతన్య శర్మ, కుట్లేహార్ నుండి దేవిందర్ కుమార్ భుట్టోలను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. -
ఉత్తరాఖండ్లో ఈడీ రెయిడ్స్.. ఆ పార్టీ నేతే టార్గెట్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ లక్ష్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు జరుపుతోంది. ఉత్తరాఖండ్, ఢిల్లీలోని మొత్తం 10 చోట్ల ఏకకాలంలో ఈడీ రెయిడ్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో బీజేపీలోనే ఉన్న హరక్ సింగ్ 2022 అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా హరక్సింగ్ను క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్లో చేరారు. 2022 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వచ్చింది. ఇదీ చదవండి.. ప్రధాని సుడిగాలి పర్యటనలు.. ప్రసంగాల్లో దానిపైనే ఫోకస్ ! -
karnataka: కాంగ్రెస్పై సొంత పార్టీ నేత తీవ్ర విమర్శలు
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి బి శివరాము సొంత పార్టీపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపైనే తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించి కాంగ్రెస్ పార్టీ నేతల్లోనే అవినీతి పెరిగిపోయిందని మండిపడ్డారు. గత బీజేపీ ప్రభుత్వంలో 40 శాతం అవినీతి జరిగిందని ప్రశ్నించిన కాంగ్రెస్.. అంతకంటే ఎక్కువగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. తన సొంత జిల్లా హసన్లోనే ఈ అవినీతి.. బీజేపీ హాయాంలోని 40 శాతం కంటే అధికంగా పెరిగిపోందన్నారు. ఈ విషయాన్ని తాను నేరుగా సీఎం సిద్ధరామయ్య దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు చేస్తున్న అవినీతిపై పార్టీ కార్యకర్తల్లో సైతం తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. తాను అవినీతి విషయంలో చాలా స్పష్టంగా తన అభిప్రాయాలు తెలియజేస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన పలువురు నేతల్లో కూడా ఇదే అభిప్రాయం ఉందని తెలిపారు. పార్టీలో కొంతమంది చేస్తున్న అవినీతిపై చర్చ జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా.. ఎప్పటికప్పుడు పార్టీ నేతలపై నిఘా ఉంచాలని అన్నారు. తాను సొంతపార్టీ నేతల అవినీతిపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తే చెడ్డవాడిగా ముద్రవేస్తారని తెలుసని అన్నారు. కానీ, పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల కోసమే తాను మాట్లాడుతున్నానని తెలిపారు. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే మాజీ ఎమ్మెల్యే శివరాము.. అధికారంలో ఉన్న సొంత పార్టీపై అవినీతి ఆరోపణలు చేయటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం గానీ.. సీఎం సిద్ధరామయ్య గాని ఎలా స్పందిస్తారో చూడాలి. చదవండి: ఢిల్లీలో ఆప్, బీజేపీ హోరాహోరీ నిరసనలు -
దళితులకిచ్చే గౌరవం ఇదేనా బాబూ?
తిరుపతి రూరల్: దళితులను అవమానించి ఆనందపడటం చంద్రబాబుకి అలవాటులా మారిపోయింది. ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారంటూ గతంలో మీడియా ముందే అహంకారంతో మాట్లాడిన బాబు మరోసారి దళితుల పట్ల తనకున్న చిన్నచూపును ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ రోజు తిరుపతి రూరల్ మండలం అవిలాలలోని టీడీపీ నేత వెంకటమణిప్రసాద్ ఇంట్లో నిర్వహించిన సమావేశంలో దళిత మాజీ మంత్రి పరసారత్నాన్ని అందరి ముందు నిల్చోబెట్టి ఘోరంగా అవమానించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి.. రెండు సార్లు ఎమ్మెల్యే, ఓసారి మంత్రిగా కూడా చేసిన ఆయనను కనీసం తమ పక్కన కూడా బాబు కూర్చోనివ్వలేదు. దాంతో ప్రెస్మీట్ జరిగినంతసేపు పరసారత్నం అవమానభారంతో చెమర్చిన కళ్లతో నిల్చోనే ఉండిపోయారు. దళితులను నిత్యం అవమానిస్తూ రాక్షసానందం పొందుతున్న తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని దళిత సంఘాలు పిలుపునిస్తున్నాయి. ఇదీ చదవండి: చంద్రబాబుపై ఆలపాటి తిరుగుబాటు -
మాజీ మంత్రి చాంబర్ నుంచి ఫర్నిచర్ తరలింపు!
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): రవీంద్రభారతిలో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ చాంబర్ నుంచి కొందరు ఫర్నిచర్ను తీసుకువెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. బుధవారం కొంతమంది వ్యక్తులు ఫర్నిచర్ను తీసుకువెళుతుండగా ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తులకు, ఓయూ జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. #OU student union leaders stopped the shifting of furniture from Former Minister Srinivas Goud's office, alleging that public property is being moved illegally. pic.twitter.com/cHlqXF4zgb — Sudhakar Udumula (@sudhakarudumula) December 6, 2023 ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ను ఎలా తీసుకువెళతారని జేఏసీ నాయకులు వారిని ప్రశ్నించారు. దీంతో వారు ఫర్నిచర్ను అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఈ ఘటనపై టీజీఓ సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ, తమ కార్యాలయంలో వినియోగించుకునేందుకు ఆ ఫర్నిచర్ను తీసుకువెళ్లాలనుకున్నామని, అయితే అది ప్రభుత్వానిదని తెలియడంతో ఆ ప్రయత్నం మానుకున్నామని తెలిపారు. -
Karnataka: మాజీ మంత్రి శ్రీరాములు కాంగ్రెస్లో చేరుతున్నారా?
బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బి.శ్రీరాములు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను సోమవారం బెంగళూరులోని ఆయన నివాసంలో కలిశారు. దీంతో శ్రీరాములు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు విజయేంద్రను పార్టీ ఇటీవల నియమించింది. దీంతో ఈ పదవిని ఆశించిన శ్రీరాములుకు భంగపాటు ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆయన పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే శ్రీరాములు తన కుమార్తె వివాహానికి ఆహ్వానించేందుకు డీకే నివాసానికి వెళ్లినట్లు సమాచారం. శ్రీరాములు బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో 2021 ఆగస్టు నుండి 2023 మే వరకు రాష్ట్ర రవాణా, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2020 అక్టోబర్ నుండి 2021 జూలై వరకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. శ్రీరాములు ప్రస్తుతం చిత్రదుర్గ జిల్లాలోని బళ్లారి రూరల్ మొలకల్మూరు నియోజకవర్గం నుంచి రాష్ట్ర శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. -
మేం చెప్పిందే చట్టం!.. అధికారులను బెదిరించిన ‘నారాయణ’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో నిరుపేద అసైన్డ్దారులను బెదిరించి బినామీలు, బంధువుల పేరిట కారు చౌకగా భూములను కొట్టేసిన మాజీ మంత్రి నారా యణ అధికారులనూ బెదిరించారని సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్రెడ్డి హైకోర్టుకు బుధవారం నివేదించారు. ప్రభుత్వం తమదని, తాము చెప్పిందే చట్టమని, చెప్పినట్లు చేయాలంటూ అధికారులను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. అప్పటి అడ్వొకేట్ జ నరల్ (ఏజీ), న్యాయశాఖ, ముఖ్య కార్యద ర్శులు, ఐఏఎస్ అధికారులు వారించినా నారాయణ లెక్క చేయలేదని తె లిపారు. అసైన్డ్ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో నారా యణే కీలక సూత్రధారి అని చెప్పారు. ఆయన సమీప బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలను కొనుగోలు చేసేందుకు రూ.18.10 కోట్లు వెచ్చించి నట్లు నివేదించారు. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ.600 కోట్లకు పైనే ఉంటుందని కోర్టు దృష్టికి తెచ్చారు. అసైన్డ్ భూములను ప్రభు త్వం వెనక్కి తీసుకుంటుందని, అంతిమంగా పేదలకు ఎలాంటి లబ్ధి చేకూరదంటూ గత ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు భయాందోళనలు రేకెత్తించారన్నారు. చదవండి: రామోజీ.. మీ ఆకాంక్షే గాలిలో దీపం అనంతరం అసైన్డ్దారుల నుంచి భూ ములను అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ల ద్వారా నామ మాత్రపు ధరలకు కొట్టేశారని తెలిపారు. ఆ తరువాత వాటిని ల్యాండ్ పూలింగ్ స్కీం కింద సీఆర్ఏడీకు ఇచ్చి జీవో 41 (ల్యాండ్ పూలింగ్ స్కీం రూల్స్) ని అడ్డం పెట్టుకుని విలువైన నివాస, వాణిజ్య ప్లాట్లను పొందినట్లు తెలిపారు. కొన్నిటిని అధిక ధరలకు అమ్ముకున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ మొత్తం నేరంలో అప్పటి సీఎం చంద్రబాబు, నాటి మంత్రి నారాయణ పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని నివేదించారు. దర్యాప్తులో సీఐడీ అధికా రులు స్వాధీనం చేసుకున్న నారాయణ ఫోన్ లో ఆయన కు మార్తె సింధూరతో జరిపిన సంభాషణలున్నట్లు తెలిపారు. తాను అసైన్డ్ భూములను కొన్నట్లు ఆ సంభాషణల్లో నారా యణ అంగీకరించారని చెప్పారు. అసైన్డ్ భూములు తమ పేర్లతో ఉంటే ప్రభుత్వం జైల్లో వేస్తుందని నారాయణ తన కుమార్తెతో చెప్పారన్నారు. ఆ సంభాషణల తాలుకూ పెన్ డ్రైవ్ ను సీల్డ్ కవర్లో కోర్టుకు అందజేశారు. ఈ వ్యవహా రానికి సంబంధించి ఒరిజినల్ రి కార్డులను సైతం సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారు. ఏఏజీ వాదనలు పూర్తి కాక పోవడంతో తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేస్తూ జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఉత్తర్వులిచ్చారు. అసైన్డ్ భూముల బద లాయింపులో అక్ర మాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, నారాయ ణ లపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీన్ని కొట్టివేయాలని కోరుతూ దాఖలైన క్వాష్ పిటి షన్లపై స్టే విధించిన కోర్టు ఇటీవల తుది విచారణ చేపట్టింది. చట్టపరమైన రక్షణ ఉంది.. ప్రాసిక్యూషన్ తగదు నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ సీఆర్డీఏ చట్టం కింద తీసు కున్న నిర్ణయాల విషయంలో ప్రభుత్వం, అధికారులు, అథారిటీలకు వ్యతిరేకంగా ఎలాంటి కేసులు దాఖలు చే యడానికి వీల్లేదన్నారు. చట్టం కింద రక్షణ ఉన్నందున నారాయణను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదన్నారు. తమ కున్న అధికారం మేరకే జీవో 41 జారీ చేశారని తెలిపారు. ఈ అధికారాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీ, ఎస్టీలెవరూ ఫిర్యాదుదారులు కాదన్నారు. అందువల్ల ఆ చట్టం కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నారు. ఇతర టీడీపీ నేతలు కూడా.. అసైన్డ్దారులను బెదిరించి నారాయణ మాత్రమే కాకుండా అప్పటి అధికార పార్టీ నేతలైన రావెల కిషోర్బాబు, అనగాని సత్యప్రసాద్, పరిటాల శ్రీరామ్, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు కూడా భూములను సొంతం చేసుకున్నట్లు ఏఏజీ సుధా కర్రెడ్డి తెలిపారు. ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి అసైన్డ్ భూములను తీసుకురావడం, ఆ భూముల బదలాయింపుపై అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, జేసీ చెరుకూరి శ్రీధర్ అభ్యంతరం తెలిపారన్నారు. ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అసైన్డ్ భూ ముల విషయంలో చట్టపరమైన నిబంధనలను నారాయణకు స్పష్టంగా వివరించినట్లు వారు త మ వాంగ్మూలాల్లో స్పష్టంగా చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో స్టే ఎత్తివేసి సీఐడీ దర్యాప్తు కొనసాగించేందుకు అనుమతినివ్వాలని అభ్యర్థించారు. -
మైనర్ బాలికలనూ విడిచిపెట్టడం లేదు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ వేధింపుల పర్వంపై వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మండిపడ్డారు. వావివరసలు లేకుండా సొంత కుటుంబ సభ్యులనే కాకుండా ప్రజలను, తన సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, చదువుకుంటున్న మైనర్ బాలికలను కూడా వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గద్దలు, డేగలు కోడి పిల్లల్ని తన్నుకుపోవడానికి పైనుంచి గురి చూసినట్లే నారాయణ అమాయక అబలలపై కన్నేసి వారిని ఖతం చేస్తున్నారని ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రకాశం జిల్లాలో కట్టిన ఫ్లెక్సీల్లో ‘అసలోడు వచ్చే వరకే కొసరోడికి పండుగ’ అని రాసి ఉందన్నారు. ‘అసలోడు .. కొసరోడు’.. ఇందులో అంతరార్థం ఏమిటో చంద్రబాబు అధికారికంగా స్పష్టత ఇవ్వాలని కోరారు. కొసరోడు అంటే ఆ జిల్లాలో యువగళం చేస్తున్న చినబాబు కాదు కదా? అని ప్రశ్నించారు. ప్రజలకు వచ్చిన సందేహాన్నే తాను కూడా ప్రస్తావిస్తున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈవెంట్ మేనేజ్మెంట్లో చంద్రబాబును మించిన వారెవరూ ఉండరని ఎద్దేవా చేశారు. ప్రతి కార్యక్రమానికి ఏదో ఒక ఆకర్షణను జత చేసి జనాన్ని మొబిలైజ్ చేయడం ఆయనకు మొదటి నుంచీ అలవాటేనన్నారు. చినబాబు యువగళం యాత్రకు గ్లామర్ అద్దేందుకు టీవీ యాంకర్ను హైదరాబాద్ నుంచి రప్పించడం ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి ఇక నుంచి సినీనటుల సందడి మొదలవుతుందనేది అర్థమవుతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
బాలికపై అమానుషం.. కాలితో తన్ని.. మినిష్టర్ భార్య నిర్వాకం
అస్సాం : అసోం గణ పరిషద్ కు చెందిన మాజీ మంత్రి హాజీ రౌఫ్ చౌదరి(85) భార్య ఫర్హానా(28) ఒక మైనర్ బాలికను కాలితో తన్నుతూ కొడుతున్న వీడియో ఒకటి వైరల్ గా మారింది. వెంటనే బాలల హక్కుల సంరక్షణ సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ ఫిర్యాదు మేరకు అసోం పోలీసులు రంగంలోకి దిగి మాజీ మంత్రిని అతడి భార్యను అరెస్టు చేశారు. బాలల సహాయక సంస్థ ప్రతినిధి చంద్రధర్ భుయాన్ తెలిపిన వివరాల ప్రకారం మాజీ మంత్రి చౌదరి ఫర్హానా దంపతులు ఈ 12 ఏళ్ల బాలికను తీసుకొచ్చి పెంచుకుంటున్నామని చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలేవైనా ఉన్నాయా అంటే లేవంటున్నారు. వీడియోలో ఆ బాలికను ఎందుకలా చావగొడుతున్నావని అడిగితే స్కూల్ చదువుల్లో బాగా వెనకబడిపోయినందునే కోపంతో కొట్టానని చెబుతోంది మాజీ మంత్రి భార్య. అంతేకాదు ఈ వీడియో స్వయంగా నేనే తీశానని నా భర్తకు ఈ విషయం గురించి ఏమీ తెలియదని చెబుతోంది. ఏది ఏమైనా ఆ బాలిక పట్ల ఆమె ప్రవర్తన అమానుషమన్నారు చంద్రధర్. కేసు నమోదు చేసిన హోజాయ్ పోలీసులు బాలిక తల్లితో పాటు మిగతావారిని కూడా సంప్రదించి ఇందులో వీరిద్దరే కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తోన్నట్లు తెలిపారు. హాజీ రౌఫ్ చౌదరి పైనా అతని భార్య ఫర్హానా పైనా ఐపీసీ 324,25 సెక్షన్లతో పాటు బాల కార్మికుల(నిషేధం & నియంత్రణ) చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా? -
ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు వైద్య పరీక్షలు
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వెన్నెముక సమస్యతో బాధపడుతున్న జైన్కు శనివారం దీన్దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్లో పరీక్షలు చేయించామని, మరోసారి వైద్యుల అభిప్రాయం తీసుకోవాలన్న ఆయన కోరిక మేరకు సోమవారం సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లామని జైలు అధికారులు తెలిపారు. ఆయన వెంట పోలీసులున్నారని చెప్పారు. న్యూరోసర్జరీ విభాగం వైద్యులు పరీక్షించాక ఆయన్ను తిరిగి జైలుకు తీసుకొచ్చారన్నారు. జైన్ను 2022 మే 31వ తేదీన ఈడీ అరెస్ట్ చేసింది. జైన్ త్వరగా కోలుకోవాలని ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆకాంక్షించారు. ‘జైన్ను బీజేపీ చంపాలనుకుంటోంది. ఇంతటి క్రూరత్వం పనికిరాదు, మోదీజీ’ అంటూ ట్వీట్ చేశారు. వివిధ ఆరోగ్య సమస్యలతో జైన్ 35 కిలోలు తగ్గారని ఆయన లాయర్ అభిషేక్ సింఘ్వి సుప్రీంకోర్టుకు తెలిపారు. -
కారులో వెళ్తూ బుల్డోజర్ను ఢీకొట్టిన మాజీ మంత్రి.. అక్కడికక్కడే..
గాంధీనగర్: గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత వల్లభ్బాయ్ వఘాసియా(69) రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బుల్డోజర్ను ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. కారును ఆయనే స్వయంగా డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వఘాసియాతో పాటు కారులో ఉన్న మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో అమ్రేలి జిల్లా సావర్కుంద్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విజయ్రూపానీ మొదటి సారి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు వఘాసియా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. సావర్కుంద్ల నియోజకవర్గం నుంచి 2012లో బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2016లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వఘాసియా మృతి పట్ల సావర్కుంద్ల ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే మహేష్ కశ్వాలా విచారం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఒక మాస్ లీడర్ను కోల్పోయామన్నారు. చదవండి: సంపు క్లీన్ చేస్తుండగా విద్యుత్ షాక్.. ముగ్గురు మృతి.. -
54 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న మాజీ మంత్రి
భువనేశ్వర్: అధికార పార్టీ బీజూ జనతాదల్ కొరాపుట్ జిల్లా పరిశీలకుడు, మాజీమంత్రి కెప్టెన్ దివ్యశంకర్ మిశ్రా(54) రెండో వివాహం చేసుకున్నారు. పూరీ సమీపంలోని ఓ రిసార్టులో ఆదివారం ఈ వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు పరిమిత బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. పాస్లు ఉన్న వారిని మాత్రమే ప్రవేశానికి అనుమతించారు. కాగా దివశంకర్తోపాటు అతను వివాహం చేసుకున్న ప్రియాంక అగస్తీకి కూడా ఇది రెండో పెళ్లి. వీరిద్దరూ ఇంతకముందు తమ గత వైవాహిక జీవితాలలో విడాకులు తీసుకున్నారు. గతంలో జయపట్నకు చెందిన మహిళతో వివాహం చేసుకున్న ఆయన.. వివిధ కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరి దాంపత్యంలో జన్మించిన కుమారుడు దుబాయ్లో చదువుతున్నట్లు సమాచారం. టాటాలో సీనియర్ ఇంజినీర్.. దివ్యశంకర మిశ్రాను వివాహం చేసుకున్న ప్రియాంక అగసీకలహండి జిల్లాలోని గోలముండా మండలం డెకోటా గ్రామానికి చెందిన భవానీ అగస్తీ కుమార్తె. సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం టాటా పవర్లో సీనియర్ లీడ్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. ప్రియాంకకు కూడా ఇది రెండో వివాహం కాగా, గతంలో మానస్ పండా అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకున్నారు. సంచలనాలకు మారు పేరైన దివ్యశంకర్.. ఈ వివాహంతో మరోసారి వార్తల్లో నిలిచారు. దివ్యశంకర్ ప్రస్తుతం కలహండి జిల్లా జునాఘడ్ విధానసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. తొలుత నవీన్ క్యాబినెట్లో హోంశాఖ సహాయ మంత్రిగా ఉండేవారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉపాధ్యాయురాలు మమతా మెహర్ హత్య కేసులో దివ్యశంకర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో క్యాబినెట్ విస్తరణలో మంత్రి పదవిని నిలబెట్టుకోలేక పోయారు. అయితే ఇటీవల బీజేడీ అధిష్టానం ఆయనకు కొరాపుట్ జిల్లా బాధ్యతలు అప్పగించింది. -
లైవ్ టీవీ షోలో ఏడ్చేసిన పాక్ మాజీ మంత్రి.. వీడియో వైరల్..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ మంత్రి, ఇమ్రాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఫవాద్ చౌదరి లైవ్ టీవీ షోలో బోరున విలపించారు. దేశద్రోహం కేసులో అరెస్టై ఇటీవలే బెయిల్పై విడుదలైన ఆయన.. జైలు జీవితాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం అధికారులను బెదిరించారనే ఆరోపణలతో ఫవాద్ చౌదరిపై దేశద్రోహం కేసు నమోదు చేసి కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు. తాను జైలులో ఉన్నప్పుడు జీవితం ఎలా ఉందని, కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటని టీవీ యాంకర్ ఫవాద్ను ప్రశ్నించారు. తనను అరెస్టు చేసినప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరుపై ఫవాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తన చేతికి సంకెళ్లు, మొహానికి ముసుగు వేసి కోర్టుకు తీసుకెళ్లారని, ఫోన్ కూడా లాక్కున్నారని చెప్పారు. ఆ ఫోన్ ఇంకా తనకు తిరిగి ఇవ్వలేదన్నారు. జైల్లో ఉన్నప్పుడు కుమారులు తనను చూసేందుకు వచ్చినప్పుడు చాలా బాధేసిందని చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే బోరున విలపించారు. కన్నీటిని చేతులతో తుడుచుకుంటూనే మాట్లాడారు. ఫవాద్కు ఇస్లామాబాద్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. మరోసారి బెదిరింపు వ్యాఖ్యలు చేయొద్దనే షరతుతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. చదవండి: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
మాజీ మంత్రి వట్టి వసంత్కుమార్ కన్నుమూత
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున వైజాగ్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వసంత్కుమార్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూళ్ళ గ్రామం. కాగా అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నారు. ఆది నుంచి వసంత్కుమార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2004, 2009లో ఉంగుటూరు నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో వైఎస్ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్లోనూ అదే శాఖా మంత్రిగా పని చేశారు. ఇక కిరణ్కుమార్ రెడ్డి కేబినెట్లో పర్యాటక శాఖ మంత్రి విధులు నిర్వర్తించారు. 2018 లో టీడీపీ-కాంగ్రెస్ కలయిక తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. 2014 నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న వసంత్కుమార్ విశాఖలో కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. -
హైకోర్టు ఆదేశాలు.. మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. హైకోర్టు ఆదేశాలతో నారాయణను ఆయన ఇంట్లో సీఐడీ ప్రశ్నించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్లో అవకతవకలపై అధికారులు విచారణ జరిపారు. 160 సీఆర్పీసీ కింద ఇప్పటికే నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. 2014-19 మధ్య ఇన్నర్ రింగ్రోడ్డు భూసేకరణలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. అలైన్మెంట్ మార్చడంతో రామకృష్ణా హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ ఫామ్స్, జయని ఎస్టేట్కు లబ్ధి చేకూర్చారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తు చేపట్టింది. అప్పటి సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే నారాయణ నాటి మున్సిపల్ మినిస్టర్ హోదాలో అలైన్మెంట్ మార్పులు చేసిట్టు గుర్తించారు. ఇప్పటికే నారాయణ బెయిల్ను సుప్రీం కోర్టులో ఏపీ సీఐడీ సవాల్ చేసింది. చదవండి: ఈడీ విచారణలో ఎల్ రమణకు తీవ్ర అస్వస్థత -
మనవరాలితో కలిసి స్టెప్పులేసిన రఘువీరారెడ్డి..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘువీరా రెడ్డి గురించి తెలియని వారుండరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి.. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కొనసాగారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా కుటుంబంతో గడపడం మొదలుపెట్టారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదా వ్యక్తిగా అందరిలో కలిసిపోయి జీవిస్తున్నారు. తాజాగా.. రఘువీరా రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన మనుమరాలితో సరదాగా డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు. టీవీలో ఓ పాట పెట్టి.. దానికి అనుగుణంగా రఘువీరా తన మనుమరాలితో కలిసి డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ఎన్నికల ముందు బీజేపీకి షాక్..!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న క్రమంలో అధికార బీజేపీకి మాజీ మంత్రి జయనారాయణ్ వ్యాస్ షాకిచ్చారు. ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. అయితే, ఆయన ఏపార్టీలో చేరతారనే విషయాన్ని వెల్లడించలేదు. కాంగ్రెస్లో చేరతారనే వాదనలు బలంగా వినిపిస్తున్నా.. మరోవైపు ఆప్ వైపు సైతం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్కు పంపించారు మాజీ మంత్రి. ‘నేను బీజేపీతో విసిగిపోయాను, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశాను. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సద్ధాపుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. ఏ పార్టీలో చేరటమనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వ్యక్తిగత కారణాలతోనే బీజేపీని వీడుతున్నాను.’ అని వ్యాస్ పేర్కొన్నారు. 75ఏళ్ల వ్యాస్ ఇటీవల కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లత్, కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికల పరిశీలకులతో వరుసగా సమావేశమయ్యారు. దీంతో ఆయన హస్తం పార్టీలో చేరే అవకాశముందని ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పెద్దలతో వ్యాస్ మంతనాలు జరుపుతున్నట్లు హస్తం పార్టీ నేత ఒకరు పేర్కొనటం ఆ వాదనలకు బలం చేకూర్చుతోంది. 2007లో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యాస్ రాష్ట్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2012, 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో కాషాయ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన వ్యాస్.. పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు.. ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం మంతనాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదీ చదవండి: ‘మిస్టర్ కేజ్రీవాల్ మీ దృష్టిలో నేను దొంగనైతే.. మరి మీరేంటి?’ -
Bengal Schools Scam: పార్థా చటర్జీకి చెందిన రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్
న్యూఢిల్లీ/కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థా చటర్జీ, ఆయన సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీకి చెందిన రూ.46.22 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రాష్ట్రంలో 2016లో చోటుచేసుకున్న టీచర్ల నియామకం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో పార్థా చటర్జీ, అర్పితా ముఖర్జీల ఆస్తులను జప్తు చేసినట్లు సోమవారం తెలిపింది. ఈడీ సోమవారం వీరిపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ వేసింది. వీరిద్దరినీ ఈడీ జూలైలో అరెస్ట్ చేసింది. వీరికి చెందిన పలు ప్రాంతాల్లో దాడులు జరిపిన ఈడీ రూ.55 కోట్ల నగలు, నగదును స్వాధీనం చేసుకుంది. ఇలా ఉండగా, ఇదే కుంభకోణానికి సంబంధించి సీబీఐ నార్త్ బెంగాల్ యూనివర్సిటీ వీసీ సుబిరెస్ భట్టాచార్యను సోమవారం అరెస్ట్ చేసింది. అప్పట్లో ఆయన బెంగాల్ సెంట్రల్ స్కూల్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా ఉండేవారు. -
Karnataka: మాజీ మంత్రి కన్నుమూత
బెంగళూరు: మాజీమంత్రి, ఉత్తర కన్నడ జిల్లా కారవారలో పలు విద్యాసంస్థలను స్థాపించిన ప్రభాకర్ రాణె (81) సోమవారం మధ్యాహ్నం తన స్వగృహంలో కన్నుమూశారు. నెల క్రితం జ్వరం రావటంతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఇంటిలోనే చికిత్స తీసుకుంటున్నారు. కారవార జోయిడా స్థానం నుంచి క్రాంతిరంగ పార్టీ నుండి ఒకసారి, కాంగ్రెస్ తరపున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1993లో వీరప్ప మెయిలీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: (బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పు పాతర) -
పంజాబ్ మాజీ మంత్రి అరెస్ట్, నెల క్రితమే సీఎం వార్నింగ్
చండీఘడ్: అవినీతి ఆరోపణలపై పంజాబ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాధు సింగ్ ధరమ్సోత్ అరెస్టయ్యారు. మంగళవారం తెల్లవారుజామున రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో ధరమ్సోతను అరెస్ట్ చేసింది. అతనితో పాటు సహాయకుడిగా పనిచేస్తున్న కమల్జిత్ సింగ్ అనే స్థానిక జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు. కాగా సాధు సింగ్ గతంలో కెప్టెన్ అమరీందర్ సింఘ్ కేబినెట్లో అటవీ, సాంఘిక, సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే పంజాబ్లో అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చెట్లను నరికివేయడానికి అనుమతి ఇచ్చినందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం చెట్లు నరికినప్పుడు కాంట్రాక్టర్లు చెట్టుకు రూ.500 చొప్పున లంచం తీసుకున్నారని విజిలెన్స్ అధికారులు అభియోగాలు మోపారు. అలాగే దళితుల స్కాలర్షిప్ పథకాల్లో కోట్లాది రూపాయల కుంభకోణానికి సూత్రధారిగా ఉన్నట్లు సాధు సింగ్పై ఆరోపణలు వచ్చాయి. కాగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రిపై చర్యలు తీసుకుంటామని ఆప్ నాయకుడు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్సింగ్ హెచ్చరించిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇక గతవారం అవినీతికి పాల్పడిన ఆరోపణలపై క్యాబినెట్ మంత్రి విజయ్ సింగ్లా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. టెండర్లపై ఒక శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అతన్ని అరెస్టు చేసింది. చదవండి: ఇంటిముందున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్ -
మాజీ మంత్రి కొడుకు హల్చల్.. కారులో మందు తాగుతూ రోడ్డుపై..
మద్యం మత్తులో కాంగ్రెస్ మాజీ మంత్రి కొడుకు రెచ్చిపోయాడు. ఫుల్లుగా తాగి వాహనం నడుపుతూ రోడ్డుపై హల్చల్ చేశాడు. మద్యం మత్తులోనే ఓ వ్యాపారి కారును ఢీకొని అతడితో వాగ్వాదానికి దిగి కత్తితో బెదిరించాడు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. షాజాపూర్కు చెందని కాంగ్రెస్ మాజీ మంత్రి హుకుమా కరాడ కొడుకు రోహితప్ సింగ్ మద్యం మత్తులో రోడ్డుపై న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. తన ఎస్వీయూ(SVU) కారులో మద్యం తాగుతూ రోడ్డు మీద ఉన్న వ్యాపారి దినేష్ అహుజా కారును ఢీకొట్టాడు. దినేస్ అహుజా అతడి అనుచరులతో కలిసి భోపాల్ నుంచి ఇండోర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, భాదితులు దినేష్ తెలిపిన వివరాల ప్రకారం.. రోహితప్ సింగ్ మద్యం తాగుతూ కారు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై తన కారును ఢీకొట్టడంతో వారు అతడిని ప్రశ్నించగా.. రోహితప్ మరింత రెచ్చిపోయాడు. బాధితులు తాము పోలీస్ స్టేషన్కు వెళతాము. నష్ట పరిహారం ఇవ్వాలని కోరడంతో వారు రోహితప్ మరింత రెచ్చిపోయాడు. మరోసారి దినేష్ కారును ఢీకొట్టాడు. దీంతో దినేష్, అతడి అనుచరులు.. రోహితప్ను బయటకు దిగాలని కోరడంతో అతడు వారిని కత్తితో బెదిరించి అక్కడి నుంచి తన కారులో వెళ్లిపోయినట్టు తెలిపారుకాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్టు అష్టా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అనిల్ యాదవ్ తెలిపారు. కారు రిజిస్ట్రేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. Former minister and senior @INCIndia leader Hukum Singh Karada's heavily drunk son Rohitap who was driving an SUV hit the car of a businessman When asked him to come to the local police, Karada again dashed the car with his SUV @ndtv @ndtvindia pic.twitter.com/quzQf5sh1P — Anurag Dwary (@Anurag_Dwary) May 23, 2022 ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు- లారీ ఢీకొని తొమ్మిది మంది మృతి -
30 ఏళ్లపాటు సేవలు.. డ్రైవర్ పాడె మోసిన మాజీ మంత్రి
సాక్షి, ఖమ్మం: వాహనం డ్రైవర్గానే కాకుండా కుటుంబానికి ఆప్తుడిగా ముప్పై ఏళ్ల పాటు సేవలందించిన వ్యక్తి మృతి చెందడంతో... ఆయన అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసిన మాజీ మంత్రి కృతజ్ఞత చాటుకున్నారు. కామేపల్లికి చెందిన సిద్ధబోయిన కృష్ణ(59) మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి వెంకట్రెడ్డి డ్రైవర్గా పనిచేశాడు. అంతేకాకుండా ముప్పై ఏళ్ల ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. కాగా, కృష్ణ శనివారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందాడు. విషయం తెలియగానే రాంరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి తదితరులు చేరుకుని నివాళులర్పించారు. కృష్ణ అంత్యక్రియల్లో పాడె మోసిన దామోదర్రెడ్డి.. తమ కుటుంబానికి కృష్ణ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, జెడ్పీటీసీ బానోత్ వెంకటప్రవీణ్కుమార్, నాయకులు నర్సింహారెడ్డి, రాంరెడ్డి గోపాల్రెడ్డి, చీమల వెంకటేశ్వర్లు, భూక్యా దళ్సింగ్, లక్కినేని సురేందర్, డాక్టర్ భూక్యా రాంచందర్నాయక్, జి.రవి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆదిలాబాద్: ఆఫీసర్స్ క్లబ్లో రికార్డింగ్ డ్యాన్సులు -
‘మా అమ్మను కిడ్నాప్ చేశారు’
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలోని మానవహక్కుల మంత్రిగా పనిచేసిన తన తల్గి షిరీన్ మజారీని పోలీసులు కిడ్నాప్ చేశారని ఆమె కుమార్తె ఆరోపించింది. వాస్తవానికి ఆమె అవినీతి నిరోధక సంస్థ కస్టడీలో ఉన్నారు. కానీ ఆమె కుమార్తె ఇమాన్ జైనాబ్ మజారీ మాత్రం పోలీసులు తన తల్లిని కొట్టి తీసుకెళ్లారని ఆరోపణలు చేశారు. అయినా ఏ వ్యక్తినైన అరెస్ట్ చేసేముందు ఏ అభియోగంతో తీసుకెళ్తున్నారో చెప్పాలి కానీ తనకు అవేమీ చెప్పలేదని కేవలం తన తల్లి లామోర్ అవినీతి నిరోధక విభాగంలో ఉందని మాత్రమే తెలుసని చెప్పుకొచ్చారు. సున్నితంగా ఉండే మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఈ ప్రభుత్వం తన తల్లిని కిడ్నాప్ చేసిందంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు గుప్పించారు. తన తల్లికి ఏదైన జరిగితే ఎవరిని వదలిపెట్టనంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. తన సహోద్యోగిని ఈ ఫాసిస్ట్ పాలన హింసాత్మక ధోరణితో కిడ్నాప్ చేసిందంటూ ఆరోపణలు చేశారు. తమ ఉద్యమం శాంతియుతమైనదని ఫాసిజాన్ని దిగుమతి చేసుకున్న ప్రభుత్వం దేశాన్ని గందరగోళంలోకి నెట్టాలని చూస్తోందన్నారు. ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఉన్నది సరిపోదన్నట్లు ఈ ఎన్నికలను నివారించేందుకే ఈ అరాచకాలు సృష్టిస్తున్నారంటూ విమర్శించారు. (చదవండి: ఉత్తర కొరియాకు వ్యాక్సిన్ ఆఫర్ ప్రకటించిన అమెరికా...కిమ్ని కలుస్తానంటున్న బైడెన్)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
డీజిల్తో పరాటా చేయడమా? చివరికి యజమాని..
మెహరీన్పై తప్పుడు వార్తలు.. క్షమాపణ చెప్పాలంటూ ఫైర్
ప్లాటినమ్ కలర్ శారీలో ‘రాములమ్మ’ హొయలు.. జింగ్ జింగ్ అమేజింగ్ శ్రీ!
8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..
రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్
సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
టీడీపీ అరాచకం.. డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
‘పీఓకే’లో ఆందోళనలపై మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు
ఫ్లాట్గా ముగిసిన స్టాక్మార్కెట్ సూచీలు
సినిమా లవర్స్కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..
తప్పక చదవండి
- సైకో థ్రిల్లర్గా 'దక్షిణ'.. ట్రైలర్తోనే భయపెట్టారు!
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement