-
Lok sabha elections 2024: ‘రీడ్ ద లెటర్ బిట్వీన్’
ఇదేదో పజిల్లా ఉందే అనుకుంటున్నారా? నిజమే.. చిన్నపాటి పజిలే. కాకపోతే పార్టీలు ప్రచారం కోసం ఉపయోగిస్తున్న కీబోర్డు ట్రెండ్. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ కీబోర్డును మీదున్న అక్షరాలతో ఈ ట్రెండ్ను వైరల్ చేస్తున్నాయి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు. అదెలా అంటే.. నేను.. ‘‘వికసిత్ భారత్ కోసం ఎవరు ఓటు వేయనున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కీబోర్డులోని యూ అండ్ ఓ మధ్య ఉన్న లెటర్ను బిగ్గరగా చదవండి’’ అని భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఆ రెండు లెటర్స్ మధ్యనున్న అక్షరం ‘ఐ’. ఆ మెసేజ్ చదివిన ప్రతి ఒక్కరూ ‘ఐ’ అంటారు. సో... వారంతా తాము బీజేపీకి ఓటు వేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేసినట్టేనని బీజేపీ భావిస్తోంది. మేము..ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ ఈ ట్రెండ్నే అనుసరిస్తోంది. ‘‘నియంత నరేంద్ర మోదీ నుంచి భారత రాజ్యాంగాన్ని కాపాడేది ఎవరు? కీబోర్డులో క్యూ, ఆర్ మధ్య ఉన్న లెటర్స్ను చదవండి’’ అని ఎక్స్లో పోస్టు చేసింది. ఇక్కడ క్యూ, ఆర్ మధ్య ఉన్నది డబ్ల్యూ, ఈ.. రెండక్షరాలను కలిపితే ‘మేము’ అనే అర్థం వస్తుంది. మేమంతా కలిసి బీజేపీని ఓడిస్తామని సందేశాన్నిచ్చేలా ఆప్ వైరల్ చేస్తోంది. పోలీసులు సైతం.. ఈ రెండు పార్టీలిలా ఉంటే.. సురక్షితమైన డ్రైవింగ్ గురించి అవగాహన కలి్పంచేందుకు ఢిల్లీ పోలీసులు కూడా ఈ వైరల్ ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ‘‘డ్రైవింగ్ చేస్తూ మీరు కీ బోర్డును చూస్తే.. క్యూ అండ్ ఆర్ మధ్యలో లెటర్స్ (డబ్ల్యూ, ఈ) చలాన్తో మిమ్మల్ని కలుస్తాయి’’ అని ఎక్స్లో పోస్టు చేశారు. అంటే మీరు కీబోర్డు చూస్తే వి (మేము) చలాన్ వేస్తామని అర్థమన్నమాట. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంచి నిద్రకు మొబైల్ చేటు
కర్ణాటక: ఇటీవల రోజుల్లో మొబైల్ ఫోన్ లేనిదే జీవితం సాగడం లేదు. ప్రతి పనికీ మొబైల్ కావాలి. దీని వల్ల ఎంత మంచి జరిగినా, కీడు కూడా తప్పడం లేదు. మొబైల్ఫోన్ వంటి డిజిటల్ పరికరాలపై ఆధారపడిన ఐటీ సిటీ పౌరులు బంగారం లాంటి నిద్రను పాడు చేసుకుంటున్నారు. 59 శాతం మంది పౌరులు అర్ధరాత్రి వరకు నిద్ర పోవడం సాధ్యం కావడం లేదు. దీనివల్ల నిద్ర కరువై అనేక రకాల అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. 46 శాతం మంది నిద్రలేచిన తరువాత కూడా తగినంత నిద్ర లేనందున నిరాసక్తంగా ఉంటున్నారని ఒక సర్వే వెల్లడించింది. 90 శాతం మంది అదే మాట ► వేక్ పిట్కో అనే సంస్థ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్టోర్ కార్డ్స్– 2024 అనే సర్వేను విడుదల చేసింది. ఇందులో బెంగళూరు నిద్ర ప్రవృత్తి, ప్రజల మొబైల్ అలవాట్ల గురించి ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి తెచ్చింది. ► సమీక్షలో పాల్గొన్న 90 శాతం మంది.. నిద్రపోయే వరకూ మొబైల్ఫోన్ను వాడుతున్నామని తెలిపారు. ► 38 శాతం మంది రాత్రి 11 గంటల తరువాత నిద్రకు ఉపక్రమిస్తున్నారు. ► కుతూహలమైది ఏమిటంటే 29 శాతం మంది ప్రజలు తమ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ అర్ధరాత్రి వరకు మేలుకునే ఉంటారు. నిద్రను నిర్లక్ష్యం చేసేవారు పగలు ఉత్సాహం కోల్పోయి తమ పనులను సమర్థంగా చేయలేకపోతున్నారని సర్వే హెచ్చరించింది. మంచి నిద్రకు ఇది ముఖ్యం బాగా నిద్రపోవాలంటే పడుకునే గంట ముందు వరకు మొబైల్, కంప్యూటర్ తరహా డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతారు. కానీ 59 శాతం మంది నిద్రపోయే చివరి క్షణం వరకూ మొబైల్తో గడుపుతున్నారు. దీని వల్ల నిద్ర సక్రమంగా సాగదు. ఉదయాన్నే హుషారు లేకపోగా నిస్సత్తువ ఆవరిస్తుంది. దూరంగా ఉంటేనే మంచిది 28 శాతం మంది తమ పనుల వల్ల అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటామని తెలిపారు. 55 శాతం మంది డ్యూటీలో ఉన్నప్పుడు నిద్ర వస్తుందని, ఒళ్లునొప్పులు వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. 40 శాతం మంది రాత్రి మొబైల్, ల్యాప్టాప్కు దూరంగా ఉంటే మంచి నిద్ర సాధ్యమని నమ్ముతున్నారు. 23 శాతం మంది ప్రజలు మంచి బెడ్, గదిలో అలంకారం వల్ల బాగా నిద్రించవచ్చని చెప్పారు. ఏదేమైనా సిలికాన్ నగరవాసులు మొబైల్ మోజులో పడి నిద్రను అశ్రద్ధ చేస్తున్నారని వెల్లడైంది. -
ఒళ్లో పేలిన ఫోను.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో మొబైల్ ఫోన్ పేలిన ఉదంతం వెలుగు చూసింది. స్థానిక కోచింగ్ సెంటర్లో క్లాసులు జరుగుతుండగా ఒక విద్యార్థిని ఒళ్లోవున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో తరగతిలో కలకలం చెలరేగింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఆ విద్యార్థిని మొబైల్ ఫోనును బయటకు విసిరేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం హమీర్పూర్ ప్రధాన మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విద్యాసంస్థ ఉంది. ఇక్కడ దాదాపు 40 మంది చదువుకుంటున్నారు. క్లాసులో తరగతి జరుగుతుండగా ఓ విద్యార్థిని దగ్గరున్న ఫోనులో నుంచి మంటలు చెలరేగాయి దీంతో ఆమె భయంతో ఆ మొబైల్ ఫోనును మెయిన్ రోడ్డు వైపునకు విసిరేసింది. ఆ ఫోను అక్కడున్న సైన్ బోర్డుకు తగిలి పేలిపోయింది. దీంతో సైన్ బోర్డుకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత మొబైల్ ఫోను పూర్తిగా కాలిపోయింది. అనంతరం స్థానికులు అప్రమత్తమై ఆ మంటలపై బకెట్లతో నీళ్లు పోసి, ఆర్పివేశారు. భవనం మొదటి అంతస్థులో ఈ ఘటన జరిగింది. అక్కడికి సమీపంలోనే దుస్తుల దుకాణాలు ఉన్నాయి. రోడ్డుపైనో, తరగతి గదిలోనో ఆ మొబైల్ ఫోన్ పేలి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని స్థానికులు అంటున్నారు. -
పిల్లల చేతిలో హెల్ఫోన్!
సాక్షి, అమరావతి: కరోనా లాక్డౌన్, ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లల్లో సెల్ఫోన్ వినియోగం పెరిగిపోయింది. కరోనా వ్యాప్తి తగ్గిపోయినా.. ఆఫ్లైన్ తరగతులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా పిల్లల్లో సెల్ఫోన్ వినియోగం మాత్రం తగ్గడం లేదు. దేశంలోని పట్టణ, నగర ప్రాంతాల్లో 9 నుంచి 17 ఏళ్ల పిల్లలు రోజుకు సగటున మూడు గంటలకు పైగా సెల్ఫోన్ వినియోగిస్తున్నారు. లోకల్ సర్కిల్ సంస్థ నిర్వహించిన సర్వేలో 61 శాతం తల్లిదండ్రులు ఈ అంశాన్ని వెల్లడించారు. తమ పిల్లలు ఫోన్లో గేమ్స్ ఆడటం, ఓటీటీ యాప్స్లో సినిమాలు చూడటం, సోషల్ మీడియాలో గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 296 జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న 46 వేల మంది తల్లిదండ్రులను సర్వే చేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో 62 శాతం మంది పురుషులు, 38 శాతం మంది మహిళలు ఉన్నారు. దూకుడు.. అసహనం పెరిగాయ్ సర్వేలో భాగంగా సెల్ఫోన్ అతి వినియోగంతో పిల్లల సామాజిక ప్రవర్తన/మానసిక ఆరోగ్యాలపై ప్రతికూల ప్రభావాల స్థాయిని తెలుసుకునే ప్రయత్నం చేశారు. సెల్ఫోన్ వినియోగం కారణంగా పిల్లల్లో గమనించిన మార్పులు ఏమిటని 11,697 మంది తల్లిదండ్రులను ఆరా తీయగా.. 39 శాతం పిల్లల్లో దూకుడు స్వభావం పెరిగినట్టు తల్లిదండ్రులు చెప్పారు. 37 శాతం పిల్లల్లో అసహనం, 25 శాతం పిల్లల్లో అతి క్రియాశీలత (హైపర్ యాక్టివ్నెస్) పెరిగిందని వెల్లడించారు. 22 శాతం పిల్లల్లో నిస్పృహ పెరిగినట్టు గుర్తించారు. ఇంట్లో ఉన్నంతసేపూ ఫోన్తోనే.. పట్టణ ప్రాంతాల్లోని చాలామంది పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో సెల్ఫోన్తో గడపడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీ పిల్లలు రోజుకు సగటు ఎంత సమయం సెల్ఫోన్ వినియోగిస్తున్నారని 11,507 మందిని ఆరా తీయగా.. 6 గంటల మేర సెల్ఫోన్తో గడుపుతున్నట్టు 15 శాతం మంది తెలిపారు. 3నుంచి 6 గంటల పాటు తమ పిల్లలు ఫోన్ వినియోగిస్తున్నట్టు 46 శాతం మంది, 1నుంచి 3 గంటల మధ్య వినియోగిస్తున్నట్టు 39 శాతం మంది పేర్కొన్నారు. అయితే ఓటీటీ.. లేదంటే సోషల్ మీడియా మీ పిల్లలు సెల్ఫోన్ ఎందుకోసం వినియోగిస్తున్నారని 12,017 మందిని ప్రశ్నించి.. సోషల్ మీడియా, ఓటీటీ, ఆన్లైన్ గేమింగ్, ఇతర వ్యాపకాలు, ఏమీ చెప్పలేం అని ఆప్షన్లు ఇవ్వగా.. చాలామంది ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లతో సమాధానాలిచ్చారు. 37 శాతం మంది తమ పిల్లలు ఓటీటీల్లో సినిమాలు, వెబ్సిరీస్ను చూస్తున్నట్టు చెప్పారు. 35 శాతం మంది వాట్సప్, ఇన్స్ట్రాగామ్, స్నాప్చాట్, బీ రియల్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో పిల్లలు గడుపుతున్నట్టు తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు 33 శాతం మంది, ఇతర వ్యాపకాలని 10 శాతం, ఏమీ చెప్పలేమని 2 శాతం మంది వెల్లడించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యం పిల్లల్లో ఫోన్ వినియోగాన్ని నియంత్రించడంలో తల్లిదండ్రుల పాత్రే కీలకం. పాఠశాల, కళాశాలల్లో అలసిపోయి ఉంటారని ఇంటికి రాగానే పిల్లలు సెల్ఫోన్ వాడుతున్నా కొందరు తల్లిదండ్రులు పట్టించుకోరు. ఆటవిడుపు కోసం చేసే ఈ చర్య క్రమంగా వ్యసనంగా మారుతోంది. అదేవిధంగా హోమ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్స్ కోసమని పిల్లలు అడిగిన వెంటనే సెల్ఫోన్ ఇచ్చేస్తుంటారు. అనంతరం వాళ్లు ఎంతసేపు ఫోన్ను వినియోగిస్తున్నారనేది పట్టించుకోరు. ఈ విధానాన్ని వీలైనంత వరకూ తగ్గించాలి. పిల్లల ముందు తల్లిదండ్రులు సెల్ఫోన్ను అనవసరంగా వినియోగించడం మానుకోవాలి. వీలైనంత సేపు వారితో గడపాలి. – డాక్టర్ కేవీ రామిరెడ్డి, సూపరింటెండెంట్, మెంటల్ కేర్ హాస్పిటల్, వైజాగ్ -
చేతిలో మొబైల్ ఉండాల్సిందే.. రాజేష్..సురేష్ల పరిస్థితి చూద్దాం
సురేష్ జేఎన్టీయూకేలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తెల్లవారుజామున లేచింది మొదలు అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్ చూస్తూనే ఉంటాడు. పరీక్షలు సమీపిస్తున్నాయని ఇంట్లో కుటుంబ సభ్యులు అడిగితే చివర్లో చదివేస్తానంటూ బదులిస్తున్నాడు. చేతిలో మొబైల్ లేకుండా ఉండలేనంతగా మారిపోయాడు. పరీక్షలు వచ్చినా ఇతని వైఖరిలో మార్పు లేదు. ఫలితాలు చూసేసరికి సబ్జెక్టులన్నీ ఫెయిలయ్యాడు. బిడ్డ తీరు చూసి తల్లిదండ్రుల ఆవేదం వర్ణనాతీతం. రాజేష్ది కాట్రేనికోన. తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. తల్లి గృహిణి. ఉన్నంతలో మంచి ప్రైవేట్ స్కూలులో జాయిన్ చేశారు. రోజూ స్కూలుకు వెళ్లి వస్తుంటాడు. స్కూలు నుంచి రాగానే తండ్రి కొనిచ్చిన మొబైల్ ఫోన్లో మునిగి తేలుతుంటాడు. ఇందులో కూడా పాఠాలు చదువుకుంటున్నానని తల్లికి చెబుతున్నాడు. కానీ మార్కులు చూస్తే దారుణం. కుర్రాడి పరిస్థితి అర్ధమైన తల్లిదండ్రులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. సెల్ వ్యసనాన్ని ఎలా మానిపించాలో తెలియక తలపట్టుకుంటున్నారు. సాక్షిప్రతినిధి,కాకినాడ: రాజేష్..సురేష్లు మాత్రమే కాదు. చాలా మంది విద్యార్థులది ఇదే తీరు. చేతిలో మొబైల్ ఉండాల్సిందే. ఇంట్లో ఉన్నంతసేపు సెల్తోనే కాలమంతా గడిపేస్తున్నారు. బిడ్డల భవిష్యత్ కోసం బంగారు కలలు కనే తల్లిదండ్రులకు ఇదో పెద్ద సమస్యగా తయారైంది. మొబైల్ ఫోన్ల నుంచి వీరిని ఎలా దూరం చేయాలో తెలియక సతమతమవుతున్నారు. విలువైన కాలాన్ని వృథా చేస్తున్న బిడ్డల తీరుపై ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చాలామంది చదువుకుంటున్న చిన్నారుల నుంచి యువత వరకూ ఈ మొబైల్తోనే కాలక్షేపం చేసేస్తున్నారు. విలువైన భవిష్యత్ను చేజేతులా పాడుచేసుకుంటున్నారు. దీనిపై చాలా ఇళ్లలో ఇది నిత్యం వివాదాలకు కారణమవుతోంది. అప్డేట్గా ఉంటే మంచిదే.. కానీ.. వాస్తవానికి మొబైల్ ఫోన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ప్రతీక. దీనిని సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగం. కానీ కెరీర్కు ఉపయోగపడని అంశాలను చూస్తుంటే కీలకమైన కాలం కాస్తా కరిగిపోతుంది. ఫలితంగా భవిష్యత్కు నష్టం జరుగుతుంది. కమ్యూనికేషన్కు..ఎప్పటికప్పుడు తమ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలపై అప్డేట్గా ఉంటే మంచిదేనని.. కానీ అలా ఎక్కువ మంది విషయంలో ఇలా జరగడం లేదని జేఎన్టీయూకే ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. అరచేతిలో ప్రపంచాన్ని వీక్షించే వీలున్న ఈ చిన్న ఆధునిక పరికరం ద్వారా మేలైన జీవితానికి బాటలు వేసుకోవచ్చునంటున్నారాయన. అలాగని నిరంతరం దానిని వాడడమే వ్యసనంగా పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదంటున్నారు. మరీ ఇంత వ్యసనంగానా.. దాదాపు అన్ని వయసుల పిల్లలలో ఎక్కువ మంది రోజులో నాలుగు గంటల పాటు మొబైల్ ఫోన్ల ద్వారా సామాజిక మాధ్యమాల్లో ఉంటున్నారని ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఇలా నెలలో 120 గంటలు.. అంటే సుమారు నాలుగున్నర రోజులు. ఏడాదికి 54 రోజుల పాటు మొబైల్ ఫోన్ చూడటంలోనే కాలం గడిపేస్తున్నారని అంచనా. ఇది చాలా ప్రమాకరమైన పోకడ. తరచూ ఫోన్ చూడటం మానసిక రోగంలా తయారైందని సైకియాట్రిస్టులు అంటున్నారు. పరీక్షా కాలంలోనూ.. పరీక్షలకు ముందు విద్యార్థులకు ప్రతి క్షణం చాలా విలువైనది. ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాలి. చదువుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు, టీచర్లు పదే పదే చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు. పరీక్షలు దగ్గరపడే సమయంలోనైనా మొబైల్కు కాస్త దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నా ప్రయోజనం కనిపించడం లేదని తల్లిదండ్రులు కలవరపడుతున్నారు. కెరీర్ను మలుపు తిప్పే పదో తరగతి నుంచి డిగ్రీ లేదా, ఇంజినీరింగ్ మధ్య చదువుల్లో ఉన్న విద్యార్థులను ఈ ‘మొబైల్ ధోరణి’ దెబ్బతీస్తోందని విద్యావంతులు హెచ్చరిస్తున్నారు. సహజంగా 20–22 వయస్సు మధ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు. పీజీ ఇతర ఉన్నత విద్యా కోర్సులు 25 ఏళ్లకు పూర్తి చేసి ఉద్యోగం సాధించాలి. కానీ ఈ మొబైల్ విచ్చలవిడి వినియోగంతో పాతికేళ్లు దాటినా బ్యాక్లాగ్లు వెంటాడుతున్నాయి. ఉద్యోగం సంపాదించాల్సిన సమయంలో వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్ట్రా తదితర సామాజిక మాధ్యమాల ప్రభావంలో పడి నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. -
ఇంకా దొరకని బండి సంజయ్ ఫోన్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పోగొట్టుకున్న సెల్ఫోన్లను గుర్తించి తిరిగి అప్పగించడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సీఈఐఆర్ విధానం ఉపయోగించి ఫోన్లను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం సెల్ఫోన్ విద్యార్థి నుంచి వృద్ధులు, అధికారి నుంచి కూలీవరకు, ఉన్నతాధికారి నుంచి చిరుద్యోగి వరకు, వార్డు మెంబరు నుంచి ప్రధాని వరకు అందరిని కలిపే సామాజిక మాధ్యమంగా మారింది. అలాంటి సెల్ఫోన్ పొరపాటున పోగొట్టుకున్నా.. చోరీకి గురైనా అందులోని డేటాతోపాటు, విలువైన సమాచారం పోతుంది. అందుకే పోలీసులు అలా పోగొట్టుకున్న పోన్లను వేటాడి గుర్తించేందుకు సీఈఐఆర్ విధానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ సాంకేతికతను తొలిసారిగా కరీంనగర్ కమిషనరేట్లో ప్రయోగపూర్వకంగా ప్రారంభించారు. ప్రస్తుతం 50శాతం వరకు ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించగలిగారు. నేటికీ దొరకని ‘బండి’ ఫోన్.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో వాట్సాప్లలో పేపర్ లీకేజీ కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఎంపీ బండి సంజయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సంజయ్ ఫోన్ అదృశ్యమైంది. పోలీసులే తన ఫోన్ మాయం చేశారని సంజయ్ ఆరోపించారు. ఆయన ఫోన్తో తమకు సంబంధం లేదని పోలీసులు వివరణ ఇచ్చారు. ఆరోపణల పర్వం ఎలా ఉన్నా.. బండి సంజయ్ ఫోన్ నేటికీ లభించలేదు. అందులో అనేక కీలక విషయాలు ఉన్నాయని, తన ఫోన్ వెంటనే అప్పగించాలని బండి అనుచరులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. పోలీసుల తరఫు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం గమనార్హం. ఫోన్ల రికవరీలో దేశంలోనే నంబర్వన్గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ పోలీసులు ఎంపీ సెల్ఫోన్ విషయంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడంపై ఆయన అనచరులు విమర్శలు గుప్పిస్తున్నారు. 1,318 ఫోన్ల అందజేత! ఈ ఏడాది ఏప్రిల్లో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (సీఈఐఆర్) సాంకేతికతపై కరీంనగర్ కమిషనరేట్లో పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఆ వెంటనే రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా సిబ్బందికి శిక్షణను విస్తరించారు. ఈ సాంకేతికత వినియోగంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకూ 5,449 ఫోన్లు ఉమ్మడి జిల్లాలో పోయినట్లు రిపోర్టయ్యాయి. అందులో 1,318 ఫోన్లను రికవరీ చేశారు. సెల్ఫోన్ల రికవరీ అత్యధికంగా 418 రామగుండం పరిధిలో ఉండగా, అత్యల్పంగా 157 జగిత్యాల పరిధిలో ఉండటం గమనార్హం. సీఈఐఆర్ సాంకేతికత అంటే.? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (సీఈఐఆర్) సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా పోయిన సెల్ఫోన్ను తిరిగి కనిపెట్టొచ్చు. సీఈఐఆర్ వెబ్సైట్లోకి వెళ్లి సెల్ఫోన్ను ఐఎంఈఐ నంబరు సాయంతో బ్లాక్ చేయవచ్చు. ఈ తరువాత ఆ సెల్ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు. ఒకవేళ ఫోన్ ఆన్చేసినా, అందులో కొత్త సిమ్కార్డు వేసినా.. ఆ విషయం ఫోన్ యజమానికి ఎస్ఎంఎస్ ద్వారా తెలిసిపోతుంది. ఎలా పనిచేస్తుంది..? సెల్ఫోన్ పోగొట్టుకున్న వెంటనే డబ్లూ.డబ్లూ.డబ్లూ.సీఈఐఆర్.జీవోవీ.ఐఎన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. అందులో బ్లాక్ ఫోన్ అనే ఆప్షన్ను ఎంచుకోవాలి. అందులో మొబైల్ నంబర్–1, మొబైల్ నంబరు–2, సెల్ఫోన్ బ్రాండ్, మోడల్, ఇన్వాయిస్ (బిల్) ఫొటో సూచించిన గడుల్లో నింపాలి. పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, ఇతర చిరునామా, అంతకుముందే ఇచ్చిన పోలీస్ కంప్లయింట్ నంబరు, ఫోన్ యజమాని చిరునామా, ఈమెయిల్ ఐడీ, ధ్రువీకరణ కార్డులు, చప్టాలను సూచించిన బాక్సుల్లో నింపాలి. వెంటనే సెల్ఫోన్ (పాత నెంబరు మీద తీసుకున్న కొత్త సిమ్) నంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఫామ్ను సబ్మిట్ చేయాలి. ఆ తరువాత ఫోన్ దానంతట అదే బ్లాక్ అవుతుంది. ఇకపై దాన్ని ఎవరూ ఆపరేట్ చేయలేరు. అందులోని డేటా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ దొంగించించిన వ్యక్తి లేదా సెకండ్ హ్యాండ్లో కొన్న వ్యక్తి సిమ్ వేయగానే.. మీ నంబరుకు మెసేజ్ వస్తుంది. ఆ సందేశం ఆధారంగా ఫోన్ ఎక్కడ ఉన్నా.. పట్టుకోవడం సులభతరంగా మారుతుంది. అన్బ్లాక్ చేయండిలా.. మీఫోన్ను పోలీసులు పట్టుకున్నా.. లేక మీకే దొరికినా.. మీ పాత ఐడీని, ఫోన్నంబరు, ఇతర వివరాలు నింపిన తరువాత ఫోన్ను అన్బ్లాక్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: ఔను..! నిజంగానే కలెక్టర్కు కోపమొచ్చింది! -
చోరీ అయిన సెల్ ఫోన్ల రికవరీలో టాప్లో అనంతపురం జిల్లా..!
అనంతపురం క్రైం: చోరీ జరిగిన, సొంతదారు పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీలో జిల్లా పోలీసులు అగ్రస్థానంలో నిలిచారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. చాట్బాట్ సేవలు అందుబాటులో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో రూ.13.13 కోట్లు విలువ చేసే 8,010 సెల్ఫోన్లు రికవరీ చేసి సొంతదారులకు అందజేసినట్లు వివరించారు. ఇటీవల వివిధ కేసుల్లో పోలీసులు రికవరీ చేసిన రూ.71 లక్షలు విలువ చేసే 385 సెల్ఫోన్లను జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో సంబంధీకులకు సోమవారం ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపీలోని 9 జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్కు చేతులు మారిపోయిన సెల్ఫోన్లను కూడా రికవరీ చేసినట్లు వివరించారు. పాత ఫోన్లు కొనొద్దు ఫోన్లు కొనుగోలు చేసే వారెవరైనా పాత ఫోన్లను కొనకపోవడం మంచిదని ఎస్పీ అన్బురాజన్ సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి అస్సలు కొనుగోలు చేయరాదన్నారు. పరిచయస్తుల ద్వారా కొనుగోలు చేస్తే ఫోన్కు సంబంధించిన బాక్స్తో పాటు బిల్లు తప్పక తీసుకోవాలన్నారు. ఫోన్ తక్కువ ధరకు వస్తుందని ఆశపడి కొనుగోలు చేస్తే అనవసరంగా పోలీసు కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఫోన్లు చోరీకి గురైనా, కనపడకుండా పోయినా సీఈఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్లు విక్రయిస్తున్న అపరిచత వ్యక్తులపై అనుమానం వస్తే వెంటనే 94407 96800కు సమాచారం అందించాలని కోరారు. పోగొట్టుకున్న డబ్బు ఖాతాలో పడుతుంది బ్యాంక్ ఖాతాలోని సొమ్మును సైబర్ నేరగాళ్లు కాజేస్తే వెంటనే 1930 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా గంట వ్యవధిలోనే ఆ డబ్బు తిరిగి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందని ఎస్పీ వివరించారు. 1930 పేవలను సకాలంలో వినియోగించుకోవాలన్నారు. అన్ని యాప్లకు గుడ్డిగా అనుమతులివ్వకూడదన్నారు. ‘పోలీసు స్పందన’కు 128 వినతులు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 128 వినతులు అందాయి. ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ ఇందిర, దిశ సీఐ చిన్నగోవిందు, ఎస్ఐ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీకి కృతజ్ఞతలు రౌడీ మూకలు కబ్జా చేసిన తమ స్థలాలను తిరిగి స్వాధీనం చేసేందుకు ఎస్పీ అన్బురాజన్ చూపిన చొరవను అభినందిస్తూ 73 మంది బాధితులు సోమవారం ఆయనను కలసి కృతజ్ఞతలు తెలిపారు. తమలో చాలా మంది ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులుగా ఉన్నామని, ఉద్యోగ విరమణ సమయంలో అందిన డబ్బుతో స్థలాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. వీటిని కొందరు రౌడీ మూకలు కబ్జా చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ స్థలాలు తిరిగి స్వాధీనం చేసిన ఎస్పీ అన్బురాజన్ సేవలను మరిచిపోలేమంటూ సన్మానం చేశారు. కాగా, మొత్తం ఈ వ్యవహారంలో బాధితుల పక్షాన నిలిచి పోరాటం చేసిన నూర్బాషాకే సన్మానం పొందే అర్హత ఉందని, ఎస్పీ ప్రతిగా ఆయనకు సన్మానం చేశారు. కానిస్టేబుల్కు అవార్డు కుందుర్పి: సైబర్ క్రెం కేసుల దర్యాప్తులో ప్రతిభ కనబరచిన కుందుర్పి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ అనిల్ను ఎస్పీ అన్బురాజన్ అభినందించారు. కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో ఇటీవల చోరీకి గురైన సెల్ఫోన్ల రికవరీలో అనిల్ చూపిన చొరవను అభినందిస్తూ సోమవారం డీపీఓలో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ అభినందిస్తూ అవార్డు అందజేశారు. -
India Mobile Congress 2023: కాంగ్రెస్.. కాలం చెల్లిన ఫోన్
న్యూఢిల్లీ: 2014 అనేది కేవలం ఒక తేదీ కాదని, దేశంలో అదొక పెనుమార్పు అని ప్రధానమంతి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని కాలం చెల్లిన ఫోన్గా అభివరి్ణంచారు. 2014లో దేశ ప్రజలు ఆ ఔట్డేటెడ్ ఫోన్ను వదిలించుకున్నారని, ఇండియా దశ దిశ మార్చే ప్రభుత్వాన్ని ఎంచుకున్నారని తెలిపారు. కాలం తీరిన ఫోన్లలో ఎన్నిసార్లు బటన్లు నొక్కినా, స్తంభించిన స్క్రీన్ను ఎన్నిసార్లు తట్టినా ఎలాంటి ఫలితం ఉండదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రీస్టార్ట్ చేసినా, చార్జింగ్ పెట్టినా, బ్యాటరీ మార్చినా ఆ ఫోన్ పనిచేయదని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. పనికిరాని ఫోన్ తరహాలోనే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ, పరిపాలన స్తంభించిపోయిందని అన్నారు. అలాంటి సమయంలో దేశానికి సేవ చేసే అవకాశాన్ని ప్రజలు తమకు ఇచ్చారని గుర్తుచేశారు. శుక్రవారం ఢిల్లీలో ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లలో తమ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన సంస్కరణలతో దేశం ప్రగతి పథంలో పరుగులు తీస్తోందని అన్నారు. గతంలో మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్న మన దేశం ఇప్పుడు ఎగుమతిదారుగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు మన దేశంలోనే ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడించారు. భారత్లో 5జీ మొబైల్ సేవలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయని, ఇక 6జీ సరీ్వసులకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. గతేడాది అక్టోబర్ 1న 5జీ టెక్నాలజీని ప్రారంభించామని, దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 5 లక్షల 5జీ బేస్ స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. 2జీ సేవల విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని చెప్పారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న టెలికాం స్పెక్ట్రం కుంభకోణాన్ని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. 4జీ సేవలను తీసుకొచ్చిన తమపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదన్నారు. 6జీ టెక్నాలజీలో ప్రపంచాన్ని మనమే ముందుకు నడిపిస్తామన్న విశ్వాసం తనకు ఉందన్నారు. దేశవ్యాప్తంగా 100 ‘5జీ ల్యాబ్లు’ యూపీఏ సర్కారు పాలనలో మొబైల్ ఫోన్ల తయారీ రంగాన్ని విస్మరించారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైన్ఫోన్ల తయారీదారుగా మారిందని అన్నారు. అలాగే ఏటా రూ.2 లక్షల కోట్ల విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను ఎగుమతి చేస్తున్నామని తెలియజేశారు. ఇండియాలో తయారైన ఫోన్లను ప్రపంచమంతటా ఉపయోగిస్తుండడం మనకు గర్వకారణమని పేర్కొన్నారు. బ్రాడ్బ్యాండ్ వేగంలో మన దేశం ఏడాది వ్యవధిలోనే 118వ స్థానం నుంచి 43వ స్థానానికి చేరిందని వివరించారు. ఇంటర్నెట్ అనుసంధానం, వేగంతో ప్రజల జీవనం సులభతరం అవుతోందన్నారు. విద్య, వైద్యం, టూరిజం, వ్యవసాయం వంటి రంగాల్లో మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రతి సమాజంలో ఒక్కరికీ చేరాలని, ఆ దిశగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. పెట్టుబడి, వనరులు, సాంకేతికతను ప్రజలకు చేరువ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. విద్యార్థులు, స్టార్టప్ కంపెనీల కోసం దేశవ్యాప్తంగా త్వరలో 100 ‘5జీ ల్యాబ్లు’ అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు. విద్యాసంస్థల్లో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. -
వినూత్నంగా సెల్ఫోన్లో కూరగాయల వ్యాపారం, నిమిషాల్లో డోర్ డెలీవరీ
కూరగాయలు పండించడంలో పాత పద్ధతి పాటిస్తూ.. వాటిని విక్రయించడంలో మాత్రం కొత్త పోకడలు అవలంబిస్తున్నాడో రైతు. మార్కెట్కు వెళ్లే అవసరం లేకుండా, కూరగాయలు రాశిగా పోసి కొనుగోలు దారుల కోసం వేచి చూడాల్సిన అగత్యం లేకుండా సెల్ఫోన్ సాయంతో వ్యాపారం చేస్తున్నారు. ఇంటి నుంచే నిర్వహిస్తున్న ఈ వ్యాపారానికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. నరసన్నపేట: వాట్సాప్ సాయంతో ఓ గ్రూపును ఏర్పాటు చేసుకున్న రైతు దాని ద్వారానే ఎంచక్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. నచ్చిన కూరగాయలు వాట్సాప్ లో బుక్ చేసిన కొన్ని గంటల వ్యవధిలో డోర్ డెలివరీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ తమకూ బాగుండడంతో వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నరసన్నపేటలోని దేశవానిపేటకు చెందిన ఆదర్శ రైతు రావాడ మోహనరావు వినూత్న పద్ధతిలో వర్తకం చేస్తున్నారు.మోహనరావుకు ప్రకృతి వ్యవసాయంపై గురి బాగా కుదిరింది. దీంతో సారవకోట మండలంలోని పద్మపురంలో 20 ఎకరాల విస్తీర్ణంలో పురుగు మందులు వాడకుండా సహజ ఎరువులతో పంటలు పండిస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలతో కూరగాయల సాగు చేస్తున్నారు. వీటిని అందరిలా కాకుండా వాట్సాప్ ద్వారా విక్రయించాలని నిర్ణయించుకుని మన మార్ట్ ఆర్గానిక్ ఫార్మ్ అని పేరుతో ఒక గ్రూప్ క్రియేట్ చేసి తనకు తెలిసిన మిత్రులను చేర్చారు. మొదట్లో 26 మందితో ఉన్న ఈ గ్రూపు ఇప్పుడు 540 మందికి చేరింది. ఈ వాట్సాప్ గ్రూపులో పండిన కూరగాయలు, దుంపలు, పళ్లు వాటి ధరలను ప్రదర్శిస్తున్నారు. నచ్చిన వారు తమకు కావాల్సిన కూరగాయలను ఆర్డర్ పెడుతున్నారు. కొన్ని గంటల్లో కూరగాయలు ఇంటికి చేర్చుతున్నారు. ఇప్పుడు నరసన్నపేటలో ఈ వ్యాపారం హాట్ టాపిక్ అయింది. రోజూ ఆకుకూరలు, కూరగాయలు వంద కిలోలకు పైగా విక్రయిస్తున్నారు. శమ తప్పింది నేను వృద్ధాప్యంలో ఉన్నాను. బజారుకు వెళ్లి కూరగాయలు కొనేందుకు నానా అవస్థలు పడేవాడిని. ఇప్పుడు కావాల్సిన కూరగాయలు వాట్సాప్లో ఆర్డర్ చేస్తున్నాం. తెచ్చి అందిస్తున్నారు. బాగుంది. కూరగాయలు నాణ్యతగా ఉంటున్నాయి. – కేఎల్ఎన్ మూర్తి, పుండరీకాక్ష కాలని, నరసన్నపేట తాజా కూరగాయలు వాట్సాప్లో కూరగాయలు చూసి ఆర్డర్ పెడుతున్నాం. గంట వ్యవధిలోనే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మాకు సమయం ఆదా అవుతోంది. కూరగాయలు కూడా తాజాగా ఉంటున్నాయి. తూకం కచ్చితంగా ఉంటుంది. – సాయి శ్రీనివాస్, టీచర్, నరసన్నపేట ఆదరించారు.. ప్రకృతి వ్యవసాయంపై మక్కువతో పలు ప్రాంతాల్లో తిరిగి ఏడాదిగా వివిధ పద్ధతుల్లో కూరగాయల సాగు చేస్తున్నాను. కొందరు మిత్రుల సలహాతో వాట్సాప్లో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాను. మూడు నెలలుగా ఇది నిరంతరాయంగా సాగుతోంది. పండుతున్న కూరగాయలు ఏ రోజుకు ఆ రోజు అయిపోతున్నాయి. వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – రావాడ మోహనరావు, ఆదర్శ రైతు, దేశవానిపేట -
సెల్ఫోన్ యూజర్లకు వార్నింగ్ మెసేజ్.. స్పందించిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఫోన్ యూజర్లకు సెల్ఫోన్లో అలర్ట్ మెసేజ్ రావడం కలకలం సృష్టించింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ రావడంతో కస్టమర్ల ఆందోళనకు గురయ్యారు. అయితే, టెస్టింగ్లో భాగంగానే వినియోగదారులకు ఇలా అలర్ట్ మెసేజ్ పంపినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది. దీనిపై భయపడాల్సిందేమీలేదని స్పష్టం చేసింది. అయితే, దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్ల యూజర్లకు గురువారం ఉదయం 11-12 గంటల మధ్య ప్రాంతంలో సెల్ఫోన్లకు వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఫోన్లను ఆపే వరకు అలారమ్ సౌండ్ చేస్తూ స్క్రీన్పై మెసేజ్ డిస్ప్లే అయ్యింది. ఈ అలర్ట్పై కేంద్రం వివరణ ఇచ్చింది. ‘ఇది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం ద్వారా సెల్ ప్రసారం సిస్టమ్ ద్వారా పంపంబడిన నమూనా పరీక్ష సందేశం. దయచేసి ఈ సందేశాన్ని విస్మరించండి. ఎందుకంటే మీ వైపు నుంచి ఎటువంటి చర్య అవసరం లేదు. ఈ సందేశం నేషనల్ డిజాస్టర్ నిర్వహణ అథారిటీ అమలు చేస్తున్న టెస్ట్ పాన్ ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థకి పంపబడింది. దీన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా భద్రత మరియు అత్యవసర సమయంలో సకాలంలో హెచ్చరికలను అందిస్తాయి అని తెలిపింది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది అని రాసి ఉంది. కాగా, ఈ మెసేజ్ ఇప్పటి వరకు మూడు భాషల్లో యూజర్లకు వచ్చింది. మొదట ఇంగ్లీష్, తర్వాత తెలుగు, చివరగా హిందీలో మెసేజ్లు వచ్చాయి. What is this alert all about? @airtelindia @airtelnews @Airtel_Presence It's like a real high vibration and emergency alarm. pic.twitter.com/dLdohymNxL — Aksh (@aksh2810) September 21, 2023 మొబైల్ ఫోన్ యూజర్లకు అలెర్ట్ మెసేజ్ రావడం ఇటు హైదరాబాద్లోనూ కలకలం సృష్టించింది. ఒక సభలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నప్పుడు ఈ అలారం వచ్చింది. ఒక్కసారిగా వార్నింగ్ సౌండ్ రావడంతో ఏమైందని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఫోన్లను ఆపే వరకు అలారం సౌండ్ రావడంతో అక్కడే ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. కాసేపటికే ఇది టెస్ట్ అలారం అని తెలియడంతో సమావేశాన్ని కొనసాగించారు. -
చిన్నపిల్లలకు స్మార్ట్ఫోన్ ఇస్తున్నారా? టీనేజ్లో డిప్రెషన్తో..
ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్ఫోన్ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తికాదు. లేచినప్పటి నుంచి నిద్రకు ఉపక్రమించే వరకు పక్కన స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. సగం పనులు దీనితోనే అవున్నాయంటే మాటలు కాదు. ఒక వైపు స్మార్ట్ ఫోన్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతకుమించి సమస్యలూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఫోన్ పెను ప్రభావం చూపుతోంది. జీవనశైలే మారిపోయింది ప్రస్తుతం 99 శాతం మంది చేతుల్లో స్మార్ట్ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ ఫోన్ల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 1995 తర్వాత పుట్టిన పిల్లలు తమ కౌమారమంతా స్మార్ట్ఫోన్తోనే గడుపుతున్న మొదటి తరమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్లు వచ్చాక మనిషి జీవన శైలే మారియిందని పేర్కొంటున్నాయి. 1995 తర్వాత పుట్టిన పిల్లలు ఎక్కువ సమయం ఆన్లైన్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. కబుర్లు, సరదాలు, ఆట పాటలూ అన్నీ అందులోనే. పుస్తకాలు చదవడం, నిద్రపోవడం, స్నేహితులతో గడపడం, శారీరక ఆటలకు కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. ఈ జీవన శైలి వలన పిల్లల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులూ హెచ్చరిస్తున్నారు. ముందు తరాలవారితో పోల్చుకుంటే జీవన నైపుణ్యాల్లో ఇప్పటి పిల్లలు వెనకబడిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. వీటికి అదనంగా ఒంటరితనంతోపాటు ఇతర మానసిక సమస్యలూ ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు తేల్చాయి. స్మార్ట్ ఫోన్లు పిల్లలు, టీనేజర్ల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపి సృజనాత్మకతను చంపేస్తున్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. అమెరికా సైకాలజీ ప్రొఫెసర్ జీన్ అధ్యయనమూ ఇదే విషయాన్ని మరింత విడమరిచి చెప్పింది. టీనేజర్లు తీవ్ర నిరాశలోకి.. టీనేజర్ల ఆరోగ్యం, ప్రవనర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్, ఐజెన్ కన్సెల్టింగ్ వైద్యురాలు జీన్ త్వెంగే అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలిసి 13 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పది లక్షలకుపైగా పిల్లపై పరిశోధనలు చేశారు. టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుపుతన్నారనేది మానసిక ఆరోగ్య కోణంలో ఓ ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. ఆమె 2011 నుంచి ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు బాగా పెరగడం గుర్తించినట్టు చెప్పారు. జీవితం వృథా అనే భావనకు చాలామంది వస్తున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలని, ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేర పెరిగాయని వివరించారు. తమను తాము గాయపరుచుకునేంతగా అవి విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికల్లో ఈ ప్రమాదకర ధరోణి రెండు మూడింతలు పెరిగిందని పేర్కొన్నారు. కొన్నేళ్లలోనే టీనేజర్ల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని జీన్ తన అధ్యయనంలో వివరించారు. ఫోన్ వ్యసనంలా.. మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లుకుపైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారట. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే భావనలో ఉంటున్నారట. ఇదొక వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? ► రోజుకు రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం డిజిటల్ మీడియాకు కేటాయించడం మంచిది. ఇది మానసిక ఆరోగ్యానికి ఆనందానికి దోహదపడుతుంది. ► అయితే డిజిటల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా విచారానికి కారణమవుతుంది. ► మన సమయం మన చేతిలోనే ఉంటుంది. ఉండాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ► స్నేహితులతో టచ్లో ఉండేందుకు మాత్రమే సోషల్ మీడియాను వాడాలి. ఒకవేళ పిల్లలకు ఫోన్ చాలా అవసరమని భావిస్తే ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫోన్ మాత్రమే ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వకూడదు. అది వారికి అలవాటు చేయడం వల్ల వారి పెరుగుదలతోపాటు మెదడుపై ప్రభావం చూపుతోంది. మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పెద్దలు కూడా అవసరానికి మించి స్మార్ట్ఫోన్లు వాడకూడదు. దీనివల్ల మతిమరుపు నిద్రలేమి సమస్యలకు లోనవుతారు. మీపిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినట్లు అనుమానం ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. -
పిల్లలు అడిగనవన్నీ ఇచ్చేస్తున్నారా? అయితే మీరు ట్రాప్లో పడ్డట్లే!
ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ వాడకం బాగా పెరిగిపోయింది. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా రెండేళ్ల లోపు చిన్నారులు కూడా ఫోన్లో బొమ్మలు చూస్తూ గంటల తరబడి గడిపేస్తున్నారు. భోజనం తినాలన్నా, నిద్ర పోవాలన్నా ఫోన్ పక్కన ఉండాల్సిందే అనేంతలా అలవాటుపడుతున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా పిల్లల చేతిలో ఫోన్ పెడితే అన్నం తినిపించడం సులువు అని ఈజీగా మొబైల్ అలవాటు చేస్తున్నారు. ఇది చిన్నారుల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది మానసికంగా, శారీరకంగా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 1. మీ పిల్లల స్నేహితులందరికీ సెల్ ఫోన్ ఉందని, మీ బిడ్డకు కూడా సెల్ ఫోన్ కొనిచ్చారా? 2.మీ పిల్లలు హోంవర్క్ పుస్తకం మర్చిపోతే మీరు స్కూల్ కు వెళ్లి ఇచ్చి వస్తున్నారా? 3.మీ పిల్లల ప్రాజెక్ట్ వర్క్ కు కావాల్సిన మెటీరియల్ కోసం మీరు షాపుల చుట్టూ తిరుగుతున్నారా? 4.మీ బిడ్డను చాలా యాక్టివిటీస్ లో చేర్పించడం వల్ల అసలు ఖాళీ సమయమే ఉండటం లేదా? 5. మీరు పికప్ చేసుకోవడానికి వెళ్లేందుకు కాస్తంత లేటయితే వెంటనే మీకు మెసేజ్ వస్తుందా? వీటిలో ఏ ఒక్కటి చేస్తున్నా.. మీరు పేరెంట్ ట్రాప్లో చిక్కుకున్నట్లే. పిల్లలు కష్టపడకూడదని చాలామంది పేరెంట్స్ పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేస్తుంటారు. అలాగే వాళ్ల ప్రాజెక్ట్ వర్క్స్ కూడా చేస్తుంటారు. ఫ్రెండ్స్ తో, టీచర్స్ తో వారికి ఎదురయ్యే సమస్యలను తల్లిదండ్రులే పరిష్కరిస్తుంటారు. దీనివల్ల పిల్లలు తమకు సొంతంగా సమస్యలను పరిష్కరించుకొని, స్కిల్స్ సాధించుకునే అవకాశాన్ని కోల్పోతారు. జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పరిష్కారం కోసం ఇతరులవైపు చూసే, ఇతరులపై ఆధారపడే మనస్తత్వాన్ని అలవాటు చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యే ప్రవర్తననే parenttrap(పేరెంట్ ట్రాప్)అంటారు. కంట్రోల్ ట్రాప్(Control Trap): తల్లిదండ్రులు తమ పిల్లలను అతిగా నియంత్రించడం, వాళ్లు ఏం చేస్తున్నారో, సోషల్ మీడియా వాడకం వరకు ప్రతీది నిర్దేశించినప్పుడు ఇది జరుగుతంది. పిల్లల భద్రత, శ్రేయస్సు కోసం కొంత నియంత్రణ అవసరం. అయితే అతిగా నియంత్రించడం వల్ల పిల్లల్లో ఆందోళన, స్వీయగౌరవ సమస్యలు ఏర్పడతాయి. క్రిటిసిజమ్ ట్రాప్(Criticism Trap): కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం విమర్శిస్తుంటారు, నిరంతరం వారిలో తప్పులను వెతుకుతుంటారు. ఇది వారి ఆత్మగౌరవం, విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. కంపారిజన్ ట్రాప్(Comparison Trap): చాలామంది పేరెంట్స్ పిల్లలను తోబుట్టువులతోనూ, తోటివారితోనూ పోల్చుతుంటారు. నిరంతరం ఇతరులతో పోల్చడం వారి ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. గివింగ్ ట్రాప్(Giving Trap): ఇతర పిల్లలకు ఉన్నవి తమకు లేవని పిల్లలు బాధపడకూడదని తల్లిదండ్రులు భావిస్తారు. అందువల్ల వారు అడగకుండానే అన్నీ తెచ్చి పెడతారు. దీనివల్ల పిల్లలకు అవసరంలేని వస్తువులను ఇచ్చే ఉచ్చులో పడతారు. గిల్ట్ ట్రాప్(Guilt Trap): పిల్లల అసంతృప్తికి తాము కారణం కాకూడదని పేరెంట్స్ భావిస్తారు. తమ బిడ్డ కలత చెందడానికి కారణం తామేనని తల్లిదండ్రులు భావించి అపరాధ భావనకు లోనవుతారు. దాన్ని అధిగమించేందుకు పిల్లలు కోరినవీ, కోరనివీ కొనిచ్చి తమ భారం దింపుకుంటారు. హర్రీడ్ ట్రాప్(Hurried Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తమ శక్తిమేరకు ప్రతిదీ చేయాలని కోరుకుంటారు. దీనివల్ల పిల్లల అవసరాలు వెంటనే తీరతాయని భావిస్తుంటారు. తక్షణ తృప్తి (#instantgratification)కి అలవాటు పడతారు. అలా తక్షణ తృప్తి దొరకనప్పుడు తీవ్రంగా నిరాశ చెందుతారు, విపరీత నిర్ణయాలు తీసుకుంటారు. పర్మీసివ్ ట్రాప్(Permissive Trap): కొందరు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసినా ఏమీ అనరు, ఏం చేయాలనుకున్నా అనుమతిస్తారు. పిల్లలతో సంఘర్షణ నివారించడానికి ఇది సులువైన మార్గంగా భావిస్తారు. కానీ దీనివల్ల పిల్లల్లో స్వీయ క్రమశిక్షణ లోపిస్తుంది, విచ్చలవిడితనానికి దారితీయవచ్చు. ప్రెజర్ ట్రాప్(Pressure Trap): తల్లిదండ్రులు తమ పిల్లల విజయాలను పంచుకోవడం గర్వంగా భావిస్తారు. పోటీలో పిల్లలు ముందుంటే సంతోషిస్తారు, ఏమాత్రం వెనుకంజ వేసినా ఆందోళన పడుతుంటారు. ముందుకు దూసుకుపోవాలని పిల్లలను ఒత్తిడి చేస్తారు. రెస్క్యూ ట్రాప్(Rescue Trap): తల్లిదండ్రులు తమ పిల్లల కష్టాలను చూసి బాధపడతారు. వాటినుంచి బయట పడేయడం ద్వారా వారిని ‘రక్షించాలని’ భావిస్తారు, బయటపడేస్తారు. పర్యవసానంగా కొన్ని పనులు జరగాలంటే వేచి ఉండటం ( delayed gratification) అవసరమనే విషయం పిల్లలకు ఎప్పటికీ అర్థం కాదు. అలాగే తమ సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే అవకాశం ఉండదు. పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే... పేరెంట్ ట్రాప్స్ నుండి బయటపడాలంటే ఎప్పటికప్పుడు తమ ప్రవర్తనను గమనించుకుంటూ, అంచనా వేసుకుంటూ, అవసరమైనమేరకు మార్చుకునేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. ► ప్రతి బిడ్డ ప్రత్యేకమని, ఎవరి ప్రత్యేక సామర్థ్యాలు వారికి ఉంటాయని గుర్తించాలి. ► బిడ్డను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పోల్చకూడదు. ► సరిహద్దులను నిర్ణయించి స్థిరంగా అమలు చేయాలి. వాటి పరిధిలో ఎంపిక చేసుకునే స్వేచ్ఛనివ్వాలి. ► కష్టమైన అంశాలపై మాట్లాడటానికి, అవసరమైనప్పుడు కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ► విమర్శించడం కంటే నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించడంపై దృష్టి పెట్టాలి. ► పిల్లల బలాలను, విజయాలను, సానుకూల ప్రవర్తనలను ప్రశంసించాలి. ► పిల్లలు తమ పనులు తాము చేసుకునేలా ప్రోత్సహించండి. ► తమకు కావాల్సినవి తాము కష్టపడి సాధించుకోవడం నేర్పించండి. ► తమ సమస్యలు తామే పరిష్కరించుకునేందుకు ప్రోత్సహించండి. -డా. మీ నవీన్ నడిమింటి(9703706660), ప్రముఖ ఆయుర్వేద నిపుణులు -
మీ సెల్ఫోన్ పోగొట్టుకున్నారా? ఇలా చేస్తే ఎక్కడున్నా దొరికేస్తుంది
సాక్షి, భీమవరం: సెల్ఫోన్ పోగొట్టుకుంటే వర్రీ కాకండి. ఫోన్ కొనుగోలు చేసిన ఆధారాలతో పోలీసులకు వాట్సాప్ మేసేజ్ ద్వారా ఫిర్యాదు చేస్తే కొద్దిరోజుల్లోనే పైసా ఖర్చులేకుండా మీ చెంతకు చేరుతుంది. పోలీసు శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన సెల్ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పోగొట్టుకున్న సెల్ఫోన్ను ఎవరైనా, ఎంత దూరంలో వినియోగిస్తున్నా సులభంగా కనిపెడుతున్నారు. వాటిని రికవరీ చేసి బాధితులకు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2,400 సెల్ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులు అందగా సుమారు రూ.1.20 కోట్ల విలువైన 801 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. కొందరే పోలీస్స్టేషన్లకు.. ప్రస్తుతం సెల్ఫోన్ లేనిది ఎటువంటి కార్యకలాపాలు ముందుకు సాగడం లేదు. ప్రధానంగా ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగం పెరిగింది. వీటి ఖరీదు అధికంగా ఉంది. సెల్ఫోన్ ఎక్కడైనా పోగొట్టుకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ఖరీదైన ఫోన్ పోయిందనే బాధతోపాటు ఫోన్లో నిక్షిప్తమైన ఫోన్ నంబర్లు, సమాచారం పొందడం కష్టంగా మారింది. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవారు తన ఫోన్ ఎక్కడైనా పడిపోయిందా.. లేదా ఎవరైనా దొంగిలించారా అనే సందేహంతో సతమతమవుతుంటారు. దీనిపై కొందరు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేస్తుండగా మరికొందరు మిన్నకుండి పోతున్నారు. దీంతో సెల్ఫోన్ దొరికిన వారు లేదా దొంగిలించిన వారు ఆ ఫోన్ తమదేనన్న ధీమాతో వినియోగించుకుంటున్నారు. వాట్సాప్కు మెసేజ్ చేస్తే.. సెల్ఫోన్ పొగొట్టుకున్నవారికి పోలీసు శాఖ మంచి అవకాశం కల్పించింది. పోగొట్టుకున్న ఫోన్ వివరాలను 9154966503 వాట్సాప్ నంబర్కు ‘హాయ్’ అనే మెసేజ్ చేస్తే చాట్బోట్ మెసేజింగ్ పద్ధతి ద్వారా ఒక లింక్ ఆటోమెటిక్గా వస్తుంది. ఆ లింక్ను ఓపెన్ చేసి ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి వివరాలతోపాటు ఫోన్ వివరాలను పొందుపరిస్తే సెల్ఫోన్ను గుర్తిస్తారు. దీనికిగాను జిల్లాలో ఎస్పీ యు.రవిప్రకాష్ ప్రత్యేక సెల్ఫోన్ ట్రాకింగ్ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందంలో దిశా పోలీసు స్టేషన్కు సంబంధించిన ఎస్సైతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐడీ డిపార్ట్మెంట్కు చెందిన ముగ్గురు సిబ్బంది పనిచేస్తున్నారు. బృంద సభ్యులు తమ రోజువారి విధి నిర్వహణతోపాటు ఫోన్ల రికవరీని కూడా చేస్తున్నారు. పోలీసులు రికవరీ చేసిన ఫోన్లలో ఇతర రాష్ట్రాల్లో వినియోగిస్తున్న ఫోన్లు కూడా ఉండటం విశేషం. నా ఫోన్ దొరికింది మోటారు సైకిల్పై భీమమరం నుంచి నిడదవోలు వెళ్తుండగా ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించాడు. నిడదవోలు స్టేషన్లో కంప్లయింట్ చేశాను. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫోన్ పోగా వెతికి పట్టుకుని జూన్లో అందజేశారు. పోయిన ఫోన్ దొరకడం ఆనందంగా ఉంది. – షేక్ బాషా, భీమవరం సెల్ఫోన్ ట్రాకింగ్ బృందం ద్వారా.. సెల్ఫోన్ దొరికితే పోలీసుస్టేషన్లలో అందజేయాలి. అక్రమంగా వినియోగించినా, ఆధారాలు లేకుండా కొనుగోలు చేసినా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో సెల్ఫోన్ ట్రాకింగ్ బృందం ఏర్పాటుచేసిన తర్వాత ఇప్పటివరకు రూ.1,20,15,000 విలువైన 801 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు ఒకసారి ఫిర్యాదు చేసి మిన్నకుండి పోకూడదు. కొన్నిరోజుల తర్వాత మరలా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. – యు.రవిప్రకాష్, ఎస్పీ, భీమవరం -
సెల్ ఫోన్ వాడొద్దన్నందుకు..
బోయినపల్లి(చొప్పదండి): పదోతరగతిలో మంచి జీపీఏతో పాసైన ఓ విద్యార్థిని సెల్ఫోన్ వాడొద్దని మందలించడంతో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బోయినపల్లి మండలం విలాసాగర్లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. విలాసాగర్కు చెందిన శేఖర్–లావణ్య దంపతుల కూతురు పోలె శరణ్య (16), ఇటీవలే పదోతరగతిలో 8.3 జీపీఏతో పాసైంది. శనివారం సెల్ఫోన్ చూస్తుండగా శరణ్యను తండ్రి మందలించడంతో రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లోనే పడుకుంది. తెల్లారి చూసేసరికి శరణ్య కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలో వెతుకుతుండగా సాయంత్రం ఓ బావిలో శరణ్య శవమై కనిపించింది. సెల్ఫోన్ వాడొద్దని మందలించినందుకు మనస్థాపం చెందిన శరణ్య మర్లపేట నుంచి విలాసాగర్ వెళ్లే దారిలోని ఓ వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణం చెందినట్లు తండ్రి శేఖర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్ పేర్కొన్నారు. -
రూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్లో నీటిని ఎత్తిపోశాడు.. తీరా చూస్తే..
అసలే ఎండాకాలం. నీటి ఎద్దడి సమస్యను చాలా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ఎదుర్కొంటున్నారు. డబ్బుల లాగే నీటిని కూడా పొదుపుగా వాడాల్సిన పరిస్థితి తలెత్తింది. నీటిని కానీ ఓ అధికారి తన సెల్ఫోన్ కోసం ఏకంగా రిజర్వాయర్లోని నీటిని బయటకు ఎత్తిపోశారు. తన స్వార్థం కోసం వందల ఎకరాలకు సాగునీరు అందించే నీటిని వృథా చేశాడు. ఏం అని ప్రశ్నిస్తే.. ఆ నీరు వాడుకకు పనికిరానిదని, కలెక్టర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్లు చెబుతున్నాడు. అసలు ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో చుద్దాం.. చత్తీస్గఢ్ రాష్ట్రం కంకారా జిల్లాలోని కొల్లిబేడ ప్రాంతానికి చెందిన రాజేశ్ విశ్వాస్ ఆహార ధాన్యాల సరాఫర శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. సెలవు దినాన్ని సరదాగా గడపడానికి ఖేర్కట్ట డ్యామ్కు వచ్చారు. అక్కడ సెల్ఫీ తీసుకునే క్రమంలో తన రూ.లక్ష విలువైన స్మార్ట్ఫోన్ రిజర్వాయర్లో జారిపడింది. స్థానిక ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. డ్యామ్ దాదాపు 15 అడుగుల లోతు ఉంటుందని, నీరు 10 అడుగుల లోతు ఉన్నాయని భావించారు. దీంతో 30హెచ్పీ సామర్థ్యం కలిగిన రెండు మోటార్లను మూడు రోజులపాటు ఉపయోగించి 21 లక్షల లీటర్ల నీటిని నీటిని ఎత్తిపోశారు. గత సోమవారం నుంచి గురువారం వరకు నిరంతరాయంగా నీటిని తోడిపోశారు. ఈ నీటితో దాదాపు 1500 ఎకరాల సాగుకు ఈ నీరు అందించవచ్చు. చివరికి స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన నీటివనరుల శాఖ అధికారులు ఆ ప్రక్రియను నిలుపుదల చేశారు. కానీ అప్పటికే 21 లక్షల లీటర్లను తోడిపోసినట్లు అధికారులు చెప్పారు. అయితే చివరికి రాజేష్కు తన ఫోన్ లభించింది. కానీ అది మూడు రోజులు వాటర్లో ఉండటం వల్ల పనికి రాకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట్లో వైరల్గా మారింది. అనంతరం శుక్రవారం సదరు అధికారిని సస్పెండ్ చేశారు.దీనిపై స్పందించిన నెటిజన్లు ఫుడ్ ఆఫీసర్పై మండిపడుతున్నారు. ఒక ఫోన్ కోసం వందల ఎకరాలకు ఉపయోగపడే నీటిని వృథా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి విలువ తెలిసిన వారు ఇలా చేయరని హితవు పలుకుతున్నారు. అతనిని చట్టం ప్రకారం శిక్షించాలని సూచిస్తున్నారు. చదవండి: Video: విద్యార్థుల ముందే ఓ రేంజ్లో తన్నుకున్న ప్రిన్సిపల్, టీచర్లు దీనిపై ఫుడ్ ఆఫీసర్ రాజేష్ విశ్వాస్ మాట్లాడుతూ.. ‘నేను స్నేహితులతో డ్యామ్లో ఈతకొట్టడానికి వెళ్లాను. ఈ క్రమంలో ఫోన్ నీటిలో పడిపోయింది. అందులో అధికారిక సమాచారం ఉంది. ఈతగాళ్లు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. నాలుగు అడుగుల మేర నీటిని ఎత్తిపోస్తే ఫోన్ను కనిపెట్టోచ్చని అన్నారు. దీంతో స్థానిక నీటి వనరుల అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాను. నా ఫోన్ దొరికింది. ఈ నీరు సాగుకు పనికి రాదు. నా చర్య వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరగలేదు.’ అని తెలిపారు. మరోవైపు రాజేశ్ విశ్వాస్ అనే అధికారికి తాము ఎలాంటి రాతపూర్వక అనుమతి ఇవ్వలేదని నీటి వనరుల అధికారులు పేర్కొన్నారు. కేవలం వర్బల్గానే అనుమతి పొందారని తెలిపారు. నాలుగు అడుగుల మేర నీటిని మాత్రమే ఎత్తిపోయడానికి అనుమతి ఇచ్చామని, అంతకంటే ఎక్కువ నీటిని ఎత్తిపోశారని అధికారులు తెలిపారు. #Chhattisgarh के अंतागढ़ में फूड इंस्पेक्टर ने अपना मोबाइल खोजने के लिए बहा दिया परलकोट जलाशय का 21 लाख लीटर पानी! फोन मिल गया फूड इंस्पेक्टर का कहना है - उन्होनें कुछ गलत नहीं किया, वहीं मंत्री @amarjeetcg कार्रवाई की बात कह रहे है।@ZeeMPCG @mohitsinha75 @RupeshGuptaReal pic.twitter.com/c0qcPpOUrd — कुलदीप नागेश्वर पवार Kuldeep Nageshwar Pawar (@kuldipnpawar) May 26, 2023 -
మొబైల్ ఫోన్ పోయిందా? ఇక చింతే లేదు.. త్వరలో పటిష్ట వ్యవస్థ!
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఇక చింతాల్సిన అవసరం లేదు. పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బ్లాక్ చేసే పటిష్టమైన వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తోంది. పీటీఐ వార్తా సంస్థ నివేదిక ప్రకారం... ప్రభుత్వం ఈ వారంలో ట్రాకింగ్ సిస్టమ్ను విడుదల చేయనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్) టెక్నాలజీ డెవలప్మెంట్ బాడీ సెంటర్ ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక, నార్త్ ఈస్ట్ రీజియన్లతో సహా కొన్ని టెలికాం సర్కిళ్లలో CEIR సిస్టమ్ను పైలట్గా నడుపుతోందని ఒక సీనియర్ అధికారి ద్వారా తెలిసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు పాన్-ఇండియా విస్తరణకు సిద్ధంగా ఉందని, మే 17న పాన్-ఇండియా లాంచ్కు షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం. దేశంలోని అన్ని టెలికాం నెట్వర్క్లలో క్లోన్ చేసిన మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తనిఖీ చేసే ఫీచర్లను సీడాట్ ఈ వ్యవస్థలో పొందుపరిచింది. దేశంలో మొబైల్ ఫోన్ల విక్రయానికి ముందు వాటి IMEI నంబర్ను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. IMEI అనేది 15 అంకెల సంఖ్య. ఇది ప్రతి మొబైల్ ఫోన్కు ప్రత్యేకంగా ఉంటుంది. ఆమోదించిన IMEI నంబర్లను యాక్సెస్ చేసే వీలు మొబైల్ నెట్వర్క్లకు ఉంటుంది. అంటే తమ నెట్వర్క్లో ఏదైనా అనధికార మొబైల్ ఫోన్లు ప్రవేశిస్తే ఇవి పసిగట్టగలవు. టెలికాం ఆపరేటర్లు, CEIR వ్యవస్థ మొబైల్ ఫోన్ల IMEI నంబర్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్లను గుర్తించగలవు. ఈ సమాచారం ఆధారంగా పోగొట్టుకున్న లేదా చోరీ గురైన మొబైల్ ఫోన్లను సులువుగా ట్రాక్ చేయవచ్చు. ఇదీ చదవండి: Mothers Day: బడా వ్యాపారవేత్తలైనా తల్లిచాటు బిడ్డలే.. టాప్ బిజినెస్ టైకూన్స్ మాతృమూర్తుల గురించి తెలుసా? -
చార్జింగ్లో ఉండగా ఫోన్కాల్
నర్సీపట్నం: నర్సీపట్నం కోమటవీధికి చెందిన కె.లక్ష్మణ్ (25) విద్యుత్ షాక్తో శుక్రవారం మృతి చెందాడు. టౌన్ సీఐ ఎన్.గణేష్ కథనం... మృతుడు లక్ష్మణ్ శుభకార్యాల క్యాటరింగ్ బాయ్స్ను సరఫరా చేస్తుంటాడు. ఇంటి దగ్గర ఫోన్ చార్జింగ్లో ఉన్నప్పుడు కాల్ రావడంతో ఫోన్లో మాట్లాడుతుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్కు గురయ్యాడు. వెంటనే బంధువులు సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిపుణుల సూచనలివే..! ► మొబైల్ చార్జింగ్ అవుతుండగా వాడరాదు ► చార్జ్ అవుతున్నప్పుడు సాధారణంగా ఫోన్ వేడెక్కుతుంది ► ఆ సమయంలో వాడితే అది మరింత వేడిగా మారుతుంది ► ఫోన్ అధిక వేడికి గురైతే అందులోని బ్యాటరీ పాడవుతుంది ► బ్యాటరీ లైఫ్టైం తగ్గిపోయే అవకాశం ఉంది ► పరిమితికి మించి వేడైనప్పుడు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది ► చార్జింగ్ అవుతున్నప్పుడు వాడితే అధిక వేడివల్ల మంటలు కూడా రావొచ్చు ► తడి చేతులతో చార్జింగ్ పెట్టరాదు.. ఫోన్ వాడరాదు ► నేల తడిగా ఉన్న ప్రాంతంలో చార్జింగ్ పెడితే షాక్ కొట్టే చాన్స్ ఉంది. Smartphone Explosion: చిన్నారి ప్రాణం తీసిన స్మార్ట్ఫోన్.. స్పందించిన కంపెనీ -
PM Modi: ప్రధాని మోదీకి ఇదేం భద్రత?!
బెంగళూరు: ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లలో లోపం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరోసారి బయటపడింది. ఎస్పీజీ స్థాయి భద్రత ఉన్న ఓ ప్రధాని స్థాయి వ్యక్తి కాన్వాయ్లోకి ఇతర వాహనాలు రావడం, తరచూ కొందరు అతిసమీపంగా రావడం గతంలో చూశాం. ఆయా ఘటనలపై విమర్శలు రావడం తెలిసిందే. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ అలాంటి సీన్ రిపీట్ అయ్యింది. ఆదివారం మైసూర్ ప్రధాని మోదీ రోడ్షోలో పాల్గొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం పైకి ఓ మొబైల్ వచ్చి పడింది. రోడ్షోకు హాజరైన ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న టైంలో ఇది జరిగింది. మోదీకి అతి సమీపంగా వెళ్లి.. వాహనం బొనెట్పై మొబైల్ పడింది. ఈ విషయాన్ని ఎస్పీజీ సిబ్బంది గమనించినా.. వాహనం ఆగకుండా ముందుకు పోయింది. అయితే.. ఈ ఘటనపై ప్రధాని మోదీ సెక్యూరిటీ బృందం దర్యాప్తు చేపట్టింది. విచారణలో.. ఆ మొబైల్ బీజేపీ మహిళా కార్యకర్తదేనని తేలింది.మోదీపై పూలు వేసే క్రమంలో, అత్యుత్సాహంతో ఆ మహిళ మొబైల్ సైతం విసిరారని భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) అధికారులు ఆమెను వదిలేశారు. #WATCH | Security breach seen during Prime Minister Narendra Modi’s roadshow, a mobile phone was thrown on PM’s vehicle. More details awaited. pic.twitter.com/rnoPXeQZgB — ANI (@ANI) April 30, 2023 ఇదిలా ఉంటే.. తాజా కేరళ పర్యటనలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ మొబైల్ ఆయన కాళ్ల దగ్గర పడింది. వెంటనే.. పక్కనున్న సిబ్బంది దానిని పక్కకు తన్నేశారు. ఎస్పీజీ స్థాయి భద్రతా సిబ్బంది ఉన్న ప్రధానికి.. స్థానిక పోలీసుల భద్రతా భారీగా కల్పిస్తున్నప్పటికీ పెద్దగా ఆంక్షలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శ వినిపిస్తోంది ఇప్పుడు. Amazing reflex of PM Modi's SPG. Today during his roadshow at Kochi, someone threw a mobile along with flowers by mistake and see how the SPG personal reacted. pic.twitter.com/s4YhxJycEi — നചികേതസ് (@nach1keta) April 24, 2023 #WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police. (Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz — ANI (@ANI) March 25, 2023 #WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi. (Source: DD) pic.twitter.com/NRK22vn23S — ANI (@ANI) January 12, 2023 ఇదీ చదవండి: బుల్లి పట్టణాల్లోనూ బిలియనీర్లు -
Smartphone Explosion: చిన్నారి ప్రాణం తీసిన స్మార్ట్ఫోన్.. స్పందించిన కంపెనీ
మొబైల్లో వీడియో చూస్తూ చిన్నారి మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. షావోమీ సంస్థ ఘటనపై స్పందించింది. బాధిత కుటుంబానికి ఎటువంటి సాయమైనా చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కేరళలోని త్రిసూర్లో ఎనిమిదేళ్ల ఆదిత్యశ్రీ స్మార్ట్ఫోన్లో వీడియో చూస్తుండగా అది ఒక్కసారిగా పేలింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఘటనపై స్థానిక పోలీసుల బృందం దర్యాప్తు చేస్తోంది. అన్ని ఆధారాలు సేకరించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది. ఇక ఈ ఘటనకు కారణమైన మొబైల్ ఫోన్ మోడల్ రెడ్ మీ అని కొన్ని రిపోర్టులు వెల్లడించాయి. అయితే, ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసు అధికారులు చెప్తున్నారు. (చదవండి: చేతిలో స్మార్ట్ఫోన్..వెన్నెముక డౌన్!) ఫోన్ పేలిన ఘటనపై రెడ్ మీ మొబైల్స్ మాతృ సంస్థ షావోమీ ఇండియా ప్రతినిధులు స్పందిస్తూ.. వినియోగదారుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో బాధిత కుటుంబానికి సాధ్యమైనంత మేర అండగా ఉంటామని చెప్పారు. కొన్ని రిపోర్టులు రెడ్ మీ మొబైల్ పేలిందని చెప్తున్నాయి. అదింకా నిర్ధారణ కాలేదని, అధికారులకు సహకరించి నిజానిజాలు నిగ్గులేందుకు కృషి చేస్తామన్నారు. (స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు) కాగా, మొబైల్ ఫోన్లు పేలడం ఇదే తొలిసారి కాదు. కొన్ని నెలల క్రితం తన మొబైల్కు చార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టి ఒక యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని బదువాలో జరిగింది. మరో ఘటనలో 68 ఏళ్ల పెద్దాయన, చార్జ్ అవుతున్న మొబైల్లో మాట్లాతుండగా షాక్ కొట్టింది. ఆయన స్పాట్లో విగతజీవిగా మారాడు. ఇలాంటివే మరికొన్ని ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. వీటన్నింటిలో ముఖ్యంగా గమనించిన అంశాలేంటంటే.. ఫోన్ చార్జింగ్లో ఉండగా వాడటం. నిపుణుల సూచనలివే..! ► మొబైల్ చార్జింగ్ అవుతుండగా వాడరాదు ► చార్జ్ అవుతున్నప్పుడు సాధారణంగా ఫోన్ వేడెక్కుతుంది ► ఆ సమయంలో వాడితే అది మరింత వేడిగా మారుతుంది ► ఫోన్ అధిక వేడికి గురైతే అందులోని బ్యాటరీ పాడవుతుంది ► బ్యాటరీ లైఫ్టైం తగ్గిపోయే అవకాశం ఉంది ► పరిమితికి మించి వేడైనప్పుడు బ్యాటరీ పేలిపోయే ప్రమాదం ఉంది ► చార్జింగ్ అవుతున్నప్పుడు వాడితే అధిక వేడివల్ల మంటలు కూడా రావొచ్చు ► తడి చేతులతో చార్జింగ్ పెట్టరాదు.. ఫోన్ వాడరాదు ► నేల తడిగా ఉన్న ప్రాంతంలో చార్జింగ్ పెడితే షాక్ కొట్టే చాన్స్ ఉంది. -
మనం చూసిన సాంకేతిక విప్లవం
ప్రపంచంలో మొబైల్ ఫోన్లు మొదలై యాభై ఏళ్లయ్యింది. అవి ఇండియాలోకి ప్రవేశించి నలభై ఏళ్లయ్యింది. అప్పట్లో ఆ ఫోన్లు అడుగు పరిమాణంలో ఉండేవి. వాటితో కేవలం మాట్లాడగలం. మెసేజులు, ఫొటోలు పంపలేము. 1990లలో ఇండియాలో మొబైల్ సేవలు ఊపందుకున్నాయి. అప్పుడు కూడా ‘టాక్ టైమ్’ ఖరీదైన వ్యవహారం. కానీ తర్వాతి రెండు దశాబ్దాల్లో అనేక మలుపులు తిరిగాయి. పాలసీ మార్పులు, ప్రీ–పెయిడ్ సర్వీస్, ఛోటా రీచార్జ్, సర్వీస్ నెట్వర్క్ల విస్తరణ, స్థానిక తయారీ వంటివన్నీ కలిసి మొబైల్ ఫోన్ సేవలను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చాయి. ఆధునిక మానవ చరిత్రలో అనేకమంది ప్రజల జీవితాలను స్పృశించిన అతి గొప్ప సాంకేతిక సాధనం మొబైల్ ఫోన్! ఆధునిక మానవ చరిత్రలో అనేకమంది ప్రజల జీవితాలను స్పృశించిన అతి గొప్ప సాంకేతిక సాధనం మొబైల్ ఫోన్. భారతదేశం స్వాతంత్య్రం పొందిన పలు దశాబ్దాల తర్వాత సగటు కుటుంబాలకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతలు సైకిల్, చేతి గడియారం, లేదా ట్రాన్సిస్టర్ రేడియో మాత్రమే. 1960లు, 1970లలో నాలాగా భారత్లో పుట్టి పెరిగినవారు అప్పట్లో ఫోన్ కలిగి ఉండటం ఒక విలాసంగా ఉండేదని మీకు చెబుతారు. టెలిఫోన్ కనెక్షన్ కోసం వేచి ఉండే సమయం అయిదు నుంచి ఏడేళ్ల వరకు ఉండేది. ఫోన్ ఉన్న కుటుంబాలకు ఇరుగుపొరుగు వద్ద చాలా డిమాండ్ ఉండేది. తమ సంబంధీకుల కాల్స్ అందుకోవడానికి వారు ఈ సౌకర్యాన్ని ఉపయో గించుకునేవారు. వారు ఆ నంబర్ను పీపీ (ప్రైవేట్ పార్టీ) అని పంచు కునేవారు. అనధికారికంగా తమ ఫోన్లను ఇతరులు వాడకుండా యజ మానులు వాటిని లాక్ చేసేవారు. (ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు స్క్రీన్ లాక్ లాగా అప్పుడు ఫోన్ డయలర్ని లాక్ చేసేవారు.) నా తరం వారు నిజంగానే తమ జీవితకాలంలో లాండ్లైన్ ఫోన్ల నుంచి సర్వవ్యాపి అయిన స్మార్ట్ ఫోన్ల వరకు సంభవించిన సాంకేతిక వివ్లవానికి సాక్షీభూతులయ్యారు. మొబైల్ ఫోన్ ను 50 సంవత్సరాల క్రితమే ఆవిష్కరించారు. న్యూయార్క్లోని దాని ఆవిష్కర్త మార్టిన్ కూపర్ ప్రపంచంలోనే మొట్టమొదటి మొబైల్ కాల్ను 1973 ఏప్రిల్ 3న చేశారు. పాశ్చాత్య ప్రపంచంలో కూడా మొబైల్ ఫోన్ వినియోగదారీ వస్తువుగా మారటానికి దాదాపు రెండు దశాబ్దాలు పట్టింది. లాండ్లైన్ లాగే, మొబైల్ ఫోన్ కూడా ప్రారంభంలో విలాసంగానే ఉండేది. 1980లలో దాని ధర అమెరికాలో 4,000 డాలర్లు. వాటి పరిమాణం పెద్దదిగా ఒక అడుగు ఉండేది. దాన్ని ‘ఇటుక ఫోన్’ అనేవారు. 1990ల మధ్యలో నేను ఉపయోగించిన తొలి మొబైల్ ఇటుక సైజు కంటే కాస్త చిన్నదిగా ఉండేది. అప్పటికీ అది ఏ జేబులోనూ పట్టేది కాదు. ధర సుమారు యాభై వేలు. నేను పని చేస్తుండిన టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ, ఫీల్డ్ అసైన్ మెంట్ల కోసం వెళ్లే విలేఖరుల కోసం కొన్ని హ్యాండ్ సెట్లను అద్దెకు తీసుకుంది. అవి ఒక డయలింగ్ ప్యాడ్తో కూడిన భారీ పరికరం, పొడుచుకువచ్చిన యాంటెన్నా, మందమైన రింగ్టోన్ తో ఉండేవి. గుర్తుంచుకోండి, దాంతో కేవలం మాట్లాడగలరు. మెసేజ్ చేయలేరు, ఫొటోలు పంపలేరు. మొబైల్ టెలిఫోన్ యుగంలోకి భారత్ 1987 జనవరి 1న ప్రవేశించిందని కొద్దిమందికే తెలుసు. మహానగర్ టెలిఫోన్ నిగమ్ తన ‘మొబైల్ రేడియో ఫోన్ సర్వీస్’ను ఢిల్లీలో ప్రారంభించడం ద్వారా ఇది మొదలైంది. అది కారులో అమర్చిన ఫోన్ యూనిట్ని ఉప యోగించి ప్రయాణిస్తున్నప్పుడు మాట్లాడటానికి వీలయ్యే ఒక ప్రాథమికమైన కార్ ఫోన్ సర్వీస్. కొన్ని డజన్ల ఫోన్లను మాత్రమే అప్పట్లో వ్యవస్థాపించారు. 1992లో దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో సెల్యులార్ టెలిఫోన్ సేవలను అందించడానికి ప్రైవేట్ కంపెనీలకు లైసెన్స్ ఇచ్చారు. మొట్టమొదటి వాణిజ్యపరమైన సెల్యులార్ మొబైల్ కాల్ను 1995 జూలై 31న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు కలకత్తా నుంచి న్యూఢిల్లీలో ఉన్న సమాచార మంత్రి సుఖ్రామ్కు చేశారు. కలకత్తాలో మొబైల్ కాల్ సర్వీస్ను మోడీ–టెల్స్ట్రా (బీకే మోడీ గ్రూప్, ఆస్ట్రేలియాకు చెందిన టెల్స్ట్రా జాయింట్ వెంచర్) అందించాయి. కొన్ని నెలల తర్వాత ఢిల్లీలో ‘భారతి’ సెల్యులార్ సేవలు ఆరంభించింది. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లో మాట్లాడటం ఖరీదైన వ్యవహారంగా ఉండేది – ఒక కాల్ చేయాలంటే నిమిషానికి రూ. 16.80, కాల్ రిసీవ్ చేసుకోవాలంటే రూ. 8.40 చెల్లించాల్సి వచ్చేది. ఫస్ట్ జనరేషన్ (1జి) డేటా టెక్నాలజీ అయిన జనరల్ పాకెట్ రేడియో సర్వీస్ (జీఆర్పీఎస్) అందించడానికి ఫోన్ కంపెనీలకు మరి కొన్నేళ్లు పట్టింది. తర్వాతి రెండు దశాబ్దాల్లో అనేక మలుపులు తిరిగాయి. పాలసీ మార్పులు, ప్రీ–పెయిడ్ సర్వీస్, ఛోటా రీఛార్జ్, కొత్త ప్రాసెసింగ్ టెక్నాలజీలు, దూకుడైన రోలవుట్ ప్లాన్స్, సర్వీస్ నెట్వర్క్ల విస్తరణ, లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటివన్నీ కలిసి భారతీయులకు మొబైల్ ఫోన్లను సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చాయి. అధిక కాల్ ఛార్జీలు పాతకథ అయిపోయాయి. జీఆర్పీఎస్ నుంచి, సూపర్ ఫాస్ట్ డేటా స్పీడ్ వరకు పయనించాం. మొబైల్ ఫోన్లు అంటే గతంలోలా ఎమర్జెన్సీ కాల్స్ చేసుకోవడానికి మాత్రమే కాదు, వినోదం నుంచి బ్యాంకింగ్ వరకు ప్రతి అవసరానికీ ఉపయోగపడుతున్నాయి. పిల్లలుగా ఉన్నప్పుడు, ల్యాండ్ లైన్ ఫోన్లో మనం సమాధానం ఇస్తుండగా మనకు కాల్ చేస్తున్న వ్యక్తి చిత్రాన్ని చూడటం సరదాగా ఉంటుందని జోక్ చేయడం నాకు గుర్తుంది. వీడియో కాల్స్ నిజంగానే ఇప్పుడు చిన్నపిల్లలాట అయిపోయింది! భారతీయ సెల్ఫోన్ విప్లవంలో మలుపులు టాక్ టైమ్కు ఎక్కువ ఖర్చు అవుతుండటం మొబైల్ ఫోన్లను సృజనాత్మకంగా ఉపయోగించడానికి దారితీసింది. సాధారణంగా, మీరు ఒక నంబరుకు కాల్ చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తి కాల్ తీసు కోలేనప్పుడు దాన్ని మిస్డ్ కాల్ అంటారు. టాక్ టైమ్ ఆదా చేయ డానికి, జనం మిస్డ్ కాల్స్ చేయడం ప్రారంభించారు. ఉద్దేశపూర్వకంగా ‘కాల్ మి బ్యాక్’, ‘నేను చేరుకున్నాను’ వంటి ముందస్తుగా నిర్దేశించిన సందేశాలను తెలియచేయడానికి మిస్డ్ కాల్స్ ఇస్తుంటారు. యజమానులకూ, డ్రైవర్లు, ఇంటి పనిమనుషులు వంటి పరిమితమైన టాక్ టైమ్ ఉన్న వారికీ మధ్య సమాచారానికి ఇది అనుకూలమైన సాధనం. కంపెనీలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విభాగాలు తరచుగా వాడే మార్కెటింగ్ సాధనమే మిస్డ్ కాల్. సామాన్య ప్రజలకు మొబైల్ ఫోన్ ని రోజువారీ సాధనంగా చేసే ప్రయాణంలో ప్రీ–పెయిడ్ సర్వీస్ ఒక కీలక మలుపు. నెల చివరలో బిల్ని చెల్లించడానికి బదులుగా వినియోగదారులు టాక్ టైమ్ని కొని, దాన్ని నిర్దిష్ట కాలంలో తమ అవసరాల కోసం ఉపయో గిస్తారు. మరొక వినూత్న ఆవిష్కరణ ‘ఛోటా రీఛార్జ్’ లేదా మైక్రో రీఛార్జ్ కూపన్లు. నెలకు 200 లేదా 300 రీఛార్జ్కి బదులుగా కేవలం ఐదు రూపాయలకే చోటా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కూరగాయల వ్యాపారి, వ్యవసాయ కూలీ వంటివారికి కూడా మొబైల్ సేవలను సరసమైన ధరకు అందించే గేమ్ ఛేంజర్ అయ్యింది. ఎఫ్ఎమ్సీజీ సిమ్ కార్డులు, రీఛార్జ్ సేవల రూపంలో ఫోన్ సర్వీస్ని స్థానిక పచారీ కొట్లు, ఫార్మసీలు, పాన్ షాపుల్లో విస్తృతంగా అందుబాటులో ఉంచడం జరిగింది. టెలికామ్ సంస్థల కోసం ‘పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్’ లాగా సేవ చేయడమే కాకుండా, ఈ ఫ్రాంచైజీలు కంపెనీ స్టోర్లలోని కస్టమర్ రిలేషన్స్ ఉద్యోగుల లాగా చందాదారుల సమస్యలను లాంఛనప్రాయంగా పరిష్కరి స్తాయి. ఫోన్లు, వాటి సేవలు వేగంగా అమ్ముడయ్యే వినియోగ సరుకులు (ఎఫ్ఎమ్సీజీ)గా మారిపోయాయి. దినేష్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి
సాక్షి, తిరువనంతపురం: మొబైల్ ఫోన్ పేలి ఎనిమిదేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన కేరళలోని తిరువిల్వమలలో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎనిమిదేళ్ల అదిత్య శ్రీ అనే చిన్నారి మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండగా చిన్నారి ముఖంపైనే పేలింది. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన సోమవారం రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ చిన్నారి స్థానిక స్కూల్లో మూడో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మొబైల్ ఫోన్ పేలుడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఐఏఎస్ హత్య కేసు నిందితుడి విడుదల దుమారం..బిహార్ సీఎంపై విమర్శలు) -
ఫోన్ పోతే.. ఇలా వెతకండి!
షాపింగ్ నుంచి ఇంటికి వచ్చిన వసుధ తెచ్చిన వస్తువులన్నీ లోపల సర్దేసి, వచ్చి కూచుంది. సడెన్గా ఏదో గుర్తుకువచ్చినట్టు అయ్యి ఫోన్ కోసం వెతికింది. చూస్తే, ఎక్కడా కనిపించలేదు. బ్యాగ్, ఇంటిలోపల అంతా చెక్ చేసింది. ఫోన్ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఖరీదైన ఫోన్, అందులో వందలాది కాంటాక్ట్ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. అనుకునేసరికి కాసేపటి వరకు ఏం చేయాలో అర్ధం కాలేదు. తన ముఖ్యమైన డేటా పోతే వచ్చే సమస్యలు తలుచుకుని చెమటలు పట్టేశాయి. ∙∙ వసుధ సమస్య చాలామంది ఎదుర్కొనే ఉంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఫోన్ ట్రాక్ చేయాలన్నా, మన వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండటానికి మార్గమే లేదా? అనుకునేవారికి సరైన సమాధానంగా సిఇఐఆర్ వరదాయినిగా మారింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ∙∙ నకిలీ మొబైల్ ఫోన్ల క్రయవిక్రయాలకు అడ్డుకట్టవేయడానికి, మొబైల్ ఫోన్ దొంగతనాన్ని అరికట్టడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా చట్టబద్ధమైన రక్షణ కలిగించడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఏర్పాటు చేసింది. సిఇఐఆర్ పోర్టల్ ప్రయోజనాలు: https://ceir.gov.in పోర్టల్ పోగొట్టుకున్న లేదా దొంగలించిన మొబైల్ పరికరాలను ట్రాక్ చేయడానికి ఐఎమ్ఇఐ నంబర్ను ఉపయోగిస్తుంది. సిఇఐఆర్ ద్వారా మొబైల్ పరికరం బ్లాక్ చేశాక, అది ఏ భారతీయ నెట్వర్క్ కంపెనీకి కనెక్ట్ చేయలేరు. ఆ పరికరాన్ని ఇక తిరిగి ఉపయోగించలేనిదిగా మార్చేస్తుంది. పోర్టల్లో మొబైల్ ఫోన్ను బ్లాక్ చేయడానికి.. ►ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. లేదా కోల్పోయిన డివైజ్ సర్టిఫికెట్ లేదా మీ అక్నాలెడ్జ్ కాపీని తీసుకోవాలి. ►మీ సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ తీసుకోవాలి. ►సిఇఐఆర్ పోర్టల్కు లాగిన్ అయ్యి, కంప్లైంట్ కాపీ, ఐడెంటిటీ (ఆధార్ కార్డ్) ప్రూఫ్ని యాడ్ చేయాలి. https://www.ceir.gov.in/Request/CeirUserBlockRequestDirect.jsp ►మీ ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ ఐడీ జనరేట్ అవుతుంది. ►మొబైల్ నంబర్ను బ్లాక్ చేయడానికి తగిన కారణం ఏంటో తెలియజేయాలి. ►మీ రిజిస్టర్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి. ఐఎమ్ఇఐ నంబర్ను చెక్ చేయడానికి.. ►ముందు పోర్టల్కి లాగిన్ అవ్వాలి. https://ceir.gov.in/ Device/CeirIMEI Verification.jsp ►మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ►మీ మొబైల్కి ఓటీపి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ►15 అంకెల ఐఎమ్ఇఐ నంబర్ను నమోదు చేసి, చెక్ రిక్వెస్ట్ అనే దానిపై క్లిక్ చేయాలి. ►ఐఎమ్ఇఐ నంబర్ ధ్రువీకరణ అవుతుంది. సిఇఐఆర్ పోర్టల్లో మీ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేయడానికి.. ►పోర్టల్లోకి లాగిన్ అవ్వాలి. https://ceir.gov.in/Request/CeirRequestStatus.jsp ►రిక్వెస్ట్ స్టేటస్ ఆప్షన్ను చెక్ చేస్తే, తెలిసిపోతుంది. పోర్టల్లో రికవరీ మొబైల్ ఫోన్ని అన్బ్లాక్ చేయడానికి.. https://ceir.gov.in/ Request/CeirUser UnblockRequest Direct.jsp పోర్టల్కు లాగిన్ అవ్వాలి. ►రిక్వెస్ట్ ఐడీని ఎంటర్ చేయాలి. ►మొబైల్ నంబర్ను అన్బ్లాక్ చేయడానికి కారణాన్ని ఇవ్వాలి. డివైజ్ను గుర్తించాక డేటాను తొలగించడానికి.. ►ఆండ్రాయిడ్ డివైజ్ డేటాను లాక్ లేదా ఎరేజ్ చేయడానికి https://support.google.com/ accounts/answer/6160491?hl=en ►ఐ ఫోన్ అయితే.. iCloud.com లో ఫైండ్ మై ఐఫోన్ అని సెర్చ్ చేసి, డేటా తొలగించాలి. https://support.apple.com/en-in/guide/icloud/mmfc0ef36f/icloud పోయిన మొబైల్ డేటా సురక్షితంగా ఉంచడానికి.. ►ఈ పోర్టల్ పూర్తిగా చట్టబద్ధమైనది. ఫోన్ ట్రాక్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. మీ డేటా, యాప్స్ను డీకంపైల్ చేయదు. https://reports.exodus-privacy.eu.org/en/ ►మీ మొబైల్ నంబర్లను నిర్ధారించడానికి, తీసేయడానికి టెలికాం విభాగాం అనుమతిస్తుంది. https://tafcop.dgtelecom.gov.in ►ఎస్సెమ్మెస్లు, బల్క్ ఎస్సెమ్మెస్లు పంపినవారిని గుర్తించడానికి అనుమతిస్తుంది. https://smsheader.trai.gov.in ►ఎస్సెమ్మెస్, వాట్సప్, ఇమెయిల్లో వచ్చిన షార్ట్ లింక్స్ మీ వ్యక్తిగత డేటాను డామేజీ చేయవచ్చు. అందుకని, షార్ట్ లింక్స్ పూర్తి యుఆర్ ఎల్ వివరాలను https://isitphishing.org/ ద్వారా చెక్చేయవచ్చు. ►యాంటీవైరస్, యాంటీ మాల్వేర్, సెక్యూరిటీ యాప్లను ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉంటే వాటిని గుర్తించడంలో సహాయపడుతుంది. ∙అన్ని అప్లికేషన్లు, సోషల్మీడియా, ఇమెయిల్ అకౌంట్స్ కోసం రెండంచెల ప్రామాణీకరణను ఉపయోగిస్తే, డేటా సురక్షితంగా ఉంటుంది. బ్లాక్ చేస్తే.. పనిచేయదు బ్లాక్ లిస్ట్ చేసిన మొబైల్ పరికరాలను షేర్ చేయడానికి నెట్వర్క్ ఆపరేటర్లకు సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్గా సేవలందిస్తూ, అన్ని మొబైల్ ఆపరేటర్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎమ్ఇఐ) డేటాబేస్లకు లింక్ చేస్తుంది. సబ్స్క్రయిబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (సిమ్) కార్డ్ మార్చినప్పటికీ ఒక నెట్వర్క్లోని బ్లాక్ చేసిన పరికరాలు ఇతర నెట్వర్క్లలో పనిచేయవని ఇది నిర్ధారిస్తుంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
సోదరుడితో గొడవ, తెగని పంచాయితీ.. కోపంలో చైనా ఫోన్ మింగేసిన యువతి
భోపాల్: ఇంట్లో పిల్లలు అలగడం, కోపడడం మనం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలో చిన్నారులు తొందర పడి ఏది పడితే అది చేస్తూ ఉంటారు. కొందరు తమను తామే గాయపరుచుకుంటే.. ఇంకొందరు ఇతరులకు గాయం చేస్తుంటారు. ఏదేమైనా ఆ తర్వాత పరిణామాలను మాత్రం వాళ్లు ఊహించరు. సరిగ్గా ఈ తరహా ఘటనే మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. సోదరుడిపై కోపంతో ఓ యువతి ఏకంగా ఫోన్ మొత్తాన్ని మింగేసింది. ఆ తర్వాత ఏమైందంటే? వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో 18 ఏళ్ల యువతి తన సోదరుడితో చైనా మొబైల్ ఫోన్ విషయంలో గొడవ మొదలైంది. వీరిద్దరి మధ్య మొదలైన ఈ సమస్యకు ఎంతసేపటికి పరిష్కారం లభించలేదు. దీంతో ఆ యువతికి పట్టారని కోపం వచ్చింది. ఆవేశంలో గొడవకు కారణమైన ఫోన్ను తీసుకుని ఆ యువతి ఆమాంతం మింగేసింది. కోపంతో సెల్ఫోన్ మింగిన వెంటనే ఆమెకు విపరీతమైన కడుపునొప్పి, నిరంతరం వాంతులు అవుతూ వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆమెను గ్వాలియర్స్లోని జయరోగ్య ఆసుపత్రి (జేఏహెచ్)కి తీసుకెళ్లారు. వైద్యులు అల్ట్రాసౌండ్, ఇతర పరీక్షలు నిర్వహించి యువతి కడుపులో మొబైల్ ఫోన్ ఉందని తేల్చారు. ఆ తర్వాత వైద్యుల బృందం ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న మొబైల్ ఫోన్ను విజయవంతంగా బయటకు తీశారు. వైద్యులు దాదాపు రెండు గంటల పాటు ఎమర్జెన్సీ సర్జరీ చేసి యువతి కడుపులోంచి మొబైల్ను బయటకు తీశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని జయరోగ్య ఆసుపత్రి వైద్యులు తెలిపారు. -
తెలుసుకున్నాకే ఫోన్ కొంటున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ ఇప్పుడు అత్యవసర వస్తువుల జాబితాలోకి వచ్చి చేరింది. పొద్దున లేవగానే, అలాగే పడుకునేప్పుడు ఫోన్ ముట్టుకోకుండా ఆ రోజు పూర్తి కాదంటే అతిశయోక్తి కాదేమో. మరి అంతటి ప్రత్యేకత కలిగిన ఫోన్ కొనుగోలు విషయంలో బడెŠజ్ట్ ఒక్కటే కాదు కోరుకునే ఫీచర్లనుబట్టి మోడల్ ఎంపిక జరుగుతోందట. స్తోమత లేనివారు, ఫోన్ వాడకం పెద్దగా అవసరం లేనివారు బేసిక్ ఫోన్లను వాడుతున్నారు. ప్రస్తుతం భారత్లో 60 కోట్ల మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారు. బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్ల వైపు వినియోగదార్లు మళ్లుతుండడం, 5జీ విస్తరణ కారణంగా 2023లో ఈ సంఖ్య 100 కోట్లను దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మార్ట్ఫోన్ రంగంలో ధరల శ్రేణి, కోరుకుంటున్న ఫీచర్లు, వినియోగదార్ల అభిరుచులు వేటికవే ప్రత్యేకం. విలువ ఉండాల్సిందే.. ధర ప్రాధాన్యం కాదు.. డబ్బుకు తగ్గ విలువ ఉండాల్సిందేనన్నది భారతీయుల ఆలోచన. రూ.15 వేలల్లో ఫోన్ కొనాలని భావించిన కస్టమర్ ముందు ఎక్కువ ఫీచర్లున్న ఫోన్ రూ.18 వేలకు లభిస్తే ఖరీదుకు వెనుకాడడం లేదు. ఇక రూ.7 వేల లోపు, అలాగే రూ.30 వేలకుపైగా ఖరీదు చేసే ఫోన్ల ను 2–5 ఏళ్లు వాడుతున్నారట. అదే రూ.15–30 వేల సెగ్మెంట్లో ఆరు నెలలకే మార్చేస్తున్నారు. కారణం యువ కస్టమర్లు కావడం. ఆన్లైన్లో కొనుగోలు చేసే వినియోగదారులకే మొబైల్స్ పట్ల అవగాహన ఎక్కువ. రూ.15 వేల లోపు లభించే ఫోన్లే అధికంగా ఆఫ్లైన్లో అమ్ముడవుతున్నాయి. రూ.15–30 వేల ధరల శ్రేణి మోడళ్ల అమ్మకాల్లో ఆన్లైన్ వాటా ఎక్కువ. ప్రపంచంలోనే ముందంజ.. స్మార్ట్ఫోన్ల పట్ల అవగాహన ఉన్న కస్టమర్లు భారత్లోనే అత్యధికం. కొనుగోలు కంటే ముందే ఆన్లైన్లో మోడళ్ల ఫీచర్లు, రివ్యూలను చూస్తున్నారట. ఈ విధంగా ముందే అవగాహనకు వచ్చి ఫోన్లను చేజిక్కించుకోవడంలో ప్రపంచంలో భారత్ ముందంజలో ఉందని రియల్మీ గ్లోబల్ ప్రొడక్ట్ మేనేజర్ శ్రీ హరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘మొబైల్ కొనుగోలు నిర్ణయంలో యువత కీలకపాత్ర పోషిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు స్మార్ట్ఫోన్ కొనే ముందు వీరిని సంప్రదిస్తున్నారు. మార్కెట్లోకి వస్తున్న మోడళ్లు, ఫీచర్లు, రేటింగ్స్ వంటి విషయాలపై యువతకు ముందే అవగాహన ఉంటోంది’ అని వివరించారు. ధర పరంగా చూస్తే.. ► రూ.7,000 లోపు: ఈ విభాగంలో వినియోగదార్లకు కావాల్సింది ఏదైనా స్మార్ట్ఫోన్. వీరికి ఫీచర్లతో పనిలేదు. అత్యధికంగా ఫీచర్ ఫోన్ నుంచి ఇటువైపు మళ్లినవారే. ఇంకో విషయం ఏమంటే వినోదం కోసం పూర్తిగా వీళ్లు ఆధారపడేది ఈ స్మార్ట్ఫోన్పైనే. ► రూ.7–15 వేలు: స్మార్ట్ఫోన్ రంగంలో ఈ విభాగం వాటా ఏకంగా 50 శాతం ఉంది. అధిక బ్యాటరీ, 6.5 అంగుళాలు, ఆపైన సైజున్న డిస్ప్లే, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ కోరుకుంటున్నారు. ► రూ.15–30 వేలు: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఈ విభాగంలో పట్టణ కస్టమర్లు ఎక్కువ. ముఖ్యంగా యూత్ అధికంగా కొనుగోలు చేసే ధరల శ్రేణి ఇది. మంచి డిజైన్, రెండు లేదా ఎక్కువ కెమెరాలు, అధిక రిజొ ల్యూషన్, ఫుల్ హెచ్డీ, అమోలెడ్ డిస్ప్లే, కర్వ్, 5జీ, ఫాస్ట్ చార్జింగ్, తక్కువ మందం ఉండాల్సిందే. ► రూ.30 వేలు ఆపైన: ఇక్కడ ఫీచర్లు ప్రాధాన్యం కాదు. పెద్ద బ్రాండ్ అయి ఉండాలి. ఈ విభాగంలో కంపెనీలు ఎలాగూ ఒకదాన్ని మించి ఒకటి ఫీచర్లను జోడిస్తాయి అన్నది కస్టమర్ల మనోగతం. -
కవిత వాడుతున్న ఫోన్ను అప్పగించాల్సిందిగా ఆదేశించిన ఈడీ
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం వాడుతున్న ఫోన్ను అప్పగించాల్సిందిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆదేశించారు. దీంతో విచారణ గది నుంచి బయటకొచ్చిన కవిత.. తన పర్సనల్ సెక్యూరిటీ దగ్గరున్న ఫోన్ను ఈడీ అధికారులకు అదించారు. అంతక ముందే ఇంటి వద్ద ఉన్న ఎమ్మెల్సీ ఫోన్ను సెక్యూరిటీతో ఈడీ అధికారులు తెప్పించారు. కవిత ఫోన్లో ఉన్న డేటాను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలకు సంబంధించి ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ ఈడీ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది. జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం అయిదు గంటలుగా ఆమెను ప్రశ్నిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై విచారణ జరుగుతోంది. ఆరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టు, ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కవితను ప్రశ్నిస్తున్నారు. చదవండి: కవితను ప్రశ్నిస్తున్న ఈడీ స్పెషల్ టీమ్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!
కెనడాలో ఘనంగా పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు!
పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ
మే 17 నుంచి సినిమా థియేటర్లు మూత
ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన
సిక్సర్ల మోత.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి
పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
ఈయన పోటీ రైళ్ల కోసం.. ప్రత్యేక మేనిఫెస్టోతో ప్రజల్లోకి..
నలుపు రంగు డ్రెస్లో 'పిచ్చెక్కిస్తున్న' సోషల్ స్టార్ దీప్తి సునైనా (ఫొటోలు)
రామ్-పూరీ 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ ఎలా ఉందంటే?
తప్పక చదవండి
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్పూర్లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- పదేళ్ల తర్వాత.. చాట్జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement