-
ఆ స్టార్ హీరో అమ్మాయిలను ఫూల్ చేస్తాడు.. జన్మలో పెళ్లి చేసుకోడు!
బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సల్మాన్ ఖాన్ హీరోయిన్లతో నడిపిన ప్రేమాయణాలకు లెక్కే లేదు. ఎంతోమంది ముద్దుగుమ్మలను బుట్టలో వేసుకున్న ఇతడు వారితో జీవితాన్ని కొనసాగించాలని మాత్రం ఎన్నడూ ఆలోచించలేదు. అందుకే ఇప్పటికీ సింగిల్గానే ఉన్నాడు. అయితే సల్మాన్ పెళ్లి చేసుకోడన్న విషయం తనకెప్పుడో తెలుసంటున్నాడు నటుడు మిథున్ చక్రవర్తి. తాజాగా ఓ షోలో సల్మాన్ తుంటరితనాన్ని వెల్లడించాడు.ఒక్క నిమిషం కూడాసల్మాన్ నన్ను ఎంతగానో అభిమానిస్తాడు. ఎక్కువ ప్రేమను పంచుతాడు. మేము కలిసున్నప్పుడైతే నా వెంటే తిరుగుతాడు. ఒక్క నిమిషం కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండలేడు. నేను పడుకున్నా సరే నిద్రలో నుంచి లేపి మరీ కబుర్లు చెప్తుంటాడు. ఓసారి సెయింట్ పీటర్స్బర్గ్లో రాత్రి రెండు గంటలకు షూటింగ్ ఉంది. నేను ఆ విషయం మర్చిపోయి గదిలో గడియ పెట్టి నిద్రపోయాను. సడన్గా కళ్లు తెరిచేసరికి అతడు నా ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు. అతడు లోపలకు ఎలా వచ్చాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నువ్వేం మనిషివిరా బాబూ అనుకుని లేచాను.పెళ్లి చేసుకోడుతనలో ఆ తుంటరితనం ఎక్కువగా ఉండేది. అతడు ఎప్పటికీ పెళ్లి చేసుకోడు.. అమ్మాయిలందరినీ ఫూల్ చేస్తాడు. నాకింకా పెళ్లవలేదు, తెలుసా అంటూ అమ్మాయిలతో మాట కలుపుతాడు. వాళ్లేమో.. ఇంత హ్యాండ్సమ్ సూపర్ స్టార్ను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని ప్రేమలో పడతారు. కానీ అతడు ఎన్నటికీ పెళ్లిపీటలెక్కడని నేను గ్యారెంటీ ఇస్తాను' అని మిథున్ చెప్పుకొచ్చాడు. -
హాస్పిటల్లో ఉంటే ప్రధాని ఫోన్ చేసి తిట్టారు: నటుడు
కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య తలెత్తుతుందో అర్థం కాని పరిస్థితి! అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించినవాళ్లు కూడా సడన్గా ఛాతీ నొప్పి, గుండెపోటు, ఇలా రకరాకల సమస్యలతో ఆస్పత్రిపాలవుతున్నారు. మూడు రోజుల క్రితం బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సైతం తీవ్రమైన ఛాతీ నొప్పితో కోల్కతాలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు. బాగానే ఉన్నా.. తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 'నేను బాగానే ఉన్నాను. ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే నా ఆహారపు అలవాట్లను కాస్త నియంత్రణలో ఉంచుకోవాలి. ఇక నేను నా పని మొదలుపెట్టాలి. రేపటి నుంచి షూటింగ్లో జాయిన్ అవ్వాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేసి మాట్లాడారు. ఇటీవలే పద్మ భూషణ్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు తిట్టారు' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్ చక్రవర్తి హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్పురి, తమిళ భాషల్లో కలిపి 350 సినిమాలు చేశాడు. సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇతడికి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. చదవండి: సెల్వతో పనిచేయడం ఇష్టమే.. మాజీ భర్త సినిమాపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు -
నటుడు మిథున్ చక్రవర్తిని పరామర్శించిన బీజేపీ నేత
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి(73) తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ కోల్కతాలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మిథున్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆయనను వీడియోలో చూసిన అభిమానులు భగవంతునికి ధన్యవాదాలు చెబుతున్నారు. #WATCH | West Bengal BJP chief Sukanta Majumdar met veteran actor and BJP leader Mithun Chakraborty at a private hospital in Kolkata pic.twitter.com/4FRNoTuwKb — ANI (@ANI) February 11, 2024 కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన మిథున్ చక్రవర్తిని బీజేపీ నేత సుకాంత్ మజుందార్ పరామర్శించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిథున్ చక్రవర్తికి చెందిన వీడియోను ఏఎన్ఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మిథున్ చక్రవర్తి హాస్పిటల్ బెడ్పై పడుకుని, వైద్యులతో మాట్లాడటాన్ని చూడవచ్చు. మిథున్ చక్రవర్తి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా మిథున్ చక్రవర్తిని కలుసుకుని పరామర్శించారు. #WATCH | West Bengal: Former Indian cricketer Sourav Ganguly arrives at a private hospital in Kolkata to meet his mother, who is admitted here. pic.twitter.com/c4goODkOX1 — ANI (@ANI) February 11, 2024 -
గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో
ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఆయన కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలోని అత్యవసర విభాగం నందు చికిత్స పొందుతున్నారు. నేడు (ఫిబ్రవరి 10) ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన ఆరోగ్య విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిథున్ చక్రవర్తికి 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం 'పద్మ భూషణ్' అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందారు. మిథున్ గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. సుమారు రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతీ వద్ద నొప్పి రావడంతో ఆయన కోల్కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. దీంతో త్వరగా ఆయన కోలుకోవాలని కోరుతూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు హీరోగా బెంగాలీ, హిందీ ఇండస్ట్రీలలో దుమ్మురేపిన మిథున్ చక్రవర్తి. శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించారు. 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంలో మిథున్ మెప్పించిన విషయం తెలిసిందే. -
ఖాళీ కడుపుతో రోడ్లపై నిద్రించి.. తిండి కోసం పార్టీలో డ్యాన్స్ చేసిన హీరో..
ఇష్టమైనది సాధించేవరకు ఎంతైనా కష్టపడుతుంటారు. విజయాలు అందుకోవాలంటే కష్టాలను దాటుకుని ముందుకు రావాల్సిందే! ఇండస్ట్రీలో గొప్ప నటులుగా పేరు పొందిన ఎంతోమంది కష్టాల కడలిని ఈదుకుంటూ ముందుకు వచ్చినవారే! అందులో నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఉన్నాడు. జీరో నుంచి హీరోగా మారిన ఇతడి ప్రయాణం ఎంతోమందికి ఆదర్శకనీయం. సినిమా ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్బస్టర్స్ ఇచ్చిన ఇతడు ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.నన్నెవరు హీరోగా తీసుకుంటారులేఓ షోలో ఆయన మాట్లాడుతూ.. 'అన్నం దొరకని సమయాల్లో ఖాళీ కడుపుతో రోజులు గడిపేశాను. ఆకలి కేకలతో నన్ను నేను తిట్టుకుంటూ, ఏడుస్తూ నిద్రపోయాను. నాకు ఇప్పుడు తిండి దొరుకుతుందా? నిద్రపోవడానికి కాస్త చోటు దొరికితే బాగుండు.. ఇలా ఆలోచిస్తూ భారంగా కాలాన్ని నెట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో.. చాలాసార్లు నేను ఫుట్పాత్ల మీదే నిద్రపోయాను. అయితే ఇండస్ట్రీలో నన్నెవరు హీరోగా తీసుకుంటారని అనుకునేవాడిని. అందుకే, విలన్ అవ్వాలనుకున్నాను.తిండి దొరుకుతుందని పార్టీలో డ్యాన్స్..అది కూడా మంచి డ్యాన్స్ చేయగలిగే విలన్గా! పని ఎక్కడ దొరికితే అక్కడికి నడుచుకుంటూ వెళ్లేవాడిని. నాలుగు మెతుకుల కోసం పార్టీలలో డ్యాన్స్ చేసేవాడిని' అని తెలిపాడు. అయితే ఒకానొక సమయంలో తన ప్రాణాలే తీసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు మిథున్. 'నేను అనుకున్నది సాధించలేనేమోనని భయపడేవాడిని. తిరిగి కోల్కతాకు కూడా వెళ్లలేకపోయాను. ఒకానొక సమయంలో చనిపోదామనుకున్నాను.బ్లాక్బస్టర్ హిట్స్కానీ అందరికీ నేనిచ్చే సలహా ఒక్కటే.. ఎవరూ జీవితాన్ని ముగించాలనుకోకండి.. పోరాడండి. నేనూ ఫైట్ చేశాను.. ఇదిగో ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్ చక్రవర్తి 1976లో వచ్చిన 'మృగయ' సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. సురక్ష, డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ ఝుక్తా నహీ, కసమ్ ఫాయిదా కర్నే వాలేకీ వంటి బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాడు. హీరోగా 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. ఈయన తెలుగులో 'గోపాల గోపాల' సినిమాలో లీలాధర స్వామి పాత్రలో కనిపించాడు.చదవండి: మరికాసేపట్లో పెళ్లి.. హల్దీ ఫంక్షన్లో కాబోయే భార్యతో స్టెప్పులేసిన మానస్ -
నాకు కలర్ తక్కువని హీరోయిన్స్ దూరం పెట్టారు: సీనియర్ హీరో
'ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్..' పాట వినగానే హిందీ సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి గుర్తుకొస్తాడు. 40 ఏళ్ల క్రితం మిథున్ హీరోగా నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ పాపులరే.. అయితే కెరీర్ తొలినాళ్లలో తనతో నటించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదట. కలర్ తక్కువని పెద్ద హీరోయిన్స్ అతడిని దూరం పెట్టేవారట. పుట్టుకతో వచ్చిన రంగును ఎలాగూ మార్చలేం కాబట్టి తన డ్యాన్స్తో అందరినీ ఆకట్టుకోవాలనుకున్నాడు. చివరకు అందరూ తన రంగు గురించి కాకుండా డ్యాన్స్ గురించి మాట్లాడుకునేలా చేశాడు. డ్యాన్స్ వల్ల నా కలర్ పక్కనపెట్టారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ.. 'నన్ను హీరోగా చూశాక జనాలు నాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. నా కొడుకును కూడా హీరో చేసేయొచ్చు అనుకున్నారు. నేను సామాన్య ప్రజల హీరోగా మారాను. కామన్ మ్యాన్కు సూపర్స్టార్ అవడం అనేది నాకు గొప్ప విషయం. నేను నా కాళ్లను కదిలిస్తూ డ్యాన్స్ చేస్తే ఎవరూ నా రంగు గురించి పట్టించుకోరనుకున్నాను. అదే నిజమైంది. నా డ్యాన్స్ వల్ల నా కలర్ను మర్చిపోయారు. ఎందుకంటే నలుపు రంగులో ఉన్నందున ఎవరూ నన్ను హీరోగా అంగీకరించలేకపోయారు. ఆ సందర్భంలో నాకు చాలా బాధేసేది. ఏడ్చేవాడిని కూడా! ఆ హీరోయిన్ ఒక్కరే నన్ను పొగిడారు పెద్ద హీరోయిన్స్ నావైపు కన్నెత్తి చూసేవారు కాదు.. నాతో నటించడానికి ఇష్టపడేవారు కాదు. నన్నసలు వాళ్లు హీరోగానే చూడలేదు. నాతో పని చేస్తే వారికి ఎటువంటి ఫేమ్ రాదని నన్ను పక్కనపెట్టేవాళ్లు. సరిగ్గా ఆ సమయంలో జీనత్ అమన్ వచ్చింది. ఇతడు చాలా బాగున్నాడు.. ఇతడితో నటించడానికేంటి సమస్య అని నా సరసన హీరోయిన్గా నటించింది. ఇక అప్పటినుంచి నా కెరీర్ బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది' అని చెప్పుకొచ్చాడు మిథున్ చక్రవర్తి. చదవండి: చై మంచివాడు, సామ్ ఆ ఫోటో డిలీట్ చేసినందుకు నాపై ద్వేషం: ప్రీతమ్ -
Nenekkadunna: టాలీవుడ్లోకి బాలీవుడ్ సీనియర్ హీరో కొడుకు
బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మాధవ్ కోదాడ దర్శకత్వంలో ‘నేనెక్కడున్నా' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో ఎయిర్ టెల్ ఫేమ్ సశా ఛెత్రి కథానాయిక. కె.బి.ఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ విడుదల చేశారు. అనంతరం సురేశ్ బాబు మాట్లాడుతూ..‘టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. కథ బాగుంటే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్' అని చెప్పారు. ‘జర్నలిజం, రాజకీయం నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుంది’అని దర్శకుడు మాధవ్ కోదాడ అన్నారు. ‘సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం సెన్సార్ సన్నాహాల్లో ఉన్నాం. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం’అని నిర్మాత మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి అన్నారు. -
డిసెంబర్లో బెంగాల్ సర్కార్ కూలిపోనుందా?
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ పదే పదే చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్లో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ కమలం కీలక నేతలంతా ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్ సైతం ఇదే కామెంట్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘డిసెంబర్లో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమ’ని ప్రకటించారు. ‘‘టీఎంసీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్లో ఉన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉనికి ప్రమాదంలో పడింది అంటూ వ్యాఖ్యానించారామె. అంతేకాదు.. రాబోయే రోజుల్లో బెంగాల్లో పెద్ద ఆట చూడబోతున్నారంటూ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. ‘‘వ్యూహమేంటో మేం చెప్పం. కానీ, ఏదో జరగబోతోంది. డిసెంబర్లో పెద్ద ఆట ఉండనుందని మా నాయకత్వం పదే పదే చెబుతోంది. రాష్ట్రం ఆర్థిక ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోంది. ఇది(టీఎంసీని ఉద్దేశించి..) దివాలా తీసిన ప్రభుత్వం. వాళ్ల(ప్రభుత్వం) వద్ద డబ్బు లేదు. ఖాళీ ఖజానాతో ఎలా పని చేస్తారు? రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్లలో 50 శాతం మంది జైలుల్లోనే ఉన్నారు. మిగిలిన 50 శాతం మంది కూడా జైలుకు వెళ్తారు. మరి ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరు?.. అంటూ వ్యాఖ్యానించారామె. ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంతా మజుందార్ ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, మమతా బెనర్జీ సైతం జైలుకు వెళ్తారంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతేకాదు డిసెంబర్ బెంగాల్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి కూడా టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారంటూ కామెంట్ చేశారు. వ్యక్తిగతంగా తనకే 21 మంది ఫోన్ ద్వారా టచ్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం టీఎంసీ ఎమ్మెల్యేలు కాంటాక్ట్లో ఉన్నారని చెబుతూ.. డిసెంబర్లో దీదీ సర్కార్ కూలిపోవడం ఖాయమంటూ ప్రకటించారు. అవినీతిలో కూరుకుపోయిన నేతలను చూసి.. మరికొందరిలో భయం నెలకొందని, వాళ్లు పార్టీ మారేందుకు ఆస్కారం ఉందని చెప్పారు సువేందు. అయితే బెంగాల్ అసెంబ్లీ సంఖ్యా బలం చూసుకుంటే.. టీఎంసీ ఫుల్ మెజార్టీతో ఉంది. మరోవైపు బెంగాల్ పంచాయితీ ఎన్నికల వేళ.. ఎలాగైనా భారీ విజయం సాధించాలని బీజేపీ పరితపిస్తోంది. స్టార్ క్యాంపెయినర్ మిథున్ చక్రవర్తిని రంగంలోకి దించిన బీజేపీ.. ఇప్పటికే టీఎంసీ పట్టున్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించే యత్నం చేస్తోంది. ఇదీ చదవండి: రామారావు పార్టీ మారితే నేను మారతానా? -
21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇంకా టచ్లోనే ఉన్నారు
కోల్కతా: ప్రముఖ నటుడు, పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార టీఎంసీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఇంకా తనతో నేరుగా టచ్లోనే ఉన్నారని చెప్పారు. ఇదివరకే ఈ విషయాన్ని చెప్పానని, మరోసారి దాన్ని గుర్తు చేస్తున్నానని పేర్కొన్నారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కోల్కతాలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మిథున్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే టీఎంసీ నేతలను బీజేపీలో చేర్చుకోవడంపై తమ నాయకులు కొందరు అభ్యంతరాలు తెలిపారని మిథున్ వెల్లడించారు. ప్రజల్లో ఆదరణ లేని నాయకులు తమకు అవసరం లేదని సూచించారని చెప్పారు. అయితే తనకు ఈ విషయంపై అవగాహన ఉందని, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. మిథన్ చక్రవర్తి గతంలోనూ ఇలాంటి స్టేట్మెంటే ఇచ్చి వార్తల్లో నిలిచారు. 20మందికిపైగా టీఎంసీ ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీ గూటికి చేరుతురాని రెండు నెలల క్రితమే చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలను టీఎంసీ నాయకులు అప్పుడు తోసిపుచ్చారు. మిథున్కు మతి భ్రమించి మాట్లాడుతున్నారని, మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు కన్పిస్తున్నారని సెటైర్లు వేశారు. ఓసారి వైద్యుడ్ని కలిసి చికిత్స తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఇప్పుడు మిథున్ చక్రవర్తి మళ్లీ తన వ్యాఖ్యలకు కట్టుబటి ఉన్నానని చెప్పడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. చదవండి: యువతి హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని సస్పెండ్ చేసిన బీజేపీ -
మిథున్ చక్రవర్తికి మెంటల్.. టీఎంసీ కౌంటర్..
కోల్కతా: బెంగాల్లో మహారాష్ట్ర పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించిన బీజేపీ నేత మిథున్ చక్రవర్తిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది టీఎంసీ. ఆయనకు బహుశా మెంటల్ అయి ఉండవచ్చని మండిపడింది. టీఎంసీ ఎంపీ శాంతను సేన్ ఈమేరకు స్పందించారు. 'మిథున్ చక్రవర్తి ఆస్పత్రిలో చేరారని విన్నాము. బహుశా ఆయనకు శారీరక సమస్య కాదు మానసిక సమస్య అయి ఉంటుంది. ఆయన చెప్పే మాటలను బెంగాల్లో ఏ ఒక్కరూ పట్టించుకోరు. ఆయనకు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. అదే సమస్య' అని శాంతను సేన్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. #WATCH | I heard that Mithun Chakraborty was admitted to a hospital a few days back. I think he was mentally ill & not physically... The problem is that he does not know politics: TMC MP Santanu Sen on Mithun Chakraborty's remarks pic.twitter.com/5FUKkM7RIQ — ANI (@ANI) July 27, 2022 అంతకుముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు మిథున్ చక్రవర్తి. మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత టీఎంసీలో తుఫాన్ మొదలైందని, ఆ పార్టీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని అన్నారు. బెంగాల్లో కూడా మహారాష్ట్ర పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు. చదవండి: మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీతో టచ్లో టీఎంసీ ఎమ్మెల్యేలు! -
మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు.. బీజేపీతో టచ్లో టీఎంసీ ఎమ్మెల్యేలు!
కోల్కతా: నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వెస్ట్ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ పార్టీ టీఎంసీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్లో ఉన్నారని తెలిపారు. వీరిలో 21 మంది నేరుగా తనతోనే మాట్లాడుతున్నారని చెప్పారు. టీఎంసీ మంత్రి పార్థ చటర్జీ అరెస్టు తర్వాత ఆ పార్టీలో తుఫాన్ చెలరేగిందని, ఇదే బిగ్ బ్రేకింగ్ అన్నారు. ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడారు. దీంతో మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలు బెంగాల్లో కలకలం రేపుతున్నాయి. బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో పార్థ చటర్జీ అరెస్టుపై మాట్లాడుతూ.. ఆయన తప్పు చేయకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని మిథున్ పేర్కొన్నారు. ఒకవేళ తప్పు చేస్తే మాత్రం ఎవరూ ఆయన్ను కాపాడలేరని స్పష్టం చేశారు. ఇది రూ.2000కోట్ల భారీ కుంభకోణం అని ఆరోపించారు. అలాగే బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీనా? అనే అంశంపైనా ఆయన స్పందించారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సూపర్స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్లు ముస్లింలే అని చెప్పారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఆదరించడం వల్లే తను నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపారు. బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని అక్కడ కూడా వాళ్ల సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తున్నట్లు వివరించారు. ఒకవేళ బీజేపీ వాళ్లను ద్వేషిస్తే ఇది సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. గతేడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు మిథున్ చక్రవర్తి. మమతా బెనర్జీ కచ్చితంగా ఓడిపోతుందని అప్పుడు వ్యాఖ్యానించారు. కానీ ఎన్నికల్లో టీఎంసీ భారీ మెజార్టీతో గెలిచింది. బీజేపీ 70 పైచిలుకు స్థానాలతో సరిపెట్టుకుంది. చదవండి: శివసేన నుంచి మరో సీఎం వస్తారు.. బీజేపీ మాట తప్పడం వల్లే ఎంవీఏ పుట్టింది -
మంత్రి పార్థ అరెస్ట్ తర్వాత టీఎంసీలో తుపాను చెలరేగింది: మిథున్
-
ఇక నావల్ల కాదు, చచ్చిపోదామనుకున్నా..
మిథున్ చక్రవర్తి.. ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించాడు. 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. 1976లో మృగయ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన డిస్కో డ్యాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్, ప్యార్ జుక్త నహీ, కసమ్ ఫాయిదా కర్నె వాలేకీ, కమాండో వంటి సినిమాలతో బాలీవుడ్ను ఓ ఊపు ఊపాడు. అయితే తన జీవితం ఏమీ పూలపాన్పు కాదంటున్నాడు మిథున్. తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు. 'సాధారణంగా ఇలాంటి వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడాను. నా లైఫ్ను మరీ అంత కష్టంగా నెట్టుకొచ్చిన సందర్భాలు కూడా పెద్దగా ఏమీ లేవు. పైగా నేను పడ్డ కష్టాలను చెప్తే నటుడిగా ఎదగాలనుకుంటున్న కొత్త తరాన్ని నేను నిరాశపర్చినట్లు అవుతుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. నా జీవితంలో అలాంటివి చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు నేను నా లక్ష్యాన్ని చేరుకోలేనేమోనని భయపడ్డాను, అంతేకాదు ఆ భయంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. కానీ ఆ ఆలోచనను విరమించుకునేవాడిని. నేను మీకిచ్చే సలహా కూడా ఇదే.. ప్రాణం తీసుకోవాలన్న ఆలోచననే మానేయండి.. ప్రతిదానితో పోరాడండి. అలా పోరాడాను కాబట్టే నేనీ స్థాయిలో ఉన్నా. రానురానూ మానవ విలువలు తగ్గిపోతున్నాయి. సోషల్ మీడియాను పాజిటివ్ అంశాలకంటే కూడా నెగెటివిటీకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు మేము షూటింగ్ అయిందంటే అందరం కలిసి కూర్చుని తినేవాళ్లం. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్లు వ్యానిటీ వ్యాన్లోకి వెళ్లిపోయి ఫోన్లతో బిజీ అవుతున్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్ బెంగాలీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అవ్జిత్ సేన్ ప్రజాపతి సినిమాలో అతడు నటించనున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆ హీరో భార్య నన్ను శారీరకంగా, మానసికంగా హింసించింది: హీరోయిన్ కేటీఆర్ గారూ, కాలక్షేపం కావాలంటే ఈ షోలు చూసేయండి -
రాజ్యసభకు మిథున్ చక్రవర్తి!
కోల్కతా: ప్రముఖ నటుడు, పార్టీ స్టార్ క్యాంపెయినర్ మిథున్ చక్రవర్తి(72)ని రాజ్యసభకు పంపే యోచనలో బీజేపీ ఉంది. రూపా గంగూలీ స్థానంలో ఆయన్ని పెద్దల సభకు పంపాలని దాదాపుగా నిర్ణయించేసినట్లు సమాచారం. నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్ చక్రవర్తి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్గా పని చేశారు. అయితే ఆ తర్వాత నుంచి అనారోగ్యం రిత్యా ఆయన బెంగాల్ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పొలిటికల్ తెర మీదకు వచ్చిన ఆయన స్వయంగా చేసిన వ్యాఖ్యలే.. చర్చనీయాంశంగా మారాయి. ‘నా అనారోగ్య కారణాల వల్ల నేను చాలా కాలం ప్రజల ముందుకు రాలేకపోయాను. రాజకీయాలను రాజకీయాల్లాగే ఉంచాలి. కానీ, ఎన్నికల తర్వాత బెంగాల్లో అశాంతి నెలకొందన్న వార్త చాలా బాధించింది’ అంటూ పొలిటికల్ రీఎంట్రీ సంకేతాలను అందించారాయన. రాజ్యసభలో రూపా గంగూలీ, స్వపన్ దాస్గుప్తాల పదవి కాలం ముగియనుంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు త్వరలోనే ఉన్నాయి. ఈ తరుణంలో ఖాళీ రాజ్యసభ స్థానాలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. బెంగాల్కు చెందిన ఈ రెండు ఖాళీలను బెంగాల్కు చెందిన వాళ్లతోనే భర్తీ చేయాలని ఇప్పటికే బీజేపీ కీలక ప్రకటన చేసింది కూడా. ఈ తరుణంలో.. ఢిల్లీ నుంచి సోమవారం అఘమేఘాల మీద కోల్కతా చేరుకున్న మిథున్ చక్రవర్తి.. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుఖంత మజుందార్తో భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని మిథున్ చక్రవర్తికి ఆహ్వానం అందిందని, ఈ మేరకు ఆయన సైతం అందుకు సానుకూలంగా స్పందించినట్లు పార్టీ కీలక వర్గాలు ప్రకటించాయి కూడా. లోక్సభ బరిలో ఛాన్స్!.. ఇదిలా ఉంటే 2024 లోక్సభ బరిలోనూ మిథున్ చక్రవర్తిని దించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దీదీ(మమతా బెనర్జీ) టీఎంసీకి చెక్ పెట్టేందుకు.. మిథున్ చక్రవర్తినే సరైన వ్యక్తిగా భావిస్తోంది ఆ పార్టీ. బాలీవుడ్, బెంగాలీ చిత్రాల ద్వారా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న మిథున్ చక్రవర్తి.. ఆ తర్వాతి రోజుల్లో రాజకీయాల్లోనూ రాణించారు. 2012 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రణబ్ ముఖర్జీకి దక్కడంలో కీలక పాత్ర పోషించింది మిథున్ చక్రవర్తినే. టీఎంసీ తరపున గతంలోనూ(2014 నుంచి) ఆయన రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు కూడా. అయితే 2016లో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. కిందటి ఏడాది మార్చిలో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ సమక్షంలో మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. -
ఆసుపత్రి పాలైన మిథున్ చక్రవర్తి, బయటికొచ్చిన ఆస్పత్రి ఫొటో
Mithun Chakraborty Hospitalised Photos Goes Viral: ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవరి ఆసుపత్రి పాలయ్యారు. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చేరారు. బీజేపీ నాయకుడు అనుపమ్ హజ్రా ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ఆసుపత్రిలోని ఆయన ఫొటోలను ట్వీట్లో షేర్ చేశారు. దీంతో ఆసుపత్రి బెడ్పై పడుకుని ఉన్న మిథున్ చక్రవర్తి ఫొటోలు సోషల్ మీడయా వైరల్గా మారాయి. ఆకస్మాత్తుగా మిథున్ చక్రవర్తి ఆసుప్రతి పాలవడంతో ఆయన అభిమానులంతా ఆందోళనకు గురవుతున్నారు. దీంతో ఆయన రెండో కుమారుడు మిమో చక్రవర్తి ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చాడు. ఇండియా టూడేతో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. ఆయన కిడ్నీ స్టోన్స్ పెయిన్ ఏప్రిల్ 30న ఆసుప్రతి చేరినట్టు చెప్పాడు. ఆయనకు ఆపరేషన్ జరిగిందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని మిమో చక్రవర్తి చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా 80, 90లలో హీరోగా బెంగాలీ, హిందీ సినిమాలలో చక్రం తిప్పారు మిథున్ చక్రవర్తి. ఇక చివరగా మిథున్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రంలో నటించి మెప్పించారు. Get well soon Mithun Da ❤️ তোমার দ্রুত আরোগ্য কামনা করি মিঠুন দা ❤️ pic.twitter.com/yM5N24mxFf — Dr. Anupam Hazra 🇮🇳 (@tweetanupam) April 30, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తిపై పోలీసుల ప్రశ్నల వర్షం
కోల్కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు, బెంగాల్ బీజేపీ నేత మిథున్ చక్రవర్తిని కోల్కతా పోలీసులు ప్రశ్నించారు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిథున్ చేసిన ఓ ప్రసంగంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి బుధవారం మిథున్ను 45 నిమిషాలపాటు పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, 71 ఏళ్ల మిథున్ చక్రవర్తి.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు బహిరంగ సభల్లో, ర్యాలీల్లో ఆవేశపూరితంగా ప్రసంగించారు. కాగా, బెంగాల్ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసలో 16 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ హింసపై మిథున్ ప్రసంగాల ప్రభావం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ‘ఎగిరి తంతే.. శవం శ్మశానంలో పడుతుంది’ అంటూ తన సినిమాలోని డైలాగును ఉపయోగించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే తాను ఆవేశంగా డైలాగులు చెప్పానే తప్ప.. ఉద్దేశపూర్వక ప్రసంగాలు చేయలేదని మిథున్ కోల్కతా కోర్టుకు విన్నపించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోర్టును కోరాడు కూడా. అయితే కోర్టు మాత్రం ఆయన్ని వర్చువల్గా ప్రశ్నించాలని పోలీసులను ఆదేశించింది. ఇక మరో బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘నేనేం ఉత్త పామును కాను. నల్లత్రాచుని. కాటేస్తే.. నీ ఫొటోకి దండ పడాల్సిందే’ అని అర్థం వచ్చేలా కామెంట్లు చేశాడు. అన్నట్లు.. ఈ డిస్కో డ్యాన్సర్ పుట్టినరోజు ఇవాళే. చదవండి: మిథున్ కొడుకుపై రేప్ కేస్ -
ప్రముఖ నటుడి నివాసంలో ఆర్ఎస్ఎస్ చీఫ్
ముంబై: పశ్చిమ బెంగాల్లో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ సర్కార్ను గద్దెదించి బీజేపీ జెండాను ఎగురువేయాలని ఆ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తిని మంగళవారం ముంబైలోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మోహన్ భాగవత్, మిథున్ను కలిసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బెంగాల్కు చెందిన సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి పెద్ద సంఖ్యలో అభిమానులు, పాపులారిటీ ఉన్న విషయం తెలిసిందే. తృణముల్ కాంగ్రెస్ పార్టీలో మిథున్ చాలా కాలం పని చేసి ఆనారోగ్య కారణాల వల్ల ఆ పార్టీకి 2016లో రాజీనామా చేశారు. ఆయన తృణముల్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన తన పదవికి 20 నెలల తర్వాత రాజీనామా చేయడం గమనార్హం. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. చదవండి: 2024లో ప్రధాని పదవి చేపట్టేది ‘ఆమెనే’! -
భయం ఎందుకు?
వివేక్ రంజన్ అగ్నిహోత్రీ దర్శకత్వంలో తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ తీస్తున్న హిందీ చిత్రం ‘ది కశ్మీరీ ఫైల్స్’. ‘‘కశ్మీరీ హిందువులపై సాగిన మారణహోమం గురించి ఇంతవరకూ ఎవ్వరూ సినిమా తీయలేదు. ఆ కథ అందరికీ తెలియజేయాలనుకున్నా’’ అని సినిమాకి శ్రీకారం చుట్టినప్పుడే వివేక్ పేర్కొన్నారు. కశ్మీర్లో ఈ చిత్రం షూటింగ్ జరిపారు. కాగా, ఈ చిత్రాన్ని తీసినవాళ్లను, చూసే ప్రేక్షకులను వదిలేదు లేదంటూ కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ బెదిరించినట్లుగా తాజాగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ‘‘ఇంకా ఈ సినిమా ఎడిటింగ్ కూడా మొదలుపెట్టలేదు. వాళ్లెందుకు భయపడుతున్నారు? నిజానికా? నిజాన్ని నిర్భయంగా చెప్పాలనుకుంటున్న మమ్మల్ని ఆశీర్వదించండి’’ అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు అభిషేక్ అగర్వాల్. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రాన్ని ఏప్రిల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
మిథున్ చక్రవర్తి ప్రేయసిగా శ్రుతీహాసన్
శ్రుతీహాసన్, మిథున్ చక్రవర్తి ముఖ్య పాత్రల్లో హిందీలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. ‘ది బెస్ట్ సెల్లర్ షీ రోట్’ అనే నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించనున్నారు. దీనిని అమెజాన్ ప్రైమ్లో విడుదల చేయనున్నారు. ఓ సూపర్ స్టార్ నవలా రచయితకూ, అతని ప్రేయసికీ మధ్య జరిగే కథే ఈ నవల. ఇందులో సూపర్స్టార్ నవలా రచయితగా మిథున్ చక్రవర్తి, అతని ప్రేయసిగా శ్రుతి కనిపిస్తారని టాక్. మనోజ్ బాజ్పాయ్ నటించిన హిందీ చిత్రం ‘మిస్సింగ్’ని తెరకెక్కించిన ముకుల్ అభ్యంకర్ ఈ సిరీస్ను డైరెక్ట్ చేయనున్నారు. సిద్ధార్థ్ పి. మల్హోత్రా నిర్మాత. ఉత్తరాఖండ్లో చిత్రీకరణ జరగనున్న ఈ సిరీస్ను ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. చదవండి: సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అదే -
షూటింగ్లో కుప్పకూలిన నటుడు
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తి నటిస్తోన్న చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. అయితే తాజాగా షూటింగ్లో నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి కారణంగా ఆరోగ్యం క్షీణించి షూటింగ్లో కుప్పకూలిపోయాడు. దీంతో సడెన్గా చిత్రీకరణను నిలిపి వేశారు. ఈ మేరకు డైరెక్టర్ వివేక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మిథున్ పాత్రపై పెద్ద యాక్షన్ సన్నివేశం కోసం షూట్ చేస్తున్నాం. ఈ క్రమంలో మిథున్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కళ్లు తిరిగి పడిపోయాడు. సాధారణంగా ఏ వ్యక్తి కూడా ఆ పరిస్థితుల్లో కనీసం నిల్చోలేరు. కానీ మిథున్ కొద్దిసేపు తీసుకొని విశ్రాంతి మళ్లీ వచ్చి షూట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా షూట్ చేస్తారని నేను అస్సలు ఉహించలేను. కానీ మిధున్ చేశాడు. అందుకే అతను సూపర్ స్టార్ అయ్యాడు. చదవండి: మిథున్ చక్రవర్తి కొడుకుపై అత్యాచారం కేసు తన నాలుగు దశబ్దాల కెరీర్లో ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదని ఇటీవల మిథున్ నాకు చెప్పాడు. మీ షూటింగ్ నా వల్ల ఆగిపోలేదు కదా అని నన్ను అడిగే వాడు. నాకు నిజంగా ఆశ్యర్యం వేస్తోంది. ఎందుకంటే ఇంతటి అంకితభావంతో పనిచేసేవాళ్లను ఈ తరం నటుల్లో ఎవర్ని చూడలేదు. మిథున్చాలా కష్టజీవి. ప్రతిరోజు షూట్కు వచ్చినప్పుడు అందరిని ఆప్యాయంగా పలకరిస్తాడు. తన పని తాను వేగంగా చేస్తాడు. మిథున్ చక్రవర్తి లాంటి నటుడు ఉండటం ఏ మూవీ యూనిట్కైనా ఆస్తి వంటింది.’ అని వివేక్ పేర్కొన్నారు. కశ్మీరీ హిందువుల దుస్థితి గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఒక చిన్న మెట్టులాగా ఉపయోగపడుతుందని వివేక్ అభిప్రాయపడ్డారు. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ 2021 లో విడుదల కానుంది. -
మిథున్ చక్రవర్తి కొడుకుపై అత్యాచారం కేసు
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు, నటుడు మహాక్షయ్పై అత్యాచారం కేసు నమోదైంది. మహాక్షయ్ అత్యాచారం చేసి, మోసం చేసినట్లు 38 ఏళ్ల మహిళ ఫిర్యాదు చేయడంతో ఓషివారా పోలీసు స్టేషన్లో గురువారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. దీంతో అతడిపై అత్యాచారం, మోసం కేసు నమోదు చేసినట్లు ఓషివారా పోలీసు అధికారి వెల్లడించారు. దీనిపై సదరు అధికారి మీడియాతో మాట్లాడుతూ.. బాధిత మహిళతో మహాక్షయ్ 2015 నుంచి 2018 వరకు కలిసి ఉన్నాడని తెలిపారు. ఈ నేపథ్యంలో అతడు ఆమెను వివాహం కూడా చేసుకుంటానని మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. 2015లో పశ్చిమ అంధేరిలో మహాక్షయ్ కోనుగోలు చేసిన ఇంటిని ఆమె చూడటానికి వెళ్లగా సాఫ్ట్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఇచ్చి తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొందన్నారు. (చదవండి: చివరి చూపు చూడలేదు) తాను గర్భవతి అయిందని ఆ విషయం అతడికి చెప్పడంతో అబార్షన్ చేసుకోవాలని కోరుతూ బలవంతంగా గర్భస్రావం మందులు ఇచ్చినట్లు ఆరోపించింది. తనను పెళ్లి చేసుకోవాలని బాధిత మహిళ మహాక్షేను ప్రశ్నించినప్పుడల్లా మాట దాటేస్తూ తనని మూడేళ్లు మోసం చేశాడని తెలిపారు. 2018 జనవరిలో కూడా మరోసారి తమ వివాహం గురించి ప్రశ్నించగా అతడు చేసుకోనని తెల్చిచెప్పడంతో వారి మధ్య గొడవలు కూడా జరిగాయని చెప్పారు. ఈ విషయంపై అతడి తల్లి యోగితా బాలి కూడా తనని బెదిరించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. దీంతో 2018లో ఢిల్లీలోని బేగంపూర్ పోలీసు స్టేషన్లో మహాక్షయ్తో పాటు అతడి తల్లిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు 376(అత్యాచారం) 313(బలవంతంగా గర్భస్రావం చేయడం) కేసులు నమోదు చేసి హైకోర్టుకు పంపినట్లు చెప్పారు. (చదవండి: కంగనా సిస్టర్స్కు కోర్టు షాక్) హైకోర్టు మహాక్షయ్, అతడి తల్లికి ముందస్తు బెయిల్ మంజూర్ చేసి స్థానిక పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాల్సిందిగా బాధిత మహిళకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ మేరకు 2020 జులైలో ఓషివారా పోలీసు స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆమె ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 376(అత్యాచారం) 376(2)(ఎన్) (పలుమార్లు అత్యాచారం చేయడం) 328(అంగీకారం లేకుండా గర్భస్రావం చేయడం, బాధకలిగించడం, బలవంతం చేయడం) 417(మోసం చేయడం), 506(క్రిమినల్ బెదిరింపులు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. అయితే మహాక్షయ్ హాంటెడ్ 3డీ, లూట్ వంటి చిత్రాల్లో నటించాడు. (చదవండి: వివేక్ ఒబెరాయ్ భార్యకు నోటీసులు!) -
చివరి చూపు చూడలేదు
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి (95) ఇటీవలే మరణించారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆయన మనవడు, మిథున్ చక్రవర్తి కుమారుడు నిమిష్ చక్రవర్తి తెలిపారు. లాక్డౌన్ ముందు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం బెంగళూర్ వెళ్లిన మిథున్ చక్రవర్తి లాక్డౌన్ కావడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో తండ్రిని చివరిసారిగా చూసే అవకాశం దక్కలేదట. -
ప్రముఖ నటుడి తండ్రి మృతి
ముంబై: ప్రముఖ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్కుమార్ చక్రవర్తి (95) మంగళవారం సాయంత్రం ముంబైలో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. కాగా, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో బెంగుళూరులో చిక్కుకున్న మిథున్ చక్రవర్తి ముంబై వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ తమ తండ్రి మరణించారని బసంత్కుమార్ రెండో కుమారుడు నామాషి చక్రవర్తి తెలిపారు. బెంగాళీ నటి రీతూపర్ణ సేన్గుప్తా ట్విటర్ వేదికగా.. మిథున్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. (చదవండి: మహమ్మారి కేంద్రంగా మహారాష్ట్ర..) -
దొరికిన పాపాయి
‘అమృత’ సినిమా గుర్తుంది కదా.. మాధవన్ హీరోగా.. సీత, పార్థిబన్ల కూతురు టైటిల్ రోల్ పోషించిన మణిరత్నం సినిమా! శ్రీలంకలో అస్తిత్వ పోరాటం చేస్తున్న ఓ తమిళ యోధురాలు రామేశ్వరం (తమిళనాడు) కాందీశీకుల శిబిరంలో బిడ్డను కని.. పాపను ఇక్కడే వదిలేసి వెంటనే శ్రీలంక వెళ్లిపోతుంది అక్కడి తమిళుల విముక్తి పోరును ముందుకు నడిపించడానికి. ఆ శిబిరంలో ఈ పసికూనను వృత్తిరీత్యా ఇంజనీర్, ప్రవృత్తిరీత్యా రచయిత అయిన శ్రీనివాస్ దత్తత తీసుకుంటాడు. ఆ చంటిదాన్ని దత్తత తీసుకోవడం కోసమే ఇందిర అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ బిడ్డకు ‘అమృత’ అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా చూసుకుంటూంటుంది ఆ జంట. ఇన్నేళ్లకు ఈ సినిమాను ఎందుకు గుర్తుచేయాల్సి వచ్చిందంటే.. ఇంచుమించు ‘అమృత’ లాంటి కథే బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి జీవితంలోనూ ఉంది. మిథున్ దత్తత తీసుకున్న అమ్మాయి పేరు దిశాని. చాన్నాళ్ల కిందటి సంగతి ఇది. బహుశా అప్పటికి అమృత సినిమా విడుదలై ఉండకపోవచ్చు. పశ్చిమ బెంగాల్లో జరిగిందీ సంఘటన. ఆడపిల్ల భారమనే అభిప్రాయంతో ఉన్న ఓ జంట తమకు పుట్టిన కూతురును రోడ్డు పక్కనున్న చెత్తకుండీలో పడేసి వెళ్లిపోయారు.సన్నగా .. గొంతులో ఊపిరి పెట్టుకున్న ఆ పిల్ల పాలకోసం గుక్కపట్టి ఏడుస్తుంటే ఆ రోడ్డు పక్కన వెళ్తున్న వాళ్లు చూసి.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల ద్వారా ఒక స్వచ్ఛంద సంస్థకూ విషయం తెలిసింది. ఆ పసిగుడ్డును తీసుకెళ్లి తమ హోమ్లో పెట్టుకున్నారు. ఇది వార్తగా మారి తెల్లవారి పత్రికల్లో, టీవీ చానళ్లలో వచ్చింది. అది మిథున్చక్రవర్తి కంటా పడింది. అతని మనసును కలిచివేసింది. అప్పటికే ముగ్గురు పిల్లలున్న మిథున్ నాలుగో బిడ్డగా ఆ పాపను సాకాలనుకున్నారు. భార్య యోగితాకు చెప్పాడు. ‘‘పదండి పాపను తెచ్చుకుందాం’’ అంది. వెంటనే ఆ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న హోమ్కు వెళ్లి .. ఆ పాపను దత్తత తీసుకుంటామని చెప్పారు ఈ తల్లిదండ్రులు. సంబంధించిన నియమ నిబంధలన్నిటికీ రాతపూర్వకమైన పూచీకత్తు ఇస్తూ ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకున్నారు. ‘దిశాని’ అని పేరు పెట్టుకున్నారు. ముద్దుగా పెంచుకున్నారు. ఇప్పుడు... దిశానీకి తండ్రిలాగే సినిమాల్లో నటించడం ఇష్టం. దాన్నే కెరీర్గా ఎంచుకుంటానని తల్లి, తండ్రికి చెప్పింది. వాళ్లూ ‘‘ఓకే’’ అని.. అమ్మాయిని న్యూయార్క్లోని ఫిల్మ్ అకాడమీలో చేర్పించారు. నటనలో తర్ఫీదు కోసం. శిక్షణ తీసుకుంటున్న దిశాని చక్రవర్తి తెరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదీ మిథున్ చక్రవర్తి ‘అమృత’ కథ.సైలెంట్గా ఇలాంటి మంచి పనులెన్నో చేస్తూంటాడు మిథున్. ఓ ట్రస్ట్ పెట్టి దాని తరపున పేదవాళ్ల కొరకు ఆసుపత్రి, స్కూల్నూ నడిపిస్తున్నాడు. కుడిచేత్తో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే మాటను బాగా నమ్ముతాడట మిథున్ చక్రవర్తి. -
మరోసారి దుమ్మురేపిన డ్యాన్సింగ్ అంకుల్
మీకు డ్యాన్సింగ్ అంకుల్ గుర్తున్నారా? గోవిందా హిట్ సాంగ్ అయిన 'ఆప్కే ఆ జానేసే' పాటకు డ్యాన్స్ చేసి ఒక్కసారిగా దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అదిరిపోయే స్టెప్పులతో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యారు సంజీవ్ శ్రీవాస్తవ. ఆయన డ్యాన్స్ వైరల్గా మారి.. సెలబ్రిటీని చేసింది. తాజాగా ఆయన మళ్లీ వార్తల్లోకి వచ్చారు. మరోసారి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేసి అందరిని అదరగొట్టాడు. 1988లో రిలీజ్ అయిన 'జీతే హై హమ్ షాన్' సినిమాలో మితున్ చక్రవర్తి నటించిన 'జూలీ జూలీ' పాటకు స్టెప్పులేసి అందరిని ఆకట్టుకున్నారు సంజీవ్. ఇటీవల ఓ పెళ్లికి హాజరైన ఆయన వేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో మరోమారు వైరల్ అయింది. చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘డ్యాన్సింగ్ అంకుల్ ఈజ్ బ్యాక్’ అంటూ ప్రశంసిస్తున్నారు. ‘డాన్సింగ్ అంకుల్’గా పేరు తెచుకున్న ఈ విదిషా ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మెచ్చుకోవడమే కాక విదిషా మున్సిపల్ కార్పొరేషన్కు బ్రాండ్ అంబాసిడర్గా నియమించిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండి అంకుల్... ఇరగదీశావ్ పో!
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
హాలీవుడ్ కింగ్ ఆఫ్ కల్ట్ రోజర్ కన్నుమూత
Daily Horoscope: ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి
ఏపీలో కాసేపట్లో ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్
నారావారిపల్లెలో టీడీపీ శ్రేణుల దౌర్జన్యకాండ
Watch Live: ఏపీ ఎన్నికల లైవ్ అప్ డేట్స్
నయవంచనకు చెక్ పెడదాం
Lok sabha elections 2024: ప్రారంభమైన నాలుగో విడత పోలింగ్
సెలబ్రిటీల ఓటు ఇక్కడే..
భారత్ ఎగుమతులు విస్తరించాయ్!
తప్పక చదవండి
- నయవంచనకు చెక్ పెడదాం
- బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
- బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
- ఈసీ ద్వంద్వ వైఖరి
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement