-
స్టార్ మాలో కొత్త సీరియల్ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’
బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు స్టార్మా లో మరో కొత్త సీరియల్ ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రాబోతుంది. సునిశిత హాస్యం, ప్రేమ,ప్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సీరియల్ సాగుంతుందని మేకర్స్ తెలియజేశారు. జనవరి 22 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ఈ సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. సీతాకాంత్, 40 ఏళ్ల వయసు కలిగిన విజయవంతమైన వ్యాపారవేత్త . బాధ్యతలు కలిగినప్పటికీ వినోదాన్ని అభిమానించే 20 ఏళ్ల రామలక్ష్మి పాత్రలో రక్ష కనిపిస్తుంది. వీరి ఇరువురి జీవితాల ద్వారా ప్రేక్షకులను ఆహ్లాదకరమైన ప్రయాణంలో నడిపిస్తుంది "ఎటో వెళ్లిపోయింది మనసు". సీతాకాంత్ పాత్రను సీతాకాంత్ పోషించారు. ఆయన జీవితం ఒక క్రమ పద్దతిలో వెళ్లాలనుకుంటారు. దాని చేతనే ఆయన ప్రసిద్ది చెందారు, అయితే రామలక్ష్మి ప్రతి సందర్భం లోనూ ఉత్సాహం తీసుకువస్తూ , జీవితాన్ని సంతోషంగా మారుస్తుంది. ఈ రెండు పాత్రల మధ్య వయస్సు అంతరం వినోదభరితమైన ఘర్షణలకు దారి తీస్తుంది, హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సరైన నేపథ్యాన్ని సృష్టిస్తుంది. రామలక్ష్మి గతం నుంచి కుటుంబ రహస్యాలను వెలికితీసినప్పుడు, ఈ ద్వయం సంఘటనల సుడిగుండంలో తమను తాము కనుగొంటారు, ఇది సౌకర్యం కోసం చేసుకున్న వివాహంతో ముగుస్తుంది. సీతాకాంత్ యొక్క ఖచ్చితమైన స్వభావం, రామలక్ష్మి యొక్క నిర్లక్ష్య స్ఫూర్తితో ఢీకొంటూ ప్రేమ, నవ్వు మరియు కుటుంబ బంధాలను మిళితం చేసే ప్రయాణానికి వేదికగా నిలుస్తుంది. ప్రేమంటే వయసు, అభిరుచుల తూకం కాదు , రెండు గుండెల చప్పుడు అని చెబుతుంది. స్టార్ మా లో ప్రతి సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు "ఎటో వెళ్లిపోయింది మనసు" ప్రసారమవుతుంది. -
ఫుడ్ డెలివరీ బాయ్ టాలెంట్కు మెచ్చి సాయం చేసిన రాహుల్ సిప్లిగంజ్
మధురమైన గాత్రాలను వెలికి తీసుకువచ్చే ప్రయత్నమే సింగింగ్ షో. ఇలాంటి సింగింగ్ షోలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుని, ఎన్నో అద్భుత స్వరాలను పరిచయం చేసిన "సూపర్ సింగర్" స్టార్ మాలో మళ్ళీ ప్రారంభం ప్రారంభమైంది. టాలెంట్ ఉంటే చాలు ఎవరైనా అనుకున్న స్థానానికి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు.. విభిన్నమైన ఆలోచనతో, విలక్షణమైన వాయిస్లతో వడపోసిన స్వరాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాక అమెరికా, కేరళ నుంచి కూడా వచ్చి ఈ పోటీలలో పాల్గొన్నారు. సంగీతం మీద ఆసక్తితో, తమను తాము నిరూపించుకోవాలన్న ఆకాంక్షతో సుమారు 20 మంది కంటెస్టెంట్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. యాంకర్ శ్రీముఖి ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా గాయని శ్వేతా మోహన్, మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, గేయ రచయిత అనంత శ్రీరామ్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్లో వెంకటేష్ అనే ఓ కంటెస్టెంట్ రాహుల్ సిప్లిగంజ్ను మెప్పించాడు. కృష్ణార్జున యుద్దం సినిమాలోని 'దారి చూడు మామ దుమ్ము చూడు మామ' అనే పాటతో అక్కడ జడ్జీలను మెప్పించాడు. ఆ పాట పాడిన వెంకటేష్ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూనే మ్యూజిక్ నేర్చుకుంటున్నట్లు స్టేజీ మీద తన కష్టాలను చెప్పుకున్నాడు. దీంతో రాహుల్ సిప్లిగంజ్ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఆ యువకుడి కష్టాన్ని మెచ్చుకున్నాడు. గతంలో తాను కూడా ఒక బార్బర్ షాప్లో పని చేస్తూనే పాటలు పాడటం నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నాడు.కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటిని తట్టుకుని ఇలా ముందుకు రావడం అంత సులభం కాదని రాహుల్ చెప్పాడు. ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ సంగీతం కోసం కష్టపడుతున్న వెంకటేష్కు లక్ష రూపాయలు సాయం చేశాడు రాహుల్.వాస్తవంగా ఆ యువకుడిలో కూడ మంచి టాలెంట్ ఉంది.అతను పాడిన పాట కూడా ప్రేక్షకులను మెప్పిస్తుంది. View this post on Instagram A post shared by STAR MAA (@starmaa) -
ఆకట్టుకుంటున్న ‘స్టార్ మా’పవర్ అవర్
‘స్టార్ మా’ పవర్ అవర్ విజయవంతంగా ప్రారంభించి టెలివిజన్ హిస్టరీలో ఎంతో ఆకట్టుకునే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "సత్యభామ" మరియు "ఊర్వసి వో రాక్షసి వో" షోలు ఉన్నాయి. డిసెంబర్ 18న ప్రీమియర్, పవర్ అవర్ రాత్రి 9:30 గంటలకు "సత్యభామ"తో ప్రారంభమైంది. ఆ తర్వాత రాత్రి 10:00 గంటలకు "ఊర్వసి వో రాక్షసి వో" ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారం అవుతుంది. ప్రముఖ టెలివిజన్ జంట యష్, వేద నటించిన ‘సత్యభామ’ డిసెంబర్ 18న రాత్రి 9:30 గంటలకు ప్రారంభమైంది. రాత్రి 10:00 గంటలకు ‘ఊర్వసి వో రాక్షసి వో’ శైలిని పునర్నిర్వచించటానికి హామీ ఇచ్చే గ్రిప్పింగ్ రివెంజ్ డ్రామా. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9:30 నుండి 10:30 గంటల వరకు పవర్ అవర్ సమయంలో “సత్యభామ” మరియు “ఊర్వసి వో రాక్షసి వో” యొక్క బ్యాక్-టు-బ్యాక్ ఉత్సాహాన్ని అనుభవించడానికి ఆడియన్స్ ను స్టార్ మా ఆహ్వానిస్తోంది. -
అభిమానులతో బతుకమ్మ ఆడిన 'స్టార్ మా' నటీనటులు
దసరా, బతుకమ్మ పండుగ సంబరాల్లో తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్, స్టార్ మాకు సంబంధించిన సీరియల్ నటులు సందడి చేశారు. తమ అభిమాన ప్రేక్షకులతో కలిసి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాలలో ఉనన దుర్గా పూజా మండపాల వద్ద సందడి చేశారు. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ప్రముఖ షోలు 'పలుకే బంగారమాయెనా, నాగ పంచమి'లలో నటించిన ప్రముఖ నటీనటులు తాజాగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో తమ అభిమానులను కలుసుకున్నారు. దీంతో వారందరూ ఎంతగానో సంతోషించారు. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న దుర్గా పూజా మండపాల వద్ద బతుకమ్మ ఆడటమే కాకుండా పలు సినిమాల సూపర్ హిట్ పాటలు పాడుతూ డ్యాన్స్లు చేశారు. అనంతరం వారితో ఫ్యాన్స్ సెల్ఫీలు తీసుకోవడమే కాకుండా పలు బహుమతులను కూడా అందుకున్నారు. ఇలా సమిష్టి స్ఫూర్తిని చాటుతూ కళాకారులు తమ అభిమానులతో ఆనందోత్సాహాలతో మెప్పించారు. ఇలా తమను అభిమానిస్తున్న ప్రేక్షకులతో ఇలా బంధాన్ని పెంపొందించుకోవడంతో పాటు.. ప్రతి పండుగను ఇలా సంతోషకరమైన అనుభూతిగా మార్చడానికి స్టార్ మా ఎప్పటికీ కట్టుబడి ఉందిని వారు తెలిపారు. దసరా, బతుకమ్మ వేడుకల సందర్భంగా స్టార్ మా నటీనటులను ఇలా ప్రేక్షకులకు మరింత చేరువ చేసేందుకు ఛానెల్ చేస్తున్న ప్రయత్నం చెప్పుకోతగినదని పేర్కొన్నారు. -
తల్లికి దూరమైన కుమారుడు ఏమయ్యాడు?.. ఆసక్తి పెంచుతోన్న సీరియల్!
అమ్మ అంటే దైవం. అమ్మ మన కళ్లు ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకి దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? ఇదే "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ కథ. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోంది. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. అనుబంధం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో ఈ పాత్రలు చెబుతాయి. ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ సన్నివేశాలు చెబుతాయి. కఠినమైన మనసుని కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని ఈ కథనం వివరిస్తుంది. అక్టోబర్ 2 నుంచి రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది. దారి తప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం.. ఆ తల్లికి, కుమారుడికి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ, కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోంది. ఒక పసివాడు తల్లి కోసం ఎంత ఆరాట పడతాడో.. తల్లి ఒకసారి కనిపిస్తే బాగుండు అని ఎంతగా కోరుకున్నాడో.. అతని తరవాతి జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే "గుండె నిండా గుడి గంటలు" చూడాల్సిందే. -
పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'!
తెలుగు రాష్ట్రాలలో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోన్న స్టార్ మాలో మరో కొత్త సీరియల్ వచ్చేసింది. సరికొత్త కథనంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు "మామగారు" అనే సరికొత్త సీరియల్తో పలకరించింది. ఈ నెల 11 నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే వినూత్నమైన కథనం కలిగిన ఈ సీరియల్.. అహంకారానికి - ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉండనుంది. డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని.. ఉన్నత వుద్యోగం చేసి వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే యువతి గంగ. బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ఒక పెద్ద కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టాలని కోరుకుంటుంది ఆమె. చెంగయ్య , ఓ పెద్ద మనిషి. పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. తన మాటే చెల్లుబాటు కావాలనుకునే పంతం కలిగిన వ్యక్తి. ఆయన మూడో కుమారుడైన గంగాధరన్కు చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నతనంలోనే ఎలక్ట్రీషియన్గా పనికి వెళ్లాడు. తండ్రి చేత తిట్లు తినే అతను, ఈ బాధ ల నుంచి విముక్తి కావాలనుకుంటూ తప్పుడు సర్టిఫికెట్లు తో దుబాయ్కి వెళ్లాలని ప్రణాళిక చేస్తాడు. అయితే, అతను ఫోర్జరీ చేయాలనుకున్నది గంగకు చెందిన సర్టిఫికేట్లు కావటం... ఈ విషయం తెలిసి గంగ ఫిర్యాదు చేయటం తో , ప్రభుత్వం గంగాధరన్ పాస్పోర్ట్ను నిషేదిస్తుంది. పెళ్లి చేస్తే అయినా తమ కుమారుడు గంగాధరన్ మారతాడని భావించి.. చెంగయ్య తన సోదరి కుమార్తె సుభద్రతో గంగాధరన్కు వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ సుభద్ర గంగాధరన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. అయినప్పటికీ చెంగయ్య పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. తన స్నేహితుడి కుమార్తె గంగతో గంగాధరన్ పెళ్లి చేయాలని చెంగయ్య ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో గంగ తండ్రికి ప్రాణాపాయస్థితి ఏర్పడటం... డబ్బుకు ఇబ్బంది పడుతున్న గంగకు ధన సహాయం చేసి ఆమె తండ్రిని కాపాడి బదులుగా తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. తమ కూతురును చెంగయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చిన గంగ తండ్రి, పెళ్లయ్యాక కూడా గంగను చదివించాలని కోరతాడు. ఇంట్లో ఆడపిల్లలెవరూ పెద్దగా చదువుకోకూడదని నిషేధం విధించిన చెంగయ్య .. సరేనంటూ తల ఊపుతాడు. నిజానికి పితృ స్వామ్య స్వభావం నరనరాన జీర్ణించుకున్న చెంగయ్య.. తన భార్య డాక్టర్ అనే సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనియ్యడు. అలాంటి వాడు తన కోడలిని చదువుకోనిస్తాడా ? అనేది సీరియల్ చూస్తేనే తెలుస్తుంది. తానెవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా తెలియని గంగాధరన్, మంగళసూత్రం కట్టేటప్పుడు గంగ ముఖం చూస్తాడు. తన దుబాయ్ కలలు కల్లలు కావటానికి కారణమైన గంగను భార్యగా గంగాధరన్ అంగీకరించాడా ? ఒక పెద్ద ఇంటికి కోడలు కావాలనే కల సాకారమైనందుకు సంతోషంగా కొత్త ఇంటికి అడుగు పెట్టిన గంగ.. ఒక వైపు తనను అసహ్యించుకునే భర్త, మరోవైపు స్త్రీలను బానిసలుగా భావించే మామగారు... నడుమ తన కలను సాకారం చేసుకోవటానికి ఎలా పోరాడుతుంది ? ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో మామగారు సీరియల్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేసింది. -
‘స్టార్ మా’లో సరికొత్త సీరియల్
భవిష్యత్తు ఎన్నో కలలను చూపిస్తుంది. ఎన్నో ఆశలను నేర్పిస్తుంది. ఏదో సాధించగలమన్న నమ్మకాన్ని ఇస్తుంది. ఈ కథతో స్టార్ మా ప్రారంభిస్తున్న సరికొత్త సీరియల్ "పలుకే బంగారమాయెనా". పుట్టుకతోపరాజితులే గానీ పట్టుదలతో ఇద్దరూ విజేతలుగా ఎలానిలబడ్డారు అనే విలక్షణ మైన కథ తో ఆగష్టు 21 నుంచి మ.1.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది ఈ సీరియల్. ‘గెలుపే గమ్యమైన ఇద్దరి ప్రయాణం లో ఎన్ని మలుపులు, ఎన్నిమజిలీలు ఉంటాయో.. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఉంటాయో చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఏదో సాధించాలనేతపన ఉన్నా తన లోపం వల్ల ఆమె ముందడుగు వేయలేనినిస్సహాయ పరిస్థితి. అయితే, ఆమె జీవితం లోకి అతని రాక ఒకమలుపు కాదు.. అనుకోని మజిలీ. అతని ప్రేమ, ప్రేరణ ఆమెఆశయాన్ని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడాయి. పెంచి పెద్దచేసాయి. అతని సహాయ సహకారాలు ఈ అమ్మాయి అనుకున్నఉన్నత స్థానానికి ఎలా తీసుకువెళ్లాయి అనేది "పలుకేబంగారమాయెనా" కథ’ అని సీరియల్ బృందం పేర్కొంది. -
బిగ్బాస్-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్ అర్థం ఇదేనా?
బుల్లితెరపై బిగ్బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లు పూర్తికాగా, త్వరలోనే బిగ్బాస్-7 ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ను మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా బిగ్బాస్ -7 ప్రోమోను 'స్టార్ మా' విడుదల చేసింది. ఈసారి కూడా నాగార్జుననే హోస్ట్గా ఎంట్రీ ఇచ్చారు. ఇలా అభిమానులకు బిగ్బాస్ టీమ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఓటీటీ వేదికైన డిస్నీ+ హాట్స్టార్లోనూ ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. (ఇదీ చదవండి: హీరోయిన్ వైష్ణవి పక్కన నటించిన ఈ 'బేబీ' గురించి తెలుసా..?) సీజన్ 1లో ఎన్టీఆర్, సీజన్ 2లో నాని హోస్ట్గా సందడి చేసిన సంగతి తెలిసిందే. తర్వాత వచ్చిన అన్ని సీజన్ల వరకు అక్కినేని నాగార్జున హోస్ట్గా మెప్పంచిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా 7వ సీజన్లో నాగ్నే హోస్ట్గా ఎంట్రీ ఇచ్చేశారు. ఈ ప్రోమోలో నాగ్ లుక్ అదిరిపోయింది. ఆగష్టు చివరి వారంలో బిగ్ బాస్-7 జర్నీ ప్రారంభం కానున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: 50 దాటేసిన వరలక్ష్మి ... అప్పట్లో ఈ బ్లాక్ బస్టర్ సినిమా చేసుంటేనా?) ఈసారి షో చాలా కొత్తగా ఉంటుందని ఈ ప్రోమోలో నాగార్జున చెప్పారు... ప్రతిసారి ఇదే డైలాగ్ కదా చెప్పేది అని. మరో డైలాగ్ అందుకుంటాడు. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటూ ప్రోమోతో నాగ్ ముందుకు వచ్చాడు. ఈ డైలాగ్తో కంటెస్టెంట్లను కొంతమేరకు డైలామాలో పడేశాడు. అంటే ఈసారి షో రొటిన్గా కాకుండా రూట్ మార్చాలనే ప్లాన్లో ఉన్నట్లు అర్థం అవుతుంది. గత ఆరు సీజన్ల మాదిరి అవే టాస్క్లు కాకుండా కొంచెం కొత్తగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు ఆడియన్స్ ఊహకు కూడా అందకుండా షో రన్ చేయాలిని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. -
Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్ ఏం చెప్పారంటే
బుల్లితెరపై బిగ్బాస్ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్లు పూర్తికాగా, త్వరలోనే బిగ్బాస్-7 ప్రారంభం కానుంది. అందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు కాబట్టి ఈసారి సీజన్ ఉంటుందా..? అనే సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. కానీ అభిమానులకు బిగ్బాస్ టీమ్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి అప్డేట్ లేకుండా ప్రోమోను రిలీజ్ చేసింది. (ఇదీ చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు) BB7 తెలుగుతో మళ్లీ వచ్చేస్తున్నామని ఈసారి వినోదం పూర్తి ప్యాకేజీ ఉంటుందని టీమ్ తెలిపింది. ఈ సీజన్లో అభిమానులకు ఎమోషన్స్తో పాటు సర్ప్రైజ్లు ఉంటాయని మేకర్స్ చెప్పారు. ఈ సీజన్లో ఎన్నో థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉండనున్నట్లు వారు చెప్పారు. ఓరకంగా అభిమానుల్ని రోలర్కోస్టర్ రైడ్లోకి తీసుకెళ్తుందని మేకర్స్ తెలుపుతూ ప్రోమోను విడుదల చేశారు. కాబట్టి ఈసారి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈ సీజన్కు కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్గా చేయనున్నారని తెలుస్తొంది. -
టీఆర్పీలో రికార్డు సృష్టించిన స్టార్ మా.. ఆ ఛానల్స్ను వెనక్కు నెట్టి..
స్టార్ మా చానల్స్ కొత్త చరిత్ర సృష్టించాయి. బార్క్ 13వ వారం రేటింగ్స్లో అత్యధిక రేటింగ్స్ సాధించింది స్టార్ మా. ప్రైమ్ టైమ్ తోపాటు నాన్ ప్రైమ్ ట్రైమ్లో కూడా ఇతర జీఈసీ ఛానెల్స్ రేటింగ్స్ దాటేసింది. 13వ వారం మొత్తమ్మీద స్టార్ మాకు 882 జీఆర్పీల రేటింగ్ వచ్చింది. స్టార్ మా ప్రైమ్టైమ్ జీఆర్పీ లలో 342 , నాన్ ప్రైమ్ టైమ్లో 510 సాధించింది. నూతన సీరియళ్ల లాంచ్ లోనూ స్టార్ మా తన ఆధిపత్యం చాటింది. తెలుగు ఛానెల్స్ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద మరే ఇతర భాషలోని వినోద ఛానెల్స్ సాధించలేని అరుదైన రికార్డు సాధించింది. ఇటీవలే స్టార్ మాలో ప్రారంభమైన నాగపంచమి, బ్రహ్మముడి సీరియల్స్ గత రికార్డులన్నింటినీ తిరగరాశాయి. గత మూడేళ్లగా కొనసాగుతున్న రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ నాగపంచమి సీరియల్ 11556 ('000 ఏఎంఏ), బ్రహ్మముడి సీరియల్ 10372.2('000 ఏఎంఏ) సాధించింది. ఈ రికార్డులకు దూరంగా సన్టీవీలో ప్రారంభమైన వనథై పోలా 9661.2 ('000 ఏఎంఏ); స్టార్ ప్లస్లో ప్రారంభమైన ఇమ్లీ 8814.1 ('000 ఏఎంఏ), కలర్స్లో నాగిన్ - 5 సీజన్ 8700.5 ('000 ఏఎంఏ) తరువాత స్థానాలలో నిలిచాయి. ఇక స్టార్ మా మూవీస్ , జెమినీ టీవీని వెనక్కి నెట్టి 228 జీఆర్పీల రేటింగ్ సాధించింది. ఇండియాలో నెంబర్1 మ్యూజిక్ ఛానెల్గా స్టార్ మా మ్యూజిక్ స్పష్టమైన ఆధిక్యతను ఇతర మ్యూజిక్ ఛానెల్స్పై చూపింది. -
సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్
షూటింగ్ సెట్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. బుల్లితెర హీరో, నటుడుపై సిబ్బంది చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘స్టార్ మా’ ధారావాహిక సావిత్రమ్మ గారి అబ్బాయితో తెలుగులో గుర్తింపు పొందిన నటున్ చందన్ కుమార్. ప్రస్తుతం అతడు తెలుగులో ‘శ్రీమతి శ్రీనివాస్’ సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేడు జరిగిన షూటింగ్లో చందన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. సీరియల్కు పనిచేస్తున్న ఓ టెక్నిషియన్ను నానాబూతులు తిడుతూ నోరుపారేసుకున్నాడు. దీంతో యూనిట్ అంతా తిరగబడ్డారు. ఈ క్రమంలోనే తన మదర్ను దూషించాడంటూ ఓ టెక్నిషియన్ చందన్ చెంప చెల్లుమనిపించాడు. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై అంతేకాదు అతనిపై మాటల దాడికి దిగారు. ఇక అక్కడే ఉన్న మిగతా సిబ్బంది చందన్తో చేత టెక్నిషియన్కు క్షమాపణలు చెప్పించారు. అనకూడని మాటలు అన్నాడు, నా తల్లిని దూషించాడు ఇప్పుడు సారీ చెబితే ఊరుకుంటామా అని సదరు సిబ్బంది వాదించాడు. ఇలా నటుడు చందన్ ఓవరాక్షన్ చేసి చెంప దెబ్బతిన్న వీడియో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. కాగా చందన్ కన్నడ పరిశ్రమలో ఎంతోకాలంగా యాక్టివ్గా ఉన్నాడు. చందన్ హీరోగా, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్గా ప్రేమ బరహా చిత్రం కూడా వచ్చింది. ‘రాధా కళ్యాణ’, ‘లక్ష్మీ బారమ్మ’ వంటి కన్నడ సీరియల్స్తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత -
"నువ్వు నేను ప్రేమ" అంటున్న స్టార్ మా!
ఇద్దరు మనుషులు ప్రేమగా ఎదురుపడితే, ఒకరినొకరు ఇష్టపడితే ప్రేమ పుడుతుంది. సాధారణంగా జరిగేది ఇదే. కానీ అస్సలు ఇష్టపడే ఛాన్స్ లేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? ఇదే స్టార్ మా సరికొత్త సీరియల్ కథ. అదే "నువ్వు నేను ప్రేమ". ఇద్దరి మధ్య శత్రుత్వం సంధించే చాలా కష్టమైన ప్రశ్నలకు అర్ధవంతమైన సమాధానాలు ఇవ్వబోతోంది ఈ సీరియల్ "నువ్వు నేను ప్రేమ". జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి, జీవితం అంటే డబ్బు సంపాదించడమే అనుకునే అబ్బాయికి మధ్య ఒక బంధం ఏర్పడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేదే సింపుల్ గా ఈ సీరియల్ కథ. విభిన్నమైన మనస్తత్వాల మధ్య మొదలయ్యే సంఘర్షణ ఎటు దారితీస్తుందో తెలియని ప్రయాణం చేస్తున్న ఇద్దరి మనుషుల కథ ఇది. స్టార్ మా లో ఈరోజు సాయంత్రం 06.30 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం అవుతుంది.ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ బ్రాడ్ కాస్ట్ అవుతుంది. (అడ్వర్టోరియల్) "నువ్వు నేను ప్రేమ" ప్రోమో👇 -
నేను కడుపులో ఉండగానే అమ్మను వదిలేశాడు : 'కస్తూరి' నటి
Kasturi Serial Heroine Aishwarya Gets Emotional: ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో ఎన్నో కథలు, వ్యధలు కనిపిస్తుంటాయి. తెరపై కనిపించే నవ్వుల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా స్క్రీన్ ముందుకు వచ్చేసరికి అన్నీ మర్చిపోయి సరదాగా కనిపిస్తుంటారు. తాజాగా ఓ షోలో పాల్గొన్న పాపులర్ సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, తేజస్విని తమ జీవితంలో జరిగిన చేదు సంఘటనల్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. స్టార్మాలో ప్రసారం అవుతున్న ‘కస్తూరి’, ‘C/O అనసూయ’సీరియల్స్తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న తేజస్విని(శివాణి), ఐశ్వర్య(కస్తూరి)లు తమ జీవితాల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ గురించి ఓపెన్ అయ్యారు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగానని, ఆఖిరికి తన తండ్రి చివరిచూపుకు కూడా నోచుకోలేదని నటి తేజస్విని పేర్కొంది. 'ఇంటర్లో ఉండగా మా నాన్న చనిపోయారు. అప్పటివరకు తెలియదు. ఆరోజు రాత్రంతా జర్నీ చేసి ఊరెళ్లాను. అప్పటికే అన్నీ చేసేశారు. ఆయన చనిపోయేవరకు కూడా నాన్న ప్రేమను పొందలేకపోయాను. నా జీవితంలో చాలా కోల్పోయాను' అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక కస్తూరి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య తన తండ్రి చేసిన మోసాన్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యింది. 'నేను కడుపులో ఉండగానే మా నాన్న అమ్మని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి అమ్మ నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఇష్టం లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి? ఒక ఆడదాన్ని జీవితాన్ని ఎందుకు పాడు చేయాలి? దయచేసి మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి.. ఇలా ఒక ఆడదాని జీవితాన్ని పాడుచేయకండి ప్లీజ్' అంటూ చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకుంది. -
రెండేళ్ల తర్వాత మళ్లీ కలిసిన రవి-శ్రీముఖి.. ఫోటోలు లీక్
Anchor Ravi And Sreemukhi Reunited After 2 Years Pics Goes Viral: యాంకర్ రవి.. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్గా సత్తా చాటుతున్నాడు. 'సమ్థింగ్ స్పెషల్' అనే ప్రోగ్రాం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రవి ఆ తర్వాత శ్రీముఖితో కలిసి చేసిన పటాస్ షోతో మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. స్టేజ్పై వీరిద్దరి టైమింగ్, కెమిస్ట్రీకి ఎంతోమంది అభిమానులున్నారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి ఏమైందేమో కానీ వీరిద్దరి జోడీ మళ్లీ ఎక్కడా కనిపించలేదు. దీంతో విబేధాల కారణంగానే వీరు కలిసి యాంకరింగ్ చేయడం లేదనే వార్తలు పుట్టుకొచ్చాయి. దీనిపై ఇంతవరకు ఈ జోడీ స్పందించలేదు. అయితే తాజాగా దాదాపు రెండేళ్ల అనంతరం వీరిద్దరు మళ్లీ కలిసినట్లు తెలుస్తుంది. బిగ్బాస్ మహోత్సవం అనే ఓ షో కోసం వీరిద్దరు కలిసి యాంకరింగ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రవి-శ్రీముఖి మళ్లీ కలిసిపోయారంటూ ప్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
బిగ్బాస్ గ్రాండ్ ప్రీమియర్..సెప్టెంబర్ 5న ప్రారంభం
వినోద ప్రియులు మరీ ముఖ్యంగా రియాల్టీ షో ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న, స్టార్ మా యొక్క ప్రతిష్టాత్మక రియాల్టీ షో బిగ్బాస్ మరో మారు తెలుగు ప్రేక్షకులకు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ ఐదవ సీజన్ గ్రాండ్ ప్రీమియర్ 'స్టార్ మా' ఛానెల్లో సెప్టెంబర్ 05, సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. గత సీజన్ గ్రాండ్ ఫైనల్.. భారతదేశంలో మరే రియాల్టీ షో కూడా సాధించలేనట్టి రీతిలో అత్యధిక వీక్షణ రేటింగ్ను సాధించి రికార్డులను సృష్టించింది. ఆ రికార్డులను తిరగరాసే రీతిలో ఈ సారి బిగ్బాస్ షో ఉండనుంది. బిగ్బాస్ తెలుగుకు సంబంధించి ఓ సీజన్ ముగింపు రాత్రే తరువాత సీజన్కు సంబంధించిన చర్చ కూడా ఆరంభమవుతుంటుంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ప్రచారాన్ని రూపొందించారు. ఈ షో తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందోనంటూ ఎదురుచూసున్న అభిమానుల జీవితాల్లో పూర్తి వినోదాన్ని తీసుకువస్తామంటూ ఈ ప్రచారం జరిగింది. ''స్టార్ మా ఇప్పుడు అత్యున్నత శిఖరాలను చేరుకుంది. మా వీక్షకులు మా పట్ల చూపుతున్న ప్రేమ, ఆదరాభిమానాలే దీనికి కారణం. అగ్రశ్రేణి ఛానెల్స్ సరసన మేము నిలిచాం. తద్వారా దేశంలో ప్రాంతీయ ఛానెల్ శక్తిని ప్రదర్శించాం. బిగ్బాస్ తెలుగు మరో సీజన్ను తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. నేడు మా దగ్గర ఉన్న ఉత్సాహపూరితమైన షోలలో బిగ్ బాస్ ఒకటి. వీక్షకులకు 100 రోజులకు పైగా వినోదాన్ని ఇది అందిస్తుంది. తెలుగు వీక్షకుల నడుమ ఇది అపూర్వ ఆదరణను సొంతం చేసుకుంది..’’ అని స్టార్ మా అధికార ప్రతినిధి అన్నారు. అక్కినేని నాగార్జున ఈ సీజన్కు హోస్ట్గా వ్యవహరిస్తుండటంతో పాటుగా డ్రామా, రొమాన్స్, యాక్షన్, వినోదంను నూతన టాస్క్లు, ఆసక్తికరమైన పోటీదారులతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదం అందించనున్నారు. బిగ్బాస్ ఐదవ సీజన్కు హోస్ట్ చేయడం గురించి నాగార్జున మాట్లాడుతూ ‘‘గత కొద్ది నెలలు ప్రతి ఒక్కరికీ సవాల్గా నిలిచాయి. ఈ షోతో మా అభిమానుల జీవితాలలో ఆనందం, ఉల్లాసం తిరిగి తీసుకురావాలనేది మా ప్రయత్నం. ఓ నటునిగా, పోటీదారుల వాస్తవ భావాలను వెలుపలికి తీసుకురావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తద్వారా వారిని మరింతగా ప్రేక్షకులు అర్థం చేసుకోగలరు. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించే ఈ షోలో భాగం కావడం పట్ల నేను సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు. అంతర్జాతీయంగా అత్యంత విజయవంతమైన నాన్ ఫిక్షన్ ఫార్మాట్లలో బిగ్ బాస్ ఒకటి. భారతదేశంలో ఏడు భాషలలో 37 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఎండెమోల్షైన్ గ్రూప్ సొంతం.బిగ్బాస్ తెలుగు–సీజన్ 5, స్టార్మాలో సెప్టెంబర్05, సాయంత్రం 6 గంటలకు తొలిసారి ప్రసారం అవుతుంది. అనంతరం 15 వారాల పాటు రాత్రి 10 గంటలకు సోమవారం–శుక్రవారం వరకూ మరియు రాత్రి 9 గంటలకు శని–ఆదివారాలలో ప్రసారమవుతుంది. -
"అమ్మకు తెలియని కోయిలమ్మ" స్టార్ మాలో
విలక్షణమైన కథలు, వినూత్నమైన కథనాలతో ప్రేక్షకులకు విభిన్నమైన ధారావాహికలను అందిస్తున్న స్టార్ మా.. ఇప్పుడు మరో సరికొత్త కథని సీరియల్ గా అందిస్తోంది. ఆ కథ పేరు "అమ్మకు తెలియని కోయిలమ్మ". అనుబంధాల మధ్య సంఘర్షణ, ఆప్యాయతల మధ్య దూరాలు పెరిగి ఎవరి కథ ఎలా షాక్ ఇవ్వబోతోంది ? ఎవరి కథ ఎందుకలా అయింది ? అసలు ఎందుకు ఇలా జరిగింది ? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం "అమ్మకు తెలియని కోయిలమ్మ". అమ్మకీ కోయిలమ్మకీ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో .. అనుబంధాల ఆధారంగా విశ్లేషించే కథ ఇది. తెలుగు సినిమాల్లో ఎన్నో ముఖ్యమైన కేరక్టర్స్ చేసిన మంజు భార్గవి ఈ కథలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ నటులు చిన్నా, వినోద్ బాల, అశ్వని గౌడ ముఖ్యమైన కేరక్టర్స్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోయిన్ గా కావ్యశ్రీ నటిస్తున్నారు. జులై 19 న రాత్రి 9.30 గంటల నుంచి స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టార్ మా ప్రేక్షకుల్ని అలరించబోతోంది. -
‘పాపే మా జీవనజ్యోతి’ అంటోంది స్టార్ మా
స్టార్ మా సరికొత్త భావోద్వేగాలతో కూడిన ఓ కొత్త కథ తో సరికొత్త ధారావాహిక రూపొందించింది. ఈ సారి అమ్మ అనే ఎమోషన్ తో వినూత్నమైన కథను అందిస్తోంది. ఆ సీరియల్ పేరు "పాపే మా జీవనజ్యోతి". టైటిల్ లో జీవన పాప అయితే, జ్యోతి తల్లి. ఆనందంగా సంతోషంగా వున్న ఓ పెద్ద కుటుంబం.. అందులో అందరికీ ముద్దుల మురిపాలు పంచే ఓ పాప. కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఆడపిల్ల లేని లోటు తీర్చిన పాప ఆ అమ్మాయి. దానితో ఇంట్లో అందరూ కంటికి రెప్పలా చూసుకుంటూ వుంటారు ఆ పాపని. కానీ ఇంతలోనే ఊహించని సంఘటన. కొన్ని కారణాల వాళ్ళ ఆ పాప ఇంటి నుంచి మిస్ అయింది. ఎవరో ఎత్తుకుపోయారు. ఏ తల్లి సహించలేనిది. ఏ కుటుంబం భరించలేనిది. ఇంతకీ ఎవరి పని ఇది? తరవాత పరిస్థితులు ఎలా మారాయి? పాప ఏమైంది? ఎవరి చేతుల్లో వుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. అన్నిటికీ జవాబులిస్తుంది "పాపే మా జీవనజ్యోతి" సీరియల్. పల్లవి, ప్రీతమ్, ప్రీతీ నిగమ్ తదితరులు నటిస్తున్న ఈ ధారావాహికని శాండల్ వుడ్ మీడియా నిర్మిస్తోంది. మాధవ్ దర్శకులు. ఏప్రిల్ 26 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మా లో ఈ ధారావాహికి ప్రసారం అవుతుంది. -
ప్రేమని నిలబెట్టుకునేందుకే ఆ జంట ఏం చేస్తుందంటే..
ఎవరు భర్త అవుతారో, ఎవరు భార్యగా వస్తారో తెలియకపోవడమే జీవితంలో మేజిక్. ఆ తరవాత ఒకరికోసం ఒకరు అనే భావన ఏర్పరచుకోవడం మరో మేజిక్. 'స్టార్ మా' సరికొత్తగా ప్రారంభించబోతున్న ధారావాహిక కోసం ముందుగా విడుదల చేసిన పాట సంచలనం సృష్టిస్తుంది. ఇది కేవలం రెండు ముఖ్యమైన పాత్రల పరిచయం. ఏ సిరులూ తన సుగుణాలతో సరితూగవని అమ్మాయి... నా కలలను నీ కనులతో చూడాలని ఆశ పడే అబ్బాయి... ఎంత అందంగా వుంది ఈ ఊహ. పాత్రల పరంగా అది పూర్తిగా నిజం. అలా పాట అంతా జీవితాన్ని అందమైన కోణం లో చూసిన ఇద్దరి ఆలోచనలు వినిపిస్తాయి. కనిపిస్తాయి. ఆ ప్రేమని నిలబెట్టుకునేందుకే ఆ జంట ప్రయత్నించి నిలబడుతుంది. ఈ నెల 22న (సోమవారం) ఈ సీరియల్ ప్రారంభం అవుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది. చదవండి : చిరంజీవి పాటకు స్టెప్పులేసిన బిగ్బాస్ భామ, ఫ్యాన్స్ ఫిదా -
చిరంజీవి పాటకు స్టెప్పులేసిన బిగ్బాస్ భామ, ఫ్యాన్స్ ఫిదా
మోనాల్ గజ్జర్.. ఒకప్పుడు ఎవరికి తెలియదు. హీరోయిన్గా ఎన్ని సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒక్కసారిగా బిగ్బాస్ షోతో వచ్చేసింది. ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్గా తెలుగు బిగ్ బాస్ 4 సిజన్లో కంటెస్టెంట్గా హౌజ్లో అడుగుపెట్టిన ఈ గుజరాతి భామ ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతోంది. 98 రోజుల పాటు హౌజ్లో కొనసాగి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దీంతో బయటకు రాగానే మోనాల్కు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అంతేగాక దర్శక నిర్మాతల నుంచి ఆమెకు వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇటీవల వచ్చిన ‘అల్లుడు అదుర్స్’లో స్పెషల్ సాంగ్లో ఆడిపాడిన సంగతి తెలిసిందే. ఇందులో మోనాల్ డ్యాన్స్, ఎక్స్ప్రెషన్కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు. ఆ తర్వాత స్టార్ మాలో వస్తున్న డ్యాన్స్ ప్లస్ రియాలిటీ షోకు మెంటర్గా చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా స్టేజ్పై కాలు కదుపుతోంది ఈ భామ. ఈ క్రమంలో తాజాగా స్టార్ మా డ్యాన్స్ ప్లస్ షో ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో మోనాల్ డ్యాన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మెగాస్టార్ చిరు-రోజాల సూపర్ హిట్ సాంగ్ మావ మావ పాటకు బాబా భాస్కర్ మాస్టర్తో కలిసి ఆకుపచ్చ రంగు చీరలో మోనాలు చిందులేసింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక జియా చార్లీ చాప్లీస్గా అందరిని ఆకట్టుకొగా బాబా భాస్కర్, యశ్, రఘు మాస్టర్లు ఒక గ్రూప్గా, అనీ మాస్టర్, ముమైత్ ఖాన్, మోనాల్ ఒక గ్రూప్గా పంజా మూవీలో ఐటెం సాంగ్ వెయ్రా చెయ్యి వేయ్రా పాటకు డ్యాన్స్ చేసి స్టేజ్పై రచ్చరచ్చ చేశారు. చదవండి: సోషల్ హల్చల్: కళ్లతో కైపెక్కిస్తోన్న భామలు ఏకధాటిగా 21 గంటలు షూటింగ్లో పాల్గొన్నా -
‘స్టార్ మా’ లో నయనతార కొత్త వేషం..!
ఆదివారాలు పాజ్ బటన్తో వస్తే ఎంత బావుంటుంది అన్నాడో ఆంగ్లేయుడు. కానీ కాలాన్ని మనం ఎలాగూ ఆపలేం. అయితే సమయాన్ని మరపురానిదిగా మలుచుకోవడం మాత్రం మన చేతిలో ఉంటుంది. ‘స్టార్ మా’ ఆదివారాలు ఇదే ఫార్ములాని అనుసరిస్తోంది. ఈ ఆదివారం (7వ తేదీ) సాయంత్రం 6 గంటలకు నయనతార ప్రత్యేక పాత్రలో నటించిన "అమ్మోరు తల్లి" చిత్రాన్ని ప్రసారం చేస్తోంది. ఎన్నో మంచి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నయనతార ముక్కుపుడక అమ్మవారిగా విభిన్నమైన హావభావాలతో కనువిందు చేయబోతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా "అమ్మోరు తల్లి" చిత్రం రాబోతోంది. వినోదానికి కొత్త అర్ధం చెబుతున్న ఈ సంచలన చిత్రం ఓ వినూత్నమైన అనుభూతిని ఇవ్వనుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు "స్టార్ట్ మ్యూజిక్ " షో తో సుమ చేస్తున్న హంగామా ఆదివారానికే ఓ ప్రత్యేకం. 1.30 గంటలకు "కామెడీ స్టార్స్" చేసే పంచులు కోలాహలం అద్భుతం. మధ్యాహ్నం అంతా మజా మజా గా సాగే వినోదం.. సాయంత్రం నయనతార నట విశ్వరూపం. స్టార్ మా ప్రేక్షకులకు ఈ ఆదివారం వెరీ వెరీ స్పెషల్. చదవండి: ఆన్లైన్ క్లాసులు: షాకైన అమ్మోరు తల్లి -
కన్నులపండువగా స్టార్ మా సండే
మిగతా రోజుల కంటే ఆదివారం నాడు కాస్త ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలనిపిస్తుంది. ఎందుకంటే రోజూ కంటే ఇంట్లో గడిపే సమయం ఎక్కువ ఉంటుంది గనక, ఆదివారం 'ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం, ఆదివారాన్ని మెమరబుల్ డే ని చెయ్యడం కోసం స్టార్ మా గ్రాండ్ ఈవెంట్ “100% లవ్” రెండో భాగంతో వస్తోంది. ఫిబ్రవరి 28న సా. 6 గం.లకు స్టార్ మా లో ప్రసారం కాబోతున్న ఈ ఈవెంట్లో తెరపైన జంటలు, అసలైన జంటలు మరింతగా కనువిందు చేయబోతున్నారు. పక్కా ఎంటర్టైన్మెంట్ అనడానికి అవసరమైన అన్ని అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఈవెంట్లో స్టార్ యాంకర్ ఓంకార్ పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. సై అంటే సై అంటున్న రెండు వర్గాల్లో కప్ని ఎవరు కొట్టబోతున్నారనెది ఉత్మంఠభరితంగా ఉండబోతోంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు సుమ తన “స్టార్ మ్యూజికొతో మేజిక్, 1.30 గం.లకు కామెడీని పండించే రైతుల్లాంటి కామెడీ స్టార్స్ ఎలాగూ ప్రతి ఆదివారం టోటల్ ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్స్టైన్మెంట్ని ఇస్తూనే ఉన్నాయి. ఈ ఆదివారం స్టార్ మాలో ఓహో అనిపించే వినోదం ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉంటుంది. ఆస్వాదించడమే ఆలస్యం. -
సండే స్టార్ మా లో ప్రేమలోకం !
ప్రేమంటే రెండు అక్షరాల మహాకావ్యం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పినా చెప్పడానికి ఎంతో మిగిలే ఉంటుంది. అలాంటి ప్రేమని స్టార్ మా ఈ ఆదివారం ఓ కొత్త కోణంలో ఒక ఈవెంట్ గా అందించబోతోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ పేరు "100% లవ్". తెరపైన జంటలకీ నిజ జీవితంలో జంటలకీ మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ ఈవెంట్ లో ఎన్నో ప్రత్యేకతలు! సగటు ప్రేక్షకుడు కోరుకునే అంశాలనే ఉంటూనే కుటుంబంలో ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించడానికి "100% లవ్" అన్ని హంగులతో రాబోతోంది. సరదాగా ఆడుకునే ఆటలు, ప్రేమగా పంచుకునే మాటలు, రెండు హృదయాల మధ్య ఎన్నో స్వీట్ నథింగ్స్, ఉంగరాలు మార్చుకునే ఉద్వేగ క్షణాలు, కలిసి అడుగులు వేసే సంతోషాలు... ఇలాంటివి ఎన్నో ఈ ఈవెంట్ అందించబోతోంది. ఈ ఆదివారం (ఫిబ్రవరి 21న) సాయంత్రం 6 గంటలకు "100% లవ్" ఈవెంట్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. -
రుద్రమ దేవి ధైర్యసాహసాలతో...
కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రాణి రుద్రమదేవి ధైర్య సాహసాలను బుల్లి›తెరపై ఆవిషరించేందుకు సిద్ధమైంది స్టార్ మా ఛానెల్. బుల్లి తెరపై మునుపెన్నడూ లేని ప్రమాణాలతో ‘రుద్రమదేవి’ కథను సీరియల్ రూపంలో తీసుకొస్తున్నారు. ‘‘ఈ రుద్రమదేవి కథా కాలాన్ని యథాతథంగా తెర మీదకు తీసుకు వచ్చేందుకు వందల మంది కృషి చేశాం. ఇది మన తెలుగు కథ. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కథ’’ అని స్టార్ మా బృందం పేర్కొంది. ‘రుద్రమదేవి’ సీరియల్ జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు స్టార్ మా చానెల్లో ప్రసారం కానుంది. -
అతిపెద్ద ఆవిష్కరణగా బిగ్బాస్: నాగార్జున
బిగ్బాస్ సీజన్ 4ను హోస్ట్ చేయడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందని టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున అన్నారు. బిగ్బాస్ను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వారం కోట్లాదిమంది వీక్షకులకు వినోదం కలిగించడమే అత్యుత్తమ సంతృప్తిగా నిలుస్తుందన్నారు. కాగా స్టార్ మా అందిస్తున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్బాస్ సీజన్ 4. సెప్టెంబర్ 6న వైభవంగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి మరో రెండు వారాల్లో శుభం కార్డు పడనుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో సహా ఇప్పటి వరకు బిగ్బాస్ హౌజ్లోకి 19 అడుగు పెట్టగా ప్రస్తుతం హౌజ్లో ఆరుగురు పోటీదారులు మాత్రమే మిగిలారు. వీరంతా కూడా ఈ సంవత్సరపు టైటిల్ కోసం పోటీపడుతుండటంతో పాటుగా వీలైనంతగా వినోదాన్ని అందిస్తున్నారు. విభిన్న నేపథ్యాల నుంచి కంటెస్టెంట్లు ఉండటంతో ఈ క్లైమాక్స్ ఖచ్చితంగా వీక్షించేందుకు ఆసక్తిగా ఉండబోతుందని తెలుస్తోంది. చదవండి: నేను అర్హురాలు కాదేమో..: అరియానా ఈ సీజన్ గురించి హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ ‘‘బిగ్బాస్ ప్రతి వారం కోట్లాది మందికి వినోదం అందించడం అత్యుత్తమ సంతృప్తిని అందిస్తుంది. అదీ మహమ్మారి విజృంభణ లాంటి కష్టసమయంలో బిగ్బాస్ సీజన్ 4 గత రికార్డులను తుడిచి పెట్టేసింది. అలాగే జాతీయస్థాయిలో బిగ్బాస్ 3 సీజన్ సృష్టించిన రికార్డులను ఇది అధిగమించింది. 20+ టీవీఆర్తో ఇది బిగ్బాస్ షోలలో అతిపెద్ద ఆవిష్కరణగా నిలిచింది. గతవారం ఏపీ మరియు తెలంగాణాలలో 4 కోట్లకు పైగా వీక్షకులు దీనిని వీక్షించడం ఈ షో పట్ల వారి ప్రేమకు నిదర్శనం. గత 12 వారాలలో జంట రాష్ట్రాలలో దాదాపు 83% మంది వీక్షకులు బిగ్బాస్ సీజన్ 4 వీక్షించారు. ఇది అపూర్వం. ఇప్పుడు మేము అత్యంత ఉత్సాహ పూరితమైన దశలో ప్రవేశించాము. ఈ షో యొక్క ఫైనల్ మరింత ఆసక్తిగా ఉండబోతుంది. బిగ్బాస్ సీజన్4 ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని అన్నారు. చదవండి: మోనాల్ స్ట్రాంగ్: బాధను దిగమింగిన అవినాష్ కాగా ఇప్పటి వరకు విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. నాలుగో సీజన్లో తమ సొంత రికార్డులనే అధిగమించింది. ప్రతి వారం ఆకట్టుకునే ప్రదర్శనతో 4 జీఈసీలలో 42% వాటా (ఎస్డీ+హెచ్డీ)ను పొందింది. బిగ్బాస్లాంటి భారీ వేదికను వినియోగించుకుని స్టార్ మా ఇప్పుడు తమ ప్రైమ్ టైమ్ను ప్రతి సంవత్సరం స్ధిరీకరించుకోవడంతో పాటుగా కొన్ని నూతన బ్లాక్బస్టర్ షోలనూ ఆవిష్కరించింది. స్టార్ మా ఇప్పుడు తమ బిగ్బాస్ షో సమయాన్ని రాత్రి 10 గంటలకు మార్చింది. అదే సమయంలో తమ అతిపెద్ద ఫిక్షన్ సీరియల్ ‘వదినమ్మ’ను రాత్రి 9.30గంటలకు తీసుకువచ్చింది. దీనితో స్టార్ మా ప్రైమ్ టైమ్ రాత్రి 11 గంటల వరకూ విస్తరించడంతో పాటుగా వీక్షకులకు ప్రతి రోజూ అదనంగా అర్థగంట వినోదం అందుబాటులోకి వస్తుంది. చదవండి: హారికకు సోహైల్ వార్నింగ్: కథే వేరే ఉందిగా! చదవండి: అరియానాకు చుక్కలు చూపిస్తున్న సోహైల్ -
వినోదానికి కేరాఫ్గా మారిన స్టార్ మా
సాక్షి, హైదరాబాద్: మారుతున్న సాంకేతికత, కంటెంట్ లభ్యతతో టెలివిజన్ వినోదం దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ టెలివిజన్ దినోత్సవ వేళ సాధారణతకు భిన్నంగా అసాధారణ ప్రయాణాన్ని ఆరంభించి ట్రెండ్ సెట్టర్గా నిలిచిన స్టార్ మా ప్రయాణాన్ని చుట్టేసొద్దాం.. తెలివైన, శక్తివంతమైన వినోదంతో విజయ ప్రయాణాన్ని ఆరంభించిన స్టార్ మా గత నాలుగు సంవత్సరాలలో వినోదానికి కేరాఫ్గా మారింది. ఒక వారాన్ని మించి మరో వారం అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన తెలుగు వినోద ఛానెల్గా విశిష్ట గుర్తింపును సంపాదించుకుంది. తెలుగు వినోదాన్ని పునర్నిర్వచించిన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోల సమ్మేళనమిది. కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ కావాల్సిన సంపూర్ణ వినోదాన్నిఅందిస్తున్నందుకు స్టార్ మా గర్విస్తోంది. (చదవండి: ఐపీఎల్ 2020 : ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప) 2017 అక్టోబర్లో నెంబర్ 1 షో కార్తీక దీపంను స్టార్ మా లో ప్రారంభించారు. ఈ కథ కోట్లాది మంది ప్రేక్షకులను రంజింపజేస్తూనే, భారతదేశపు అభిమాన సీరియల్గా నిలిచింది. తమ నాల్గవ సీజన్లో ఉన్న బిగ్బాస్, ప్రతి సంవత్సరం టెలివిజన్ వీక్షకుల నడుమ ఆసక్తిని రేకిత్తిస్తోంది. కార్తీక దీపంలో దీప అయినా, గృహలక్ష్మిలో తులసి; మౌనరాగంలో అమ్ములు లేదా కేరాఫ్ అనసూయలో అనసూయ అయినా స్టార్ మా లోని ప్రతి క్యారెక్టర్, మన చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రతిబింబిస్తూనేఉంటుంది. స్టార్ మా యొక్క ట్యాగ్లైన్ ‘మీ తో మేము, మా తో మీరు’ను స్ఫురిస్తూనే ఉంటుంది.ఇక స్టార్ మా.. స్టార్ మా మ్యూజిక్, స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ ఛానళ్లను కూడా నడుపుతున్న విషయం తెలిసిందే.
Pagination
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
టీడీపీ బైరెడ్డి శబరిపై రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ మహిళా నేత..
ఎల్లో మీడియా కుట్రలు..బద్దలు కొట్టిన సీఎం జగన్..
షూటింగ్కు ఆటోలో వెళ్లిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే?
ముస్లింలకు బాబు టోపీ
క్యూట్ క్యూట్ అందాలతో అలరిస్తోన్న తాన్య రవిచంద్రన్…(ఫొటోలు)
మీ జగన్ గెలిస్తేనే స్కీములు కొనసాగింపు
May 10 Tirumala: తిరుమలలో నేటి రద్దీ
Fact Check: చంద్రబాబుకోసమే... రామోజీ నేలబారు రాతలు!
అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
తప్పక చదవండి
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
Advertisement