-
వర్షం కారణంగా అర్ధంతరంగా ముగిసిన రెండో రోజు ఆట
Australia vs Pakistan, 3rd Test Day 2: ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా రెండో రోజు కేవలం 46 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆసీస్ పేసర్ల దెబ్బకు టాపార్డర్ కుదేలైంది. ఓపెనర్లు షఫీక్ (0), అయూబ్ (0) డకౌట్ కాగా, కెప్టెన్ షాన్ మసూద్ (35; 3 ఫోర్లు), బాబర్ ఆజమ్ (26; 4 ఫోర్లు) కొద్దిగా పోరాడారు. ఒక దశలో స్కోరు 96/5కి చేరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్న వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (88), ఆగా సల్మాన్ (53) సల్మాన్ ఆరో వికెట్కు 94 పరుగులు జోడించారు. మిగతా వాళ్లంతా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కావడంతో పాక్ ఇక సులువుగానే తలవంచుతుందని ఆసీస్ భావించింది. కానీ పేస్ ఆల్రౌండర్ ఆమిర్ జమాల్ (97 బంతుల్లో 82; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) బ్యాటింగ్లో వీరోచిత పోరాటం చేశాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా పాకిస్తాన్ మెరుగైన స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 77.1 ఓవర్లలో 313 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు అత్యధికంగా ఐదు వికెట్లు దక్కగా.. స్టార్క్ రెండు, మిచెల్ మార్ష్, నాథన్ లియాన్ ఒక్కో వికెట్ తీశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ ఆట నిలిచే సమయానికి 6/0(2) స్కోరు చేసింది. ఈ క్రమంలో గురువారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ 24.3 ఓవర్ వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్(34) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అయితే, అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన మార్నస్ లబుషేన్.. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కానీ అర్ధ శతకానికి మూడు పరుగుల దూరంలో ఉన్న ఖవాజా(47)ను ఆమిర్ జమాల్ అవుట్ చేయడంతో ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. స్టీవ్ స్మిత్ క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో 47వ ఓవర్ ముగిసే సరికి మొదలైన వర్షం తెరిపినివ్వలేదు. దీంతో అక్కడితో ఆటను ముగించేశారు. అప్పటికి లబుషేన్ 23, స్టీవ్ స్మిత్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆగా సల్మాన్, ఆమిర్ జమాల్కు చెరో వికెట్ దక్కింది. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో మూడు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఇక సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న నామమాత్రపు మూడో మ్యాచ్ డేవిడ్ వార్నర్ కెరీర్లో చివరి టెస్టు. చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం -
Aus Vs Pak: ఐదు వికెట్లతో చెలరేగిన కమిన్స్.. పాక్ ఆలౌట్
Australia vs Pakistan, 3rd Test Day 1 Report: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు తొలి రోజు పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆతిథ్య జట్టు పేసర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలినా.. మహ్మద్ రిజ్వాన్, ఆగా సల్మాన్, ఆమెర్ జమాల్ అర్ధ శతకాలతో రాణించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరి ముగ్గురి అద్భుత ప్రదర్శన కారణంగా పాకిస్తాన్ 300 పరుగుల మార్కును అందుకోగలిగింది. కాగా ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పాక్ ఇప్పటికే మూడు మ్యాచ్ల సిరీస్ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య నామమాత్రపు టెస్టు సిడ్నీ వేదికగా బుధవారం ఆరంభమైంది. టాస్ గెలిచిన పర్యాటక పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆదిలోనే ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ను మిచెల్ స్టార్క్.. సయీమ్ ఆయుబ్ను జోష్ హాజిల్వుడ్ డకౌట్ చేసి పెవిలియన్కు పంపారు. దీంతో పరుగుల ఖాతా తెరవకుండానే పాక్ రెండు వికెట్లు కోల్పోగా.. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్(35).. బాబర్ ఆజంతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే, ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాబర్ను 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఈ జోడీని విడదీశాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన సౌద్ షకీల్ను కూడా కమిన్సే అవుట్ చేశాడు. ఈ క్రమంలో 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 88 పరుగులతో రాణించాడు. అతడి తర్వాతి స్థానంలో బ్యాటింగ్ చేసిన ఆగా సల్మాన్ మరో ఎండ్ నుంచి సహకారం అందిస్తూ 53 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరు అవుట్ కాగానే పాక్ సులువుగానే తలవంచుతుందని భావించిన కమిన్స్ బృందానికి ఆల్రౌండర్ ఆమెర్ జమాల్ షాకిచ్చాడు. తొమ్మిద స్థానంలో బరిలోకి దిగిన అతడు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతూ 97 బంతుల్లో 82 పరుగులు రాబట్టాడు. అయితే, నాథన్ లియోన్ అద్బుత బంతితో అతడిని బోల్తా కొట్టించడంతో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది. తొలి రోజు ఆటలో భాగంగా 77.1 ఓవర్లలో 313 పరుగుల వద్ద పాక్ జట్టు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ రెండు, హాజిల్వుడ్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా బుధవారం నాటి ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. కెరీర్లో ఆఖరి టెస్టు ఆడుతున్న వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్కు పాకిస్తాన్ ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వడం మొదటి రోజు ఆటలో హైలైట్గా నిలిచింది. ఇక ఆసీస్ పాక్ కంటే 307 పరుగులు వెనుకబడి ఉంది. వార్నర్ ఆరు, ఉస్మాన్ ఖవాజా సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు. -
కమిన్స్ దెబ్బ.. రెండో టెస్టులోనూ పాక్ చిత్తు.. సిరీస్ ఆస్ట్రేలియాదే
Australia vs Pakistan, 2nd Test : పాకిస్తాన్తో రెండో టెస్టులోనూ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. బాబర్ ఆజం స్థానంలో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన షాన్ మసూద్ సారథ్యంలో పాకిస్తాన్ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య డిసెంబరు 14న మొదలైన తొలి టెస్టులో ఆతిథ్య ఆసీస్ ఏకంగా 360 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసింది. ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా గెలిచి నిలవాలని పాక్ భావించింది. బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో కంగారూ జట్టును 318 పరుగులకు కట్టడి చేయగలిగింది పాక్. కానీ బ్యాటర్ల వైఫల్యం కారణంగా 264 పరుగులకే షాన్ మసూద్ బృందం ఆలౌట్ కావడంతో.. ఆసీస్కు 54 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు పాక్ ఆరంభంలోనే షాకిచ్చింది. పేసర్లు షాహిన్ ఆఫ్రిది, మీర్ హంజా దెబ్బకు టాపార్డర్ కుప్పకూలిపోయింది. 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ ఇబ్బందుల్లో పడింది. Mitch Marsh hangs on at third man! Whatta catch! #AUSvPAK pic.twitter.com/BFC1LBXjeK — cricket.com.au (@cricketcomau) December 29, 2023 ఇలాంటి క్లిష్ట దశలో మిచెల్ మార్ష్ (96; 13 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి ఐదో వికెట్కు 153 పరుగులు జోడించి ఆసీస్ను నిలబెట్టారు. ఈ క్రమంలో.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 62.3 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో ఓవరాల్గా 241 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఆస్ట్రేలియా 262 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ను ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ బెంబేలెత్తించాడు. ఐదు వికెట్లతో చెలరేగి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. మరో పేసర్ మిచెల్ స్టార్క్ కూడా తనదైన శైలిలో రాణించడంతో పాకిస్తాన్ 237 పరుగులకే చాపచుట్టేసింది. షాన్ మసూద్ కెప్టెన్ ఇన్నింగ్స్(71 బంతుల్లో 60 పరుగులు), ఆగా సల్మాన్ అర్ధ శతకం(50)తో రాణించినా ఫలితం లేకుండా పోయింది. 79 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి పాలు కాగా నాలుగో రోజే ఆట ముగిసిపోయింది. ఇక పాక్ రెండో ఇన్నింగ్స్లో స్టార్క్ నాలుగు, జోష్ హాజిల్వుడ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ప్యాట్ కమిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య నామమాత్రపు ఆఖరి టెస్టు బుధవారం (జనవరి 3) నుంచి ప్రారంభం కానుంది. కాగా ఆస్ట్రేలియాలో పాక్ ఇంత వరకు ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేదన్న విషయం తెలిసిందే. 1995లో చివరగా కంగారూ గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచింది. తాజా పరాజయంతో 1999 పర్యటన నుంచి ఆ జట్టు వరుసగా 16 టెస్టుల్లో ఓడింది. THE AUSSIES GET IT DONE! 🔥 📺 Watch Day 4 #AUSvPAK on Fox Cricket and Kayo Sports: https://t.co/VNpf5Xojhg ✍ BLOG: https://t.co/physFvdl0W 🔢 MATCH CENTRE: https://t.co/v8I8vaM89H pic.twitter.com/D8dCwItqhb — Fox Cricket (@FoxCricket) December 29, 2023 -
బాబర్ విఫలం.. కమిన్స్ జోరు! రెండో రోజు ఆసీస్దే పైచేయి!
Australia vs Pakistan, 2nd Test Day 2: పాకిస్తాన్తో రెండో టెస్టులో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకుంది. రెండో రోజు ఆట ముగిసే సరికి పర్యాటక జట్టుపై పైచేయి సాధించింది. కాగా మెల్బోర్న్ వేదికగా మంగళవారం ఆసీస్- పాకిస్తాన్ మధ్య బాక్సింగ్ డే టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 187 పరుగులు చేసింది. టీ విరామానికి 37 నిమిషాల ముందు వర్షం రావడంతో ఆటకు మూడు గంటలపాటు అంతరాయం ఏర్పడింది. దాంతో తొలి రోజు 66 ఓవర్లు మాత్రమే సాధ్యమయ్యాయి. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (38; 3 ఫోర్లు), ఉస్మాన్ ఖవాజా (42; 5 ఫోర్లు) తొలి వికెట్కు 90 పరుగులు జోడించారు. స్టీవ్ స్మిత్ (26; 2 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఆట ముగిసే సమయానికి లబుషేన్ (44 బ్యాటింగ్; 3 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (9 బ్యాటింగ్; 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లు హసన్ అలీ, ఆమెర్ జమాల్, ఆగా సల్మాన్ ఒక్కోవికెట్ తీశారు. ఈ నేపథ్యంలో రెండో రోజు ఆట మొదలుపెట్టిన కంగారూ జట్టును పాక్ బౌలర్లు కట్టడి చేశారు. 187/3 ఓవర్నైట్ స్కోరుతో మొదలుపెట్టిన ఆస్ట్రేలియాను 318 పరుగులకు ఆలౌట్ చేశారు. ఆతిథ్య ఆసీస్ రెండో రోజు కేవలం 131 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ జోష్లో బ్యాటింగ్ మొదలుపెట్టిన పాకిస్తాన్కు ఆదిలోనే షాకిచ్చాడు ఆసీస్ వెటరన్ స్పిన్నర్ నాథన్ లియోన్. పది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ను అవుట్ చేశాడు. అయితే, మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ అర్ధ శతకం(62)తో మెరిశాడు. వన్డౌన్ బ్యాటర్, కెప్టెన్ షాన్ మసూద్(54)తో కలిసి మెరుగైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో ప్యాట్ కమిన్స్ షఫీక్ను, లియోన్ మసూద్ను అవుట్ చేసి ఈ జోడీని విడగొట్టారు. ఇక ఈ మ్యాచ్లోనూ బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. కమిన్స్ అద్భుత బంతితో బాబర్(1)ను బౌల్డ్ చేయగా.. సౌద్ షకీల్ను 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జోష్ హాజిల్వుడ్ పెవిలియన్కు చేర్చాడు. ఇక మరోసారి బంతితో మ్యాజిక్ చేసిన కమిన్స్.. ఆగా సల్మాన్(9)ను అవుట్ చేశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సరికి మళ్లీ ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి వచ్చింది. మొత్తంగా 55 ఓవర్ల ఆటలో ఆరు వికెట్ల నష్టానికి పాకిస్తాన్ 194 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్ 29, ఆమిర్ జమాల్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్కు మూడు, నాథన్ లియోన్కు రెండు, జోష్ హాజిల్వుడ్కు ఒక వికెట్ దక్కాయి. చదవండి: Virat Kohli: ఓసారి మా అక్క నన్ను బాగా కొట్టింది.. రూ. 50 నోటు చూడగానే చించేసి! -
Aus vs Pak 2nd Test: సర్ఫరాజ్ అహ్మద్పై వేటు.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ
Aus vs Pak Boxing Day Test Squads: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో విఫలమైన పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్పై వేటు పడింది. అతడి స్థానంలో స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ను తుదిజట్టులోకి తీసుకుంది పాక్ మేనేజ్మెంట్. బాబర్ ఆజం కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత షాన్ మసూద్ పాకిస్తాన్ టెస్టు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. వచ్చీరాగానే ఆస్ట్రేలియా పర్యటన రూపంలో అతడికి కఠిన సవాలు ఎదురైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టులో కంగారూ జట్టు చేతిలో పాక్ ఘోర పరభవాన్ని చవిచూసింది. ఏకంగా 360 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో.. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో పాక్ ఆటగాళ్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్ల ధాటికి 89 పరుగులకే జట్టు ఆలౌట్ కావడంతో భారీ తేడాతో ఓటమి తప్పలేదు. మిగతా వాళ్లు తొలి ఇన్నింగ్స్లో కాస్త ఫర్వాలేదనిపించినా సర్ఫరాజ్ అహ్మద్ మాత్రం నిరాశపరిచాడు. మొత్తంగా ఏడు (3,4) పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో ఆసీస్తో రెండో టెస్టుకు సర్ఫరాజ్ను తప్పించిన యాజమాన్యం అతడి స్థానాన్ని స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్తో భర్తీ చేసేంది. ఈ విషయం గురించి కెప్టెన్ షాన్ మసూద్ మాట్లాడుతూ.. ‘‘సర్ఫరాజ్ తిరిగి పుంజుకోవడానికి కాస్త సమయం కావాలి. రిజ్వాన్ వంటి అత్యుత్తమ ఆటగాళ్లను ఒక్కోసారి పక్కనపెట్టాల్సి వస్తుంది. అయితే, ఇప్పుడు అతడి అవసరం జట్టుకు ఉంది’’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. నొమన్ అలీ, ఖుర్రం షెహజాద్ గాయపడటంతో జట్టుకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా మాత్రం తొలి టెస్టు ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్లోనూ బరిలోకి దిగనుంది. ఎలాంటి మార్పులు లేకుండానే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో పాక్తో రెండో టెస్టు ఆడనున్నట్లు ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ ప్రకటించాడు. ఈ జట్టులో చోటు ఆశించి భంగపడిన వెటరన్ పేసర్ స్కాట్ బోలాండ్కు తగిన సమయంలో అవకాశం ఇస్తామని ఈ సందర్భంగా కమిన్స్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియోన్, జోష్ హాజిల్వుడ్. పాకిస్తాన్ జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ ఆఘా, షాహిన్ అఫ్రిది, హసన్ అలీ, మీర్ హమ్జా, అమీర్ జమాల్, సాజిద్ ఖాన్. చదవండి: Ind vs SA: షమీ ఉన్నా.. లేకపోయినా పెద్దగా తేడా ఉండదు: సౌతాఫ్రికా కెప్టెన్ -
మూలిగే నక్కమీద తాటిపండు.. పాక్కు మరో షాకిచ్చిన ఐసీసీ!
Aus vs Pakistan lose WTC25 Points: ఆస్ట్రేలియా చేతిలో తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్కు మరో భారీ షాక్ తగిలింది. పెర్త్ టెస్టులో నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి పాక్ జట్టుకు జరిమానా విధించింది. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2023-25 సీజన్ పాయింట్లలో రెండు పాయింట్ల మేర కోత విధించింది. భారీ ఓటమి కాగా పాకిస్తాన్తో టెస్టులో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదివారం 450 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది పాకిస్తాన్. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్లో 30.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. పాక్ జట్టులో సౌద్ షకీల్ (24), బాబర్ ఆజమ్ (14), ఇమామ్ ఉల్ హఖ్ (10) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్ (3/31), హాజిల్వుడ్ (3/13), నాథన్ లియోన్ (2/14) పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బకొట్టారు. ఆసీస్ చేతిలో మరోసారి ఘోర పరాభవం దీంతో కంగారూల చేతిలో షాన్ మసూద్ బృందానికి ఘోర పరాభవం తప్పలేదు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 84/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 5 వికెట్లకు 233 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక తాజా పరాజయంతో ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్కిది వరుసగా 15వ ఓటమి కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలో చివరిసారిగా 1995లో పాకిస్తాన్ టెస్టు మ్యాచ్ గెలిచింది. అంతేకాదు.. పరుగుల తేడా పరంగా టెస్టుల్లో పాకిస్తాన్కిది రెండో అతిపెద్ద పరాజయం. మూలిగే నక్కమీద తాటిపండు ఇన్ని పరాభవాల మధ్య డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఇప్పటికే టీమిండియాకు కోల్పోయిన పాకిస్తాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్తో తొలి టెస్టులో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పాక్ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో పది శాతం మేర కోతపడింది. అంతేకాదు.. రెండు డబ్ల్యూటీసీ పాయింట్లు కూడా కోల్పోయింది. దీంతో టీమిండియా అగ్రపీఠాన్ని మరింత పదిలమైంది. అప్డేట్ అయిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక PC: ICC ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం వెల్లడించింది. దీంతో పాకిస్తాన్ పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైందని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య రెండో టెస్టు డిసెంబరు 26న మొదలుకానుంది. అదే రోజు టీమిండియా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆరంభించనుంది. చదవండి: Ind vs SA: ముఖం మీదే డోర్ వేసేశాడు! పాపం రుతురాజ్.. వీడియో వైరల్ -
పాక్తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న మార్ష్.. ఆసీస్ భారీ స్కోర్
పెర్త్ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఆతిథ్య ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 487 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. తొలి రోజు ఆటలో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ శతకంతో (164) చెలరేగగా.. రెండో రోజు మిడిలార్డర్ బ్యాటర్ మిచెల్ మార్ష్ (90) 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా (41), స్టీవ్ స్మిత్ (31), ట్రవిస్ హెడ్ (40), అలెక్స్ క్యారీ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. లబూషేన్ (16), మిచెల్ స్టార్క్ (12), కమిన్స్ (9), నాథన్ లయోన్ (5) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. పాక్ బౌలర్లలో అరంగేట్రం పేసర్ ఆమిర్ జమాల్ ఆరు వికెట్ల ప్రదర్శనతో అరదగొట్టగా.. మరో అరంగ్రేటం బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ 2, షాహీన్ అఫ్రిది, ఫహీమ్ అష్రాఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి ఆసీస్ స్కోర్కు ఇంకా 355 పరుగులు వెనకపడి ఉంది. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ 42, కెప్టెన్ షాన్ మసూద్ 30 పరుగులు చేసి ఔట్ కాగా.. ఇమామ్ ఉల్ హాక్ 38, ఖుర్రమ్ షెహజాద్ 7 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్.. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలి టెస్ట్ అనంతరం పాక్ డిసెంబర్ 26 నుంచి మెల్బోర్న్లో రెండో టెస్ట్ ఆడుతుంది. అనంతరం వచ్చే ఏడాది జనవరి 3 నుంచి సిడ్నీలో మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ సిరీస్తో ఆసీస్ వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పనున్నాడు. -
ఆసీస్ను పాక్ ఆపతరమా..? తొలి టెస్టుకు సర్వం సిద్దం
పెర్త్: ప్రపంచకప్ గెలిచిన సమరోత్సాహంతో ఉన్న ఆ స్ట్రేలియా, పేలవ ప్రదర్శనతో పరిమిత ఓవర్ల లోనూ తడబడుతున్న పాకిస్తాన్ మధ్య టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే తొలి టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి. సొంతగడ్డపై తిరుగులేని జట్టయిన ఆసీస్ అన్ని రకాలుగా బలంగా కనిపిస్తూ నిస్సందేహంగా ఫేవరెట్గా కనిపిస్తోంది. మరో వైపు వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత జట్టు, కెప్టెన్ల మార్పులతో పాక్ బరిలోకి దిగుతోంది. 1995లో ఆసీస్ గడ్డపై చివరి సారిగా టెస్టు మ్యాచ్ నెగ్గిన పాక్ ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేదు. 1999 టూర్నుంచి ఆ జట్టు వరుసగా 14 టెస్టుల్లో ఓడింది. కనీసం ‘డ్రా’గా కూడా ముగించలేకపోయింది. టెస్టుకు ముందు ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖాజా గాజాలో పాలస్తీనాకు మద్దతు తెలుపుతున్నట్లుగా తన షూస్కు ‘ఆల్ లైవ్స్ ఆర్ ఈక్వల్’ అనే క్యాప్షన్తో ప్రాక్టీస్తో పాల్గొన్నాడు. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి క్రికెట్ మైదానంలో ప్రదర్శించరాదు. ఖాజాకు తన భావాలను ప్రదర్శించే స్వేచ్ఛ ఉందని ఆసీస్ బోర్డు, కెప్టెన్ కమిన్స్ అండగా నిలిచినా... అతను ఆ వ్యాఖ్యలు ఉన్న షూస్తో టెస్టు బరిలోకి దిగరాదని నిర్ణయించుకున్నాడు. తనది రాజకీయ ప్రకటన కాదని, మానవత్వం మాత్రమేనని ఖాజా అన్నాడు. -
ఆసీస్తో తొలి టెస్ట్.. పాక్ జట్టు ప్రకటన.. ఇద్దరు కొత్త ఆటగాళ్ల ఎంట్రీ
ఆస్ట్రేలియాతో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కోసం పాకిస్తాన్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ఆటగాళ్లు టెస్ట్ అరంగ్రేటం చేయనున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఆల్రౌండర్ ఆమిర్ జమాల్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఖుర్రమ్ షెహజాద్ తమ తొలి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నారని పీసీబీ పేర్కొంది. జమాల్ గతేడాది పరిమిత ఓవర్ల ఫార్మాట్లో పాక్కు తొలిసారి ప్రాతినిథ్యం వహించగా.. ఖుర్రమ్ షెహజాద్ ఏ ఫార్మాట్లో అయిన జాతీయ జట్టుకు ఆడటం ఇదే తొలిసారి. మరోవైపు ఆల్రౌండర్ ఫహీమ్ అష్రాఫ్ ఏడాది తర్వాత తిరిగి పాక్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోగా.. పాక్ తమ ఫస్ట్ ఛాయిస్ వికెట్కీపర్గా మొహమ్మద్ రిజ్వాన్ను కాదని సర్ఫరాజ్ అహ్మద్వైపే మొగ్గు చూపింది. ఓపెనర్లుగా ఇమామ్ ఉల్ హాక్, అబ్దుల్లా షఫీక్లను కొనసాగించిన పాక్ మేనేజ్మెంట్.. వన్ డౌన్లో నయా కెప్టెన్ షాన్ మసూద్, ఆతర్వాతి స్థానంలో తాజా మాజీ కెప్టెన్ బాబార్ ఆజమ్ బరిలోకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. 🚨 Playing XI for first Test 🚨 Aamir Jamal and Khurram Shahzad are set to make their Test debut 👏#AUSvPAK pic.twitter.com/4GqRRKZC6J — Pakistan Cricket (@TheRealPCB) December 13, 2023 ఐదో స్థానంలో సౌద్ షకీల్ తన స్థానాన్ని పదిలం చేసుకోగా.. పేస్ అటాక్ను షాహీన్ అఫ్రిది లీడ్ చేయనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ గాయపడటంతో సల్మాన్ అలీ అఘా ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు. కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. తొలి మ్యాచ్ రేపటి నుంచి పెర్త్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా కూడా తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించింది. వరల్డ్కప్ వైఫల్యాల నేపథ్యంలో పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో షాన్ మసూద్ పాక్ టెస్ట్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్గా మసూద్కు ఇదే తొలి టెస్ట్ కావడం విశేషం. ఆసీస్తో తొలి టెస్ట్కు పాక్ తుది జట్టు: ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్కీపర్), సల్మాన్ అలీ అఘా, ఫహీమ్ అష్రాఫ్, షాహీన్ ఆఫ్రిది, అమీర్ జమాల్, ఖుర్రం షెహజాద్ ఆసీస్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రవిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), నాథన్ లియాన్, జోష్ హాజిల్వుడ్. -
PAK Tour Of AUS: డబుల్ సెంచరీతో చెలరేగిన పాక్ కొత్త కెప్టెన్
నూతనంగా ఎంపిక చేయబడిన పాకిస్తాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ షాన్ మసూద్ కెప్టెన్గా ఎంపికైన తర్వాత ఆడిన తొలి మ్యాచ్లోనే అజేయ డబుల్ సెంచరీతో (201) చెలరేగాడు. మూడు టెస్ట్ మ్యాచ్ల ఆసీస్ పర్యటనలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్తో నిన్న (డిసెంబర్ 6) మొదలైన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్లో మసూద్ కెప్టెన్స్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మసూద్తో పాటు అబ్దుల్లా షఫీక్ (38), మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (40), సర్ఫరాజ్ అహ్మద్ (41) ఓ మోస్తరుగా రాణించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 391 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పాక్ ఇన్నింగ్స్లో ఇమామ్ ఉల్ హాక్ (9), సౌద్ షకీల్ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరారు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ బౌలర్లలో జోర్డన్ బకింగ్హమ్ 5 వికెట్లతో విజృంభించగా.. స్టీకిటీ, మెక్ ఆండ్రూ, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ అనంతరం డిసెంబర్ 14 నుంచి 18 వరకు పెర్త్లో తొలి టెస్ట్ జరుగుతుంది. డిసెంబర్ 26-30 వరకు మెల్బోర్న్లో రెండో టెస్ట్.. వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా సెమీస్కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశంలో ముప్పేట దాడిని ఎదుర్కొన్న అప్పటి కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అనంతర పరిణామాల్లో టెస్ట్ జట్టుకు షాన్ మసూద్, టీ20 జట్టుకు షాహీన్ అఫ్రిది కెప్టెన్లుగా ఎన్నికయ్యారు. పాక్ క్రికెట్ బోర్డు టీ20లకు కెప్టెన్ను ప్రకటించాల్సి ఉంది. -
PAK Tour Of AUS: కొత్త కెప్టెన్.. వచ్చీ రాగానే సెంచరీతో ఇరగదీశాడు..!
పాకిస్తాన్ టెస్ట్ జట్టు కెప్టెన్గా ఇటీవలే నియమితుడైన షాన్ మసూద్.. కెప్టెన్గా తన తొలి మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టాడు. ఆసీస్ పర్యటనలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్తో ఇవాళ (డిసెంబర్ 6) మొదలైన నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్లో మసూద్ కెప్టెన్స్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న పాక్.. 78 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. మసూద్ 136 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతనికి జతగా సర్ఫరాజ్ అహ్మద్ (24) క్రీజ్లో ఉన్నాడు. పాక్ ఇన్నింగ్స్లో అబ్దుల్లా షఫీక్ (38), మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ఇమామ్ ఉల్ హాక్ (9), సౌద్ షకీల్ (13) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరి నిరాశపర్చారు. ప్రైమ్ మినిస్టర్ ఎలెవెన్ బౌలర్లలో జోర్డన్ బకింగ్హమ్ 2, టాడ్ మర్ఫీ, మార్క్ స్కీకిటీ తలో వికెట్ పడగొట్టారు. పాక్ జట్టు ప్రస్తుత ఆసీస్ పర్యటనలో మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. డిసెంబర్ 14 నుంచి 18 వరకు పెర్త్లో తొలి టెస్ట్ జరుగనుండగా.. డిసెంబర్ 26-30 వరకు మెల్బోర్న్లో రెండో టెస్ట్.. వచ్చే ఏడాది జనవరి 3-7 వరకు సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్లో పాక్ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా సెమీస్కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశంలో ముప్పేట దాడిని ఎదుర్కొన్న అప్పటి కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అనంతర పరిణామాల్లో టెస్ట్ జట్టుకు షాన్ మసూద్, టీ20 జట్టుకు షాహీన్ అఫ్రిది కెప్టెన్లుగా ఎన్నికయ్యారు. పాక్ క్రికెట్ బోర్డు టీ20లకు కెప్టెన్ను ప్రకటించాల్సి ఉంది. -
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ
వన్డే ప్రపంచకప్-2023లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్.. ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఆసీస్తో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో పాకిస్తాన్ తలపడనుంది. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు వెటరన్ బ్యాటర్ షాన్ మసూద్ సారథ్యం వహించనున్నాడు. ఈ సిరీస్తో పాకిస్తాన్ టెస్టు కెప్టెన్గా మసూద్ ప్రయాణం ప్రారంభం కానుంది. బాబర్ ఆజం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాక్ టెస్టు సారధిగా మసూద్ ఎంపికయ్యాడు. ఇక దేశీవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న యువ ఓపెనర్ సైమ్ అయూబ్కు తొలిసారి పాక్ టెస్టు జట్టులో చోటు దక్కింది. అయూబ్తో పాటు యువ బౌలర్ ఖుర్రం షాజాద్కు పాక్ సెలక్టర్లు పిలుపునిచ్చారు. కాగా డిసెంబర్ 14న పెర్త్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆసీస్తో టెస్టులకు పాక్ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్), సయీమ్ అయూబ్, అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇమామ్-ఉల్-హక్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్ కీప), షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మీర్ హమ్జా, ఖుర్రం షాజాద్ హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్, నోమన్ అలీ, అబ్రార్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్ చదవండి: CWC 2023: నిన్నటి రోజు మనది కాకుండా పోయింది.. మోదీకి ధన్యవాదాలు: షమీ భావోద్వేగం The 18-member squad for Australia series has been revealed Saim Ayub & Khurram Shahzad have been called up for the three-match series #PAKvAUS #TestSeries pic.twitter.com/9rhZujQOg1 — Cricket Pakistan (@cricketpakcompk) November 20, 2023 -
బాబర్ ఆజం కోసం ప్రాణత్యాగాలకైనా సిద్దం.. పాక్ స్టార్ బ్యాటర్ సంచలన వాఖ్యలు
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాంపై గత కొంతకాలంగా విమర్శల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. బ్యాటర్గా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ సారథిగా మాత్రం జట్టును విజయపథంలో నడిపించడంలో విఫలవమవుతున్నాడు. గతేడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు పాకిస్తాన్ ను సొంతగడ్డమీదే మట్టికరిపించాయి. ఈ క్రమంలో ఆజంను పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి తొలిగించాలని ఆ దేశ మాజీ ఆటగాళ్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇప్పటికీ బాబర్ను పాక్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అతడి జట్టు సహచరులు మాత్రం బాబర్ కు అండగా నిలుస్తున్నారు. తాజాగా సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబర్ ఆజంను ఉద్దేశించి పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ షాన్ మసూద్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. బాబర్ అంటే తమకు ఎంతో ఇష్టమని.. అతడి కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా మా ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని మసూద్ తెలిపాడు. "మేముందరం బాబర్కు మద్దతుగా ఉంటాం. సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్గా ఉన్నప్పుడు అతని కోసం ప్రాణాలివ్వడానికి సిద్ధపడ్డాం. ఇప్పడు బాబర్ ఆజం కోసం కూడా అదే పని చేసేందుకు సిద్ధమయ్యాం. దేశం కోసం అత్యుత్తమంగా ఆడటమే మా అందరి లక్ష్యం. మా జట్టుపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఆటలో గెలుపు ఓటములు సహజం. అంత మాత్రాన జట్టును తక్కువగా చేసి మాట్లడకూడదు. మమ్మల్ని వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్నారు. కానీ మేము అవి పట్టించుకోం అని" మసూద్ పేర్కొన్నాడు. కాగా వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్ జట్టుకు వైస్ కెప్టెన్గా మసూద్ వ్యవహరిస్తున్నాడు. -
ఘనంగా క్రికెటర్ పెళ్లి వేడుక.. జనవరి 27న రిసెప్షన్
పాకిస్తాన్ క్రికెటర్.. జట్టు వైస్కెప్టెన్ షాన్ మసూద్ వివాహం పెషావర్లో ఘనంగా జరిగింది. తన చిన్ననాటి ఫ్రెండ్, ప్రేయసి నిషే ఖాన్ను అతను పెళ్లి చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు పాకిస్తాన్ క్రికెట్ నుంచి చీఫ్ సెలెక్టర్ షాహిద్ అఫ్రిది, ఆల్రౌండర్ షాదాబ్ ఖాన్లు హాజరయ్యారు. కరాచీ వేదికగా జనవరి 27న గ్రాండ్గా రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ రిసెప్షన్కు పాక్ క్రికెటర్లు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇక షాన్ మసూద్ పెళ్లి వేడుకను ఒక వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక అయేమన్ మాలిక్ అనే వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్లో షాన్ మసూద్, నిఖా షేన్ వివాహ వేడుకల ఫోటోలను పంచుకున్నాడు. కాగా కొత్త జంటకు మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, ఇఫ్తికార్ అహ్మద్లతో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మసూద్, నిషేతో తన రిలేషన్షిప్ గురించి ప్రస్తావించాడు. నిషే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆమెను మొదటిసారిగా లాహోర్లో కలిశానని చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ జట్టులో మిడిలార్డర్ బ్యాటర్ అయిన మసూద్ టి20 వరల్డ్ కప్లో కీలక ఇన్నింగ్స్లు ఆడాడు. టోర్నీలో పాకిస్థాన్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక భారత్తో జరిగిన మ్యాచ్లో షాన్ మసూద్ హాఫ్ సెంచరీ (52)తో రాణించాడు. ఇక ఫైనల్లో ఇంగ్లండ్పై 38 పరుగులు చేశాడు. పాక్ జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న షాన్ మసూద్ 28 టెస్టుల్లో 1500 పరుగులు, 19 టి20ల్లో 395 పరుగులు, ఆరు వన్డేల్లో 110 పరుగులు చేశాడు. Shan Masood Bhai Mubarak ho bohot Bohot . You both look adorable together, Ma Sha Allah♥️ #ShanMasood pic.twitter.com/UCVSjVWd26 — Shaharyar Ejaz 🏏 (@SharyOfficial) January 20, 2023 View this post on Instagram A post shared by Ayeman Malik 🔥 (@ayemanmalik01) చదవండి: 'కివీస్ను క్లీన్స్వీప్ చేస్తే టీమిండియాకు సువర్ణావకాశం' -
బాబర్ ఆజమ్పై వేటు, పాక్ కొత్త కెప్టెన్ ఎవరంటే..?
స్వదేశంలో వరుస పరాజయాల నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నాయకత్వ మార్పు చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న బాబర్ ఆజమ్ను దించేసి, అతని స్థానంలో మిడిలార్డర్ బ్యాటర్ షాన్ మసూద్కు పట్టం కట్టేందుకు సర్వం సిద్ధమైనట్లు పాక్ మీడియాలో కధనాలు ప్రసారమవుతున్నాయి. మరోవైపు వెటరన్ వికెట్కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ను టెస్ట్ కెప్టెన్ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వన్డే, టీ20ల్లో షాన్ మసూద్కు కెప్టెన్సీ అప్పగించినా.. టెస్ట్ల్లో మాత్రం సర్ఫరాజ్కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పాలని పాక్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారట. ఈ విషయంపై నజీం నేథీ నేతృత్వంలోని పీసీబీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. పాక్ క్రికెట్ సర్కిల్స్లో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాక్ మాజీలు, ఆ దేశ క్రికెట్ విశ్లేషకులేమో మూడు ఫార్మాట్లలో ముగ్గురు వేర్వేరు కెప్టెన్ల ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని సమాచారం. ఏదిఏమైనప్పటికీ పీసీబీ నుంచి అధికారిక ప్రకటన వెలువడేంత వరకు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాగా, ఇటీవలి కాలంలో పాక్ స్వదేశంలో ఆడిన దాదాపు ప్రతి సిరీస్లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్తో ముగిసిన వన్డే సిరీస్లో 1-2 తేడాతో ఓటమిపాలైన పాక్.. అంతకుముందు అదే జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ను అతికష్టం మీద డ్రా చేసుకోగలిగింది. అంతకుముందు ఇంగ్లండ్ చేతిలో 0-3 తేడాతో వైట్ వాష్ అయిన పాక్.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23లో భాగంగా స్వదేశంలో జరిగిన ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్పై వేటు అంశం తెరపైకి వచ్చింది. ఇదిలా ఉంటే, పీసీబీ కొద్దికాలం క్రితమే బోర్డు ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. తొలుత అధ్యక్షుడు రమీజ్ రజాపై వేటు వేసి నజీం సేథికి బాధ్యతలు అప్పగించిన పీసీబీ.. ఇటీవలే షాహిద్ అఫ్రిదిని జాతీయ సెలెక్షన్ కమిటీ చైర్మన్గా నియమించింది. -
'అవసరమా మనకు.. 'స్పైడర్'ను బ్యాన్ చేయండి'
ఆదివారం టీమిండియా,పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన హై వోల్జేజ్ మ్యాచ్లో కోహ్లి స్టన్నింగ్ ఇన్నింగ్స్తో టీమిండియాను గెలిపించాడు. ఈ విషయం పక్కనబెడితే.. ఇదే మ్యాచ్లో ఒక అంశం తెరమీదకు వచ్చింది. అదే స్పైడర్ కెమెరా. మ్యాచ్ జరగుతున్న సమయంలో మైదానంలో అటూ ఇటూ తిరుగుతూ ఆటగాళ్ల కదలికలతో పాటు మ్యాచ్ను కవరేజ్ చేస్తుంది. అయితే ఈ స్పైడర్ కెమెరా వల్ల పెద్ద చిక్కు వచ్చి పడుతుంది. బాగా ఆడుతున్న బ్యాటర్ ఇచ్చిన క్యాచ్ను ఫీల్డర్లు నేలపాలు చేస్తున్నారు. దానికి కారణం స్పైడర్ కెమెరానే. బ్యాటర్ కొట్టిన బంతి స్పైడర్కు తగిలి ఒకచోట పడాల్సింది పోయి మరొక చోట పడుతుంది. దీంతో బ్యాటర్లకు అదృష్టంగా.. బౌలింగ్ చేస్తున్న జట్టుకు దురదృష్టంగా మారిపోయింది. టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్లో అర్థసెంచరీతో రాణించిన షాన్ మసూద్ స్పైడర్ కెమెరా వల్ల బతికిపోయాడంటే నమ్ముతారా. పాక్ ఇన్నింగ్స్ సమయంలో షాన్ మసూద్ కొట్టిన ఒక బంతి నేరుగా స్పైడర్ కెమెరా కేబుల్కు తగిలింది. దీంతో బంతి దిశ మారి వేరేచోట పడింది. ఒకవేళ స్పైడర్ కెమెరా లేకపోయుంటే డీప్లో కోహ్లి క్యాచ్ అందుకోవడం ద్వారా షాన్ మసూద్ ఔటయ్యేవాడు. ఇది చూసిన హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలు స్పైడర్ కెమెరాపై అసహనం వ్యక్తం చేశారు. అప్పటికి మసూద్ 31 పరుగుల వద్ద ఉన్నాడు. అలా బతికిపోయిన మసూద్ ఆ తర్వాత అర్థసెంచరీతో రాణించి చివరి వరకు నాటౌట్గా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. ఇలా స్పైడర్ కెమెరాకు బంతి తగిలి బ్యాటర్ బతికిపోవడం చాలాసార్లు జరిగింది. ఇంతకముందు 2014-15లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ ఒక మ్యాచ్ సందర్భంగా ఈ స్పైడర్ కెమెరా అడ్డు వల్లే బతికిపోయాడు. ఇంకా చాలా సందర్భాల్లో ఈ కెమెరా వల్ల ఫీల్డర్లు ఇబ్బందిపడ్డారు. దీంతో స్పైడర్ కెమెరాపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ''స్పైడర్ కెమెరా వాడకం అవసరమా.. పరోక్షంగా ఇది బ్యాటర్లకు అదృష్టంగా కలిసొస్తుంది. అవవసరమా ఇవన్నీ మనకు.. స్పైడర్ కెమెరాను బ్యాన్ చేయండి'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో స్పైడర్ కెమెరాను పదేళ్లుగా వాడుతున్నారు. 2007లో ఐపీఎల్ తొలి సీజన్లో తొలిసారి స్పైడర్ కెమెరాలను ఉపయోగించారు. ఆ తర్వాత క్రమంగా అంతర్జాతీయ క్రికెట్లోనూ అడుపెట్టింది. pic.twitter.com/ZaSvVkGqk7 — Vaishnavi Iyer (@Vaishnaviiyer14) October 23, 2022 చదవండి: Viirat Kohli: ఒక్క ఇన్నింగ్స్తో టాప్-10లోకి దూసుకొచ్చిన 'కింగ్' కోహ్లి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
Ind Vs Pak: పాక్కు ఊహించని షాక్.. కీలక బ్యాటర్ తలకు గాయం.. ఆస్పత్రికి తరలింపు
T20 World Cup 2022- India Vs Pakistan: టీమిండియాతో మ్యాచ్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో భాగంగా పాక్ బ్యాటర్ షాన్ మసూద్ తలకు గాయమైంది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని జర్నలిస్టు బోరియా మజుందార్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. కాగా టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో భాగంగా శనివారం (అక్టోబరు 23) పాక్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. రోహిత్ సేనతో మెల్బోర్న్ క్రికెట్ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మెల్బోర్న్ చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీసు మొదలుపెట్టాయి. నవాజ్ షాట్ ఆడగా.. ఈ క్రమంలో పాక్ ఆల్రౌండర్ మహ్మద్ నవాజ్ షాట్ ఆడగా.. బంతి మసూద్ తలకు తగలగా గ్రౌండ్లో కుప్పకూలినట్లు సమాచారం. దెబ్బ గట్టిగా తగలడంతో సుమారు ఐదు నిమిషాల పాటు అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది షాన్ మసూద్ను ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. కాగా పాక్ వన్డౌన్ బ్యాటర్గా బరిలోకి దిగే ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇప్పటి వరకు 12 టీ20 మ్యాచ్లు ఆడి 221 పరుగులు చేశాడు. ఇటీవల న్యూజిలాండ్, బంగ్లాదేశ్లతో ట్రై సిరీస్ నేపథ్యంలోనూ జట్టుతో ఉన్నాడు. అయితే, కీలక మ్యాచ్కు ముందు గాయపడ్డ అతడు.. టోర్నీ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక దాయాదితో పోరుకు సిద్ధమవుతున్న వేళ టాపార్డర్ బ్యాటర్ గాయపడటంతో పాక్ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. చదవండి: T20 World Cup 2022: 'రిజ్వాన్, కోహ్లి, సూర్య కాదు.. అతడే ప్రపంచకప్ టాప్ రన్ స్కోరర్' T20 WC 2022- Ind Vs Pak: ‘అలా అయితే అక్టోబరు 23న ఇండియాతో పాక్ మ్యాచ్ ఆడదు’ Update: Pakistani Batter Shan Masood has been taken to the hospital. Doctors will examine him and then further steps will be taken. Mohd. Nawaz’s shot hit Masood on the head for this unfortunate injury. He was lying down on the ground for 5-7 mints. Wish him a speedy recovery. — Boria Majumdar (@BoriaMajumdar) October 21, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ENG VS PAK: రాణించిన షాన్ మసూద్.. ఇంగ్లండ్ టార్గెట్ 161
టీ20 వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా ఇవాళ (అక్టోబర్ 17) ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ ఓ మోస్తరు స్కోర్ సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో 19 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి పాక్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు షాన్ మసూద్ (22 బంతుల్లో 39; 7 ఫోర్లు), హైదర్ అలీ (16 బంతుల్లో 18; 3 ఫోర్లు) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లెవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. తాత్కాలిక కెప్టెన్ షాదాబ్ ఖాన్ (12), ఇఫ్తికార్ అహ్మద్ (22), ఖుష్దిల్ (0), ఆసిఫ్ అలీ (14), నవాజ్ (10) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో మహ్మద్ వసీమ్ జూనియర్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, సిక్స్) వేగంగా పరుగులు సాధించడంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో విల్లే 2 వికెట్లు పడగొట్టగా.. బెన్ స్టోక్స్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లివింగ్స్టోన్లకు తలో వికెట్ దక్కింది. అనంతరం 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్కు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్ (1), అలెక్స్ హేల్స్ (9) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. వన్ డౌన్లో వచ్చిన బెన్ స్టోక్స్ (18 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజ్లో నిలబడలేకపోయాడు. 7.2 ఓవర్లు పూర్తియ్యే సరికి ఇంగ్లండ్ స్కోర్ 63/3గా ఉంది. లివింగ్స్టోన్ (5), హ్యారీ బ్రూక్ (9) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ గెలవాలంటే 70 బంతుల్లో 98 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. -
'అక్క మరణం నా జీవితాన్ని తలకిందులు చేసింది'
పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాన్ మసూద్ దాదాపు ఆరు నెలల తర్వాత పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టెస్టు ఓపెనర్గా ముద్రపడిన షాన్ మసూద్ ఇంతకాలం టెస్టులు, వన్డేలకు మాత్రమే పరిమితమయ్యాడు. తన కెరీర్లో ఒక్క టి20 మ్యాచ్ ఆడని షాన్ మసూద్ను పీసీబీ ఏకంగా ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్కు ఎంపికచేసింది. గాయంతో బాధపడుతున్న ఫఖర్ జమాన్ స్థానంలో షాన్ మసూద్ను ఎంపిక చేసింది. 2013లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన షాన్ మసూద్ ఇప్పటివరకు 25 టెస్టులాడి 1378 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు అర్థసెంచరీలు ఉండడం విశేషం. కాగా టి20 ప్రపంచకప్కు ఎంపిక చేయడంపై షాన్ మసూద్ శనివారం స్పందించాడు. ''పాక్ జట్టుకు ఆడని కాలంలో చాలా విషయాలు తెలుసుకున్నా.. ఒక వ్యక్తిగా, ఆటగాడిగా చాలా ఎదిగాననిపిస్తుంది. క్రికెట్ కంటే జీవితంలో ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయని తెలుసుకున్నా. మన ఆత్మీయులను పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ మనకు తెలుస్తుంది. అది నేను అనుభవించా. ఈ ఏడాది మా అక్క మరణం నా జీవితాన్ని తలకిందులు చేసింది. ఆమె మరణంతో ఒక్కసారిగా అంతా కోల్పోయానన్న భావన కలిగింది. కానీ దేశం కోసం మనకిష్టమైన ఆట ఆడినప్పుడు విఫలం కంటే సఫలం ఎక్కువగా ఉంటుందని అక్క చెప్పిన మాటలు మనసులో ఉంచుకున్నా. జట్టులో ఎంపికవుతామా అన్న విషయాన్ని పక్కనబెట్టి రాణిస్తే ఫలితాలు వెతుక్కుంటూ వస్తాయని నా విషయంలో నిరూపితమైంది. ఇక జట్టులోకి తిరిగి రావడం సంతోషమనిపించింది. జట్టులో నా పాత్రను సమర్థంగా పోషిస్తానని అనుకుంటున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లండ్ ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడనుంది. ఇది ముగిసిన అనంతరం ఆస్ట్రేలియాకు వెళ్లనున్న పాకిస్తాన్ టి0 ప్రపంచకప్లో ఆడనుంది. తమ తొలి మ్యాచ్ను చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో అక్టోబర్ 23న(ఆదివారం) ఆడనుంది. చదవండి: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. మొహాలీకి చేరుకున్న భారత ఆటగాళ్లు -
మసూద్ తుపాన్ ఇన్నింగ్స్.. 6 ఫోర్లు.. 4 సిక్స్లతో!
పాకిస్తాన్ సూపర్ లీగ్లో భాగంగా క్వాట్టా గ్లాడియేటర్స్ తో జరిగిన మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లాడియేటర్స్ 168 పరుగులకే ఆలౌటైంది. ముల్తాన్ సుల్తాన్ బౌలర్లలో కుష్దిల్ షా, తాహిర్, విల్లీ చెరో మూడు వికెట్లు పడగొట్టాడు. గ్లాడియేటర్స్ బ్యాటర్లలో బెన్ డకెట్(47), ఇఫ్తికార్ అహ్మద్(30) పరుగులతో టాప్ స్కోరర్లగా నిలిచారు. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముల్తాన్ సుల్తాన్ ఆదిలోనే కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ వికెట్ కోల్పోయింది. అయితే మరో ఓపెనర్ షాన్ మసూద్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. షాన్ మసూద్ కేవలం 58 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, నాలుగు సిక్స్లు ఉన్నాయి. షాన్ మసూద్ చేలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్ 174 పరుగులు చేసింది. ఇక గ్లాడియేటర్స్ బౌలర్లలో మహ్మద్ హస్నైన్ రెండు వికెట్లు పడగొట్టగా, ఫాల్క్నర్ ఒక వికెట్ పడగొట్టాడు. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ -
అత్యంత విలువైన వ్యక్తివి నువ్వు.. చాలా మిస్ అవుతున్నా: క్రికెటర్ భావోద్వేగం
Shan Masood Gets Emotional: పాకిస్తాన్ క్రికెటర్ షాన్ మసూద్ నివాసంలో విషాదం నెలకొంది. అతడి సోదరి మీషూ మరణించింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించిన మసూద్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ‘‘మీషూ.. నా జీవితంలో అత్యంత విలువైన వ్యక్తివి నువ్వు. నీకు నేను గుడ్బై చెప్పలేను. ఆ దేవుడు నిన్ను ఇంతకంటే మంచి చోటుకు తీసుకువెళ్లాడని నాకు తెలుసు. అయినా.. నిన్ను చాలా మిస్ అవుతున్నా’’ అని ట్వీట్ చేశాడు. తన సోదరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించమని అభిమానులను కోరాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, అన్వర్ అలీ, అబిద్ అలీ, పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా తదితరులు మసూద్ కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. కాగా తన సోదరి మీషూ(30) అరుదైన క్రోమోజోమ్ డిజార్డర్తో బాధపడుతోందని మసూద్ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘తను దివ్యాంగురాలు. నవజాత శిశువుతో సమానం. శారీరక ఎదుగుదల ఉంది కానీ.. మానసికంగా పరిపక్వత చెందలేదు. తనకు డిపెండెంట్ వీసా కూడా లేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక ఆదివారం తమను విడిచి శాశ్వతంగా దూరం కావడంతో శోక సంద్రంలో మునిగిపోయాడు. ఇక కెరీర్ విషయానికొస్తే... 2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్తో పాకిస్తాన్ తరఫున మసూద్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. చివరగా న్యూజిలాండ్తో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టెస్టు మ్యాచ్లో అతడు ఆడాడు. ఇక 2019లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం నేషనల్ టీ20 కప్లో భాగంగా సింధ్ తరఫున ఆడుతున్నాడు. Meeshu you were the most precious thing in my life and I did not even get to say goodbye, I will miss you so much but I know God has taken you to a better place. Please pray for my sister’s departed soul 🙏🏽 pic.twitter.com/1AFHad7red — Shan Masood (@shani_official) October 3, 2021 -
పాకిస్తాన్ షాన్దార్
మాంచెస్టర్: ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు పాకిస్తాన్ సత్తా చాటింది. ముందుగా ఓపెనర్ షాన్ మసూద్ (319 బంతుల్లో 156; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్లో మెరుగైన స్కోరు సాధించిన పాక్... ఆ తర్వాత తమ పదునైన బౌలింగ్తో ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. ఫలితంగా గురువారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (4), సిబ్లీ (8)లతో పాటు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ (0), కెప్టెన్ జో రూట్ (14) కూడా పెవిలియన్ చేరారు. ప్రస్తుతం ఒలీ పోప్ (46 బ్యాటింగ్), బట్లర్ (15 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో షాహిన్ అఫ్రిది వికెట్ తీయగా... తర్వాతి రెండు వికెట్లు మొహమ్మద్ అబ్బాస్ ఖాతాలో చేరాయి. యాసిర్ షా మరొ వికెట్ పడగొట్టాడు. అంతకు ముందు పాక్ 326 పరుగుకు ఆలౌటైంది. మసూద్కు షాదాబ్ ఖాన్ (45) అండగా నిలిచాడు. ఓవర్నైట్ స్కోరు 139/2తో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ తొలి ఓవర్లోనే అదే స్కోరు వద్ద బాబర్ ఆజమ్ (69) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత తక్కువ వ్యవధిలోనే అసద్ షఫీఖ్ (7), రిజ్వాన్ (9) వెనుదిరిగారు. ఈ దశలో మసూద్, షాదాబ్ కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో 251 బంతుల్లో మసూద్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతనికి ఇది నాలుగో సెంచరీ కాగా... వరుసగా మూడోది కావడం విశేషం. గత రెండు ఇన్నింగ్స్లలో అతను 135 (శ్రీలంకపై), 100 (బంగ్లాదేశ్పై) పరుగులు సాధించాడు. ఎట్టకేలకు షాదాబ్ను బెస్ అవుట్ చేయడంతో 105 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. సెంచరీ తర్వాత మరో 60 బంతుల్లోనే 150కు చేరుకున్న మసూద్ చివరకు తొమ్మిదో వికెట్గా అవుటయ్యాడు. -
24 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ఓపెనర్గా..
మాంచెస్టర్: పాకిస్తాన్ ఓపెనర్ షాన్ మసూద్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఇంగ్లండ్తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో మసూద్ సెంచరీ సాధించాడు. 251 బంతుల్లో 13 ఫోర్లతో శతకం బాదేశాడు. ఈ రోజు(రెండో రోజు) ఆటలో బాబర్ అజామ్ సెంచరీ చేస్తాడనుకుంటే అతను మాత్రం 69 వ్యక్తిగత పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో మసూద్ నిలకడగా ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్ల నుంచి పదునైన బంతులు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో శతకం పూర్తి చేస్తున్నాడు. ఫలితంగా ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో శతకం సాధించిన ఐదో పాకిస్తాన్ ఓపెనర్గా నిలిచాడు. కాగా, 24 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ సాధించిన తొలి పాకిస్తాన్ ఓపెనర్గా మసూద్ నిలవడం ఇక్కడ విశేషం. ఇంగ్లండ్ గడ్డపై చివరిసారి 1996లో సయ్యీద్ అన్వర్ టెస్టుల్లో శతకం సాధించిన పాక్ ఓపెనర్ కాగా, ఆ తర్వాత ఇంతకాలానికి మసూద్ సాధించాడు. ఇక ఇది మసూద్కు టెస్టుల్లో వరుసగా మూడో సెంచరీ. 2019-20 సీజన్లో మసూద్ మూడో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా టెస్టుల్లో వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఆరో పాకిస్తాన్ ఆటగాడిగా మసూద్ నిలిచాడు. అంతకుముందు జహీర్ అబ్బాస్(1982-83), ముదాస్సార్ నజార్(1983), మహ్మద్ యూసఫ్(2006), యూనిస్ ఖాన్(2014), మిస్బావుల్ హక్(2014)లు హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన పాక్ క్రికెటర్లు. కాగా, ఇందులో ముదాస్సార్ నజార్ మాత్రమే ఓపెనర్ కాగా, ఆ తర్వాత స్థానంలో మసూద్ నిలిచాడు. (ఐపీఎల్ కొత్త టైటిల్ స్పాన్సర్ ఎవరు?) 139/2 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆదిలోనే వికెట్ను కోల్పోయింది. ఓవర్నైట్ ఆటగాడు బాబర్ అజామ్(69) నిన్నటి స్కోరు వద్దే పెవిలియన్ చేరాడు. అండర్సన్ వేసిన బౌలింగ్లో రూట్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫలితంగా పాకిస్తాన్ 139 పరుగుల వద్దే మూడో వికెట్ నష్టపోయింది. ఆపై షఫీక్(7), రిజ్వాన్(9)లు నిరాశపరచడంతో పాక్ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మసూద్ బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే తొలుత హాఫ్ సెంచరీ చేసుకున్న మసూద్.. దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. దాంతో పాక్ తేరుకుంది. పాకిస్తాన్ 95 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 281 పరుగులతో ఉంది. మసూద్(126 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. ఇది మసూద్కు నాల్గో టెస్టు సెంచరీ. -
పాకిస్థాన్ అనూహ్య విజయం
పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన నిర్ణయాత్మక మూడో టెస్టులో పాకిస్థాన్ అనూహ్య విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. 377 పరుగుల టార్గెట్ ను సునాయాసంగా ఛేదించింది. 103.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 382 పరుగులు చేసింది. ఓపెనర్ షాన్ మసూద్ (125), సీనియర్ బ్యాట్స్మన్ యూనిస్ ఖాన్ (171) సెంచరీలతో కదం తొక్కారు. కెప్టెన్ మిస్బా(59) అర్ధసెంచరీతో రాణించాడు. 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును వీరు ముగ్గురు అసమాన ఆటతీరుతో విజయ తీరాలకు చేర్చారు. మూడో వికెట్ కు 242, నాలుగో వికెట్ కు 127 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్ లో లంక 278, పాక్ 215 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 313 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ ను 2-1 తేడాతో పాకిస్థాన్ కైవసం చేసుకుంది. యూనిస్ ఖాన్ 'మ్యాన్ ఆఫ్ మ్యాచ్' దక్కించుకున్నాడు. 12 వికెట్లు పడగొట్టిన పాక్ బౌలర్ యాసిర్ షా 'మ్యాన్ ఆఫ్ ద సిరీస్' అందుకున్నాడు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
16, 17 తేదీల్లో జూనియర్ ఇంటర్లో ప్రవేశానికి కౌన్సెలింగ్
రేపు బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ పార్లమెంట్ పరిధిలో 2009 నుంచి 2024 వరకు నమోదైన ఓట్లు, పోలింగ్ శాతం...
పథకాలు పారదర్శకంగా అందించాలి
No Headline
రైతులు ధైర్యంగా ఉండాలి
వరంగల్ స్ట్రాంగ్రూంకు ఈవీఎంలు
వాతావరణం
ఓటుకు దూరంగా..
రేవణ్ణ అరెస్ట్ వెనుక కుట్ర: కుమార
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
Advertisement