-
టీఎఫ్డీఏ నూతన అధ్యక్షుడిగా వీరశంకర్
తెలుగు సినీ దర్శకుల సంఘం (టీఎఫ్డీఏ) సంఘం నూతన అధ్యక్షుడిగా దర్శకుడు బి. వీరశంకర శ్రీనివాస్ (వీరశంకర్) గెలుపొందారు. 2024–2026 సంవత్సరాలకు గాను ఆదివారం హైదరాబాద్లో టీఎఫ్డీఏ ఎన్నికలు జరిగాయి. దర్శకుల సంఘంలో దాదాపు 2000 మంది సభ్యులున్నారు. ఎన్నికల్లో 1113 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవికి బి. వీరశంకర శ్రీనివాస్, వి. సముద్రరావు, జి. రామ్ప్రసాద్, ఏఎస్ రవికుమార్ చౌదరి, పానుగంటి రాజారెడ్డి పోటీ చేశారు. ఈ పోటీలో 536 ఓట్లతో వీరశంకర్ విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా నీలం సాయిరాజేశ్, ఎమ్వీఎన్ రెడ్డి (వశిష్ఠ), జనరల్ సెక్రటరీగా సీహెచ్ సుబ్బారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా వద్దానం రమేశ్, కస్తూరి శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పీఎస్ ప్రియదర్శి, డి. వంశీకృష్ణ జయకేతనం ఎగురవేశారు. ట్రెజరర్గా పీవీ రామారావు గెలుపొందారు. కార్యవర్గ సభ్యులుగా ఎ. కృష్ణమోహన్, అల్లా భక్స్, రాజా వన్నెంరెడ్డి, శైలేష్ కొలను, శ్రీరామ్ ఆదిత్య తుర్లపాటి, కూరపాటి రామారావు, లక్ష్మణరావు చాపర్ల, ప్రవీణ మడిపల్లి, రమణ మొగిలి, కొండా విజయ్కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల అనంతరం నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ– ‘‘తెలుగు దర్శకుల సంఘం స్థాయిని నెక్ట్స్ లెవల్కి తీసుకుని వెళ్లేందుకు అందరం కలిసి కృషి చేస్తాం. ఇప్పుడు ఉన్న టీఎఫ్డీఏను ‘టీఎఫ్డీఏ 2.ఓ’ అన్నట్లుగా వర్క్ చేస్తాం. హైదరాబాద్కు ఎవరైనా పర్యాటకులు వస్తే టీఎఫ్డీఏ బిల్డింగ్ ముందు సెల్ఫీ తీసుకోవాలన్నట్లుగా చేస్తాం. మంచి ఆలోచనలుంటే ప్రభుత్వ సహకారం కూడా లభిస్తుంది’’ అన్నారు. -
ఈగల్ కి ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాం..!
-
అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 తెలుగు సినిమాలు
-
మరో స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్
‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరో స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్కు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’, ‘సార్’ వంటి సినిమాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్న చిత్రంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘‘అక్టోబరులో షూటింగ్ను ఆరంభించి, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులను అలరించే మరో మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్గా ఈ చిత్రం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అయోమయంలో అరవింద చిత్రం ప్రారంభం
తెలుగులో మరో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతోంది. రణధీర్, సుభ శ్రీ హీరోహీరోయిన్లుగా వూర శ్రీను దర్శకత్వంలో ధార్వి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 బ్యానర్లో లెక్కల మహేంద్రా రెడ్డి నిర్మాణంలో 'అయోమయంలో అరవింద' చిత్రం తెరకెక్కుతోంది. డాక్టర్ ప్రసాద్ మూరెళ్ల సహకార సారధ్యంలో రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్ ఫిలింనగర్ వెంకటేశ్వర స్వామి దైవ సన్నిదానంలో ప్రారంభోత్సవ వేడుక జరిగింది. హీరోహీరోయిన్లపై ముహూర్తం షాట్కు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ క్లాప్ కొట్టారు. వి.శ్రీనివాసరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలిషాట్కు మేడిది వెంకటేశ్వరరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ ప్రారంభ వేడుకలో నిర్మాత లెక్కల మహేంద్రా రెడ్డి మాట్లాడుతూ.. 'అయోమయంలో అరవింద' ఇప్పటి వరకు వచ్చిన కథలకు భిన్నంగా ఉంటూ ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది అన్నారు. హీరో రణధీర్ మాట్లాడుతూ.. 'నాకిది రెండో సినిమా. ఇది ఎవరూ ఊహించని క్రైమ్ థ్రిల్లర్. కథ విన్నప్పుడు నేను కూడా అయోమయంలో పడిపోయాను. సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నాడు. హీరోయిన్ సుభ శ్రీ మాట్లాడుతూ... 'ఇది నాకు నాలుగవ ప్రాజెక్ట్. ఈ సినిమా యూనిట్ అంతా సపోర్టుగా ఉన్నారు. నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చింది. హీరో తండ్రి బీసు చందర్ గౌడ్ మాట్లాడుతూ.. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రల్లో ఇది కొత్త ప్రయోగం, హీరోయిన్ చేసే మర్డర్స్, హీరో చేధించే తీరు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించడం ఖాయం. భిన్నమైన కథ. అందరి ఆశీర్వాదంతో మూడు నెలల్లో సినిమా పూర్తి అయి మీ ముందుకు వస్తుంది. చదవండి: హీరోయిన్కు అభిమాని పూజలు, వీడియో వైరల్ వందల కోట్ల స్టార్ హీరోకు దారుణ పరిస్థితి -
కందికొండకు క్యాన్సర్.. ‘మనందరం అండగా నిలబడదాం’
సినిమా ప్రపంచంలో పాటకున్న ప్రత్యేకత అసాధారణమైనది. ఒక్కో సందర్భంలో పాటల ద్వారానే సినిమాలు హిట్ అవుతుంటాయి. ఇలాంటి పాటలను రాయడంలో కందికొండ చెయ్యి తిరిగినవాడు. వందలాది పాటలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గడపను తాకిన వైనం ఈయనది. తెలంగాణలోని వరంగల్ జిల్లా నాగుర్లపల్లెలో సామాన్య కుమ్మరి కుటుంబం నుండి వచ్చినవారు కందికొండ. మట్టిమనుషుల యాస–గోసను పట్టిన కలం ఈయన సొంతం. ప్రొఫెసర్ అవ్వాలనే కోరికతో డబుల్ యంఏ చదివి 2004లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు మళ్ళీకూయవే గువ్వా అనే పాట ద్వారా సినిమా ప్రపంచంలోకి అడిగిడునాడు. అనతికాలంలోనే తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే అసంఖ్యాక పాటలను అందించాడు. తెలుగు సినిమాలో రజనికాంత్, చిరంజీవితో సహా దాదాపుగా అందరు హీరోలకు కలిపి 1,300 పైగా పాటలను అందించారు కందికొండ. ఈయన పాటలు కేవలం సినిమాకే పరిమితం అవ్వలేదు తెలంగాణ పోరులో సైరన్ అయ్యింది. తెలంగాణ అస్తిత్వంలో పాటై కోట్ల గొంతుకలను ఒక్కటిగా చేసింది. బతుకమ్మ పండుగకు కంది కొండ పాటలేనిదే ఊపులేదనే చెప్పాలి. సందర్భం ఏధైనా సరే భక్తి, రక్తి, ప్రేమ, విరహం, ఊపు, అన్నికోణాల్లో పాటలను అందించగల్గిన ఒకేఒక్కడు కందికొండ. తెలంగాణ సినీగేయాలపై ఉస్మానియాలో పీహెచ్డీ చేసి ఇటీవలే డాక్టరేట్ కూడ అందుకున్నారు. తెలుగు సమాజంలో పాట మాత్రమే బ్రతికివుంటుంది, పాడినోడికి, పాట రాసినోడికి రాని గుర్తింపు కేవలం పాటలకే వస్తుంటాయి, పాటలను గన్నవాళ్ళకు జీవనమే దుర్భరమైన సందర్భాలు మనం చూశాము. కళాకారులు ప్రజల ఆస్తిగా బావించాల్సింది ప్రభుత్వాలే. అందుకే వీళ్ళకు సముచితమైన గౌరవాన్ని అందించడంలో మీనమేషాలు చూడకూడదు. ఇప్పుడు గత కొద్దిరోజులుగా కంది కొండ గొంతు క్యాన్సర్తో చావుతో పోరాడుతున్నారు, సరైన వైద్య సదుపాయం కావాలంటే లక్షల రూపాయల్లో ఖర్చు. ఇలాంటి సందర్భంలో అరుదైన కళాకారులను ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. అస్థిత్వ ధోరణిలో తెలంగాణ ప్రభుత్వం మరింత అండగా ముందుకు రావాల్సి ఉన్నది. తెలుగు సినిమా ఒకటే కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ కందికొండను బతికించుకోవడంలో భాగస్వామ్యం వహించవల్సి ఉన్నది. ప్రభుత్వాలే కాకుండా మనం సైతం ఇప్పుడు కందికొండకు అండగ నిలబడాలని ఉంది. దాతలు గూగుల్ పే ద్వారా 8179310687కి సహాయం అదించగలరు. అలాగే కందికొండ రమాదేవి ఆంధ్రాబ్యాంక్ 135510100174728 (అకౌంట్ నంబర్). IFSC ANDB0001355కి కూడా తమ సహాయాన్ని అందించవచ్చును. - వరకుమార్ గుండెపంగు ప్రముఖ కథా రచయిత మొబైల్: 99485 41711 -
త్వరలోనే గుడ్న్యూస్ చెబుతా : హీరోయిన్
‘గద్దలకొండ గణేష్’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మృణాళినీ రవి మరో తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపారట. ప్రస్తుతం తమిళ్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారామె. విక్రమ్ సరసన ‘కోబ్రా’, విశాల్తో ‘ఎనిమి’ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ మరో తెలుగు చిత్రంలో నటించనున్నారని టాక్. ఈ సందర్భంగా మృణాళిని మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకుల అభిమానం ఒక రేంజ్లో ఉంటుంది. ఒక్కసారి ఆ అభిమానాన్ని రుచి చూసిన వాళ్లెవరైనా అంత తేలిగ్గా మర్చిపోలేరు. నటనతో పాటు గ్లామర్కి స్కోప్ ఉన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఈ కరోనా లాక్డౌన్లో కొందరు తెలుగు దర్శకులు చెప్పిన కథలను ఆన్లైన్లో విన్నాను. త్వరలోనే గుడ్న్యూస్ చెబుతాను’’ అన్నారు. -
సినీ కార్మికులను బతికించుకుంటాం: అనిల్
తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 18 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి కొమర వెంకటేష్పై విజయం సాధించారు అనిల్ కుమార్. ప్రధాన కార్యదర్శిగా పీఎస్ఎన్ దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారి ఆశయాలతో కార్మిక వర్గాన్ని సంక్షేమబాటలో తీసుకుని వెళతాం. సినీ కార్మికుల ఐక్యత కోసమే మేం పోరాడి గెలిచాం. కరోనా వల్ల ఇబ్బందులపాలైన కార్మికులను ఆదుకోవడంపై మొదట దృష్టి పెడతాం. చిరంజీవిగారు, భరద్వాజగారు, సి. కల్యాణ్ వంటి సినీ ప్రముఖులు, ఛాంబర్, నిర్మాతల మండలిల సహకారంతో సినీ కార్మికులను బతికించుకుంటాం’’ అన్నారు. -
దగ్గుబాటి రానా బర్త్డే స్పెషల్ ఫోటోలు
-
సింగర్ మంగ్లీ గ్లామర్ ఫోటోలు
-
అక్కినేని నాగార్జున స్పెషల్ ఫోటోలు
-
అపూర్వ శ్రీనివాసన్ గ్లామర్ ఫోటోలు
-
వైభవంగా నిర్మాత వల్లూరుపల్లి రమేష్ కుమారుడు వివాహం
-
హీరోయిన్ అదితీ రావ్ హైదరీ క్యూట్ ఫోటోలు
-
అందాల ముద్దుగుమ్మ ప్రణవి గ్లామర్ ఫోటోలు
-
యాంకర్ హరితేజ ఫోటోలు
-
హీరోయిన్ నందిని రాయ్ అదిరే స్టిల్స్
-
బుల్లితెర యాంకర్ భానుశ్రీ అదిరే స్టిల్స్
-
హీరోయిన్ అషిమా నర్వాల్ గ్లామర్ ఫోటోలు
-
ఎస్వి రంగారావు అపూర్వ చిత్రాల ఫోటో గ్యాలరీ
-
అడవి సాక్షిగా..
అదొక అటవీ ప్రాంతం. అడవి సాక్షిగా ఆ ప్రాంతంలో ఉండే రెండు మనసులు కలుస్తాయి. అయితే వారి ప్రేమకు ఆ అమ్మాయి అన్నలు విలన్లు అవుతారు. మరి.. ఆ జంట తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు? అనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రం ‘గజేంద్రుడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఆర్య, కేథరిన్ జంటగా రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్షీ్మ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై భారతి, వరప్రసాద్ వడ్డెల్ల సమర్పణలో ఉదయ్ హర్ష వడ్డెల్ల తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ – ‘‘హీరోగా, విలన్గా ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. కథానాయికగా కేథరిన్ చాలా పాపులర్. వీరిద్దరి జంట తెరపై కనువిందు చేసే విధంగా ఉంటుంది. తమిళంలో ఘన విజయం సాధించి, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్న చిత్రమిది. ఇందులో ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా ఇద్దరూ నటించారు. సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్కి గురి చేసేలా ఉంటుంది. ఆర్య ఈ సినిమా కోసం వెయిట్ పెరిగారు. సినిమాకు ఓ హైలెట్ గా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఉంటుంది. మార్చిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
టాలీవుడ్పై కన్నేసిన ఎయిర్టెల్ భామ
సాక్షి, హైదరాబాద్ : ఎయిర్టెల్ 4జీ యాడ్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సషా చెట్రీ టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనుంది. వినాయకుడు, కేరింత సినిమాల దర్శకుడు సాయి కిరణ్ అడవి మరో యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నారు. చిత్రంలోని పాత్రల్లో ఫ్రేష్ లుక్ కోసం కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకున్నారట. దీనికోసం జరిపిన ఆడిషన్లలో సాషా యాక్టింగ్ స్కిల్స్, డైలాగ్ డెలివరీతో డైరెక్టర్ ఇంప్రెస్ అయినట్టు సమాచారం. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. డెహ్రాడూన్కు చెందిన ఈ 19 ఏళ్ల ముద్దుగుమ్మ మోడల్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. 2015 ఆగష్టులో ఎయిర్టెల్ నెట్వర్క్ ప్రచార యాడ్లో సషాకు అవకాశం రావడంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. -
ఐఫోన్ 6ఎస్ తో సినిమా..
హైదరాబాద్: సెల్ఫోన్ ప్రపంచంలో యాపిల్ ఐఫోన్ది ఓ చరిత్ర. అత్యధిక మంది ఐఫోన్ వాడాలనుకుంటారు. దీనికి మార్కెట్లో ఉండే క్రేజే వేరు. అలాంటి ఐఫోన్తో ఏకంగా ఓ సినిమా తీశారు. అది కూడా తెలుగు సినిమా. ఐఫోన్తో సినిమాని చిత్రీకరించారు. ఆ సినిమా పేరు "లవర్స్ క్లబ్". వివరాల్లోకి వెళ్తే "ప్లాన్ బీ ఎంటర్టైన్మెంట్ అండ్ శ్రేయా ఆర్ట్ క్రియేషన్స్" బ్యానర్లో చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఈ చిత్రానికి భరత్ అవ్వారి దర్శకత్వం వహిస్తున్నారు. దృవ శేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు, ఫైట్లు, సన్నివేశాలు, ఇలా అన్నీ ఐఫోన్ 6ఎస్ తో చిత్రీకరించారు. ఇండియాలోనే ఐఫోన్తో తీసిన తొలిచిత్రం కావడం విశేషం. జూన్లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. చిత్ర ప్రచారంలో భాగంగా 34 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ను సోమవారం విడుదల చేశారు. -
సిద్ధు ఈజ్ బ్యాక్!
వస్తుతః తమిళుడైనా, అక్కడి కన్నా తెలుగులో ఎక్కువ పేరు తెచ్చుకున్న హీరో - సిద్ధార్థ్. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ లాంటి చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న ఆయన కొంతకాలంగా నేరు తెలుగు చిత్రాల్లో కనిపించడం లేదు. తాజాగా ఇప్పుడు ఆయన ఒక నేరు తెలుగు చిత్రంలో నటించడానికి సిద్ధమైనట్లు కృష్ణానగర్ కబురు. ఈ చిత్రానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు. గతంలో జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైన ‘చందమామ కథలు’, ఇటీవలే అధోజగత్తుకు చెందిన ఇద్దరు దొంగల జీవితాలపై తీసిన కామెడీ-థ్రిల్లర్ ‘గుంటూర్ టాకీస్’ ద్వారా పేరు తెచ్చుకున్నారు ప్రవీణ్. ఆయన తన తాజా ప్రయత్నానికి సిద్ధార్థ్ను కథానాయకుడిగా ఎంచుకొన్నారట! బహిర్గతం చేయకుండా మనం మనసులోనే దాచుకొనే ఆలోచనలు, అంతరంగ భావోద్వేగాలను నగ్నంగా ఆవిష్కరించే ఒక సున్నితమైన ప్రేమకథగా ఈ చిత్రకథను అల్లుకుంటున్నట్లు ఫిల్మ్నగర్ టాక్! ఇప్పటికే ఈ స్క్రిప్ట్ మీద బాగా వర్క్ చేసిన దర్శకుడు ఏప్రిల్ ఆఖరు కల్లా షూటింగ్ మొదలుపెట్టేస్తారట! మొత్తానికి, సిద్ధార్థ్ సెకండ్ ఇన్నింగ్స్కు ఇది షురూ అన్న మాట! -
నలుగురు వ్యక్తుల చుట్టూ మనమంతా
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్, గౌతమి చాలా విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించ నున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ముఖ్య పాత్రల్లో నటించనున్న చిత్రం ‘మనమంతా’. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశాన్ని దేవుని పటాలపై చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నలుగురు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సోమవారం చిత్రీకరణ మొదలవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాహుల్, సంగీతం: మహేశ్ శంకర్, నిర్మాత: రజనీ కొర్రపాటి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
'హౌస్ ఆఫ్ డ్రాగన్స్' సీజన్ 2 ట్రైలర్ రిలీజ్
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
రైతుల కష్టాలు రేవంత్కు కనిపించడం లేదా?: కేటీఆర్
నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
ఏపీ ఎన్నికలపై సీఈఓ ముకేశ్ కుమార్ కీలక ప్రెస్ మీట్
ఏపీలో 81.86 శాతం పోలింగ్ నమోదు.. అక్కడే అత్యధికం: ఎంకే మీనా
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: భారత్కు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ!
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- పరిచయం పెంచుకొని.. పాపను విడిచి
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
Advertisement