-
Andhra Pradesh: సర్కారు ఆస్పత్రులు సరికొత్తగా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా వైద్యరంగానికి పెద్దపీట వేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా నియామకాలు చేపట్టింది. అధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేయడంతోపాటు మౌలిక వసతులను సైతం కల్పించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్కారు ఆస్పత్రుల్లోని వైద్యులు రోగులకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ సంఖ్య గణనీయంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వాస్పత్రుల్లో ప్రస్తుతం ఉత్తమ వైద్యసేవలు అందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యమే పరమావధిగా సకల సౌకర్యాలతో రోగులకు సేవలందిస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాస్పత్రుల వరకు అన్ని సర్కారు ఆస్పత్రుల్లో మౌలిక వసతులతోపాటు అత్యాధునిక పరికరాలను ఏర్పాటు చేసింది. పూర్తిస్థాయిలో వైద్యు లు, సిబ్బందిని నియమించి నాణ్యమైన వైద్యం అందిస్తుండడంతో గత నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వాస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య రెండు రెట్లు పెరిగింది. జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ సేవలు నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్)లో రోగులకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుతున్నాయి. ప్రభుత్వం ఆయా విభాగాల్లో అధునాతన పరికరాలను ఏర్పాటు చేయడంతో వైద్యులు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నారు. 2019కు ముందు కేవలం ఒక సీటీ స్కాన్, ఒక ఎక్సరే పరికరాలు ఉండేవి. అవి కూడా సక్రమంగా పనిచేసేవి కావు. దీంతో జీజీహెచ్కు వచ్చిన రోగులు సీటీ స్కాన్, ఎక్సరేల కోసం బయట సెంటర్లకు వెళ్లేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన సీటీ స్కాన్, ఎక్సరే, ఎంఆర్ఐ పరికరాలను ఏర్పాటు చేశారు. రక్తపరీక్షల సంఖ్యను పెంచారు. ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. 20 ఫ్రీజర్లను ప్రభుత్వం అందజేసింది. రూ.10 కోట్లతో క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణంలో ఉంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లను 175కు పెంచారు. అలాగే పిడియాట్రిక్, అనస్తీషియా, పల్మనాలజీ విభాగాల్లో పీజీ సీట్లను తీసుకొచ్చారు. యూపీహెచ్సీలకు అధునాతన హంగులు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 54 డివిజన్లు ఉండగా, దాదాపు 9 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. 2019 వరకు కార్పొరేషన్ పరిధిలో కేవలం 8 ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉండేవి. వాటి నిర్వహణ తూతూమంత్రంగా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 13 నూతన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను (యూపీహెచ్సీలను)అధునాతన హంగులతో నిర్మించింది. ఒక్కో భవనానికి రూ.1.10 కోట్ల నిధులను ప్రభుత్వం వెచ్చించింది. ఈ ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ, మందులు గది, ల్యాబ్, ప్రత్యేక వార్డు, డెలివరీ గదిని ప్రత్యేకంగా నిర్మించింది. పాత ఆరోగ్య కేంద్రాలకు నిధులు వెచ్చించి మరమ్మతులు చేసింది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కరోనాలోనూ ఉత్తమ వైద్యసేవలు కోవిడ్–19 సమయంలో జీజీహెచ్లోని వైద్యులు, సిబ్బంది, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో రోగులకు ఉత్తమ సేవలు అందించారు. కోవిడ్ బారిన పడిన వారికి తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైదసేవలు అందించారు. ఇతని పేరు పెంచలనాయుడు. ఇతనిది పొదలకూరు. ఇటీవల ఇంట్లో కాలు జారి కింద పడ్డాడు. చెయ్యి విరగడంతో జీజీహెచ్కు వెళ్లాడు. అక్కడ ఆర్థో విభాగం వైద్యులు పరీక్షించి చెయ్యి విరిగిన చోట ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగుంది. దాదాపు పది రోజులుగా జీజీహెచ్లో ఉన్నాడు. డాక్టర్లు ఉచిత వైద్యసేవలు అందించడమే కాకుండా ప్రతి పూట భోజనం పెట్టారు. అలాగే ప్రభుత్వం నుంచి రూ.4,720 వరకు ఆర్థికసాయం అందింది. ఇతని పేరు నాగరాజు. ఇతనిది నెల్లూరు నగరం. గత కొంతకాలంగా పైల్స్తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే వైద్యానికి రూ.50 వేలు ఖర్చవుతుందని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నెల్లూరులోని జీజీహెచ్కు వెళ్లాడు. వైద్యులు పరీక్షలు చేసి సమస్యను గుర్తించారు. తక్షణమే చికిత్స చేసేందుకు ముందుకువచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసేందుకు నిర్ణయించారు. రోగులకు అన్ని సౌకర్యాలు నాడు–నేడు కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. హాస్పిటల్కు వచ్చే రోగులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అన్ని ఏసీలు పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. 10 లిఫ్ట్ లు పనిచేస్తున్నాయి. అధునాతన పరికరాలతో సేవలు అందిస్తున్నాం. – సిద్ధానాయక్, జీజీహెచ్, సూపరింటెండెంట్ సేవ చేయడానికి ముందున్నాం జీజీహెచ్కు వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాం. అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తాను. హాస్పిటల్లో ఎన్నో క్లిష్టమైన డెలివరీలు చేశాం. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో, ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి సహాయ, సహకారాలతో పేదలకు మంచి వైద్యం అందిస్తున్నాం. – లక్ష్మీ సునంద, జీజీహెచ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కోఆర్డినేటర్ -
గుంటూరు జీజీహెచ్ లో శిశువు కిడ్నాప్
-
కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లేశారు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఎస్.కొత్తపల్లికి చెందిన జి.స్వప్నకు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సిజేరియన్ చేసి కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆమె డెలివరీ కోసం ఏలూరు సర్వజన ఆసుపత్రికి వచ్చింది. ఎంసీహెచ్ ప్రత్యేక విభాగంలో ఆమెకు సిజేరియన్ చేశారు. అనంతరం ఆరోగ్యంగా తల్లీబిడ్డ ఇంటికి వెళ్లారు. ఇటీవల ఆమెకు కడుపులో తీవ్రంగా నొప్పి రావటంతో ఈ నెల 8న ఏలూరు జీజీహెచ్లో జనరల్ వైద్యుల వద్దకు వచ్చింది. వైద్యులు ఎక్స్రే తీయించగా..ఆమె కడుపులో ఫోర్సెప్స్ (ఆపరేషన్ చేసినప్పుడు ఉపయోగించే వస్తువు)ను మరిచిపోయి కుట్లు వేసినట్లు గుర్తించారు. దీంతో ఆమెను విజయవాడ జీజీహెచ్కు రిఫర్ చేయగా.. అక్కడ స్వప్నకు ఆపరేషన్ చేసి పరికరాన్ని బయటకు తీశారు. ఆమె ప్రస్తుతం క్షేమంగా ఉంది. స్వప్న కడుపులో ఫోర్సెప్స్ పరికరం ఉన్నట్లు తెలిపే ఎక్స్రేను హాస్పిటల్లోని ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో ఉంచాడు. స్వప్న కడుపులో ఫోర్సెప్స్ పరికరాన్ని ఉంచి కుట్లు వేసిన ఘటనపై కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ ఆదేశాలతో విచారణ కమిటీ వేసినట్లు ఏలూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శశిధర్ చెప్పారు. -
క్యాన్సర్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
గుంటూరు మెడికల్: క్యాన్సర్ నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం ఈ ఏడాదిలో రూ.600 కోట్లు క్యాన్సర్ చికిత్సల కోసం ఖర్చు చేసిందన్నారు. గుంటూరు జీజీహెచ్ నాట్కో క్యాన్సర్ సెంటర్లో శుక్రవారం జరిగిన నేషనల్ క్యాన్సర్ గ్రిడ్ (ఎన్సీజీ) ఏపీ చాప్టర్ రాష్ట్రస్థాయి వార్షిక తొలి సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యాధునిక క్యాన్సర్ వైద్యసేవలు పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్నారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాస్పత్రుల్లో క్యాన్సర్ వైద్యసేవలు అందిస్తున్నట్లు చెప్పారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో గత ప్రభుత్వంలో 990 ప్రొసీజర్లు మాత్రమే ఉండేవని, నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలందరికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో 3,257 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చారని వివరించారు. ముఖ్యమంత్రికి క్యాన్సర్ నియంత్రణకై ప్రత్యేకదృష్టి ఉందని, అందుకే ఆరోగ్యశ్రీ పథకంలో 638 ప్రొసీజర్లు కేవలం క్యాన్సర్ వ్యాధులకు చెందినవే అందుబాటులో ఉంచారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.120 కోట్లు ఖర్చుచేస్తోందన్నారు. ఇతర కళాశాలల్లో సైతం రెండోదశలో క్యాన్సర్ చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలులో రూ.120 కోట్లతో ఏర్పాటు చేసిన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో రూ.55 కోట్లతో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నామని, దీన్ని త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. కడపలో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు రూ.107 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వైజాగ్ను క్యాన్సర్ చికిత్సకు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్గా మార్చేందుకు రూ.45 కోట్లతో అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆమె చెప్పారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్.హరీంద్రప్రసాద్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో క్యాన్సర్ చికిత్స అందించేందుకు సమావేశంలో చర్చిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక క్యాన్సర్ చికిత్సలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ చికిత్సల కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. నాట్కో ట్రస్టు వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పేదలకు గుంటూరు జీజీహెచ్లో ఉచితంగా క్యాన్సర్ వైద్యసేవలు, మందులు అందిస్తున్నట్లు చెప్పారు. నగర మేయర్ కావటి మనోహర్నాయుడు, సదస్సు ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి.వి.శివరామకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహం, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీలి ఉమాజ్యోతి, డాక్టర్ ఉమేష్శెట్టి, డాక్టర్ ఏకుల కిరణ్కుమార్, యడ్లపాటి అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
8 గంటలు శ్రమించి... ప్రాణాలు కాపాడారు జీజీహెచ్ లో అరుదైన ఆపరేషన్...!
-
అరుదైన ట్యూమర్.. వైద్యులంతా చర్చించి.. ధైర్యం చేసి..
సాక్షి, గుంటూరు మెడికల్: మెడికల్ జర్నల్స్లో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం రెండు కేసులు మాత్రమే నమోదైన అత్యంత అరుదైన ట్యూమర్ను గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్యులు గుర్తించారు. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్ను జనరల్ సర్జరీ రెండో యూనిట్ వైద్యులు విజయవంతంగా చేసి రోగి ప్రాణాలను కాపాడారు. ఆస్పత్రిలో బుధవారం మీడియాకు ప్రొఫెసర్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ వివరాలు వెల్లడించారు. విజయవాడకు చెందిన నేలటూరి శామ్సన్జాన్సునీల్ మంచంపై నుంచి లేవలేని విధంగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం అతడిని విజయవాడ జీజీహెచ్కు తీసుకెళ్లారు. వైద్యులు తక్షణమే అతడికి రక్తం ఎక్కించి ఆరోగ్యం కొంచెం మెరుగుపడ్డాక వైద్య పరీక్షలు నిర్వహించి.. కడుపు కింది భాగంలో జిస్ట్ అనే కణితి ఉన్నట్లు నిర్థారించారు. సర్జరీ కోసం ఓ కార్పొరేట్ ఆస్పత్రిని సంప్రదించినా లాభంలేక గుంటూరు జీజీహెచ్కు మార్చి 14న రోగిని తీసుకొచ్చారు. రిపోర్టులు పరిశీలించి.. చిన్న పేగు డ్యూడెనమ్, జెజునమ్ జంక్షన్ దగ్గర అత్యంత అరుదైన జిస్ట్ ట్యూమర్ ఉన్నట్లు గుర్తించామని డాక్టర్ కిరణ్కుమార్ చెప్పారు. చిన్నపేగు మొదటి భాగంలో గ్యాస్ట్రో ఇంటస్టీనల్ స్ట్రోమల్ ట్యూమర్(జిస్ట్) ఇప్పటివరకు మెడికల్ జర్నల్స్లో రెండు మాత్రమే నమోదైనట్టు తెలిపారు. చదవండి: సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా ఈ సమస్యకు ఏ విధంగా ఆపరేషన్ చేయాలనే విషయాలు ఎక్కడా పేర్కొనలేదని, రెండో యూనిట్ జనరల్ సర్జరీ వైద్యులంతా దీని గురించి చర్చించి ధైర్యంగా మార్చి 25న ఆపరేషన్ చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 లక్షల వరకూ తీసుకునే ఈ సర్జరీని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తి ఉచితంగా చేశారు. ఆపరేషన్ ప్రక్రియలో తనతో పాటు వైద్యులు చలం, నాగసంతోష్, వంశీధర్, అనూష, వేణుగోపాల్, కోటి, మత్తు వైద్యులు మహేష్బాబు, ఆనందబాబు, అలేఖ్య, కీర్తి, రాఘవ, కవిత పాల్గొన్నట్టు డాక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. -
ప్లాస్టిక్ కవర్లో పసివాడి ప్రాణం
గుంటూరు ఈస్ట్: నవమాసాలు మోసిన తల్లి... ‘కని’కరం లేకుండా 48గంటల్లోనే తన బిడ్డను వదిలేసింది. పేగు తెంచి పంచిన పసి ప్రాణాన్ని తన పొత్తిళ్లలో అదుముకుని అల్లారుముద్దుగా చూసుకోకుండా... చెత్తను విసిరేసినంత సులభంగా ప్లాస్టిక్ కవర్లో పెట్టి పాడుబడిన ఇంట్లో పడేసింది. తల్లి స్పర్శ కోసం గుక్కపెట్టిన ఆ శిశువు ఏడుపు విని పక్క ఇంట్లో ఉంటున్న మరో మాతృమూర్తి వచ్చి ఆ బిడ్డను కాపాడారు. ఈ హృదయవిదారక ఘటన గుంటూరులో ఆదివారం జరిగింది. గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని గుంటూరువారితోట 5వ లైనులో ఓ పాడుబడిన భవనం పై నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ శిశువు ఏడుపు వినిపించడంతో పక్క ఇంట్లో ఉన్న మహిళ చూసేందుకు వెళ్లారు. అక్కడ పాలిథిన్ క్యారీ బ్యాగులో మగ శిశువు కనిపించాడు. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొత్తపేట పోలీసులు ఘటనస్థలానికి వెళ్లి ఆ శిశువుని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, పిల్లల విభాగంలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ శిశువు పుట్టి రెండు రోజులు అయి ఉంటుందని, ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. ఆ శిశువు ఉన్న పాడుబడిన భవనం చుట్టూ హాస్పిటల్స్ ఉండటంతో సమీపంలోనే డెలివరీ అయి ఇక్కడ వదిలి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ శిశువును ఎవరు వదిలి వెళ్లారనే విషయాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. -
22 రోజుల శిశువుకు అరుదైన శస్త్ర చికిత్స
లబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే కుడివైపు ముక్కులో మాస్ పెరుగుదల ఉన్న 22 రోజుల శిశువుకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జీజీహెచ్ ఇఎన్టీ విభాగ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆ శిశువుకు ఎముకల ఫైబ్రోమా వ్యాధిగా నిర్ధారించిన వైద్యులు, ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక ఎండోస్కోపీ పరికరంతో శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి కుడి నాసల్లోని మాస్ను తొలగించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో అత్యాధునిక పరికరాలతో పాటు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండడంతో క్లిష్టతరమైన, అరుదైన శస్త్ర చికిత్సలను సైతం విజయవంతంగా నిర్వహించగలుగుతున్నారు. ముక్కులో మాస్తో ఇబ్బంది పడుతున్న శిశువును పాత ప్రభుత్వాస్పత్రి నుంచి ఇక్కడికి రిఫర్ చేయగా, ఆమెకు పుట్టుకతోనే ఉన్న వ్యాధి నిర్ధారించి శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఇఎస్టీ విభాగాధిపతి డాక్టర్ రవి తెలిపారు. ఇఎన్టీ వైద్యులు డాక్టర్ లీలాప్రసాద్, డాక్టర్ ఆదిత్య, ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి సూర్యశ్రీ, డాక్టర్ కిరణ్కుమార్, డాక్టర్ సుధారాణి పాల్గొన్నారు. -
Brain Tumor: బ్రెయిన్ ట్యూమర్ గుర్తించడం ఇలా.. కారణాలివే..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కాలంలో బ్రెయిన్ ట్యూమర్ బాధితులు పెరుగుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రికే ప్రతినెలా 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ బాధితులు వస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి బ్రెయిన్ స్కాన్ చేసి వ్యాధిని నిర్ధారించి, అవసరమైన చికిత్సలు చేస్తున్నారు. ఒకప్పుడు ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో బ్రెయిన్ ట్యూమర్లు చూసేవారమని, ఇప్పుడు 15 ఏళ్ల చిన్నారులు, 30–40 ఏళ్ల మధ్య వయస్సు వారిలోనూ బ్రెయిన్ ట్యూమర్లు చూస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ ట్యూమర్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయని, చిన్న పిల్లల్లో జన్యుపరమైన లోపాలే కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినట్లు చెపుతున్నారు. కారణాలివే.. ► జన్యుపరమైన లోపాలు ► తీసుకునే ఆహారం వలన ► సెల్ఫోన్ రేడియేషన్ ► స్మోకింగ్, ఆల్కాహాల్ తీసుకునే వారిలోనూ రావచ్చు. గుర్తించడం ఇలా... బ్రెయిన్ ట్యూమర్కు నాలుగు దశలు ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. మొదటి దశ : తలనొప్పి, వాంతులు, తల తిరగడం. రెండోదశ : తీవ్రమైన తలనొప్పి, అకారణంగా వాంతులు అవడం, తలతిరగడం ఎక్కువగా ఉంటుంది. మూడో దశ : బ్రెయిన్లోని ట్యూమర్ ఇతర అవయవాలకు వ్యాప్తి చెందుతుంది. ఊపిరితిత్తులు, వెన్నుపూసలకు విస్తరిస్తుంది. లక్షణాలు కూడా తీవ్రంగా ఉంటాయి. నాలుగోదశ : ట్యూమర్ కణాలు శరీరంలోని రక్తంలో కలిసి అంతా వ్యాప్తి చెందుతుంది. ఈ దశలో రోగి మరింత క్షీణిస్తాడు. చికిత్సలు ఇలా.. బ్రెయిన్ ట్యూమర్ దశను బట్టి చికిత్స అందిస్తారు. కొందరికి మందులు ఇస్తూ ట్యూమర్ను తగ్గిస్తారు. మరికొందరికి శస్త్ర చికిత్స ద్వారా ట్యూమర్ను తొలగిస్తారు. రేడియేషన్ థెరపీ, శస్త్ర చికిత్స తర్వాత కీమోథెరపీ వంటి చికిత్సలు అందిస్తారు. ప్రస్తుతం ఆధునిక చికిత్స, అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో బ్రెయిన్ ట్యూమర్ రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. నిర్ధారణ ఇలా.. తలనొప్పితో వచ్చిన రోగికి సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు చేయడం ద్వారా బ్రెయిన్ ట్యూమర్ను నిర్ధారిస్తారు. ఒకప్పుడు బ్రెయిన్ ట్యూమర్ను నాలుగో దశ వచ్చే వరకూ గుర్తించే వారు కాదు. వ్యాధి నిర్ధారణ కాకముందే మరణించినవారు కూడా ఉన్నారు. ఇప్పుడు అత్యాధునిక డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రావడంతో తొలిదశలోనే గుర్తించగలుగుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో సైతం రెండు సీటీ స్కానింగ్ యంత్రాలతో పాటు, ఒక ఎంఆర్ఐ పరికరం అందుబాటులో ఉంది. ప్రైవేటులో సైతం విస్తృతంగా స్కానింగ్ పరికరాలు అందుబాటులోకి రావడంతో తొలిదశలో గుర్తించగలుగుతున్నారు. (క్లిక్ చేయండి: చలికాలం మెదడుకు ముప్పు.. జాగ్రత్త..!) ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు ప్రభుత్వాస్పత్రిలోని న్యూరాలజీ ఓపీకి నెలకు 20 నుంచి 30 మంది వరకూ బ్రెయిన్ ట్యూమర్ రోగులు వస్తున్నారు. ఎక్కువగా రెండో దశలోనే వస్తున్నారు. వారి పరిస్థితిని అంచనా వేసి మందులు ఇవ్వాలా, శస్త్ర చికిత్స చేయాలా అనేది నిర్ధారిస్తాం. తీవ్రమైన తలనొప్పితో వచ్చిన వారికి సీటీ, ఎంఆర్ఐ స్కాన్ చేయడంతో ట్యూమర్ను నిర్ధారిస్తున్నారు. అందుకోసం ప్రభుత్వాస్పత్రిలో రెండు సీటీ స్కాన్లు, ఒక ఎంఆర్ఐ స్కానింగ్ పరికరం అందుబాటులో ఉంది. – డాక్టర్ దార వెంకట రమణ, న్యూరాలజీ విభాగాధిపతి, జీజీహెచ్, విజయవాడ కచ్చితమైన నిర్ధారణ బ్రెయిన్ ట్యూమర్లను కాంట్రాస్ట్ సీటీతో కచ్చితమైన నిర్ధారణ చేస్తాం. బ్రెయిన్లో ఏదైనా గడ్డ ఉంటే అది ట్యూమరా, ఇంకేమైనా ఉందా అనేది తెలుసుకోవచ్చు. ఏ ప్రాంతంలో ట్యూమర్ ఉంది అనేది చెప్పవచ్చు. ఒకప్పుడు నాలుగో దశ వరకూ తెలుసుకునే వారు కాదు. ఇప్పుడు అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అందుబాటులోకి రావడంతో. మొదటి, రెండో దశలోనే గుర్తించగలుగుతున్నారు. తలనొప్పితో వచ్చిన వారికి లక్షణాలను బట్టి స్కాన్ చేస్తే ట్యూమర్ ఉంటే నిర్ధారణ చేయొచ్చు. – డాక్టర్ ఎన్.దీప్తిలత, రేడియాలజిస్ట్ -
పదేళ్ల బాలుడికి పునర్జన్మ
గుంటూరు మెడికల్: ఆడుతూ పాడుతూ ఉండాల్సిన పదేళ్ల బాలుడు అకస్మాత్తుగా జీబీ సిండ్రోమ్ వ్యాధి బారిన పడ్డాడు. రెండు నెలలపాటు పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేసినా బాలుడి ఆరోగ్యం మెరుగుపడకపోగా, మరింత క్షీణించింది. వెంటిలేటర్పై ఉంచి తీసుకొచ్చిన ఆ బాలుడికి గుంటూరు జీజీహెచ్లోని న్యూరాలజీ వైద్యులు సకాలంలో సరైన వైద్యం అందించి పునర్జన్మను ప్రసాదించారు. దీంతో బాలుడి తండ్రి ఆనందంతో న్యూరాలజీ వైద్య విభాగంలో గురువారం కేక్ కట్ చేసి, స్వీట్లు పంచి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చాకలికుంట తండాకు చెందిన మూడావత్ రాజానాయక్, మంగాబాయి దంపతుల కుమారుడు వగ్యానాయక్(10) ఐదో తరగతి చదువుతున్నాడు. వగ్యానాయక్కు రెండు నెలల క్రితం ముఖంపై వాపు వచ్చింది. అతడికి నరసరావుపేట, గుంటూరులోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. అన్ని ఆస్పత్రుల్లో కలిపి రూ.10లక్షలు వరకు ఖర్చు చేశారు. అయినా బాలుడు కోలుకోలేదు. రెండుసార్లు కార్డియాక్ అరెస్టయి ఆరోగ్యం మరింత క్షీణించి వెంటిలేటర్పై ఉన్న వగ్యానాయక్ను చివరికి ఈ నెల మూడో తేదీ అర్ధరాత్రి గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగానికి తీసుకొచ్చారు. తక్షణమే డ్యూటీలో ఉన్న పీజీ వైద్యులను అప్రమత్తం చేసి బాలుడిని ఐసీయూలోకి తరలించి వెంటిలేటర్ అమర్చి చికిత్స అందించామని న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ వెంకటసుందరాచారి తెలిపారు. వారం రోజులపాటు వెంటిలేటర్పై చికిత్స అందించిన తర్వాత బాలుడు కోలుకోవడం ప్రారంభమైందని చెప్పారు. ఈ బాలుడికి అరుదుగా సంభవించే గులియన్బెరి సిండ్రోమ్ (జీబీ సిండ్రోమ్) సోకినట్లు నిర్ధారించామన్నారు. రోజుకు రూ.లక్ష విలువైన ఇంజక్షన్లు చేశామని, కేవలం ఇంజక్షన్లకు రూ.ఆరు లక్షలకు పైగా ఖర్చు అయినట్లు వెల్లడించారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సుమారు రూ.10 లక్షలు ఖర్చు అయ్యే వైద్యాన్ని బాలుడికి ఉచితంగా చేసి ప్రాణాలు కాపాడామని, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడని వివరించారు. -
World Piles Day 2022: పైల్స్కు స‘మూల’ పరిష్కారం..
గుంటూరు మెడికల్: ఆధునిక జీవన శైలి వల్ల ప్రస్తుతం ప్రజలు యుక్త వయసులోనే మూలవ్యాధి(పైల్స్/మొలలు) బారిన పడుతున్నారు. ఎక్కువగా కాలేజీ విద్యార్థులు, ఉద్యోగులు దీనివల్ల బాధపడుతున్నట్టు వైద్య నిపుణులు గుర్తించారు. ఈ రోగులు ఎక్కువగా కూర్చోలేరు. అలాగని తిరగనూ లేరు. గుంటూరు జీజీహెచ్ జనరల్ సర్జరీ వైద్య విభాగానికి ప్రతిరోజూ పది మంది పైల్స్ సమస్యతో చికిత్స కోసం వస్తున్నారు. గుంటూరు జిల్లాలో 120 మంది జనరల్ సర్జన్లు, పది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు ప్రతిరోజూ సగటున ఇద్దరు మొలల బాధితులు చికిత్స కోసం వస్తున్నట్టు సమాచారం. హెమోరాయిడ్స్గా పిలిచే ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాదీ నవంబర్ 20న వరల్డ్ పైల్స్ డేని నిర్వహిస్తున్నారు. సరైన వైద్యం తీసుకుంటే మూలవ్యాధిని సమూలంగా నయం చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు. కారణమేంటంటే.. మల విసర్జన సరిగా జరగకపోవడాన్ని మలబద్ధకం అంటారు. ఇది ఎక్కువగా ఉండేవారిలో అన్నవాహిక చివరి భాగంలో మల ద్వారానికిపైన పురీషనాళం వద్ద రక్తనాళాల్లో వాపు చోటుచేసుకుంటుంది. దీనినే మూల వ్యాధి అంటారు. కొందరిలో మలద్వారం దగ్గర సిరలు బలహీనంగా ఉండటం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. వంశ పారంపర్యంగానూ వచ్చే ఆస్కారం ఉంది. వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, ఆహారపు అలవాట్లు, పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే ఆస్కారం ఉంది. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం, మానసిక ఒత్తిడి, మద్యపానం, నీరు తక్కువగా తాగడం, మాంసాహారం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వారిలో పైల్స్ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. మల ద్వారం చుట్టూ దురదగా ఉండడం, మల విసర్జన సమయంలో వాపు, ఉబ్బు తగలడం, అధిక రక్తస్రావం దీని లక్షణాలు. చికిత్స, జాగ్రత్తలు ► ప్రస్తుతం మూలవ్యాధికి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. స్టాప్లర్, లేజర్, హాల్స్వంటి విధానాల వల్ల ఎక్కువ నొప్పి, గాయం లేకుండా మూలవ్యాధిని నయం చేయొచ్చు. ► మొలలు సోకిన వారు పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ద్రవ పదార్థాలను ప్రత్యేకంగా నీళ్లను తరచూ తాగాలి. పండ్లు, ఆకు కూరలు, కాయగూరలు అధికంగా తీసుకోవాలి. ఎక్కువగా శ్రమపడి ఒత్తిడి కలిగేలా మల విసర్జన చేయకూడదు. కారం, మాసాలాలు, పచ్చళ్లు, వేపుళ్లు, దుంప కూరలకు దూరంగా ఉండాలి. 90 శాతం మందులతోనే నయం పైల్స్ బాధితులకు గుంటూరు జీజీహెచ్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉచితంగా ఆపరేషన్లూ చేస్తున్నాం. నూటికి 90 శాతం మూలవ్యాధి మందులతోనే నయమవుతుంది. కేవలం పది శాతం మందికి మాత్రమే శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఆపరేషన్కూ అత్యాధునిక పద్ధతులు ఉన్నాయి. లేజర్ చికిత్స ద్వారా అతి తక్కువ కోత, కుట్లతో శస్త్రచికిత్స చేయొచ్చు. – షేక్ నాగూర్బాషా, గ్యాస్ట్రో ఎంట్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ -
Epilepsy: దేహం రంగు మారిందో ప్రాణాపాయం తప్పదు
సాక్షి, గుంటూరు: ఫిట్స్ వ్యాధికి వైద్యం లేదనే అపోహకు కాలం చెల్లింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం 50 మిలియన్ల ప్రజలు మూర్చవ్యాధితో (ఎపిలెప్సి) బాధపడుతున్నారు. వీరిలో 80 శాతం బాధితులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. మన దేశంలో 10 మిలియన్ల మంది వ్యాధితో బాధపడుతున్నారు. ప్రజలకు ఫిట్స్ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఎపిలెప్సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2009 నుంచి నవంబర్ నెలను జాతీయ ఎపిలెప్సీ అవగాహన మాసంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి ’ అందిస్తున్న ప్రత్యేక కథనం. మూర్చ అంటే (ఫిట్స్).. మెదడులో ఉన్న న్యూరాన్లలో విద్యుత్ ఆవేశం ఎక్కువైనప్పుడు బయట కనిపించే లక్షణాలనే ఫిట్స్ లేదా మూర్చ అంటారు. ఇది వచ్చినప్పుడు కాళ్లు, చేతులు కొట్టుకుని పడిపోతారు. ఫిట్స్ వచ్చినప్పుడు కొంత మందికి నాలుక కొరుక్కోవడం, నోటి నుంచి నురగ రావడం గమనించవచ్చు. ఫిట్స్ ఎక్కువ సమయం ఉండే మనిషి దేహం నీలంరంగుగా మారి ప్రాణాపాయ స్థితికి చేరుకోవచ్చు. కారణాలు.. మెదడులో వచ్చే ఇన్ఫెక్షన్లు, గడ్డలు, తలకు గాయాలు, బ్రెయిన్ స్ట్రోక్స్, మెదడులో రక్తనాళాలు ఉబ్బడం, పుట్టుకతో వచ్చే జన్యుపరమైన సమస్యల వల్ల ఫిట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పిల్లలు, పెద్దవాళ్లలో అందరిలోనూ ఈ మూర్ఛ వ్యాధి వస్తుంది. గొంతు, చెవిలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల చిన్నారుల్లో వచ్చే అవకాశం ఉంది. స్త్రీలు ప్రసవ సమయంలో కొన్ని రకాల చికిత్స విధానాలు పాటించకపోవడం వల్ల, టీబీ, హెచ్ఐవీ, మెదడువాపు జబ్బుల వల్ల, వైరస్లు, బ్యాక్టీరియా, ఫంగస్ల వల్ల ఫిట్స్ కేసులు దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో బాధితులు.. గుంటూరు జీజీహెచ్లో ప్రతి శనివారం మూర్చవ్యాధి బాధితుల కోసం ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. ప్రతి వారం 150 మంది ఓపీ విభాగానికి వైద్యం కోసం వస్తున్నారు. జిల్లాలో సుమారు 90 మంది న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు , ఫిజీషియన్ల వద్ద ప్రతి రోజూ ఒక్కొక్కరి వద్ద ఐదు నుంచి పది మంది వరకు ఫిట్స్ సమస్యతో చికిత్స పొందుతున్నారు. -
AP: డాక్టరమ్మ గొప్ప మనస్సు.. రూ.20 కోట్ల భారీ విరాళం
గుంటూరు మెడికల్: ఓ డాక్టరమ్మ తాను వైద్య విద్యను అభ్యసించిన కళాశాలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.20 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని కూచిపూడికి చెందిన డాక్టర్ గవిని వెంకటకృష్ణారావు రెండో కుమార్తె డాక్టర్ ఉమ గవిని. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించారు. అమెరికాలో 40 ఏళ్ల కిందట స్థిరపడి, ఇమ్యునాలజిస్టుగా వైద్య సేవలు అందిస్తున్నారు. చదవండి: ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింఖానా)కు అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం జింఖానా కోశాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్లో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)కి డాక్టర్ ఉమ గవిని విరాళం ప్రకటించారు. అధిక మొత్తంలో విరాళం ప్రకటించిన డాక్టర్ ఉమ గవిని దాతృత్వాన్ని ప్రశంసిస్తూ అనేక పోస్టులు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పెట్టారు. -
గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందని ఫిర్యాదులు రావడంతో శుక్రవారం వైద్య కళాశాల అధికారులు ర్యాగింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ మహిళా వైద్యులను పిలిపించి విచారణ చేశారు. గుంటూరు జీజీహెచ్లో హౌస్ సర్జన్గా (ఇంటర్నీ) విధులు నిర్వహిస్తున్న ఓ వైద్య విద్యార్థిని తనను పీజీ విద్యార్థినులు వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) టోల్ఫ్రీ నంబర్కు ఫోన్చేసి ఫిర్యాదు చేసింది. ఎన్ఎంసీ అధికారులు సదరు ఘటనపై తక్షణమే విచారణ నిర్వహించాలని ఆదేశిస్తూ శుక్రవారం వైద్య కళాశాల అధికారులకు మెయిల్ ద్వారా ఉత్తర్వులు పంపారు. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చాగంటి పద్మావతీదేవి ఆధ్వర్యంలో పలువురు యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు ర్యాగింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పీజీ మహిళా వైద్యులను పిలిపించి విచారించారు. కాగా, ఏప్రిల్లో మెన్స్ హాస్టల్లో సీనియర్ వైద్య విద్యార్థులు ర్యాగింగ్ చేస్తున్నారంటూ జూనియర్ వైద్య విద్యార్థులు ఎన్ఎంసీకి ఫిర్యాదు చేశారు. నాడు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతీదేవి సీనియర్ వైద్య విద్యార్థులు, జూనియర్ వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ర్యాగింగ్ విష సంస్కృతిని అనుసరించవద్దని, ఎవరైనా ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా మళ్లీ కళాశాలలో ర్యాగింగ్ జరగడం గమనార్హం. -
గుంటూరులో మంకీపాక్స్ కలకలం.. శాంపిల్స్ పూణేకు తరలింపు
సాక్షి, గుంటూరు : గుంటూరులో మంకీపాక్స్ కలకలం సృష్టించింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో రాహువ్ నహక్(8) జీజీహెచ్లో చేరాడు. దీంతో, చికిత్స పొందుతున్న రాహువ్ నుంచి శనివారం రాత్రి జీజీహెచ్ అధికారులు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించారు. గొంతు, ముక్కు నుంచి స్వాబ్ తీయడంతోపాటు, రక్తం, మూత్రం శాంపిల్స్ను సేకరించి ప్రత్యేకంగా భద్రపరిచారు. వ్యాధి నిర్ధారణ కోసం ఆ శాంపిల్స్ను ఎపిడిమాలజిస్టు డాక్టర్ వరప్రసాద్తో శనివారం రాత్రి 10 గంటలకు విమానంలో పూణేకు పంపిస్తామని, వ్యాధి నిర్ధారణకు 3 రోజుల సమయం పడుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి తెలిపారు. కాగా, ఒడిశాకు చెందిన బనిత నహక్, గౌడ నహక్లు తమ కుమారుడు రాహువ్ నహక్తో కలిసి ఒడిశా నుంచి యడ్లపాడు స్పిన్నింగ్మిల్లుకు 16 రోజుల కిందట వచ్చారని పేర్కొన్నారు. ఒంటిపై గుల్లలు రావడంతో ఈ నెల 28న చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తీసుకువచ్చారని, ప్రత్యేక వార్డులో బాలుడిని అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: సాగర గర్భంలో పర్యాటకం -
గుంటూరులో మంకీపాక్స్ కలకలం.. జీజీహెచ్లో చేరిన అనుమానిత కేసు
-
Monkeypox: గుంటూరులో మంకీపాక్స్ కలకలం!
గుంటూరు: గుంటూరులో అనుమానిత మంకీపాక్స్ కేసు కలకలం సృష్టించింది. దద్దుర్లు కనిపించటంతో ఎనిమిదేళ్ల బాలుడిని జీజీహెచ్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రత్యేక వార్డులో ఉంచి బాలుడికి చికిత్స అందిస్తున్నారు జీజీహెచ్ వైద్యులు. మంకీపాక్స్ లక్షణాలు కనిపించటం వల్ల బాలుడి శాంపిల్స్ను గాంధీ ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. ఇంతకుముందు విజయవాడలోనూ ఓ చిన్నారిలో లక్షణాలు కనిపించాయి. అయితే, పరీక్షల్లో నెగెటివ్గా తేలింది. ఇదీ చదవండి: తల్లడిల్లిన మాతృ హృదయాలు -
విజయవాడ జీజీహెచ్.. ఇక ఇ–ఆస్పత్రి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): విజయవాడ ప్రభుత్వాస్పత్రి ‘ఇ’(ఎల్రక్టానిక్) ఆస్పత్రిగా రూపాంతరం చెందనుంది. పేపర్ రహిత డిజిటల్ వైద్య సేవలందించేందుకు రాష్ట్రంలోనే మోడల్ ఆస్పత్రిగా ఎంపికైంది. ఈ విషయాన్ని శుక్రవారం రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు ఎం.రాఘవేంద్రరావు ప్రకటించారు. ఇ ఆస్పత్రిగా మార్చే పనులు 15 రోజులుగా చేస్తున్నారు. ఈ నెలాఖరుకు అత్యాధునిక పరికరాలు రానున్నాయి. దీంతో మార్చి 15 నాటికి సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ డివిజన్ హెల్త్ మిషన్లో భాగంగా ఇ ఆస్పత్రిగా మారుస్తున్నారు. చదవండి: విశాఖలో సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. ప్రతి రోగికి ఒక శాశ్వత ఐడీ.. ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతి రోగికి ఆధార్ అనుసంధానిత గ్లోబల్ బేస్డ్ ఐడీని క్రియేట్ చేస్తారు. ఒకవేళ ఆ రోగికి అప్పుడే ఐడీ ఉంటే, దాని ప్రకారమే సేవలు అందిస్తారు. ఒకసారి ఐడీని క్రియేట్ చేస్తే, ఆ నంబరు జీవితాంతం ఉండిపోతుంది. రోగి ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నంబరు చెబితే అతని పూర్వ చికిత్స వివరాలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటివి రోగి చెప్పకుండానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దేశంలోనే కాకుండా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ ఐడీ నంబర్ పనిచేస్తుంది. ఒకవేళ రోగి ఐడీ నంబర్ మర్చిపోయినా, ఆధార్ నంబర్ ఆధారంగా తెలుసుకునే వీలుంది. పేపర్ రహిత సేవలు.. ఎల్రక్టానిక్ ఆస్పత్రిగా రూపొంతరం చెందిన అనంతరం ఆస్పత్రిలో పేపర్ రహిత వైద్య సేవలు అందించనున్నారు. రోగి ఓపీకి ఐడీ ఆధారంగా రిజి్రస్టేషన్ చేయడంతో పాటు, వైద్యులు పరీక్షలు చేసి, వారు గుర్తించిన లోపాలు, రక్త పరీక్షా ఫలితాలు, సీటీ స్కాన్ , ఎంఆర్ఐ రిపోర్టులు ఇలా అన్నీ రోగి ఐడీ ఆధారంగా ఆన్లైన్లోనే ఉంచుతారు. వారి మెడికల్ రికార్డులు సైతం ఆన్లైన్లోనే ఉంటాయి. ఇన్పేషెంట్గా చేరినా రికార్డులన్నీ ఎలక్ట్రానిక్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆన్లైన్లోనే పొందుపరుస్తారు. ఒక్క క్లిక్తో హిస్టరీ అంతా.. ప్రతి రోగికి ఒక ఐడీని క్రియేట్ చేసి, తన రిపోర్టులన్నీ ఆన్లైన్ చేయడం ద్వారా ఒక్క క్లిక్తో రోగి పూర్వ పరిస్థితిని (స్టరీ) వైద్యులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. రోగి ఐడీని ఓపెన్ చేస్తే పాత హిస్టరీ అంతా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మోడల్ ఆస్పత్రిగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిని ఇ ఆస్పత్రిగా మారుస్తుండగా, అనంతరం రాష్ట్రంలోని ఇతర బోధనాస్పత్రులు, జిల్లా ఏరియా ఆస్పత్రులతో పాటు, ప్రైవేట్ ఆస్పత్రులను సైతం మార్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. మార్చి 15కి పూర్తి.. ఎల్రక్టానిక్ ఆస్పత్రిగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. మార్చి 15 నాటికి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటుంది. అందుకోసం ప్రతి వార్డులో ఒక కంప్యూటర్ ఆపరేటర్ను ఏర్పాటు చేసి, రికార్డులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తాం. ప్రతి రిపోర్టు ఆన్లైన్లోనే ఉంటుంది. పేపర్ రహిత వైద్య సేవలు అందించనున్నాం. రోగి హిస్టరీ అంతా ఐడీ నంబర్తో తెలుసుకోవచ్చు. – డాక్టర్ యేకుల కిరణ్కుమార్, సూపరింటెండెంట్ -
ఆప్యాయత అల్లుకున్న ’మన ఇల్లు‘
పెద్దాపురం: స్పందించే మనసుంటే చాలు...సేవ చేయాలనే తపన ఉంటే చాలు..ఆదుకోడానికి పెద్దగా ఆస్తిపాస్తులక్కరలేదని చెప్పడానికి ఆయనే నిదర్శనం. అయినవాళ్ల ఆదరణకు దూరంగా ..వృద్ధాప్యంలో అనాథలైన వారికి ఆసరా ఇస్తున్న ఆయన పేరు అల్లవరపు సత్యన్నారాయణ. బాల్యంలో తండ్రి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో పడిన బాధల్ని కళ్లారా చూశారు. ఆర్ధిక పరిస్థితి సహకరించకపోతే ఎదురయ్యే పరిస్థితులనూ చూశారు. ఆవే ఆయన్ను ప్రభావితం చేశాయి. అభాగ్యులకు అండగా నిలవాలనే తత్వాన్ని పెంచాయి. ఫలితంగా ఆయన నేతృత్వంలో 2016లో కాకినాలో ఆవిర్భవించిందే బాధ్యత స్వచ్ఛంద సంస్థ. తనలాంటి స్వభావమున్న మరో ఏడుగురు ఈయనకు తోడయ్యారు. నాటి ఆస్పత్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు ప్రోత్సాహమూ బలమైంది. తొలుత కాకినాడలో అనాథ బాలలు గుర్తించి, దిశ వన్ స్టాప్ సర్వీస్ల సహాకారంతో సేవలకు శ్రీకారం చుట్టారు. మేమున్నామని.. జీజీహెచ్లో ఏ దిక్కూ లేని వృద్ధుల వైద్యసేవలకో వార్డు ఉంది. ఈ వార్డులో చికిత్స పొందుతున్న వారెవరికీ తెలియదు. వీరికోసం ఎవరూ అక్కడికి రారు. ఈ వార్డుకు సత్యనారాయణ బృందం వెళుతూ వారికి సపర్యలు చేస్తున్నారు. వీరికి తామే ఎందుకు ఆసరా కల్పించకూడదనే ఆలోచనతో పెద్దాపురంలో మన ఇల్లు ఏర్పాటు చేశారు. తొలుత ఎనిమిది మందితో ఆరంభమైన మన ఇల్లులో ఇప్పుడు 29మంది ఉంటున్నారు. సహచరులు.. యువత, ప్రభుత్వ ఉద్యోగులు సత్యనారాయణ ఆలోచనకు అండగా నిలుస్తున్నారు. తమ వంతు చేయూతనిస్తున్నారు. మన ఇల్లులో ఉన్నవారెవరికీ తాము అనాథలం అనే భావన రానీయకుండా సాకుతున్నామని సత్యనారాయణ చెప్పారు. ఆహ్లాద కరమైన వాతావరణంలో పడుకోవడానికి బెడ్లు, దుప్పట్లు, వేళకు భోజనం సమకూర్చుతున్నారు. వినోదం కోసం టీవీలు అందుబాటులో ఉంచుతున్నారు మన ఇల్లు నిర్వాహకులు. అసోం నుంచి రైలు ప్రమాదంలో అనారోగ్యం పాలై మతిస్థిమితం కోల్పోయిన శ్రీదౌహరుకు మూడేళ్లపాటు సేవలందించారు. తర్వాత కుటుంబీకుల వివరాలు చెప్పడంతో ఇటీవల వారిని రప్పించి అతడ్ని స్వస్థలానికి పంపించారు. ఈవిషయంలో మన ఇల్లు నిర్వాహకుడు సత్యనారాయణ పోషించిన పాత్రను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ప్రశంసించారు. జీజీహెచ్లో అనాథలుగా ప్రాణాలు కోల్పోయిన 14 మంది మృతదేహాలకు సత్యనారాయణ బృందం అంతిమ సంస్కారాలను నిర్వహించింది. కాళ్లు చచ్చుబడిన స్థితి నుంచి ఇలా ఉన్నా.. నాది రాజమహేంద్రవరం. నాకు అందరూ ఉన్నారు. రెండు కాళ్లు చచ్చుబడిపోయి మంచాన పడ్డాను. కాకినాడ తిమ్మాపురానికి చెందిన నా సోదరి జీజీహెచ్లో చేర్పించింది. నా పరిస్థితి గుర్తించి సత్యన్నారాయణ పెద్దాపురంలోని మన ఇల్లుకు తీసుకువచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపుతున్నాను. – వెంకటరమణ, రాజమహేంద్రవరం ఆ వృద్ధులందరూ అమ్మానాన్నలే.. పెద్దాపురంలో మూడేళ్లుగా ‘మనఇల్లు’ను ప్రారంభించాం. ప్రస్తుతం 29 మంది వృద్ధులు ఉన్నారు. వీరికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. కొందరికి ఫిజియోథెరపీ సేవలు కూడా అందిస్తున్నాం. వీరంతా అనాధ వృద్ధులు కాదు. నాకు అమ్మా నాన్నలే. వృద్ధులైన వారిపై కుటుంబీకులు నిరాదరణ చూపడం సరికాదు. పెద్దలను గౌరవిస్తూ సేవలందించాలి. – అల్లవరపు సత్యనారాయణ, ‘మన ఇల్లు’ సంస్థ నిర్వాహకుడు -
ఉన్నతస్థితికొచ్చి అండగా ఉంటారనుకున్నాం
గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి: వేద విద్యలో ఉన్నతస్థాయికి చేరి తమకు అండగా ఉంటారనుకున్న తమ పిల్లలను.. విగతజీవులుగా చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బోరున విలపించిన తీరు అక్కడి వారి హృదయాలను బరువెక్కించింది. సుదూర ప్రాంతాలనుంచి వచ్చి అచ్చంపేట మండలం మాదిపాడు వేద పాఠశాలలో విద్యనార్జిస్తున్న విద్యార్థుల్లో సంధ్యావందనం కోసం కృష్ణానదిలో స్నానమాచరించేందుకు ఉపక్రమించిన ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన విషయం విదితమే. ఆ విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో శనివారం వారి తల్లిదండ్రులు, బంధువులకు అప్పగించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు.. ప్రత్యేక అంబులెన్స్ను దేవదాయ ధర్మదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్తరప్రదేశ్కు చెందిన నితీష్ దీక్షిత్ తండ్రి వీరేంద్రదీక్షిత్, శుభం త్రివేదీ తండ్రి అనిల్ త్రివేది, హర్షిత్శుక్లా తండ్రి రామ్శంకర్ శుక్లా, అన్షుమాన్ బాబాయి ఆవదేశ్ శుక్లాలు జీజీహెచ్ మార్చురీకి వచ్చారు. మధ్యప్రదేశ్కు చెందిన శివకుమార్ శర్మ మృతదేహానికి తండ్రి లక్ష్మీప్రసాద్ శర్మ గుంటూరు శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఈమని చంద్రశేఖర్రెడ్డి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు, తల్లిదండ్రుల ప్రయాణ ఖర్చుల కింద శాఖ తరఫున రూ.1.25 లక్షలు అందజేసినట్లు వెల్లడించారు. కాగా, మృతుల తల్లిదండ్రులంతా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో చిన్నకారు వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారు, నిరుపేద బ్రాహ్మణులే. ప్రభుత్వ అండ: మంత్రి వెలంపల్లి వేద పాఠశాల విద్యార్థుల మృతదేహాలను గుంటూరు జీజీహెచ్ మార్చురీలో దేవదాయధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారని తెలిపారు. మృతుల కుటుంబాలను పూర్తి స్థాయిలో ఆదుకుని సహాయసహకారాలు అందించాలని ఆదేశించారని చెప్పారు. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మృతదేహాలకు నివాళులర్పించారు. ఘటన దురదృష్టకరం: స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పెందుర్తి: ఐదుగురు వేద విద్యార్థులు, ఒక గురువు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం తనను తీవ్రంగా కలచివేసిందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి పీఠం తరపున రూ.50 వేల చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించారు. కాగా, వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పీఠం ప్రతినిధులు డాక్టర్ వెంకటరమణ, సతీష్శర్మ నగదు అందజేశారు. -
జీజీహెచ్, గుంటూరులో 129 పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ).. గుంటూరు జిల్లా ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో(జీజీహెచ్) ఒప్పంద/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 129 ► పోస్టుల వివరాలు: ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఫిజిసిస్ట్, డేటాఎంట్రీ ఆపరేటర్, బయో–మెడికల్ ఇంజనీర్, ఆప్టోమెట్రిస్ట్, ఈసీజీ టెక్నీషియన్, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్, ల్యాబ్ అటెండెంట్స్ తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, జీఎన్ఎం, డిప్లొమా/బీఎస్సీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సులతోపాటు ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ► వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును సూపరింటెండెంట్, జీజీహెచ్, గుంటూరు, ఏపీ చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021 ► వెబ్సైట్: guntur.ap.gov.in -
మెదడు గురించీ ఆలోచించాలి..బ్రెయిన్ స్ట్రోక్కు కారణాలు
సాక్షి, అమరావతి: గుంటూరు నగరానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఓ ప్రైవేట్ షోరూమ్లో పనిచేస్తుంటాడు. ఇతనికి రెండు నెలల క్రితం మూతి వంకరపోవడంతో కుటుంబ సభ్యులు జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం)గా నిర్ధారణ అయింది. డిగ్రీ చదివే రోజుల నుంచే సురేశ్ సిగరెట్లు తాగేవాడు. రోజులు గడిచే కొద్దీ చైన్ స్మోకర్గా మారాడు. చిన్న వయసులోనే స్ట్రోక్కు గురికావడానికి పొగతాగడమే కారణంగా వైద్యులు గుర్తించారు. విశాఖపట్నం నగరానికి చెందిన 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కరోనా కారణంగా గత ఏడాదిగా ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. రెండు వారాల క్రితం ఇంట్లో పనిచేస్తూ స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తరలించగా వైద్య పరీక్షల అనంతరం బ్రెయిన్ స్ట్రోక్కు గురయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన పని ఒత్తిడితో, నిద్రలేమి వంటి సమస్యల వల్ల స్ట్రోక్ వచ్చినట్టుగా గుర్తించారు. ఆలోచనల ఒత్తిడితో సతమతమయ్యే మెదడు గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆధునిక జీవన శైలి, దురలవాట్ల కారణంగా 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయసులో కొందరు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుండేది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న 25 నుంచి 30 శాతం బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో వ్యక్తుల వయసు 20 నుంచి 45 ఏళ్ల లోపు ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్కు కారణాలు.. ► పొగతాగడం, మద్యం, గంజాయి, డ్రగ్స్ తీసుకోవడం. మద్యపానం, ధూమపానం అలవాటైన పదేళ్లకే పలువురిలో బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనబడుతున్నాయి. ► బీపీ, షుగర్లు నియంత్రణలో లేకపోవడం. శారీరక శ్రమ లేకపోవడం. ► మహిళలు నెలసరిని వాయిదా వేయడం. అధిక రక్తస్రావం నియంత్రణకు వైద్యుల సలహాలు తీసుకోకుండా మందులు వాడటం. ► ప్రస్తుతం కరోనా బారినపడి కోలుకున్న వారిలో 5 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్నారు. రాష్ట్రంలో బీపీ, షుగర్, ఊబకాయం పరిస్థితి ఇలా.. ► మన రాష్ట్రంలో 30 ఏళ్లు నిండిన ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ, ప్రతి ఐదుగురిలో ఒకరికి షుగర్ ఉంటోంది. ► గ్రామాల్లో 26 శాతం మంది, పట్టణాల్లో 30 శాతం మంది బీపీ బాధితులు, గ్రామాల్లో 19 శాతం మంది, పట్టణాల్లో 24 శాతం మంది షుగర్ బాధితులు. ► జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ఆధారంగా రాష్ట్రంలో 36.3 శాతం మంది మహిళల్లో, 31.3 శాతం పురుషుల్లో ఊబకాయం ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► రోజూ 45 నిమిషాల నడకతో పాటు ఇతర వ్యాయామాలు చేయాలి. ► ఆహారంలో 25 శాతం పండ్లు, 30 శాతం కూరగాయలు, 25 శాతం పిండి పదార్థాలు, 20 శాతం ప్రొటీన్స్ ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ను పూర్తిగా నియంత్రించాలి. ► శరీర బరువును నియంత్రించుకోవాలి. బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉంటే తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ► ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. రోజుకు ఆరు గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి. స్ట్రోక్ రెండు రకాలు మెదడులోని రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం వల్ల శరీరంలోని కొన్ని భాగాలు చచ్చుబడటాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. రక్తనాళాలు చిట్లినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. బీపీ, షుగర్, ఊబకాయం నియంత్రించుకోవడంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల మన దేశంలో మధ్య వయసుల వారు స్ట్రోక్కు గురవ్వడం పెరుగుతోంది. కేజీహెచ్కు రోజుకు సగటున ఆరు కేసులు వస్తుంటాయి. – డాక్టర్ జి.బుచ్చిరాజు, న్యూరాలజీ విభాగాధిపతి, విశాఖ ఆంధ్ర మెడికల్ కళాశాల మూడు గంటల్లోపు ఆస్పత్రికి వస్తే.. గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేకంగా స్ట్రోక్ యూనిట్ ఉంది. గతేడాది 614 మంది, ఈ ఏడాది ఇప్పటి వరకూ 416 మంది స్ట్రోక్ బాధితులకు చికిత్స అందించాం. ఈ ఏడాది కరోనా చికిత్స కారణంగా మే నెలలో అడ్మిషన్లు లేవు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా చికిత్స ఉంటుంది. స్ట్రోక్ వచ్చిన మూడు గంటల్లోపు రోగిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తే వైకల్యం లేకుండా చేయవచ్చు. – డాక్టర్ కె. సుందరాచారి, న్యూరాలజీ విభాగాధిపతి, గుంటూరు మెడికల్ కళాశాల -
4 ఏళ్ల నరకయాతన.. 3 రోజుల్లో విముక్తి
సాక్షి, అమరావతి: నాలుగేళ్ల నరకయాతనకు గుంటూరు జీజీహెచ్ వైద్యులు మూడు రోజుల్లో విముక్తి కల్పించారు. 10 లక్షల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ రుగ్మతకు చికిత్స చేయించుకున్న రైతు కోలుకుని హాయిగా నడవగలిగే స్థితికి వచ్చాడు. వివరాలు.. ప్రకాశం జిల్లా మాచవరానికి చెందిన రైతు ఆర్.రమణయ్య కు 2017 నుంచి ఉన్నట్టుండి కండరాలు బిగుసుకుపోయే సమస్యతో బాధపడుతున్నాడు. ఒంగోలు, గుంటూరు, విజయవాడల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో నాలుగేళ్లపాటు నరకయాతన అనుభవించాడు. వెళ్లిన ప్రతి ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్సరే అంటూ శరీరంలోని ప్రతి అవయవాన్ని పరిశీలించారు. ఒకరు వెన్నెముకలో సమస్య ఉందని, మరొకరు నాడీ వ్యవస్థ సమస్య ఉందని.. అనేక రకాల మందులు రాసిచ్చి, ఫీజులు గుంజారే తప్ప ఎక్కడా నయం కాలేదు. నాలుగేళ్లలో సుమారు రూ.10 లక్షలను ఖర్చు చేసిన ఫలితం లేకపోయింది. చివరకు సెల్ఫోన్ రింగ్ వినిపించినా, చిన్న శబ్దమైనా అతడి కండరాలు అమాంతం బిగుసుకుపోయేవి. చివరి ప్రయత్నంగా గుంటూరు జీజీహెచ్కు ఈ ఏడాది సెప్టెంబర్ 6న రమణయ్యను కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సుందరాచారి.. రమణయ్య ‘స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు నిర్ధారిచారు. 3 రోజుల చికిత్స అందించిన అనంతరం రమణయ్య స్వతహాగా లేచి నడవడం ప్రారంభించాడు. -
Guntur: జీజీహెచ్లో పసికందు కిడ్నాప్
గుంటూరు (ఈస్ట్): గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో మూడు రోజుల మగ శిశువు అపహరణకు గురయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 7 గంటల్లోపే కేసును ఛేదించి శిశువును తల్లి ఒడికి చేర్చారు. శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఉప్పతల మహేష్ భార్య ప్రియాంకను ప్రసవ సమయం దగ్గర పడటంతో కుటుంబ సభ్యులు ఈ నెల 11వ తేదీన జీజీహెచ్లో చేర్పించారు. ప్రియాంక ఈ నెల 13న మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ నెల 15వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మహేష్ తల్లి ఏసుకుమారి వార్డులో కోడలి పొత్తిళ్లలో ఉన్న శిశువు ఏడుస్తుండటంతో ఎత్తుకుని వార్డు బయటకు తీసుకొచ్చింది. కొద్దిసేపటి తరువాత ఆ పసికందును ప్రియాంక తల్లి పార్వతమ్మ వద్ద ఉంచి బాత్రూమ్కు వెళ్లింది. కొద్దిసేపటికే పార్వతమ్మ నిద్రలోకి జారుకోగా.. బాత్రూమ్ నుంచి తిరిగొచ్చిన ఏసుకుమారికి పసికందు కనిపించలేదు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కొత్తపేట ఎస్హెచ్వో శ్రీనివాసులురెడ్డి పోలీసు బృందాల్ని రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులు రైల్వేస్టేషన్ వైపు ఉన్న మెయిన్ గేటు నుంచి బయటకు చేరుకుని ఆటో ఎక్కి వెళ్లిపోయినట్టు గుర్తించారు. ఆటో ఎటు వెళ్లిందో కూపీ లాగిన పోలీసులు చివరకు ఆటో డ్రైవర్ను గుర్తించి అతడి సహాయంతో నిందితుల ఇంటికి వెళ్లారు. నిందితులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదలకు చెందిన హేమవర్ణుడు, రెడ్డి పద్మజలను అరెస్ట్ చేసి పసికందును తల్లి ఒడికి చేర్చారు. మగ శిశువును అపహరించి విక్రయిస్తే భారీగా సొమ్ము సంపాదించవచ్చని భావించిన హేమవర్ణుడు పథకం ప్రకారం పద్మజతో కలిసి ఈ కిడ్నాప్కు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. -
జీజీహెచ్లో కిడ్నాప్కు గురైన బాలుడు సురక్షితం
సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలోని జీజీహెచ్ ఆస్పత్రిలో కిడ్నాపైన పసికందు సురక్షితంగా ఉన్నాడు. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నెహ్రూనగర్లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. గుంటూరు జీజీహెచ్లో శనివారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో..4 రోజుల పసికందును కిడ్నాప్ చేశారు. అయితే, కొద్ది గంటల్లో శిశువు ఆచూకీ లభించింది. అక్కడ వార్డు బాయ్ మరో మహిళతో కలిసి పసికందును అపహరించినట్టు పోలీస్ విచారణలో వెల్లడయ్యింది. పసికందు అపహరణకు గురైన కొద్ది గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వేలుకు సిరాచుక్క
ఎమ్మెల్యేలకు పరీక్ష!
గీతకార్మికుడికి గాయాలు
ప్రశాంత పోలింగ్కు పటిష్ట బందోబస్తు
పార్లమెంటు ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
● మూడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ ● సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ● పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్
ఓటెత్తాలి..!
ఎన్నికల విధుల్లో ఎన్సీసీ కేడెట్లు
ఎన్నికల విధుల్లో.. ఎస్సై సోదరులు
మండుటెండల్లో గాలివాన బీభత్సం
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement