-
పూజల్లో యూపీ సీఎం.. సూర్య నమస్కారాల్లో గుజరాత్ సీఎం!
ఈరోజు నూతన సంవత్సరంలో తొలి రోజు.. అందుకే ఈరోజును ప్రత్యేకంగా మార్చుకోవాలని చాలామంది భావిస్తుంటారు. చాలామంది కొత్త సంవత్సరం మొదటి రోజున ఆలయాలు సందర్శించి, దేవునికి పూజలు చేస్తుంటారు. ఫలితంగా ఈరోజు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంటుంది. కాగా పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు, గవర్నర్లు ఆలయాలను సందర్శించి పూజలు చేస్తున్నారు. #WATCH | Uttar Pradesh CM Yogi Adityanath performs 'havan' and 'Rudra Abhishek' in Gorakhnath temple, Gorakhpur (Video source: CMO) pic.twitter.com/0juG1CX7Vd — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 1, 2024 యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు (సోమవారం) ఉదయం గోరఖ్పూర్ చేరుకుని, గోరఖ్నాథ్ ఆలయంలో యాగం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్లో ‘జనతా దర్శన్’ కార్యక్రమంలో పాల్గొని సామాన్య ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, హోం మంత్రి హర్ష్ షాంఘ్వీ 2024 సంవత్సరం తొలి రోజు మోధేరా సూర్య దేవాలయంలో సూర్యనమస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ ‘ఈ రోజు అత్యధిక సూర్య నమస్కారాలు చేస్తూ గిన్నిస్ రికార్డ్ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సూర్య నమస్కార కార్యక్రమంలో నాలుగువేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారన్నారు. ఇది కూడా చదవండి: వైష్ణోదేవి ఎదుట భక్తులు బారులు #WATCH | Mehsana: Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi participate in the Suryanamaskar Program at Modhera Sun Temple, on the first morning of the year 2024. pic.twitter.com/t3z3iBBIuk — ANI (@ANI) January 1, 2024 -
అయోధ్యలో అక్షత పూజ
అయోధ్య: అయోధ్యలో శ్రీరామ మందిరంలో ప్రతిష్టాపన పూజలు ఆదివారం సంప్రదాయం ప్రకారం అక్షత పూజతో మొదలయ్యాయి. ఆలయంలోని రామదర్బార్, శ్రీరాముని ఆస్థానంలో పసుపు, దేశవాళీ నెయ్యి కలిపిన 100 క్వింటాళ్ల బియ్యంతో అక్షత పూజ నిర్వహిస్తున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేశంలోని 45 ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ)కు చెందిన 90 మంది ముఖ్యులకు 5 కిలోల మేర అక్షతలను పంపిణీ చేస్తారు. వీరు వీటిని జిల్లాలు, బ్లాకులు, తహసీల్లు, గ్రామాల ప్రతినిధులకు అందజేస్తారని ట్రస్ట్ కార్యదర్శి చంపత్రాయ్ చెప్పారు. మిగతా అక్షతలను ఆలయంలోని శ్రీరాముని విగ్రహం ఎదురుగా కలశంలో ఉంచుతారు. వీరు ఈ అక్షతలను వీరు వచ్చే జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన జరిగేలోగా దేశవ్యాప్తంగా ప్రజలకు పంపిణీ చేయనున్నారని ట్రస్ట్ తెలిపింది. -
వినాయకుడి పూజలోని ఏకవింశతి పత్రాల విశిష్టత ఏంటో తెలుసా!
గణపతి పూజావిధానంలోనే ‘...పత్రం సమర్పయామి’ అని వల్లిస్తాం. పత్రం మాత్రమే పూజలో చోటుచేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి. ఆ రోజున మాత్రమే ఏకవింశతి (21) పత్రాలను పూజలో వినియోగిస్తాం. ఆ పత్రిలో ఒక్కో ఆకుకు ఒక్కో విశిష్టత ఉంది. అవేమిటో తెలుసుకుందాం. మాచీ పత్రం (దవనం ఆకు): ఈ ఆకును తాకడం, సువాసన పీల్చడంద్వారా నరాల బలహీనతలు, ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి. మనోవైకల్యం, అలసట తగ్గుతాయి. ఆస్తమా నియంత్రణలో ఉంటుంది. వ్రణాలకు, కుష్టువ్యాధికి మందులా పనిచేస్తుంది. తలనొప్పి, వాతం నొప్పులను తగ్గిస్తుంది. కళ్లకు చలువ చేకూర్చి మానసిక వికాసం కలుగజేస్తుంది. ఉదరానికి మాచీపత్రం చాలా మంచిది. బృహతీ పత్రం (నేల మునగ ఆకు): దీనినే ‘వాకుడు ఆకు’ అని అంటారు. ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని. దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి. హృదయానికి చాలా మంచిది. వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. మూత్రం సాఫీగా కావడానికి, తాప నివారణకు, హృద్రోగ శాంతికి నేల మునగాకు సహకరిస్తుంది. బిల్వ పత్రం (మారేడు ఆకు): దీనికే మరో పేరు ’బిలిబిత్తిరి’. ’త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మపాప సంహారం, ఏక బిల్వం శివార్పణం’ అని పూజిస్తాం. బిల్వ పత్రమంటే శివునికి ఎంత ప్రీతికరమో ఈ శ్లోకంద్వారా తెలుస్తోంది. ఈ మారేడు ఆకువల్ల నెమ్మదించే రోగగుణాలను పరిశీలిస్తే... బంక విరోచనాలు కట్టడిపోతాయి. అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు మేలైనది. నేత్రసంబంధమైన రుగ్మతలను అరికడుతుంది. శ్రీమహాలక్ష్మి తపస్సువల్ల ఈ వక్షం జన్మించినదట. మారేడు దళంలో మూడు ఆకులు, ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున ఆకులుంటాయి. ఎక్కువగా మూడు ఆకుల దళమే వాడుకలో ఉంది. దూర్వాయుగ్మం (గరిక): చర్మరోగాలకు, మానసిక రుగ్మతలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అజీర్తిని నివారించడంలో, అంటువ్యాధులు నిరోధించడంలో, వాంతులు, విరోచనాలు అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్నిస్తుంది. గజ్జిని నియంత్రిస్తుంది. గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారిణి లా పనిచేసి మాడ్చేస్తుంది. దత్తూర పత్రం (ఉమ్మెత్త ఆకు): దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది. ఉబ్బసం, కోరింత దగ్గు తగిస్తుంది. ఉదరకోశ వ్యాధులకు, చర్మరోగాలకు, కీళ్ల నొప్పులకు, లైంగిక సంబంధ సమస్యలకు, గడ్డలు, ప్రణాలకు ఉమ్మెత్త ఆకు చాలా బాగా పనిచేస్తుంది. బదరీ పత్రం (రేగు ఆకు): జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది. వీర్యవద్ధికి దోహదపడుతుంది. రక్త దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది. శరీరానికి సత్తువను చేకూరుస్తుంది. అరికాళ్ల మంటలు, అరిచేతుల దురదలు తగ్గుతాయి. అపామార్గ పత్రం (ఉత్తరేణి): పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు. ఆరోగ్య సంరక్షిణిగా చెప్పవచ్చు. కడుపు శూల, అజీర్తి, మొలలు, వేడిసెగ గడ్డలు, చర్మపుపొంగుకు ఉత్తరేణి చాలా మంచిది. దీనితో పళ్లు తోముకున్నట్టయితే దంతాలు గట్టిపడతాయి. దీనికే పాపసంహారిణి, రాక్షస సంహారిణి అనికూడా పేర్లున్నాయి. తులసీ పత్రం: ఇందులో చాలా రకాలున్నాయి. జలుబు, దగ్గు, చర్మరోగాలు, గొంతు సంబంధ వ్యాధులు, అజీర్ణ వ్యాధులు తగ్గించగలదు. రక్తస్రావాన్ని, అతిసారను అదుపుచేస్తుంది. వాంతులు, కడుపుశూల అరికడుతుంది. విషాన్ని హరించే గుణంకూడా తులసి ఆకులో ఉంది. యాంటిసెప్టిక్గా పనిచేస్తుంది. కలియుగ కల్పతరువుగా కశ్యపాయ పత్రాన్ని చెప్పాలి. చూత పత్రం (మామిడి ఆకు): దీనిని ఏ శుభకార్యమైనా, పర్వదినమైనా గుమ్మానికి తోరణంలా అలంకరించడం పరిపాటి. మామిడాకు తోరణం కడితే ఆ ఇంటికి వింత శోభ చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మామిడి ఆకులతో విస్తరి కుట్టుకుని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది. శరీరంలో మంటలు, రక్త అతిసార, నోటిపూత, చిగుళ్ల బాధలు, పాదాల పగుళ్లు వంటివి మామిడాకుతో నివారించుకోవచ్చు. చక్కెర వ్యాధికి ఉపశమనమిస్తుంది. దీని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్తి కలిగిస్తుంది. కరవీర పత్రం (ఎర్ర గన్నేరు ఆకు): పేలను నివారించి శిరోజాలకు రక్షణనిస్తుంది. గుండె జబ్బులు, మూత్రవ్యాధులు, కుష్టు రోగం, దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కణుతులను కరిగించే గుణం పుష్కలంగా ఉంది. విష్ణుక్రాంత పత్రం (విష్ణు క్రాంతి): జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నరాల బలహీనతను అరికడుతుంది. జ్వరం, పైత్యం, కఫం, వాపులకు ఈ ఆకు చాలా మంచిది. ఉబ్బసపు దగ్గు, రొమ్ము పడిశం, దగ్గు తగ్గించగలదు. దాడిమి పత్రం (దానిమ్మ ఆకు): రక్తవద్ధి కలుగజేస్తుంది. పిత్తహరిణి, అతిసార, మలేరియా, ఇతర జ్వరాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. నోటిపూత, జీర్ణకోశ, మలాశయ వ్యాధులను నివారిస్తుంది. పిల్లలకు కడుపులో నులిపురుగులను, నలికెల పాములను చేరనివ్వదు. దేవదారు పత్రం (దేవదారు ఆకు): జ్ఞానవద్ధి, జ్ఞాపక శక్తి పెంపుదలకు దోహదకారి. పుండ్లు, చర్మవ్యాధులు, జ్వరాలు, విరోచనాలు తగ్గించగలదు. దీని తైలం కళ్లకు చలువనిస్తుంది. 14. మరువక పత్రం (మరువం) : శ్వాసకోశ వ్యాధులు, కీళ్ల నొప్పులను నివారిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇంద్రియ పుష్టి చేకూరుస్తుంది. దీని నూనె తలకు పట్టిస్తే మెదడుకు చలువనిచ్చి జుట్టు రాలనివ్వదు. సిందూర పత్రం (వావిలాకు) : తలనొప్పి, జ్వరం, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పంటి నొప్పులు, వాతపు నొప్పులు, బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది. కలరాను తగ్గుముఖం పట్టించగలదు. కీళ్ల వాపులు తగ్గించి కీళ్ల నొప్పులను అరికడుతుంది. జాజి పత్రం (జాజి ఆకు) : తలనొప్పి, చర్మవ్యాధులు, నోటి పూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యం వంటివాటికి చాలా మంచిది. బుద్ధిబలాన్ని పెంపొందిస్తుంది. కామెర్లు, శరీరంపై మచ్చలు, పక్షవాతం, కాలేయం సమస్యలు నివారిస్తుంది. గవద బిళ్లలకు జాజి ఆకు మంచి మందు. జాజికాయ, జాపత్రికి చెందినదీ ఆకు. సన్నజాజి ఆకు కాదు. గండకి లేదా గానకి ఆకు (సీతాఫలం ఆకు) : ఇది రక్తశుద్ధి చేసి వీర్యవృద్ధిని కలుగజేస్తుంది. శమీ పత్రం (జమ్మి ఆకు) : చర్మ వ్యాధి, అజీర్ణం, దగ్గు, ఉబ్బసం, ఉష్ణం వంటి రుగ్మతలనుంచి విముక్తి చూపించి ప్రశాంతతను చేకూరుస్తుంది. జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు. కుష్టువ్యాధిని నియంత్రిస్తుంది. అశ్వత్థ పత్రం (రావి ఆకు) : కంటివ్యాధులు, అతిసార, సంభోగ రోగాలు, ఉన్మాదం వంటివి నిర్మూలిస్తుంది. జీర్ణకారిగా పనిచేస్తుంది. చర్మం పగుళ్లు, చర్మ రోగాలు, పుండ్లు తగ్గిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని రగిలించి సంతానలేమిని నివారిస్తుంది. జ్వరాలకు, నోటిపూతకు, ఆస్తమాకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది. అర్జున పత్రం (తెల్లమద్ది ఆకు) : దీనిలో నల్లమద్ది ఆకుకూడా ఉంది. తెల్లమద్ది ఆకునే ఎక్కువగా పూజలకు వినియోగిస్తారు. వ్రణాలకు, శరీరంలో మంటలకు, చెవిపోటుకు పనిచేస్తుంది. గుండెకు బలాన్ని చేకూరుస్తుంది. శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు. వాత పిత్త కఫాలకు మంచిది. పితకర్మలలో వినియోగిస్తారు. దీని రసం రుమాటిజమ్ను అరికడుతుంది. నల్లమద్ది ఆకు కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. అర్క పత్రం (జిల్లేడు ఆకు) : సూర్యునికి ప్రీతికరమైన ఆకు ఇది. పక్షవాతం, కుష్టు, చర్మవ్యాధులు, ఉబ్బసం, వాతం, కడుపు శూల వంటి దీర్ఘరోగాలను నివారిస్తుంది. అమిత ఉష్ణతత్వంనుంచి విముక్తి కలిగిస్తుంది. రథసప్తమినాడు ఆత్మకారకుడైన సూర్యభగవానుడి ప్రీతికోసం జిల్లేడు ఆకులను తల, భుజాలపై పెట్టుకుని తలారా స్నానంచేయడం ఆనవాయితీ. – డి.వి.ఆర్. (చదవండి: వినాయకుని పూజలో చదవాల్సిన కథ) -
ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు వినూత్న పూజలు
తమిళనాడు: తిరుపత్తూరు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని సొరకాల్నత్తం గ్రామానికి చెందిన కేశవన్ ఇతని భార్య వాసంతి. వీరికి ఎయిల్ అరసన్, ఉదయ్వసంత్(20) పిల్లలున్నారు. ఎయిల్ అరసన్ సొరకాల నత్తం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఉంటున్నాడు. ఉదయ్వసంత్ రెండు నెలల క్రితం అదే గ్రామంలో బైకులో వెళుతున్న సమయంలో లారీ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులు అదే గ్రామంలోని శ్మశానంలో దహన క్రియలు చేశారు. చెరువు గట్టు వద్ద ఆత్మగా తిరుగుతున్న ఉదయ్వసంత్ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేశారు. మంగళవారం సాయంత్రం మృతిచెందిన ఉదయ్వసంత్ ఆత్మను ఇంటికి తీసుకొచ్చేందుకు చెరువు గట్టు వద్ద కుటుంబ సభ్యులు పూజలు చేశారు. అక్కడ పూలకరగం పెట్టి నేలపై పసుపు, పుష్పాలు పెట్టి మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయ్వసంత్ చిత్రపటంతో పాటు కరగను చెరువు గట్టు నుంచి ఇంటికి మేళ తాళాల నడుమ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఒకటిన్నర కిలో మీటరు దూరం పసుపు నీల్లు, పుష్పాలు చల్లి ఊరేగింపుగా వచ్చారు. అనంతరం ఉదయ్వసంత్ చిత్ర పటాన్ని ఇంట్లో పెట్టి పూల మాల వేసి పూజలు చేశారు. మృతి చెందిన కుమారుడి ఆత్మ ఇంటికి రావాలని కుటుంబసభ్యులు పూజలు చేసిన సంఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది. -
Aghora Puja: మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు.. వీడియో వైరల్
కర్ణాటక: సూలూరు శ్మశాన వాటికలో దహన సంస్కారాలకు వచ్చిన ఓ మృతదేహంపై కూర్చొని అఘోర పూజలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాలు.. కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మరణించిన 40 ఏళ్ల వ్యక్తి మృతదేహం అంత్యక్రియల కోసం సోమవారం సూలూర్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. ఆ సమయంలో మృతుడి బంధువులతో పాటు 8 మంది అఘోరాలు కూడా వచ్చారు. మృతదేహాన్ని దహనం చేసేముందు అఘోర శవంపై కూర్చొని పూజలు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో మీడియా ప్రతినిధులు శ్మశాన నిర్వాహకుడు సురేష్ను ఈ విషయంపై ప్రశ్నించారు. అయితే బంధువుల అనుమతితోనే అఘోర పూజలు చేసినట్లు చెప్పారు. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
తెలంగాణ కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్
-
నాగోబా మహాపూజ ప్రచారయాత్ర షురూ
ఆదివాసీల ఆరాధ్యదైవమైన నాగోబా మహాపూజకు తొలి అడుగుపడింది. జనవరి 21న నిర్వహించనున్న మహాపూజలో భాగంలో సోమవారం ప్రచారయాత్ర ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తరలివచ్చిన మెస్రం వంశీయులు కేస్లాపూర్లోని మురాడి వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రచారయాత్ర, గంగాజల యాత్ర, మహాపూజ, జాతర నిర్వహణపై చర్చించారు. అనంతరం పూజలు చేసి ప్రచారరథాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాథోడ్ జనార్దన్, నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, మెస్రం వంశ పెద్దలు పాల్గొన్నారు. –ఇంద్రవెల్లి -
జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 12 మంది దుర్మరణం
పాట్నా: బిహార్లోని వైశాలి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు గుమిగూడిన జనంపైకి వేగంగా వెళ్తున్న ట్రక్కు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. నయా గావ్ టోలి గ్రామంలో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భూయాన్ బాబా పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో జనం వచినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాజిపూర్లోన సదర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు సహాయంగా అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటనలో తెలిపింది. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: హైవేపై లారీ బీభత్సం.. 48 వాహనాలు ధ్వంసం.. 30 మందికి గాయాలు -
గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్
-
రైళ్లలో పూజలు చేసుకోవచ్చు కానీ..
సాక్షి, హైదరాబాద్: శబరిమలకు నడిపే ప్రత్యేక రైళ్లలో భక్తులు పూజలు చేసుకోవచ్చని.. కానీ హారతి కర్పూరం, దీపాలు, అగరొత్తులు వెలిగించరాదని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గురువారం నుంచి శబరిమల ప్రత్యేక రైళ్లు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన విడుదల చేసింది. నిప్పు వల్ల రైళ్లకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో, భక్తులు రైళ్లలో అగ్గి పుల్లలు కూడా వెలిగించొద్దని ఆ ప్రకటనలో సూచించింది. మండే స్వభావం ఉన్న వాటిని వినియోగించటం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి రైల్వే పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. బుధవారం రైల్ నిలయంలో జరిగిన పెన్షన్ అదాలత్లో ఆయన పాల్గొన్నారు. పెన్షన్ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఓ సెల్ను ప్రారంభించారు. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. ఇక అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు! -
దెయ్యం ఉందంటూ శాంతి పూజలు
ఆదిలాబాద్రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలం మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గ్రామస్తులు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ఆదివారం శాంతిపూజలు చేశారు. వసతిగృహంలో దెయ్యం ఉం దంటూ విద్యార్థినులు శుక్రవారం రాత్రి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కిందపడటంతో కొందరికి గాయాలయ్యాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం హాస్టల్కు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ వసతిగృహంలో అడుగుపెట్టడానికి విద్యార్థినులు భయపడుతున్నారు. దీంతో ‘శాంతి పూజలు చేశాం. వేదపండితుల సమక్షంలో దెయ్యం పారిపోవాలని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాం. దెయ్యం వసతి గృహంవైపు రాకుండా అష్టదిగ్బంధనం చేశాం’ అని మామిడిగూడ ఆదివాసులు తెలిపారు. వసతి గృహంలో ఎలాంటి దెయ్యం లేదని, వదంతులు నమ్మొద్దని కోరారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. కరోనాతోనే పిల్లలు రెండేళ్లు చదువులు నష్టపోవాల్సి వచ్చిందని, మళ్లీ దెయ్యం ఉందనే అపోహలు నమ్మి పిల్లల చదువులకు ఇబ్బందులు కలిగించొద్దని తల్లిదండ్రులను కోరారు. ఇంటికి వెళ్లిన విద్యార్థినులను పాఠశాలకు పంపించాలని, ఉపాధ్యాయులతోపాటు గ్రామస్తులందరం అండగా ఉంటామని తెలిపారు. -
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతికి గవర్నర్ తమిళసై తొలిపూజ
-
ఖైరతాబాద్ గణపతికి గవర్నర్ తొలిపూజ
ఖైరతాబాద్: శ్రీపంచముఖ రుద్ర మహాగణపతిగా ఈ సంవత్సరం రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజా కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు పాల్గొన్నారు. తొలిపూజ అనంతరం గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, మహాగణపతి ఆశీర్వాదంతో తెలు గు రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరుకున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డిలు పాల్గొన్నారు. విఘ్నాధిపతికి 60 అడుగుల కండువా మహాగణపతికి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో 60 అడుగుల కండువా, గరికమాల, యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు స్వామి వారికి 25 కిలోల లడ్డూను సమర్పించారు. మహాగణపతిని దర్శించుకున్న కిషన్రెడ్డి, కేటీఆర్లు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని పూజలు చేశారు ఇవీ చదవండి: మరో పాటతో దూసుకుపోతున్న మంగ్లీ మహాకాయ.. అభయమీయవయా! -
ఢిల్లీలో TRS పార్టీ ఆఫీస్ భూమి పూజ
-
పూజలతో గ్రహస్థితి బాగు చేస్తానంటూ.. మహిళను..
సాక్షి, డిచ్పల్లి(నిజామాబాద్): పూజలతో గ్రహస్థితి బాగు చేస్తానంటూ మాయమాటలతో మహిళను నమ్మించి రూ.25 లక్షలకు పూజారి టోకరా వేసి అనంతరం పరారయ్యాడు. డిచ్పల్లి ఎస్ఐ ఆంజనేయులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కొంత కాలంగా శ్రీనివాస్ శర్మ పూజారి (అర్చకుడు)గా పని చేస్తున్నాడు. నిజామాబాద్ కంఠేశ్వర్ న్యూ హౌజింగ్ బోర్డు కాలనీకి చెందిన కొత్త మాధవీలత ఖిల్లా రోడ్లో షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త గణేష్ పక్షవాతం, మనవరాలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మాధవీలత ధర్మారం(బి)లో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజారికి తన సమస్యలను ఏకరువు పెట్టుకుంది. మీ గ్రహస్థితి బాగలేదని, కొంత మంది భక్తులకు లడ్డూలతో భోజనాలు వడ్డిస్తే సమస్యలన్నీ తీరుతాయని నమ్మించాడు. మాయమాటలకు నమ్మిన మాధవీలత శ్రీనగర్లో రెండు ఎకరాల భూమి అమ్మగా వచ్చిన రూ.25 లక్షలనుదశల వారీగా పూజారికి ఇచ్చారు. మోసపోయానని గ్రహించి తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తడి తేవడంతో పూజారి శ్రీనివాస శర్మ మే 29 నుంచి కన్పించలేదు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆషాఢం: కొత్త దంపతులకు దూరం ఎందుకంటే..?
ఆషాఢ మాసం.. ఎంతో విశిష్టం.. ఏకాదశి, గురుపౌర్ణమి, చాతుర్మాస వ్రతాలు.. పూరీలో జగన్నాథుని రథయాత్ర.. ఇలా ఎన్నో పండుగలు.. మరెన్నో ప్రత్యేకతలు దీని సొంతం.. అయితే నవదంపతులకు మాత్రం భారం.. కోటి ఆశలతో ఒక్కటైన జంటకు నెలపాటు ఎడబాటు.. అయితే ‘సెల్’మోహన రంగా అంటూ.. విరహగీతం ఆలపిస్తారు.. వీడియో కాలింగ్లో విహరిస్తారు. ప్రణయ మధురిమలు పంచుకుంటారు.. సరాగాల సరిగమలు పెంచుకుంటారు.. శ్రావణం రావాలి అంటూ నిరీక్షిస్తూ ఉంటారు. సాక్షి, కడప : ఈనెల 11వ తేదీ నుంచి ఆషాఢ మాసం మొదలైంది. ఈ మాసాన్ని శూన్యమాసమంటారు. వివాహం లాంటి శుభకార్యాలు తలపెట్టరు. ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి వైష్ణవ ఆరాధకులకు ముఖ్యమైనది. దీన్నే తొలి ఏకాదశి అంటారు. అప్పటి నుంచి ప్రతి వారం ఏదో ఒక పండుగ, వ్రతం, పూజ ఉంటాయి. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తారు. ► ఆషాఢమాసంలో యువతులు గోరింటాకు తప్పక పెట్టుకోవాలని పెద్దలు పేర్కొంటారు. గోరింటాకుకు మన సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. ► ఆషాఢ పౌర్ణమిని మనం వేద వ్యాసుని పేరిట గురుపౌర్ణమిగానిర్వహించుకుంటాం. ► తెలంగాణలో బోనాల పండుగను నిర్వహిస్తారు. వర్షాల కారణంగా కూరగాయలు బాగా పండుతాయి.. శ్రీ దుర్గామాతను శాకంబరిగా అలంకరించి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. ► ఒరిస్సాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర కూడా ఈ మాసంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. వధూవరుల విరహం.. ఆషాఢ మాసంలో అత్తాకోడళ్లు ఒక ఇంటిలో ఉండకూడదంటారు. కొత్తగా పెళ్లయిన దంపతులను దూరంగా ఉంచుతారు. ఇందులో భాగంగా అమ్మాయిని పుట్టింటికి తీసుకు వెళతారు. ఇందులో శాస్త్రీయత ఉందని పెద్దలు పేర్కొంటున్నారు. ఈ మాసంలో స్త్రీ నెల తప్పితే తొమ్మిది నెలల తర్వాత వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉందని, అప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకు ఆ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుందని.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, తల్లీబిడ్డల ఆరోగ్యానికి కూడా ఈ వాతావరణం మంచిది కాదంటారు. అందుకే ఆ మాసంలో నూతన దంపతులను దూరంగా ఉంచుతారు. కొత్త కోడలు పుట్టింటికి... ఈ మాసంలో తొలకరి మొదలై మంచి వర్షాలు కురుస్తాయి. పొలం పనులు జోరందుకుంటాయి. ఇంటిలో అందరూ వ్యవసాయ పనులపై పొలానికి వెళ్లినపుడు కొత్తగా పెళ్లయిన జంట ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. అందుకే సంప్రదాయం పేరిట కొత్త కోడలిని పుట్టింటికి పంపేస్తారు. కొత్త అల్లుడు అత్తగారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే. ఎందుకిలా.. ఆషాఢం మొదలయ్యే నాటికి వర్షాలు కురిసి కొత్త నీరు వస్తుంది. మారుతున్న వాతావరణంలో అనుకూల, ప్రతికూల మార్పులను తట్టుకుని నిలవాలన్నదే ఈ మాసం సందేశం. కొత్త జంటలలో అమ్మాయి ఈ మాసంలో అత్తగారింట్లో ఉండకూడదన్న సంప్రదాయం బాగా ప్రచారంలో ఉంది. శారీరకంగా, మానసికంగా అప్పుడప్పుడే భర్తకు దగ్గరవుతున్న వారు ఈ ఎడబాటు ద్వారా కలిగే ప్రేమ వారి భవిష్య జీవితానికి ఎంతో ఉపయోగపడుతుందంటారు. ఈ మాసం నూతన జంటలను కొన్నాళ్లపాటు విడదీసి విరహంలో ముంచుతుందని మాత్రమే భావించాల్సిన అవసరం లేదు. వారి మధ్య బంధాన్ని మరింతగా బలపరుస్తుందన్న అవగాహన కలిగి ఉండాలి. ఆధునిక టెక్నాలజి కారణంగా సెల్ఫోన్లలో ఎక్కువగా మాట్లాడుకునేందుకు ఇప్పుడు వీలుంది. నెలరోజుల తర్వాత అంటే శ్రావణమాసంలో మెట్టినింటివారు అమ్మాయికి చీర, సారె పెట్టి ఆశీర్వదించి మంగళ ప్రదంగా తమ ఇంటికి తీసుకు వస్తారు. ఇక్కడితో ఆషాడ మాసపు ఎడబాటు ముగుస్తుంది. అయితే ఈ ఆధునిక కాలపు ఉద్యోగం చేసే జంటకు విరహం, బాధ ఉండదు. వివాహమైన నెలరోజులకే ఉద్యోగం చేసే చోట కొత్త కాపురం పెట్టేస్తుండడంతో అత్తాకోడలు ఒకే ఇంటిలో ఉండే నిబంధన వారికి వర్తించదు. చాతుర్మాస దీక్షలు చేపడతారు.. ఆషాఢాన్ని శూన్య మాసంగా భావిస్తారు. శుభ కార్యాలు చేయకూడదని విశ్వసిస్తారు. నిజానికి పెద్ద పండుగల రాకను ఈ మాసం తెలుపుతుంది. వైష్ణవులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మఠాధిపతులు ఈ మాసంలోనే చాతుర్మాస దీక్ష వహిస్తారు. – విజయ్భట్టర్, అర్చక సంఘం నాయకుడు, కడప ఎన్నో ప్రత్యేకతలు.. ఆషాఢ మాసానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అత్తాకోడళ్లు ఈ మాసంలో ఒకే ఇంటిలో ఉండకూడదని భావిస్తారు. నిజానికి ఈ నమ్మకం వెనుక ప్రకృతి ఆధారిత సంప్రదాయం ఉంది. దాదాపు అన్ని పండుగల వెనుక ప్రకృతి పరమైన లేదా ఆధ్యాతి్మక, పురాణ పరమైన విశ్వాసాలు ఉంటాయి. – హరిభూషణరావు, లైబ్రేరియన్, కడప -
తొలి ప్రమిద ఎవరిది?
సూర్య చంద్ర తారకలు, మెరుపు, అగ్నీ అనేవి ఆ పరం జ్యోతి పెట్టిన తొలి ప్రమిదలని శాస్త్రం చెబుతోంది. భిన్నమైన పలు గాధల సమాహారమే దీపావళి. శ్రీరామ పట్టాభిషేకం, బలి పాతాళ నిర్బంధనం, నరకుని మరణం, విక్రమార్కుని పట్టాభిషేకం, యమధర్మజునికి నీరాజనోత్సవం, గోపూజా, గోవర్ధన గిరి పూజలు, లక్ష్మీపూజ, జ్యేష్ట్యా దేవి నిష్క్రమణోత్సవం, తీర్ధంకరుడిని జ్ఞానలక్ష్మి అనుగ్రహించిన దినం, కాళీ పూజలు, మార్గ పాలిని పూజ.. వీటిలో కొన్ని మన అందరికి తెలిసి గాధలైతే ఇంకొన్ని తెలియనివి ఉన్నాయి. కాలక్రమంలో దీపావళి పండుగ పలు పేర్లను పొందింది అన్న విషయం కూడా మనకి తెలియనిదే. ఈ పండుగ మార్చుకున్న పేర్లు, వాటి వెనుక దాగిన గాథలూ, ఈ పండుగ పుట్టుక వంటి ఆసక్తికర అంశాలను పరిశీలిస్తే విస్మయం కలుగుతుంది. ఋగ్వేద కాలంలో పుట్టిన సంప్రదాయం ఇది. దీపం జ్యోతి పర బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే .. అని ఆర్యోక్తి. చీకటి అనేది దుఃఖానికి, మరణానికి, భయానికి సంకేతం. వెలుగులో ఏది యేదో గుర్తించే మనం, చీకటిలో ఆ శక్తిని కోల్పోతాం. చీకటినే పోగొట్టాలంటే వెలుగులు విరజిమ్మే దీపం అవసరం. పర బ్రహ్మ స్వరూపాన్ని జ్యోతితో పోల్చారు. అదే విధంగా సమస్త వెలుగును విరజిమ్మే పదార్ధాలైన సూర్య–చంద్ర–తారకలు, మెరుపు, అగ్నీ అనేవి ఆ పరం జ్యోతి ప్రకాశాలే తప్ప మరొకటి కావని స్పష్టం చేశాయి. మన పండుగలు అన్ని జ్యోతిశ్శాస్త్త్ర్రంతో ముడిపడి ఉన్నవే కావడం గమనించదగిన అంశం. దీపావళి కూడా అందుకు భిన్నమైన పండుగ కాదు అంటోంది శాస్త్రం. వేదకాలంలో దీపావళి పదమూడు రోజుల పండుగ. అసలు దీపావళి అనే శబ్దం ప్రాచీన వేదాలలో ఎక్కడా కనిపించదు. అప్పట్లో దీపావళి పేరు ‘యక్ష రాత్రి’ అని పి. కె .గోడే అనే కాశీ పండితుడు పేర్కొన్నాడు. పదిహేనవ శతాబ్ది గ్రంధాలైన ‘నిర్ణయం’, ‘ధర్మ సింధువు’ లలో మొదటిసరిగా దీపావళి అనే పదం కనిపించింది. అంటే సుమారుగా గత ఐదు వందల ఏళ్ల కిందటి నుంచి మాత్రమే దీపావళి పండుగను దీపావళి పేరుతో జరుపుకుంటున్నాం. పదహారవ శతాబ్ది వరకు దీపావళి ఐదు రోజుల పాటు సాగిన పండగ కాగా నేడది కేవలం రెండు రోజుల పాటు మాత్రమే చేసుకునే పండగ అయ్యింది. చారిత్రక విశేషాలు నరకాసురుని రాజధాని ప్రాగ్జ్యోతిష్యపురం నేటి మన అస్సాం రాష్ట్రంలోని గౌహతి. అయితే అప్పట్లో అది బర్మా వరకు వ్యాపించి ఉన్న ప్రాంతం. కృష్ణ, సత్య, నరకాసుర యుద్ధం గౌహతిలో 5065 సంవత్సరాల క్రితం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. కృష్ణుని ద్వారకా నగరం అరేబియా సముద్ర తీరమైన కథియవాడ్ ప్రాంతంలో ముంబైకి కొంత దూరంలోఉంది. ద్వారక పడమటి కొనలో ఉంటే, ప్రాగ్జ్యోతిష్యపురం తూర్పు కొనలో ఉంది.రామ, రావణ సంగ్రామ కాలం నాటికే ఫిరంగుల వాడకం ఉంది. వీటినే రావణ ఫిరంగులని,రావణ శతఘ్నులు అని పిలిచేవారు. నరక–సత్యల సంగ్రామంలోనూ వీటిని ఉపయోగించారు. అవి కాలగమనంలో బాణాసంచా అయ్యాయి. (చదవండి: దీపం జ్యోతి పరబ్రహ్మ.. ) -
అందుకే ఈ ఆడియో!
సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి చవితి నేడు. ఈ సందర్భంగా భక్తులందరూ గణనాథుడి కథను చదివి, వినాయక వ్రత కల్పాన్ని పాటిస్తారు. గంభీరమైన స్వరం ఉన్న నటుడు మంచు మోహన్బాబు వినాయక చవితి పూజను తన గళంతో వినిపించారు. దాన్ని ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు శుక్రవారం యూట్యూబ్లో విడుదల చేశారు. ‘‘నేనిష్టపడే పండగలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటగా నేను ఇష్టపడే పండగ వినాయక చవితి. ప్రతి సంవత్సరం నా కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితుల్ని మా ఇంటికి పిలిచి నేనే స్వయంగా పుస్తకంలోని మంత్రాలు చదివి, కథను వినిపించడం నాకు అలవాటు. నా పెద్ద కుమారుడు విష్ణువర్థన్ బాబు ఈ వినాయక కథను అందరికీ వినిపించవలసిందిగా కోరాడు. ఆ సత్సంకల్పంలో భాగంగా నేను మీకు ఈ విఘ్నేశ్వరుడి కథను వినిపిస్తున్నాను’’ అన్నారు మోహన్ బాబు. వినాయకుని జననం, విఘ్నాలకు అధిపతి ఎవరు? చంద్రునికి పార్వతీదేవి శాపం, శమంతకోపాఖ్యానం: ద్వాపరయుగం, భాద్రపద శుద్ధ చవితి మహత్యం, వినాయక వ్రతకల్పం వంటివి చెబుతూ ఈ ఆడియోను విడుదల చేశారు. -
ప్రియుడిని పెళ్లాడిన నటి..!
‘దేవోంకీ దేవ్ మహదేవ్’(హరహర మహాదేవ శంభో శంకర) సీరియల ఫేం పూజా బెనర్జీ తన చిరకాల మిత్రుడు, నటుడు కునాల్ వర్మను వివాహమాడారు. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. అదేంటి కరోనా లాక్డౌన్ కాలంలో ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? నిజానికి కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ స్టార్ జంట గత నెలలోనే కోర్టు మ్యారేజీ ద్వారా తమ పెళ్లిని రిజిస్టర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ 15న అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక జరుపుకోవాలని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే ఈలోగా మహమ్మారి కరోనా విజృంభణతో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో పూజా, కునాల్ నిరాశకు గురయ్యారు. అయితే లాక్డౌన్ కారణంగా వివాహ వేడుకలను రద్దు చేసుకున్న ఈ జంట.. వాటి కోసం ఖర్చు చేయాలనుకున్న మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పూజా, కునాల్ సోషల్ మీడియాలో వెల్లడించారు. గతేడాది దుర్గా పూజలో సింధు ఖేల్కు సంబంధించిన ఫొటో షేర్ చేసిన పూజా.. ‘‘ఈరోజు మా పెళ్లి వేడుక జరగాల్సింది. అయితే దానిని మేం రద్దు చేసుకున్నాం. అధికారికంగా మేము ఇప్పుడు భార్యభర్తలం. మా తల్లిదండ్రులు, తాతా- బామ్మల ఆశీస్సులతో కొత్త జీవితం ప్రారంభిస్తున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో మంది తమ ప్రియమైన వాళ్లను కోల్పోవడం హృదయాలను కలచివేస్తోంది. వారి కోసం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాం. అదే విధంగా మా వంతు సాయంగా పెళ్లి వేడుకల కోసం ఖర్చు చేయాలనుకున్న డబ్బును విరాళంగా ఇస్తున్నాం. మళ్లీ ఈ ప్రపంచం త్వరలోనే పూర్వస్థితికి రావాలని ఆశిస్తున్నాం. జై మాతాది’’అని ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో నూతన వధూవరులకు సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరులకు సాయపడాలన్న మీ దాతృత్వ గుణం ఆదర్శనీయం అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. View this post on Instagram This is a pic from last year durga puja sindoor khela. TODAY WAS SUPPOSED TO BE OUR WEDDING BUT THE SITUATION IS SUCH THAT WE HAVE CANCELLED ALL OUR CEREMONIES ALTHOUGH WE HAD REGISTERED OUR MARRIAGE BEFORE A MONTH SO WE ARE OFFICIALLY MARRIED AND TOGETHER FOREVER NOW. WITH THE BLESSING OF OUR PARENTS AND GRANDPARENTS WE STARTING OUR NEW LIFE NEED ALL OF UR BEST WISHES. OUR FAMILY IS HAPPY AND SO ARE WE BUT GIVEN CIRCUMSTANCES OUR HEART GOES OUT TO ALL THE PEOPLE WHO ARE FIGHTING FOR THEIR LIVES RIGHT NOW AND TO ALL THE FAMILIES WHO LOST THEIR LOVED ONES . OUR PRAYERS WITH ALL OF YOU AND A SMALL CONTRIBUTION FROM OUR SIDE AS THE MONEY WE WERE TO SPEND FOR OUR MARRIAGE FUNCTION WE ARE DONATING TO PEOPLE WHO ARE IN NEED NOW 🙏 THIS IS NO TIME TO CELEBRATE BUT WE WILL CELEBRATE WITH OUR LOVED ONES ONCE THE WORLD BECOMES A HAPPY PLACE AGAIN.🙏 JAI MATA DI A post shared by Puja Banerjee (@banerjeepuja) on Apr 15, 2020 at 6:59am PDT -
నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత
సర్వం శ్రీనివాస్, రవళి, సరిత, మధుశ్రీ, లావణ్య రెడ్డి, పూజ ముఖ్య తారలుగా అతిమల్ల రాబిన్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్వం సిద్ధం–నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత’. సినెటేరియా మీడియా వర్క్స్ పతాకంపై శ్రీలత బి. వెంకట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ని దర్శకులు వీఎన్ ఆదిత్య, ‘అమ్మ’ రాజశేఖర్ విడుదల చేశారు. వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టీజర్ను చూశాక సినిమా రంగంలోని అలనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. టీజర్లో చూపించినట్లుగా ఒక్కరోజైనా సినీ దర్శకునిగా సెట్లో మెలగాలనే ఆకాంక్ష చాలా మందికి ఉంటుంది’’ అన్నారు. ‘‘టీజర్ చూస్తుంటే సినిమా 100 శాతం కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది’’ అన్నారు ‘అమ్మ’ రాజశేఖర్. ‘‘సినిమా చూసే ప్రేక్షకులకు పొట్ట చెక్కలవ్వడం ఖాయం’’ అని అతిమల రాబిన్ నాయుడు అన్నారు. శ్రీలత బి.వెంకట్, సినెటేరియా గ్రూప్ సీఈవో వెంకట్ బులెమోని, ఎన్.సి.సి మార్కెటింగ్ హెడ్ శ్రీవికాస్, సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంచాలకులు డా. రవి కుమార్ జైన్, టెక్స్టైల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అమ్మనబోలు ప్రకాశ్, ‘సమరం’ చిత్రం హీరో సాగర్ జి, లావణ్య, పూజ, ఫరీనా, నటులు సర్వం శ్రీనివాస్, కెమెరామేన్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డేవిడ్ జి. -
అమిత్, పూజ ‘పసిడి’ పంచ్
బ్యాంకాక్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత్ రెండు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 13 పతకాలతో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. చివరి రోజు పురుషుల విభాగంలో అమిత్ పంఘల్ (52 కేజీలు)... మహిళల విభాగంలో పూజా రాణి (81 కేజీలు) పసిడి పతకాలు గెలిచారు. ఫైనల్లో ఓడిన దీపక్ సింగ్ (49 కేజీలు), కవిందర్ (56 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సిమ్రన్జిత్ (64 కేజీలు)లకు రజత పతకాలు లభించాయి. సెమీస్లో ఓడిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు), సోనియా (57 కేజీలు), మనీషా (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు)లకు కాంస్యాలు దక్కాయి. ఫైనల్లో అమిత్ 5–0తో కిమ్ ఇంక్యు (కొరియా)పై, పూజా రాణి 4–1తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వాంగ్ లీనా (చైనా)పై గెలుపొందారు. ఇతర ఫైనల్స్లో దీపక్ 2–3తో నొదిర్జాన్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... కవిందర్ 0–5తో మిరాజిజ్బెక్ (ఉజ్బెకి స్తాన్) చేతిలో... ఆశిష్ కుమార్ 0–5తో కులాఖ్మెత్ (కజకిస్తాన్) చేతిలో... సిమ్రన్జిత్ కౌర్ 1–4తో డాన్ డుయు (చైనా) చేతిలో ఓడిపోయారు. -
వరం ఫలితం
మనిషికి సంబంధించిన వాటికంటే, ఆదాము అనుయాయులు ఇతర స్వభావాలతో పుట్టడం జరుగుతూంటుంది. ఎవరో ఒకరు మీకు ఆ వృక్ష, జంతు జాలాలు ప్రత్యేకంగా గుర్తుచేస్తుంటారు. ఒకసారి ఓ పూజారి మహిళ కడుపున మనిషిగా జన్మించాడు. కానీ అతను చూడ్డానికి కాకి, దాతుర, కాక్టస్లకు జన్మించినవాడిలా ఉన్నాడు. తమ పిల్లవాడే అయినప్పటికీ వాడి వికృతచేష్టలకు భయపడి తల్లిదండ్రులు పిల్లవాడిని అమ్మవారి గుడికి పంపించారు, అక్కడ ఆమె కరుణతో మార్పు వస్తుందని. కానీ ప్రతీరోజు కాక్టస్కు పాలు, వెన్న పెట్టినా, అది కాక్టసే కదా. ఈ బ్రాహ్మణుడు చందనం ఎంత రాసుకుంటాడో, జపమాలతో అంత ధ్యానం చేస్తాడు. దేవీపూజ చేస్తాడు. భంగ్, గంజాయి తీసుకుంటాడు. పగలు, రాత్రీ అతని కళ్లు కాగడాల్లా ఎర్రగా ఉంటాయి. బండ పెదవులు, పచ్చని పలువరస పొట్టవరకూ గడ్డం, జుత్తు మేటవేసి పక్షి గూడులా ఉంటుంది. పైకి కట్టబడి ఉంటుంది. పొడవాటి మెడ, శరీరమంతా ఎలుగుకిలా జుత్తు.అదృష్టవశాత్తూ, ఈ బ్రాహ్మణుడి భార్య ఎంతో సాదాసీదా మనిషి. భయస్తురాలు. కానీ అతను కొట్టాలనిపించినపుడల్లా కొడుతూంటాడు, అదో రోజూవారీ కార్యక్రమంలాగా. ఆమె కూడా భర్త చేత తన్నులు తినడం కుటుంబ జీవితంలో భాగంగా భావిస్తుంది. వండటానికి ఏమీ లేనపుడు ఆమె ఎంతో ఆందోళనపడుతుంది. ఆ సమయంలో దేవతకు అర్చనగా పెట్టేది చాలా స్వల్పం. దీంతో బతుకుడు కష్టం. పైగా ఇటువంటి బ్రాహ్మణుడితో ఆమెకు దైవభక్తి రెండింతలయింది. అర్చనలు రోజు రోజుకీ తగ్గిపోయాయి. గుడిలో అమ్మవారికీ ఆందోళన పట్టుకుంది.ఒకరోజు రాత్రి భోజనం తర్వాత కాస్తంత గంజాయి లాగించి నిద్రకి ఉపక్రమిస్తూ భార్యతో ‘‘మన అమ్మవారు చాలా తక్కువస్థాయి మనిషి. పూజారే యింత దరిద్రంలో వుంటే ఈ దేవతను ఎవరు మాత్రం పూజిస్తారు?’’ అన్నాడతను. రోజూ ఈ పూజా పునస్కారాలతో ఏమి ప్రయోజనం లేదు. గుడికి వెళ్లి దేవతతోపాటు తగలబడదామనిపిస్తోంది. ఇహ కొన్ని రోజులు వేచి చూస్తా, ఆ తర్వాత నువ్వే చూద్దువు... ఆమెకు బుద్ధి చెబుతాను’’ అన్నాడు.‘‘నన్ను అలా వదిలేసి వెళ్ళకండి’’ ఈ లోకంలో భర్త లేకుండా ఒంటరిగా ఎలా బతకగలను?’’ అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.‘‘ఓహ్! ఆ సంగతి ఆలోచించనేలేదు. నయం పైకి చెప్పావు. మంచిది.’’మంచం మీద కూర్చున్నాడు. అతని భార్య వచ్చి ‘‘ఇలా జరగకుండా ఉండాల్సింది! నన్నింకా తన్నకుండానే ఎలా నిద్ర పోతారు?’’ అంది.ఇప్పుడు పిల్లాడిలా ఆ బ్రాహ్మణుడు తనను తాను మర్చిపోయి ఒకటి లేదా రెండుసార్లు నవ్వాడు. నవ్వడం అనేది అతని పెదవుల మీదికి వచ్చినప్పటి నుంచీ, దాని జ్ఞాపకం అతనికి అంతగా లేదు. భార్య మాట వినగానే, మొదటిసారిగా పెదవులపై చిర్నవ్వు మెరిసింది.‘‘నీకు విశ్రాంతి కావాలంటే నేను తన్నాలా? నీకు ఆశ్చర్యం కలగవచ్చుగానీ, నేను మనిషిగా భావించినప్పుడు మాత్రమే నిన్ను కొడుతూంటాను. మనకి పిల్లలు ఉంటే, వాళ్లనీ కొట్టేవాడిని. ఇప్పటినుంచీ ఎవరిపైనా చెయ్యెత్తితే, అది ఆ దేవత మెడమీదే. ఒక గొడ్డలి సంపాదించి వెళ్లి ఆ దేవత విగ్రహాన్ని ముక్కలు చేస్తాను. అంతా తగలబెడతాను, లోపల ఉండి పోయి. ప్రశాంతంగా మరణిస్తాను, చూడు. ఒకవేళ నేను మర్చిపోతే నాకు గుర్తుచెయ్యి. మర్చిపోకు. రాబోయే పౌర్ణమిని అలా వట్టిగా పోనీయద్దు.’’కాలం విస్ఫోటాన్ని సైతం పట్టించుకోదు. ఈ పిసినారి, పిచ్చిబ్రాహ్మణుడిని పట్టించుకుంటుందా? పగలు, రాత్రి కాలచ్రకంలో అలా సహజసిద్ధంగా కదలిపోతున్నాయి. చివరగా పౌర్ణమి రానే వచ్చింది. దేవత ఆగ్రహించింది. ఆ పిచ్చాడు ఏం చేయబోతున్నాడో చెప్పనయినా చెప్పలేదు! ఒక్కక్షణం నమ్మకస్తుడి విశ్వాసం సన్నగిల్లితే ఆమె పేరు జపించేవారు ఒక్కరయినా మిగలరు. పౌర్ణమి ముందు రోజు రాత్రి ఆమె తన భర్తకి ప్రమాణాన్ని గుర్తుచేసింది.అతను కోపగించుకున్నాడు, వెర్రెత్తిపోయాడు, ‘‘బుద్ధిహీనురాలా! మంచి నిద్రలోకి వెళ్లే సమయంలోనా చెప్పేది? రేపు ఉదయాన్నే మొదటగా చెప్పు!’’ అన్నాడు.మర్నాడు ఉదయం ఆ బ్రాహ్మణుడు గుడికి వెళుతోండగా, అతని భార్య వేరే పనుల్లోపడి అతనికి గుర్తుచేయడం మర్చిపోయింది. దీంతో అతనికి మరింత కోపం వచ్చింది. ‘‘ఎన్నిసార్లు చెప్పాను. నాకు గుర్తుచేయమని, అయినా నువ్వు మర్చిపోయావ్! నేను యివాళ ఎవరి దగ్గర్నుంచయినా ఓ సుత్తిని తెద్దామనుకున్నాను. చెక్కలు కొట్టడానికి.’’గుడిలో అమ్మవారు ఆలోచనలో పడింది. హారతుల మీద దృష్టి పెట్టలేకపోతోంది. ఆమెకు ఈ బ్రాహ్మణుడి సంగతి బాగా తెలుసు. అతడిని శాంత పరిచేందుకు ఏదో ఆలోచన చేయాలి. అదే మంచిదనిపించింది.సూర్యాస్తమయ సమయానికి బ్రాహ్మణుడు ఆ రోజుకు చివరగా పూజచేస్తున్నాడు. అమ్మవారు విగ్రహం నుంచి వచ్చి ప్రత్యక్షమయింది. తలనించి పాదాల వరకూ ఎంతో విలువయిన వజ్రవైడూర్యాలతో మెరిసిపోతోంది. గర్భగుడి అంతా వేయి దీపాల వెలుగుగా ఉంది. బ్రాహ్మణుడు తల ఎత్తి చూశాడు. తన పక్కనున్న ఒకే ఒక్క భక్తుడు, అదో మహా అదృష్టంగా భావించాడు. ఆమె అంది, ‘‘కుమారా! ఇన్నాళ్లూ నిన్ను పరీక్షిస్తున్నాను. మరి కొంతకాలం వేచి ఉన్నట్లయితే. నీకు ఏకంగా ఇంద్రుని సింహాసనమే లభించేది. కానీ, ముందే నువ్వు సహనం కోల్పోయావు. అయినా ఫరవాలేదు, నువ్వు ఏది అడిగితే అది ప్రసాదిస్తాను’’ అన్నది.అతను భయపడకుండా అడిగాడు, ‘‘నేను ముందే చనిపోతే ఏమవుతుంది?’’ అని.ఆమె నవ్వింది.‘‘అది జరగకుండా చూస్తాను. దివ్యరాజ్యంలో రవ్వంత ఆలస్యం కారణంగా నీ జన్మ చాలా ఆలస్యం జరిగింది.’’ఆమె వచ్చినంత వేగంగా మాయమయితే ఏమవుతుంది? ఏమీ ఉండదు. అందువల్ల అతను చాలా కచ్చితంగా, ‘‘నీ నగలన్నీ నాకివ్వు. మనిద్దరం చాలా ప్రశాంతంగా జీవించొచ్చు.’’ అన్నాడు.‘‘కానీ ఆభరణాలు లేకుండా నేను ఉండకూడదు. మానవులకు దేవతల ఆభరణాలు ఉపయోగపడవు. మీరు తాకితే అవి మట్టిగా మారిపోతాయి.’’‘‘అందుకనా, నేను ఏది అడిగితే అది యిస్తానన్నావు? నాకు కావలసినదే నేను అడిగాను. అయినా, నా యిబ్బందులు నీ నుంచీ దాచలేను. నువ్వు నిజంగా నాకు వరం యివ్వదలిస్తే ఇచ్చేయ్. నీకిష్టమైనది ఇవ్వదలచుకున్నదయినా సరే, యివ్వు.’’ఎంత ధైర్యం! ఆమె అతికష్టం మీద కోపం అణచుకుంది. ఈ భక్తుడి గురించీ ఆమెకు బాగా తెలుసు. సుఖసంతోషాలతో వున్నవాడెవడూ యింత నిర్లక్ష్యంతో ఉండడు. కానీ ఈ బ్రాహ్మణుడు ఎంత భోగాన్ని రుచి చూసినా, చాలా సున్నితమయినవాడు! కనుక ఆమె చింతించనవసరం లేదు. ఇటువంటివాడే చుట్టూ ఉన్నవారంతా అసహ్యంగా కనిపించడానికి ముక్కు కోసేసుకోగలడు. అంచేత అతనికి ఆవేశం కలిగించే వరం యివ్వాలి. చుట్టపక్కల వారందరికీ మరింత వరాలివ్వాలి. అది అతనికి ఈరష్య కలిగిస్తుంది. ఆమె అన్నది, ‘‘ఇన్నాళ్లు నన్ను పూజిస్తున్నావు. అయినా నీ మనసు స్వచ్ఛంగా మారలేదు. నీ హృదయంలోని ఆ అగ్నిని చల్లార్చుకో. అది రేగినప్పుడల్లా యితరులకు సహాయం చెయ్యి.’’సలహా వినడంతో అతను నీరసపడ్డాడు.‘‘ఇదేం మాట? అంతా నాకు ముందే తెలుసు. బోధన చేయడం ఆపి నాకు ఒక్క వరం యివ్వు.’’‘‘నువ్వు నిజంగా కోట్లలో ఒక్కడివి. నీ మొండితనం ఎంతో నచ్చింది. ఆ మూర్ఖులతో నాకు ప్రయోజనం లేదు. ఎప్పుడూ ఏడుస్తూ, అడుక్కు తింటూంటారు. ఇక్కడ నీ ఆసక్తిని నువ్వు పట్టించుకోలేవు. ఇప్పటినుంచీ నీ బాగోగులు నేను చూసుకుంటాను.’’‘‘చాలా సంతోషం. ఇంత గొప్ప ఆలోచనతో పోవడానికి యింత కాలం పట్టిందా?’’అమ్మవారు దయతో నవ్వి, ‘‘నీకిచ్చు వరం వంటిది యింతవరకూ ఎవరికీ లభించలేదు. నీతోపాటు యితరులకూ ఎంతో లబ్ధి కలుగుతుంది.’’‘‘యితరులూ లబ్ధిపొందుతారా? అంతకంటే దారుణం మరోటి ఉంటుందా? ఇలాంటి వరంతో ప్రయోజనం లేదు.’’‘‘ఒకదాని తర్వాత ఒకటి యిలా అనేక కష్టాలు జీవితమంతా అనుభవిస్తున్నావు. కోపగించుకుంటే ప్రయోజనం లేదు. వెళ్లు. ఇవాళ్టి నుంచీ నువ్వు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది.’’‘‘దీన్ని వరం అంటావా? శాపం కన్నా దారుణం! నీవు ఇచ్చిన ఈ వరంతో పోలిస్తే నా దారుణమయిన జీవితమే వేయి రెట్లు నయం. తెలివిలేని నీ వరాన్ని వెనక్కి తీసుకో, నన్ను వదిలేయ్’’ అన్నాడు.అతను ఆ మాట అనగానే ఆమ్మవారు కనిపించినంత వేగంగా ఆశ్చర్యంగా మాయమయింది. ఆలోచనలో పడ్డాడు. ఇంటికి వెళ్లి ఈ సంగతి తన భార్యతో చెప్పాలనుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత అమ్మవారు ఒక వరాన్ని యిచ్చింది.’’అతనికి ఎంతో ఆనందంగా ఉంది. అతను గుడి నుంచీ యింటికి వెళ్లాడు. గుమ్మంలో అతని భార్య వేచి ఉంది. ‘‘ఏమయింది? ఏమిటా తొందర?’’ గాబరాతో అడిగింది.బ్రాహ్మణుడు తనకు అమ్మవారు వరం యివ్వడం గురించీ అంతా పూసగుచ్చినట్టు వివరంగా చెప్పాడు ఇన్నాళ్లూ ఆమె పడ్డ కష్టాలు కష్టాలు కాదన్నంతగా అయింది. ఆమె ఆనందానికి అంతేలేదు. అతనితో అంది, ‘‘నాకు తెలుసు పూజల్లో యిన్నాళ్లు గడిపిన సమయమంతా వృ«థాపోదని.’’‘‘గొప్ప ఫలమా? ఏమంటున్నావు? నేను ఏదో పొందితే అది యితరులకు అంతకు రెండింతలు లభిస్తుంది. ఇంతకంటే దారుణ శాపం విని ఉండవ్. నువ్వుగాని భంగు తాగావా?’’‘‘మహిళగా నేను మీకు సలహానిచ్చే అర్హత లేకపోవచ్చు. కానీ, నిజానికి యితరులకు మనకంటే రెండింతలు లాభిస్తే నష్టమేమిటి? ఇన్నాళ్లూ ఎన్నో కష్టాలను భరించాం. మనం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిద్దాం. సౌఖ్యమేమిటో మనకూ తెలుస్తుంది. యిక మీ యిష్టం. దాన్ని గురించి ఆందోళన చెందాల్సిందేముంది? మీ నిరాశతో నా అదృష్టాన్ని కాదనుకుంటాను. మీరు నాకు ఈ చిన్న ఆనందపు మెరుపు ఎందుకు ప్రసాదించలేదు?’’‘‘నువ్వు చెప్పింది సబబే. అదెలా పనిచేస్తుందో చూద్దాం.. ఏమయినప్పటికీ అమ్మవారు మనకు మార్పు తేవడానికి వరం యిచ్చిందేమో?’’ అన్నాడు సాలోచనగా.కానీ మొదటగా ఏమి కోరుకోవాలి? హఠాత్తుగా అతనికి తన పగిలి పోయిన పైపు, ఖాళీ గంజాపాత్ర గుర్తుకు వచ్చాయి. ‘‘అమ్మా, నువ్విచ్చిన వరమే నిజమైతే, నాకు ఓ కొత్త పైపు, గంజాతో నిండిన పాత్రనీ ప్రసాదించు’’ అన్నాడు.అతని పెదవుల నుంచి మాట బయటకు వచ్చిందో లేదో, కోరిన బహుమతులు ప్రత్యక్షమయ్యాయి. అవి చూసినవారు ఆశ్చర్యంతో బొమ్మల్లా ఉండిపోయారు. ఇంత సులభంగా ప్రతీ కోరికా తీరితే, వారి ఆనందానికి అంతేదీ! గంజాను పైప్ నిండా కుక్కి దాన్ని అంటించడానికి అతని భార్య నిప్పుకణిక తెచ్చింది. తర్వాత ఏం కోరుకోవాలో ఆలోచిస్తున్నాడు. జీవితమంతా వాళ్లు నానా కష్టాలూ పడ్డారు. ఇప్పుడు మంచిది ఏది అడగాలి? ఇదా లేక అదా, అదా లేక ఇదా? మనసు ముడి వీడటం లేదు. కోరడానికి అనేకం ఆలోచించాడు. భార్యను సంతోష పెట్టడానికి పిండి, ఉప్పు, సుగంధద్రవ్యాలు, వంటచెరకు కావాలి. ఒక నిమిషం కొన్ని వస్తువుల గురించి అడుగుతాడు. మరుక్షణం అవి అతని ముందుంటున్నాయి.భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యంలో తలమునకలవుతున్నారు. పొయ్యి వెలిగించడానికి అతని భార్య పరిగెట్టుకెళ్లింది. ఎందుకు సందేహించడం? అతను ఎంత ఆనందంగా ఉన్నాడో అంతగా యిబ్బందిపడుతున్నాడు. అతని చుట్టుపక్కలవారు రెండింతలు పొందుతున్నారు. అదేం తప్పుకాదే.బ్రాహ్మణుడి భార్య తన భర్తకి భోజనం పెట్టి తాను తినడానికి కూర్చుంది. సంతృప్తిగా భోజనం చేయడం కంటే ఆనందం మరోటి ఉండదు. బ్రాహ్మణుడు తన జీవితంలో మొదటిసారి సంతృప్తిగా భోజనం చేశాడు. కానీ అది విచారపరిచింది. తన భార్య దగ్గరికి వెళ్లి ‘‘నాకో పని చేసిపెడతావా?’’ అని అడిగాడు.‘‘నీ మాటను ఎప్పుడన్నా కాదన్నానా? ఇంత హఠాత్తుగా అడిగారు?’’‘‘కాదంటే, నేనే సమాధానం చెబుతాను. ఊళ్లోకి వెళ్లు. ప్రతీ యింటా మనకంటే రెండింతలు ఉన్నదీ లేనిదీ చూసిరా.’’‘‘ఇతరుల సంగతి మనకెందుకు? మనం యిప్పుడు చిన్న దీపందివ్వె కోసమయినా యితరులను అడుక్కోనక్కర్లేదు. అంతేగాదు ప్రతీవారు మీ వల్లనే ఎంతో సమృద్ధులవుతున్నారు. మనకంటే తక్కువేమీ అభివృద్ధి చెందడంలేదు!’’ఆమె యిల్లు చేరేసరికి ఆమె భర్త విచారంతో కూచోనున్నాడు. ఆమె రాక తెలిసి తలెత్తి, ‘‘నిజమేనా? మనకంటే వాళ్లంతా రెండింతలు పొందారా?’’ అడిగాడు.పూజారి భార్య అవునని చెప్పగానే, అతనికి చెవుల్లో తుపాకులు పేల్చినట్లయింది. అతనికి తెలియనివాటి గురించి అతనికి దిగులు లేదు, కానీ, తన గ్రామంలో ప్రజలంతా పొందుతున్నవాటి గురించి అమితాశ్చర్యపడ్డాడు. కనీసం ఒక్కరైనా కృతజ్ఞతలు చెప్పలేదు. దుర్మార్గులు ఒక మాట అనలేదు. ఇటువంటి ద్రోహులకు సహాయపడటం పాపం అనుకున్నాడు. పిచ్చెత్తిపోయాడు. మంచంమీద పడిపోయాడు. అతని భార్య అతని చేతులు, కాళ్లూ రుద్దడం ఆరంభించింది.కొంతసేపటికి అతన్ని ఇలా శాంతపరిచింది, ‘‘ఏమీ లేనివాని కోసం ఎందుకు అంతగా బాధపడతారు. లోకం కాలిపోని, మనకేంటి?’’ అంది.‘‘అంత సులభంగా అందరినీ అలా వెళ్లనిస్తాను? అదే నిజంగా జరిగితే, నేను నిశ్చింతగా ఉంటాను.’’‘‘శ్వాస ఉన్నంతకాలమే ఈ లోకం ఉండేది. నీ గురించీ జాగ్రత్తపడు. మిగతావన్నీ సక్రమమవుతాయి. అద్దంలో చూడు. ఎంత ఆరోగ్యంగా ఉండేవాడివి. నా కళ్ల ముందే చిక్కి శల్యమయ్యావు. ముందు ఆరోగ్యంగా తయారవు. తర్వాత నువ్వు ఏం చెయ్యదల్చుకుంటే అది చేద్దువుగానీ. జీడిపప్పు, పాలు తీసుకురా నీకు పాయసం, లడ్డూ, హల్వా చేస్తాను రాత్రి భోజనంలోకి.’’ఆమె అడిగింది‘‘నా చేతులతో నేనే వీటిని వండాలా? నాకు మంచి పెనం, వెండి గిన్నెలు కావాలి.’’ అని.ఆశ్చర్యంగా బ్రాహ్మణుడు జాబితాలో పెనం, గిన్నెలు వేపు చూశాడు. వంటసామగ్రి ఆమె ఎదుట క్షణంలో ప్రత్యక్షమయ్యాయి. ఆమె హల్వా చేయడానికి యిక ఆట్టే సమయం పట్టలేదు.బ్రాహ్మణుడు నోరారా వేడి వేడి హల్వా తిన్నాడు. తర్వాత తన భార్యవంక చూసి, ‘‘నేను కలగంటున్నానా? కళ్లు తెరిచే ఉన్నాయా? నన్ను సరిగా చూసి చెప్పు.’’‘‘ముందు నువ్వే చెప్పు, తెరిచే ఉన్నాయా?’’‘‘అవును. విప్పారి ఉన్నాయి. ఇవాళ మన సొంత పొయ్యి మీదే హల్వా చేసుకున్నాం. నిన్నటి వరకూ ఊహించనివన్నీ ఇవాళ మన కళ్లతో చూస్తున్నాం.’’వాళ్లకి తెలీకుండానే, ఆనందం అనుభవించాలన్న కోరిక బలంగా కలిగింది. ఇవాళ్టివరకూ కష్టాలు అనుభవించారు. భరించలేని నష్టాలు భరించారు. ఇప్పుడు వీలయినంత ఆనందాన్ని ఆశిస్తున్నారు. మిగతా లోకమంతా తొలగిపోయింది.తెలవారుతోంది. నక్షత్రాలతోటి చీకటి నేలపైకి దిగుతోంది. పక్షులు కిలకిలా రావం, పాటతో అందెలసవ్వడి చేస్తోన్నాయి. అద్భుతం, నక్షత్రాలు ఆగి చూస్తున్నాయి! అలాంటి పల్చటి చీకటి తెర! చల్లని చిరుగాలి లోకం ఆహ్లాదం కలిగిస్తోంది. లోకం ఎంత బావుందో చూడ్డానికి యిపుడు! ‘‘మనకు కొన్ని ఆవులు, ఎద్దులు ఉంటే ఎలా ఉంటుంది? కోరుకున్నప్పుడల్లా పెరుగు, మీగడ ఉంటుంది.’’‘‘ఇలాంటి వరంతో చిన్నవాటిని కోరడమెందుకు? మనం అనుకున్నంత హాయిగా ఉండవచ్చు.’’హఠాత్తుగా బ్రాహ్మణుడి మనసులో ఓ ఆలోచన మెరిసింది. ‘‘అసలు అమ్మవారిపైనే ఓ తమాషా చేస్తే ఎలా వుంటుందంటావ్? ఇంటికి కావలసిన చిన్న చిన్నవాటిని ఎలాగూ ఇస్తుందనుకో. కానీ నిజంగా మనం ఎంతో ఘనమైనదే కోరితే? చేతులు జోడించి కోరుకున్నాడు, ‘‘ఓ తల్లీ, నా మాట ప్రకారం మహిమాన్వితవే అయితే, బంగారు భవంతి కావాలన్న నా కోరిక తీర్చు. అందుకు సరిపడా బంగారు వస్తుపరికరాలు అమర్చు.’’ఆ మాటలు అతని నోటనుండి వచ్చిన తక్షణమే ఓ అద్భుత బంగారు భవంతి అతని చుట్టూ వచ్చేసింది. సరిగా నవారు లేని తుక్కి మంచం బంగారంగా మారిపోయింది! అతను లేచి కూచున్నాడు, అమితాశ్చర్యపోయాడు, నోటమాటరాలేదు. ఆవుపేడ అలికిన బలహీనమైన గోడలు మంచి పసుపు ఛాయలోకి మారాయి. కళ్లు నులుముకుని మరీ చూశాడు. దుర్లభమయిన తన కోరిక నిజంగానే నిజమయినదా? పక్కనే అతని భార్య నిలబడింది, ఆశ్చర్యంతో నోటమాటరావడం లేదు. ఇదేమి లీల.అతని భార్య బంగారు దీపం వెలిగించింది. అతను భార్యతో అన్నాడు, ‘‘మనం అసలు నేరుగా ఈ భవంతినే కోరుకొని ఉండాల్సింది! ఉప్పు, వంటనూనె రెండింతలయ్యుండేవి, కానీ ఆమె ఇలాంటి రెండు బంగారు భవంతులు కల్పించడం చూడాలనుంది’’. దేవతకి ఈ కరుణ ఇరవయ్యేళ్ల క్రితమే కలిగి ఉంటే అతని జీవితం ఎంతో బాగుండేది. కానీ ఇపుడు వాళ్లు ఈ అద్భుత భవంతిలో ఎన్నాళ్లు సుఖంగా జీవించాలి? తన భార్యతో అన్నాడు, ‘‘నువ్వు ముసలిదానివయ్యావు. ఇలాంటి భవంతిలో ఉండే వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా, యవ్వనంతో ఉండాలి.’’‘‘నువ్వు నాకంటే ఘోరంగా వున్నావ్. నా గురించి ఆందోళనపడకు. నేను నీకంటే ముందే ఈ లోకాన్ని విడిచివెళ్లాలన్నదే నాకోరిక. బంగారుభవంతిని నా కళ్లతో చూశాను, ఇంతకంటే నాకింకేమి కావాలి? ఒక్క ఆలోచన.. అమ్మవారు మనల్ని యవ్వనంలోకి తీసికెళ్లలేదా?’’‘‘అరే, నిజమే, ఎందుకు తీసికెళ్లలేదు? నా మనసుకు ఏమయింది! పోనీలే, ఆలస్యమైనా ఫరవాలేదు. ’’అతను అడిగిన మరుక్షణం వారిద్దరినీ అమ్మవారు యవ్వనవంతుల్ని చేసింది. వారి యవ్వనం తిరిగివచ్చింది. ఇలాంటి లీలను కనీసం కలలోనైనా ఎవరూ ఊహించరు. కానీ ఇద్దరూ మళ్లీ యవ్వనంలోకి వచ్చారు! రెప్పపాటు కాలంలో ఆ అద్భుత రాత్రి గడచిపోయింది.మర్నాడు తెల్లవారుతుండగానే బ్రాహ్మణుడు నిద్రలేచాడు. ‘‘ఇవాళ్టిలా సూర్యుడు ఎన్నడయినా సరికొత్తగా ఉదయిస్తాడా?’’ అతను ఆశ్చర్యపోయాడు.అతను బంగారు మెట్లు ఎక్కి బంగారు మేడ మీదకి వచ్చాడు. చుట్టూరా అంతటా బంగారు భవంతులే. లెక్కలేనన్ని సూర్యులు ఉదయించినట్టుంది. అసూయతో అతని హృదయం మండిపోయింది. ఇతరులకు తన వల్ల ఎంతో మంచి జరుగుతుందని, ఎంతో ఆనందంగా ఉన్నారన్న ఆలోచనే అతనికి మింగుడు పడదు. ఇంత కంటే ప్రారబ్ధం ఉంటుందా?అతనో ప్రమాదకర చిట్టడవిలో ఇరుక్కున్నాడు. అతని హృదయంలో మంటలు మరింత పెరిగాయి, సూర్యుడిని సైతం కాల్చివేసేంతగా ఎదిగాయి. సహజసిద్ధమయిన అతనిలోని జంతువులు.. నక్క, కాకి, పులి, పాము అన్నీ క్రూరంగా తిరుగుతున్నాయి. రేబిస్ వచ్చిన కుక్కలా అరుస్తూ గుండ్రంగా తిరుగుతూన్నాడు.‘ ‘నా కళ్లలో ఒకటి గుడ్డిదే కాని! ఓ చెవి చిల్లుపడనీ! అంతులేని లోతు బావి నా భవంతి మధ్యలో పడని!’’ అన్నాడు.ఆ మాటలు అతని నోటినుండి రాగానే అతని భార్య గట్టిగా బాధతో అరిచింది. ‘‘భగవంతుడా, ఏం జరుగుతోంది? మా అద్భుత భవనం కనుమరుగవుతుందా? ఎదుగుతున్న సూర్యుడు భూమిలోకి పడిపోతాడా?’’ఏం జరుగుతోందో అతనికి అర్థమయింది. పరుగు పరుగున బంగారు మెట్లు దిగి భార్య వద్దకి వచ్చాడు. ఆమె తన ముందున్న గోడను పట్టుకుని ముందుకు వెళ్లబోయింది. అప్పుడే వచ్చిన బ్రాహ్మణుడు ‘‘ఆగు, అక్కడే ఆగిపో! ఒక్క అడుగు ముందుకేస్తే పెద్దగొయ్యి ఉంది నీముందు!’’ అంటూ గట్టిగా అరిచాడు. కానీ ఆమెకి అతని మాట వినపడలేదు. అలా ముందుకు కదిలింది. ఆమెను పట్టుకోవడానికి గెంతాడు. కింద ఎక్కడో పడిన శబ్దం వినపడింది. ఆమె అతన్ని వదిలిపోయింది. ఆ తరువాత అతను ఇరవై నాలుగు కోసుల దూరం వరకూ ప్రతీ ఇల్లూ, ప్రతీ గ్రామం తిరిగాడు. అతను ఏ గ్రామానికి వెళ్లినా అతను ఒక్క కంటితోనే చూడగలుగుతున్నాడు, ప్రజలు ఒకరి తర్వాత ఒకరు ఆ బావుల్లో పడుతున్నారు. అంతానికి ఆట్టే కాలం పట్టలేదు. అతను దయ్యంలా అరిచాడు. మృత్యువు వొడిలోకి దారి తీయించిన తన రెండు బంగారు భవంతులపట్ల ఎంతో సంతసించాడు!ఇప్పుడు తాను అన్ని బంగారు భవంతులకు ఏకైక యజమాని. కాదని ఎదిరించడానికి ఎవరూ లేరు. రోజుకో కొత్తభవంతిలో నిద్రబోతున్నాడు. అతనికిలా రెండేసి పొందడానికి ఇపుడు ఇక ఎవరూ లేరు. అమ్మవారు అతనికి వరం ఇచ్చి ప్రయోజనమేమిటి? వరాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అతనికి బాగా తెలుసు. కనుక అమ్మవారిచ్చిన వరమూ చివరికి పోయింది. ఆనందంతో ఎగిరి గంతేశాడు, చేతులు పైకెత్తి తన ఒక్క కంటితో బంగారు భవంతులను చూసుకున్నాడు. కానీ అతని అత్యంత ఆనందకర సమయాన్ని చూసేందుకే ఎవరూ లేకపోవడం చాలా దురదృష్టకరం.‘చౌబోలీ అండ్ అదర్స్టోరీస్’ నుంచి మూలం : విజయదన్ దెత (రాజస్థాన్) అనువాదం: టి. లలితప్రసాద్ -
పోలింగ్ బూత్లో పూజలు చేసిన ఛత్తీస్గఢ్ మంత్రి
-
వైరల్.. ఈవీఎం మిషన్కి పూజలు చేసిన ఎమ్మెల్యే
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రంలో పూజలు నిర్వహించడంమే ఇందుకు కారణం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నవగఢ్లో చోటు చేసుకుంది. ఈ నెల 20న ఛత్తీస్గఢ్లో చివరి దశ పోలీంగ్ ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున నవగఢ్ ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక మంత్రి దయాల్దాస్ బాఘెల్ ఓ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంకి పూజలు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్గా మారింది. బేమెతర జిల్లాలోని నవగఢ్ నియోజకవర్గంలో గత మంగళవారం పోలింగ్ ప్రారంభమవడానికి ముందు దయాల్దాస్ స్థానిక పోలింగ్ కేంద్రంలో పూజలు చేశారు. ఈవీఎం మిషన్కు దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తీలు కూడా ముట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల కావడంతో స్పందించిన రిటర్నింగ్ అధికారి దయాల్దాస్కు నోటీసులు జారీ చేశారు. 24గంటల్లోగా వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో నేతలు సామాన్యులను పూజించాలి గానీ ఈవీఎంలను కాదని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గత 15ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా.. ప్రజల కోసం పనిచేయకుండా ఇప్పుడు ఈవీఎంలకు పూజలు చేస్తే ఏం లాభమని ఎద్దేవా చేసింది. కాగా ఈ వార్తలపై దయాల్దాస్ ఇంతవరకూ స్పందించలేదు. -
లడ్డూలు పంచండి
మండపాలు వెలుగుతుంటాయి... పూజలు జరుగుతుంటాయి... పిల్లలూ పెద్దలూ అక్కడే చేరి ఉత్సాహంగా ఏకదంతుని స్తుతిస్తూ భజనలు చేస్తుంటారు. పూజతో పాటు ప్రసాదం కూడా ఉండాలి. ఈ లడ్లు చేయండి. దేవుడికి పెట్టండి. నలుగురికీ పంచండి. పండగను సంతోషాలతో నింపండి. కొబ్బరి లడ్డు కావలసినవి: తాజా కొబ్బరి తురుము – 2 కప్పులు; పాలు – అర కప్పు; పంచదార – ముప్పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; జీడి పప్పులు – గుప్పెడు (చిన్న చిన్న ముక్కలు చేయాలి); నెయ్యి – ఒక టీ స్పూను తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ♦ జీడిపప్పు ముక్కలు వేసి, వేయించి తీసి, పక్కన ఉంచాలి ♦ అదే బాణలిలో పచ్చి కొబ్బరి తురుము, పంచదార వేసి బాగా కలిపి ఉడికించాలి ♦ మిశ్రమంలో తడి అంతా పోయి, బాగా గట్టిపడ్డాక, ఏలకుల పొడి, వేయించి ఉంచుకున్న నట్స్ జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ♦ మిశ్రమం కొద్దిగా చల్లారాక లడ్డూల మాదిరిగా చేతితో గుండ్రంగా చేయాలి ♦ గాలిచొరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి ♦ ఇవి రెండు మూడు రోజుల కంటె ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. బందరు లడ్డు కావలసినవి: సెనగ పిండి – 300 గ్రా.; బెల్లం – 400 గ్రా.; నీళ్లు – అర కప్పు (బెల్లం పాకం కోసం) ; ఏలకుల పొడి – పావు టీ స్పూను; నెయ్యి/నూనె – ఒక కప్పు; జీడిపప్పులు + కిస్మిస్ – పావు కప్పు తయారీ: ♦ ఒక వెడల్పాటి పాత్రలో సెన గ పిండి వేసి తగినన్ని నీళ్లు జత చేసి జంతికల పిండిలా కలిపి పక్కన ఉంచాలి ♦ పిండి మరీ గట్టిగా, మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి ♦ స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి/నూనె పోసి కాగనివ్వాలి ♦ జంతికల పిండిని జంతికల గొట్టలోకి కొద్దికొద్దిగా పెట్టుకుంటూ నెయ్యి/నూనెలోకి జంతికలు చుట్టాలి ♦ రెండువైపులా బాగా వేగిన తరవాత ఒక పళ్లెంలోకి తీసుకోవాలి ♦ ఈ విధంగా మొత్తం పిండిని జంతికలుగా చేసుకుని పక్కన ఉంచాలి ♦ బాగా చల్లారిన తరవాత జంతికలను చేతితో చిదిపి మిక్సీలో వేసి మెత్తగా పొడిలా అయ్యేవరకు మిక్సీ పట్టాలి ♦ పిండిని జల్లించుకోవాలి ♦ మెత్తగా ఉన్న పిండిని మాత్రమే వాడుకోవాలి ♦ జల్లెడలో మిగిలిన పిండిని రెండు మూడు సార్లు మిక్సీలో పడితే చాలావరకు మెత్తగా వస్తుంది ♦ జల్లెడలో కొద్దిగా మాత్రమే మిగులుతుంది ♦ ఇలా తయారుచేసుకున్న పిండిని పక్కన ఉంచాలి ♦ ఒక మందపాటి పాత్రలో బెల్లం, నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి కొద్దిగా ఉండపాకం వచ్చేవరకు ఉడికించాలి ♦ ఉడుకుతుండగానే ఏలకుల పొడి వేసి బాగా కలపాలి ♦ ఉండ పాకం రాగానే పక్కన ఉంచుకున్న జంతికల పిండిని కొద్దికొద్దిగా వేస్తూ బాగా కలిపి దింపేయాలి ♦ ఈలోపుగా స్టౌ మీద మరో బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, కిస్మిస్లను వేసి వేయించి పక్కన ఉంచాలి ♦ పిండిని పాకంలో బాగా తిప్పుతూ ఉండాలి ♦ (ఇంట్లో రోలు, రోకలిబండ ఉన్నవారు రోట్లో వేసి తొక్కాలి) మిశ్రమం గట్టిపడుతుండగా, వేయించి ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసి మరోమారు కలిపి, మిశ్రమం చల్లారకుండా, వేడిగా ఉండగానే గబగబ లడ్డూలుగా గుండ్రంగా చేయాలి ♦ (ఆలస్యం అయితే మిశ్రమం పొడిపొడిలా అయిపోయి, ఉండలు చేయడానికి కుదరదు) ♦ లడ్డూలు చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి ♦ ఇవి కనీసం నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి. డేట్స్ మావా లడ్డు కావలసినవి: ఖర్జూరాలు – 300 గ్రా. (గింజలు తీసినవి); పచ్చి కోవా – 200 గ్రా.; నెయ్యి – ఒక టీస్పూను; న ట్స్ – కొద్దిగా (బాదం పప్పులు, పిస్తా, జీడి పప్పుల తరుగు); రోజ్ వాటర్ – ఒక టీ స్పూను తయారీ: ♦ ఖర్జూరాలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. (ఖర్జూరాలు కొద్దిగా గట్టిగా అనిపిస్తే, కొద్దిగా పాలలో నానబెట్టిన తరవాత మిక్సీలో వేయాలి) ♦ స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ♦ మెత్తగా చేసుకున్న ఖర్జూరాలు, పచ్చికోవా వేసి బాగా కలిపి సుమారు ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ♦ బాణలి అంచులను విడిచిపెడుతున్నట్లుగా అయ్యేవరకు ఉడికించాక రోజ్వాటర్ జతచేసి మరోమారు కలపాలి ♦ మిశ్రమం ముద్దలా అయిన తరవాత దింపేసి, నెయ్యి పూసిన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ♦ నట్స్ జత చేయాలి ♦ కొద్దిగా చల్లబడిన తరవాత లడ్డూల మాదిరిగా గుండ్రంగా చేసుకోవాలి ♦ ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అందువల్ల ఫ్రిజ్లో నిల్వ చేసుకోవాలి. వాల్నట్ లడ్డు కావలసినవి: వాల్నట్స్ – ఒక కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); అటుకులు – ఒక కప్పు; తాటి బెల్లం పొyì / బెల్లం పొడి∙– ముప్పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను. తయారీ: ♦ స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక అటుకులు వేసి దోరగా వేయించి తీసేయాలి ♦ అదే బాణలిలో వాల్నట్స్ వేసి వేయించి తీసి చల్లారనివ్వాలి ♦ అటుకులు చల్లారిన తరవాత చేతితో పొడిలా చేయాలి ♦ వాల్నట్స్ చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ♦ బెల్లం కూడా జత చేసి మరోమారు మిక్సీ పట్టాక, ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ♦ అటుకుల పొడి జత చేసి బాగా కలిపి, చేతికి కొద్దిగా నెయ్యి పూసుకుని, మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకుని లడ్డూలు తయారుచేయాలి ♦ వాల్నట్స్ లడ్డూలు సిద్ధమైనట్లే. మలడు లడ్డు కావలసినవి: పుట్నాల పప్పు – ఒక కప్పు; పంచదార – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; జీడిపప్పులు – గుప్పెడు తయారీ: ♦ పుట్నాలపప్పు (వేయించిన సెనగ పప్పు) మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచాలి ♦ పంచదార, ఏలకులను మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ♦ స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక జీడిపప్పులు వేసి వేయించి, మంట ఆర్పేయాలి ♦ పంచదార పొడి, పుట్నాల పప్పు పొడి వేడివేడి నేతిలో వేసి బాగా కలపాలి ♦ వేడి బాగా తగ్గేవరకు పక్కన ఉంచాలి ♦ (పూర్తిగా చల్లారనివ్వకూడదు) ♦ గోరువెచ్చగా ఉన్న సమయంలోనే కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ లడ్డూ ఉండలు చేసి పక్కన ఉంచాలి ♦ చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ కోకోనట్ లడ్డు కావలసినవి : కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు + 2 టేబుల్స్పూన్ల స్వీట్ కండెన్స్డ్ మిల్క్; ఏలకుల పొడి – చిటికెడు; వేయించిన నట్స్ – కొద్దిగా (పిస్తా పప్పులు, జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ కలిపి); పచ్చి కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు (బాగా మెత్తగా ఉండాలి) తయారీ ♦ ఒక పాత్రలో పచ్చి కొబ్బరి తురుము, కండెన్స్డ్ మిల్క్ + స్వీట్ కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి కలుపుతుండాలి ♦ మిశ్రమం బాగా ఉడుకుపట్టి, దగ్గర పడిన తరవాత ఏలకుల పొడి, నట్స్ జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ♦ కొద్దిగా చల్లారిన తరవాత లడ్డూల మాదిరిగా చేసుకుని గాలిచొరని డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో నిల్వ చేసుకోవాలి. మలై లడ్డు కావలసినవి: పాలు – 2 లీటర్లు (8 కప్పులు); పంచదార – అర కప్పు; నిమ్మ రసం – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – చిటికెడు; కుంకుమ పువ్వు – చిటికెడు; జీడి పప్పులు – తగినన్ని; కిస్మిస్ – తగినన్ని తయారీ: ♦ ఒక పెద్ద పాత్రలో పాలు పోసి మీగడ పొర వచ్చేవరకు పాలను కాచి, స్టౌ మీద నుంచి దింపేయాలి ♦ రెండు కప్పుల పాలు, మీగడ వేరే పాత్రలోకి తీసుకోవాలి ♦ మిగిలిన ఆరు కప్పుల పాలలో నిమ్మ రసం వేసి పాలను విరగ్గొట్టాలి ♦ పాల విరుగును ఒక పల్చటి వస్త్రంలో వేసి మూట గట్టి, నిమ్మరసం పోయేవరకు చన్నీళ్లలో కడగాలి ♦ నీరంతా పోయేవరకు గట్టిగా పిండాలి ♦ పనీర్ రెడీ అయినట్లే ∙పక్కన ఉంచుకున్న రెండు కప్పుల పాలకు పంచదార జత చేసి స్టౌ మీద ఉంచి అర కప్పు పాలు మిగిలే వరకు మరిగించాలి ♦ తయారు చేసి ఉంచుకున్న పనీర్ వేసి బాగా కలపాలి ♦ మిశ్రమం బాగా చిక్కపడేవరకు కలుపుతుండాలి ♦ ఏలకుల పొడి పంచదార మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి ♦ లడ్డూ మౌల్డ్కి కొద్దిగా నెయ్యి పూసి, తగినంత మలై లడ్డూ మిశ్రమం అందులో ఉంచి మూసేయాలి ♦ ¯ð మ్మదిగా తెరిచి లడ్డూ ఆకారం చెyì పోకుండా జాగ్రత్తగా బయటకు తీసి ఒక ప్లేట్లో ఉంచాలి ♦ ఈ విధంగా లడ్డూలన్నీ తయారుచేసుకోవాలి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ♦ అందువల్ల ఫ్రిజ్లో ఉంచుకోవాలి. తంబిట్టు కావలసినవి: పుట్నాల పప్పు – ఒక కప్పు (పొడి చేయాలి); బెల్లం పొడి – అర కప్పు; నెయ్యి – అర కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; ఎండు కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; వేయించిన నువ్వులు – 3 టేబుల్ స్పూన్లు (పొడి చేయాలి); వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు (పొడి చేయాలి); గసగసాలు – ఒక టేబుల్ స్పూను తయారీ: వెడల్పాటి పాత్రను స్టౌ మీద ఉంచి, వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ♦ బెల్లం పొడి జత చేసి బాగా కలపాలి ♦ బెల్లం పూర్తిగా కరిగి, పొంగులు వస్తుండగా ఏలకుల పొడి, పుట్నాల పొడి (2 టేబుల్ స్పూన్ల పొడి పక్కన ఉంచాలి) ♦ కొబ్బరి తురుము, నువ్వుల పొడి, గసగసాలు, పల్లీల పొడి వేసి బాగా కలపాలి ♦ బెల్లం పాకంలో బాగా కలిసేవరకు కలుపుతుండాలి ♦ పల్చగా అనిపిస్తే, పక్కన ఉంచుకున్న పుట్నాల పొడి జత చేసి మరోమారు కలపాలి ♦ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరవాత, చేతికి కొద్దిగా నెయ్యి పూసుకుని, పుట్నాల పొడి మిశ్రమం కొద్దిగా చేతిలోకి తీసుకుని లడ్డూలు చేయాలి ♦ (మరీ ఆలస్యం చేస్తే లడ్డూ చేయడానికి రాదు) ♦ వారం రోజుల కంటె ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ♦ ఈ లడ్డూలను కర్ణాటక రాష్ట్రంలో గౌరీ పూజ, వినాయక పూజ వంటి సందర్భాలలో ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఆటా లడ్డు కావలసినవి : గోధుమ పిండి – 2 కప్పులు; పంచదార – ఒక కప్పు; నెయ్యి – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కిస్మిస్ – తగినన్ని; జీడి పప్పులు – తగినన్ని తయారీ ♦ స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి ♦ జీడిపప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ♦ బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగాక గోధుమ పిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, తీసి పక్కన ఉంచి చల్లారనివ్వాలి ♦ మిక్సీలో పంచదార, ఏలకులు వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ♦ ఒక పాత్రలో ఈ పదార్థాలన్నిటినీ వేసి బాగా కలపాలి ♦ కొద్దికొద్దిగా నెయ్యి, వేయించి∙ఉంచుకున్న జీడిపప్పులు, కిస్మిస్లు వేసి లడ్డూలు చేసుకోవాలి ♦ గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి ♦ ఈ లడ్డూలు చిన్న పిల్లలకు మంచిది అనారోగ్యం, అజీర్తి చేయకుండా ఉంటుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
ఇన్ఫోసిస్ ప్రైజ్.. 40 ఏళ్లకు తగ్గించిన వయో పరిమితి
తప్పక చదవండి
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- యంగ్ హీరోతో మృణాల్ డేటింగ్? ఏంటి విషయం!
- టీడీపీ మూకలకు మంత్రి మేరుగ వార్నింగ్
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement