-
అదనపు ఛార్జీలు లేకుండా ఫుడ్, క్యాబ్ సర్వీసు..!
బిర్యానీ తినాలని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే నేరుగా రెస్టారెంట్కు వెళ్లి తినే ఖర్చుకంటే అధికంగా ఛార్జీలు కనిపిస్తూంటాయి. హైదరాబాద్లోని ఏదైనా ప్రముఖ రెస్టారెంట్లో రూ.250కి దొరికే బిర్యానీ.. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే జీఎస్టీ, కన్వేయన్స్, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్, ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలన్నీ కలిపి రూ.300 పైగానే ఖర్చవుతోంది. రెస్టారెంట్ నుంచి ఇంటి దూరం పెరిగితే ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. నిత్యం ఏదో అవసరానికి ఎమర్జెన్సీలో ఒకప్రదేశం నుంచి మరో ప్రదేశానికి ప్రయాణించాలంటే ఆన్లైన్లో క్యాబ్, బైక్ బుక్ చేస్తూంటారు. మార్నింగ్, ఈవినింగ్ సమయంలో ‘పీక్, సర్జ్ అవర్స్’ పేరుతో సాధారణం కంటే అదనంగా ఛార్జ్ చేస్తూంటారు. ఇలా కొన్ని సంస్థలు చేస్తున్న వ్యవహారాలపై నియంత్రణ లేకుండా పోయింది. దాంతో వినియోగదారులపై భారంపడుతోంది. అలాంటి వ్యవస్థలను సవాళు చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఓఎన్డీసీ (ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్) వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) ఆధ్వర్యంలో వినియోగదారులకు నిర్దేశిత ధరల్లోనే ఫుడ్ డెలివరీలతో పాటు, క్యాబ్ సర్వీసులు, ఆన్లైన్లో వస్తువుల విక్రయం వంటి సేవలందిస్తున్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రెస్టారెంట్ ధరలు, వినియోగదారుడు ఉన్న దూరం ఆధారంగా నిర్దేశిత రుసుముతోనే ఆర్డర్లను చేర్చడం ఈ వేదిక ప్రత్యేకత. ఉదాహరణకు నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్లో బిర్యానీ రూ.300 ధర ఉంటే ఓఎన్డీసీ ద్వారా బుక్ చేస్తే డెలివరీ ఛార్జీలు కలిపి సుమారు రూ.325కి లభిస్తుంది. ఇంటర్నెట్, ప్యాకేజింగ్ ఛార్జీలు అంటూ అదనపు బాదుడు ఉండదు. 1,15,000 మందికి పైగా డెలివరీబాయ్స్తో బెంగళూరు, కొచ్చి, మైసూరు, కోల్కతా నగరాల్లో ఈ వేదిక కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆ ప్రాంతాల్లో వీరంతా రూ.160కోట్ల ఆదాయాన్ని పొందారు. హైదరాబాద్లోనూ ఇటీవల ఓఎన్డీసీ సేవలు ప్రారంభించింది. తెలంగాణ గిగ్వర్కర్స్ అసోసియేషన్కు చెందిన డెలివరీబాయ్లు ఇందులో భాగస్వాములైనట్లు ఆ సంస్థ పేర్కొంది. ఓఎన్డీసీకు సంబంధించి ప్రత్యేకమైన యాప్ ఏమీ లేదు. యూపీఐ పేమెంట్ యాప్ల ద్వారానే నేరుగా ఆర్డర్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం పేటీఎం ద్వారా ఇది నగరవాసులకు అందుబాటులో ఉంది. హైదరాబాద్కు చెందిన 25వేల మంది డెలివరీబాయ్లు ఇందులో పనిచేస్తున్నారు. ఇదీ చదవండి: ఫ్రీ సినిమా పేరిట సైబర్ మోసం.. ఏం చేస్తున్నారంటే.. హైదరాబాద్లో ఏటా కోటి కంటే ఎక్కువ బిర్యానీలు అమ్ముడవుతున్నాయి. 15 వేలకు పైగా రెస్టారెంట్లు ఉన్నాయి. ఏటా కేవలం ఆన్లైన్ ద్వారానే రూ.500 కోట్ల వ్యాపారం జరుగుతోందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. కేంద్రం ప్రారంభించిన ఓఎన్డీసీ వేదిక ఎక్కువమందికి చేరువైతే సుమారు రూ.50కోట్ల మేర వినియోగదారులకు ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిసింది. -
రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు
దిగ్గజ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) నోటీసులు జారీ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి. ఈ కథనాల ప్రకారం.. జొమాటో, స్విగ్గీ వరుసగా రూ.400 కోట్లు, రూ.350 కోట్ల విలువైన జీఎస్టీ నోటీసులు అందుకున్నాయి. ఫుడ్ డెలివరీ అనేది ఒక సర్వీస్ కాబట్టి దాని ట్యాక్స్స్లాబ్కు తగినట్లు జొమాటో, స్విగ్గీ జీఎస్టీ చెల్లించాలని డీజీజీఐ తెలిపింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్లు జొమాటో, స్విగ్గీ డెలివరీ ఫీజు పేరుతో కస్టమర్ల నుంచి కొంత డబ్బు వసూలు చేస్తాయి. 'డెలివరీ ఛార్జీ' అనేది ఇంటింటికీ ఆహారాన్ని తీసుకెళ్లే డెలివరీ భాగస్వాములు భరించే ఖర్చు. కంపెనీలు ఆ ధరను కస్టమర్ల నుంచి సేకరించి వారి డెలివరీ భాగస్వాములకు అందిస్తాయి. అయితే ఈ విషయంలో జీఎస్టీ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2022లో స్విగ్గీ, జొమాటో తమ ఆర్డర్లపై 5 శాతం రేటుతో పన్ను వసూలు చేసి జమ చేయాలనే నిబంధనలు ఉన్నాయి. అంతకు ముందు జీఎస్టీ కింద నమోదైన రెస్టారెంట్లు మాత్రమే పన్ను వసూలు చేసి జమ చేసేవి. గత నెలలో స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ల ప్లాట్ఫారమ్ చార్జీను రూ.2 నుంచి రూ.3కి పెంచింది. జొమాటో షేర్లు బుధవారం 1.07 శాతం నష్టపోయి రూ.115.25 వద్ద ముగిశాయి. -
ఏడాదిలో 42శాతం పెరిగిన కంపెనీ ఇదీ..
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ విలువను 7.85 బిలియన్ డాలర్లు (రూ.65,000 కోట్లు)గా అమెరికా ఫండ్ మేనేజర్ ఇన్వెస్కో అంచనా వేసింది. ఈ ఏడాది జులై 31 నాటికి 5.5 బిలియన్ డాలర్లుగా స్విగ్గీ విలువను తేల్చిన ఇన్వెస్కో ప్రస్తుత విలువను ప్రకటించింది. గతంతో పోలిస్తే ప్రస్తుత అంచనా విలువ 42 శాతం ఎక్కువ. 2022 జనవరిలో స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్లుగా పరిగణనలోకి తీసుకున్నారు. అప్పటితో పోలిస్తే తాజా అంచనా విలువ 30 శాతం తక్కువగానే ఉంది. ఆ సమయంలో ఇన్వెస్కో నేతృత్వంలో జరిగిన 700 మిలియన్ డాలర్ల నిధుల సమీకరణ ప్రక్రియ కోసం, స్విగ్గీ విలువను 10.7 బిలియన్ డాలర్ల విలువగా పరిగణనలోకి తీసుకున్నారు. వచ్చే ఏడాదిలో పబ్లిక్ ఇష్యూకు రావాలని భావిస్తున్న స్విగ్గీ.. తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు చర్యలు చేపడుతోంది. స్విగ్గీలో ఇన్వెస్కోకు 24,844 షేర్లు ఉన్నాయి. సంస్థ విలువలో మార్సును పరిగణనలోకి తీసుకోమని, వినియోగదార్ల సేవలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని స్విగ్గీ చెబుతోంది. అయితే స్విగ్గీ పోటీ సంస్థ జొమాటో విలువను గత జులైలో 7.7 బిలియన్ డాలర్లుగా లెక్కించడం గమనార్హం. ఆ తర్వాత జొమాటో షేరు 30 శాతం పెరగడంతో, ప్రస్తుతం ఆ సంస్థ విలువ ప్రస్తుతం 11 బిలియన్ డాలర్లకు చేరినట్లు అంచనా. -
24 పరుగులకు ఐఫోన్ 15.. 36 పరుగులకు స్కోడా కారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫాం స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్ప్రైజ్ను ఆఫర్ చేయనుంది. క్రికెట్ వరల్డ్కప్ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్ నింపేందుకు వివిధ ప్రైజ్మనీతో అలరించనుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. మ్యాచ్ డే మానియా ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్లో రన్స్ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్స్టామార్ట్లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు. లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్హోటల్లో బస, తనిష్క్ వోచర్ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
అరచేతిలో హోటళ్లు..
భద్రాద్రి: జోరుగా వాన కురుస్తుంది.. బిర్యానీ తినాలనిపించింది..బయటకు వెళ్లాలంటే వర్షం.. ఎలా అనిఆలోచించాల్సిన పనిలేదిప్పుడు. చేతిలో సెల్ఫోన్ ఉండి అందులో ఫుడ్ డెలివరీ యాప్స్ ఉంటే చాలు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ఫోన్ నుంచి ఆన్లైన్లో పేమెంట్ చేయవచ్చు. లేకుంటే ఆర్థర్ బాయ్కి డబ్బులు చెల్లించవచ్చు. అనుకోకుండా చుట్టాలో, స్నేహితులో ఇంటికి వచ్చారనుకొండి ఏ మాత్రం టెన్సన్ పడాల్సిన పనిలేదు. వారు ప్రెషప్ అయ్యే సరికి వేడివేడిగా వారికి మనం ఆర్డర్ చేసిన ఆహారం అందించవచ్చు. ఎండ, వాన, చలి ఏ సమయంలోనైనా ఫుడ్ డెలివరీ యాప్స్తో మనకు ఇష్టామైన ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని ఇంట్లోనే ఆస్వాదిస్తూ ఆరగించవచ్చు. గతంలో నగరాలు, పట్టణాలపై పరిమితమైన ఫుడ్ డెలివరీ యాప్స్ సేవలు ఇప్పుడు పట్టణాలకు సమీపంలోని గ్రామాలకు కూడా విస్తరిస్తున్నాయి. ఆధ్యాత్మిక కేంద్రమైన భద్రాచలంలోని హోటళ్లు, బేకరీల నుంచి ఇప్పుడు ఫుడ్ డెలివరీ యాప్స్తో సారపాక, ఐటీసీ, తాళ్లగొమ్మూరు, కోయగూడెం, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం, బూర్గంపాడు ప్రాంతాలకు ఫుడ్ డెలివరీ అందుతుంది. ప్రస్తుతం భద్రాచలం, సారపాకలలోని హోటళ్లు, బేకరీల నుంచి పరిసర గ్రామాలకు స్విగ్గి, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ల నుంచి సేవలు అందుతున్నాయి. బిర్యానీ, స్నాక్స్, చికెన్, మటన్, ఫిష్ తదితర మాంసాహార వంటకాలు ఆర్డర్ చేసిన అరగంటకే వేడివేడిగా అందుబాటులోకి వస్తున్నాయి.స్మార్ట్ఫోన్లో ప్లేస్టోర్ నుంచి స్విగ్గి, జొమాటో ఫుడ్ డెలివరీ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి. తొలిసారి యాప్లను వినియోగిస్తే ఫుడ్ బిల్లులో ఆఫర్లు కూడా వర్తిస్తాయి. అదేవిధంగా పండుగలకు, ఓపెనింగ్లకు కూడా కొన్ని హోటళ్లు ఆర్డర్లపై ఆఫర్లను ప్రకటిస్తాయి. ఫుడ్ డెలివరీ యాప్లతో సేవలందించేందుకు స్థానిక యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. సొంత పనులు చేసుకుంటునే చాలామంది యువకులు పార్ట్టైమ్ జాబ్గా ఫుడ్ డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారు. ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్న యువకులు, చదువుకుంటున్న యువకులు కూడా ఈ యాప్ల నుంచి సేవలను అందిస్తు ఉపాధిపొందుతున్నారు. పగటిపూట రోజువారీ పనులు చేసుకునే చాలామంది.. సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆర్డర్లను హోమ్ డెలివరీ చేస్తు ఉపాధి పొందుతున్నారు. ఫుడ్ డెలివరీ చేసే దూరం, ఫుడ్ పరిమాణాన్ని బట్టి బాయ్స్కు వేతనాన్ని అయా సంస్థలు అందిస్తాయి. ఫుడ్ డెలివరీ యాప్లతో అటు వినియోగదారులకు, ఇటు హోటళ్లు, బేకరీల నిర్వహకులకు కూడా సౌకర్యవంతంగా ఉంది. ఈ ఫుడ్ డెలివరీ సిస్టమ్తో స్థానికంగా చాలామంది యువతకు ఉపాధి లభిస్తుంది. కొన్నేళ్లుగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాలపై పరిమితమైన ఈ యాప్లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి సేవలను అందిస్తున్నాయి. ఫుడ్ ఆర్డర్తో ఈజీగా ఉంది మనకు కావాల్సింది తినాలనుకున్నప్పుడు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం ఈజీగా ఉంది. మనం ఆర్డర్ చేసిన అరగంట వ్యవధిలోనే ఫుడ్ ఇంటికి వస్తుంది. కొన్ని తప్పని పరిస్థితుల్లో మన ఆకలి తీర్చేందుకు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేయటం సులభమైంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలు మనకు కావాలి్సన ఫుడ్ను ఇంటికే తీసుకువస్తున్నాయి. – వై శివారెడ్డి, రెడ్డిపాలెం బంధువులొస్తే భయం లేదు మనం పని ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్, బంధువులు ఇంటికి వస్తే వారికి అప్పటికప్పుడు వండి పెట్టలేము. వాళ్లు ఫ్రెష్ అయ్యేసరికి మనం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడితే అరగంటలోపే ఫుడ్ ఇంటికి వస్తుంది. స్విగ్గీ, జొమోటో వంటి సంస్థలు అన్నిరకాల ఫుడ్ ఐటెమ్స్ను మనం ఆర్డర్ చేసుకున్న దానిని బట్టి ఇంటికి పంపిస్తున్నారు. ఈ సేవలు చాలా బాగున్నాయి. – రాజశేఖర్, సారపాక -
స్విగ్గీకి పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: ఫుడ్, గ్రోసరీ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో భారీ నష్టాలు ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2020–21) నమోదైన రూ. 1,617 కోట్ల నుంచి నష్టం రూ. 3,629 కోట్లకు పెరిగింది. బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ టాఫ్లర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం స్విగ్గీ కార్యకలాపాల ఆదాయం మాత్రం రెట్టింపైంది. రూ. 5,705 కోట్లకు చేరింది. 2020–21లో రూ. 2,547 కోట్ల టర్నోవర్ మాత్రమే సాధించింది. అయితే కంపెనీల రిజిస్ట్రార్వద్ద దాఖలైన స్విగ్గీ నివేదిక ప్రకారం మొత్తం ఆదాయం రూ. 2,676 కోట్ల నుంచి రూ. 6,120 కోట్లకు ఎగసింది. చదవండి: గుడ్ న్యూస్: ఏటీఎం కార్డ్ లేకుండా క్యాష్ విత్డ్రా.. ఇలా చేస్తే సరిపోతుంది! -
లేట్ నైట్ అయినా సరే.. చిటికెలో డెలివరీ!
న్యూఢిల్లీ: అర్ధరాత్రి సమయంలోనూ కిరాణా సరుకులు మీ ఇంటికి చేర్చే రోజు వస్తుందని ఊహించారా..? దీన్ని నిజం చేసింది స్విగ్గీ ఇన్స్టామార్ట్. గ్రోసరీ విభాగంలో ఈ కామర్స్ సంస్థల మధ్య పోటీ మామూలు స్థాయిలో లేదనడానికి ఇదొక తాజా ఉదాహరణ. కస్టమర్ల అవసరాలను తీర్చడం, మార్కెట్ వాటా పెంచుకోవడం ఈ రెండు అంశాలే ప్రామాణికంగా గ్రోసరీ ఈ కామర్స్ సంస్థలు వ్యూహాలను అమలు చేస్తున్నాయి. (వావ్..అదరహో! ఎలైట్ క్లబ్లోకి ఎస్బీఐ ఎంట్రీ) పోటీ తీవ్రంగా ఉండడం వల్లే 10 నిమిషాల్లో డెలివరీ సదుపాయం పుట్టుకొచ్చింది. ఆర్డర్ చేసి, టీ తాగేలోపే కిరాణా సరుకులు తెచ్చివ్వడం కస్టమర్లను సైతం ఆశ్చర్చచకితులను చేసిందని చెప్పుకోవాలి. ఇలా కొత్త ఆలోచనలతో పోటీ సంస్థలపై పైచేయి సాధించేందుకు కంపెనీలు ఎత్తులు వేస్తున్నాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ అనుబంధ గ్రోసరీ సంస్థ ఇన్స్టామార్ట్.. తెల్లవారుజాము వరకు గ్రోసరీ డెలివరీకి శ్రీకారం చుట్టింది. పరిశ్రమలో ఈ సేవలు ప్రారంభించిన మొదటి సంస్థగా నిలిచింది. కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ముందుగా ఈ సేవలను అందిస్తోంది. (షాపింగ్ మాల్స్ సందడి, ఎన్ని పెరిగాయో తెలుసా?) 3 గంటల వరకు.. ‘‘తెల్లవారుజామున మూడు గంటల వరకు మా సేవలు తెరిచే ఉంటాయి. అప్పటివరకు మీకు కావాల్సిన వాటిని డెలివరీ చేస్తుంటాం’’ అంటూ తన కస్టమర్లకు స్విగ్గీ ఇన్స్టామార్ట్ సందేశాలు పంపించింది. జూన్ వరకు చివరి 12 నెలల్లో ఆర్డర్ల పరంగా ఇన్స్టామార్ట్ 16 రెట్ల వృద్ధిని చూసింది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ‘‘స్విగ్గీ ఇన్స్టామార్ట్ దేశవ్యాప్తంగా 25 పట్టణాల్లో ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఒంటి గంట వరకు సేవలు అందిస్తోంది. స్టోర్ ఆపరేటర్లు, డెలివరీ భాగస్వాముల సహకారంతో కొన్ని పట్టణాల్లో మా కార్యకలాపాల సమయాన్ని మరింత పెంచుతున్నాం. కస్టమర్ల కోరిక మేరకు 5,000 ఉత్పత్తుల్లో కోరిన దాన్ని డెలివరీ చేస్తున్నాం’’అని స్విగ్గీ అధికార ప్రతినిధి తెలిపారు. జెప్టో సైతం.. ఈ విషయంలో జెప్టో సైతం స్విగ్గీ ఇన్స్టామార్ట్కు గట్టి పోటీనిచ్చేలా ఉంది. రోజంతా డెలివరీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్టు తెలిపింది. ‘‘మేము ఇప్పటికే 10 పట్టణాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు డెలివరీ సేవలను ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు 24 గంటల పాటు సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించాం. ఇది ఇంకా ఆరంభంలోనే ఉంది. కాకపోతే రాత్రి పూట ఆర్డర్లలో క్రమంగా వృద్ధి కనిపిస్తోంది’’ అని జెప్టో అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘క్విక్ కామర్స్ కంపెనీలు రాత్రి డెలివరీలో పైచేయి సాధించగలవు. వాటికున్న డార్క్ స్టోర్లు, మినీ స్టోర్ల నెట్వర్క్ ద్వారా ఈ సేవలు ఆఫర్ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. 15-30 నిమిషాల్లోనే డెలివరీ చేయగలవు. బయటి విక్రయదారులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు’’ అని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. అయితే, ఈ సేవలు ఎంతకాలం పాటు కొనసాగగలవు? అన్నదే ప్రశ్నగా పేర్కొన్నాయి. -
బిర్యానీ తగ్గేదేలే..!
నాన్ వెజ్ ప్రియుల నిలయమని నగరం నిరూపించుకుంది. రంజాన్ పండగ వేళ ఈ వంటకాల విక్రయాలు మరింత ఊపందుకున్నాయి. కులమతాలకు అతీతంగా ఆరగించే హలీం అమ్మకాల్లో ముందున్నా, చికెన్ బిర్యానీకి ఉన్న డిమాండ్ఏ మాత్రం తగ్గకపోవడం విశేషమని ఇప్పటికీ ఆర్డర్ల పరంగా అదే నంబర్ వన్ అని.. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ అధ్యయనం తేల్చింది. సాక్షి, హైదరాబాద్: విభిన్న సంస్కృతులు, అభి‘రుచుల’ నిలయం నగరం. ఇక్కడి నాన్వెజ్ వంటకాల్లో బిర్యానీకి ఉన్న క్రేజ్ సంగతి చెప్పక్కర్లేదు. ఇక రంజాన్ సమయంలో అన్ని వంటకాల్నీ వెనక్కి నెట్టేస్తోంది హలీం. ఈ ఏడాది మాత్రం చికెన్ బిర్యానీ తన క్రేజ్ను నిలబెట్టుకుని హలీమ్ కన్నా డిమాండ్లో ఉందని స్టడీలో వెల్లడైంది. ‘ఆరు’గించినవి అవే.. రంజాన్ పండగ ప్రారంభమైన తర్వాత ఈ నెల 2 నుంచి 22 వరకూ సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఆర్డర్ల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు. దీనిప్రకారం అత్యధిక సంఖ్యలో నగరవాసులు ఆరగించిన వంటకాల్లో.. చికెన్ బిర్యానీ, హలీమ్, నీహారిస్, సమోసాలు, రబ్డి, మాల్పువా అగ్రస్థానంలో ఉన్నాయి. బిర్యానీ...అదే క్రేజ్... హలీమ్ హవా ఉన్నప్పటికీ బిర్యానీ పట్ల డిమాండ్ ఎంత మాత్రం తగ్గలేదని స్టడీ తేల్చింది. కేవలం 20రోజుల్లో 8 లక్షల చికెన్ బిర్యానీలు నగరవాసులు హాంఫట్ అనిపించారు. కేవలం ఒక్క డోర్డెలివరీ యాప్ ఆర్డర్ల ద్వారానే ఈ స్థాయిలో డిమాండ్ ఉంటే ఇక మొత్తంగా చూస్తే అది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. ‘ఆహా’లీం.. ఏడాదికోసారి జిహ్వల్ని పలకరించే హలీంను గత ఏడాది కన్నా 33 రెట్లు ఎక్కువగా సిటిజనులు ఆరగించారు. దీనిలో మటన్ హలీం తొలిస్థానం కాగా స్పెషల్ హలీం, చికెన్ హలీం, ముర్గ్ హలీంలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రంజాన్ మాసంలోనే విరివిగా లభించే నిహారీ కూడా గత ఏడాదితో పోలిస్తే 30 రెట్లు ఎక్కువగా ఆదరణ పొందింది. అత్యధిక ఆర్డర్లు అందుకున్న వాటిలో ఇఫ్తార్ వంటకాలైన సమోసా, భజియా, రబ్డి, ఫిర్నీ, మాల్పువా.. ఉన్నాయి. ఇవి ఈ 20 రోజుల్లో ఏకంగా 4.5లక్షల ఆర్డర్లు సాధించాయి. ఇవి కాకుండా పనీర్ బటర్ మసాలా, చికెన్ 65, మసాలా దోశెలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇడ్లీలు సైతం 17వేల ఆర్డర్లు పొందడం విశేషం కాగా. డిసర్ట్స్లో గులాబ్జామూన్, రస్మలాయి, డబుల్ కా మీఠాలు టాప్ త్రీలో ఉన్నాయి. టేస్టీ.. యూనిటీ.. కుటుంబం మొత్తాన్నీ ఒకే చోట చేర్చడమే రంజాన్ గొప్పతనం. ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. అందర్నీ ఏకం చేసేలా విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకే వీలున్నన్ని రంజాన్ వంటకాలను రుచిచూడాలని భావిస్తాం. – మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్– మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ -
Swiggy Delivery: తెగ లాగించేశారట..!!
-
ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీదే హవా..సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్
గతంతో పోలిస్తే హైదరాబాదీలలో ఆరోగ్య స్పృహ పెరిగిందనేది ఫుడ్ ఆర్డర్ల ద్వారా మరోసారి రుజువైంది. విందు వినోదాల వీకెండ్ తర్వాత రోజు ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ.. వార్షిక నివేదిక వెల్లడించిన ఆసక్తికరమైన అంశాలివీ.. – సాక్షి, హైదరాబాద్ గ్రాసరీస్తో సహా విభిన్న రకాల కేటగిరీ ఉత్పత్తులను స్విగ్గీ అందిస్తున్నప్పటికీ.. మొత్తం ఆర్డర్లలో 48 శాతం ఫుడ్కు సంబంధించినవే. ఈ ఏడాది పెట్ ఫుడ్ కూడా ఆర్డర్లు బాగా పెరిగాయి. ఆసక్తికరంగా.. 20వేల ఆర్డర్స్ పెట్ ఫుడ్ కోసం వచ్చాయి. ఫుడ్ ఫర్ హెల్త్.. ఆరోగ్యకరమైన ఆహారం కోరుతూ హెల్త్ హబ్కి ఆర్డర్లు ఈ ఏడాది 200 శాతం పెరిగాయి. దేశంలోనే ఆరోగ్య స్పృహ కలిగిన ఆహారం కోరే నగరాల్లో బెంగళూరు ప్రథమ స్థానంలో ఉండగా గతం కంటే మెరుగ్గా హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకోవడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ముంబై నిలిచింది. విందూ వినోదాలు ఎక్కువగా జరిగే వారాంతపు రోజుల అనంతరం సోమవారం ఆరోగ్యకర ఆహారం గురించి ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటే.. ఆ తర్వాత స్థానం గురువారం దక్కించుకుంది. కీటో శైలి ఫుడ్లో 23 శాతం వృద్ధి కనిపించగా, వెగాన్ శైలి, శాకాహారపు ఆర్డర్స్లో 83 శాతం పెరుగుదల నమోదైంది. చదవండి: అంతరిక్షానికీ ఫుడ్ డెలివరీ.. సెకనుకు 2 బిర్యానీలు.. హాంఫట్.. నగరంలో చికెన్ బిర్యానీ ఆర్డర్లకే ఫస్ట్ ప్లేస్ దక్కుతోంది. అలాగే యాప్ని తొలిసారి వినియోగిస్తున్నవారిలో అత్యధికులు చికెన్ బిర్యానీతోనే అరంగేట్రం చేస్తున్నారట. దేశవ్యాప్తంగా గత ఏడాది నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వస్తే.. ఈ ఏడాది అది 115కి పెరిగింది. అంటే సెకనుకు 2 బిర్యానీలుగా చెప్పొచ్చు. చికెన్ బిర్యానీ వినియోగంలో వరుసగా చెన్నై, కోల్కతా, లక్నో, హైదరాబాద్లు టాప్లో ఉన్నాయి. ముంబైలో మాత్రం చికెన్ బిర్యానీని దాల్ కిచిడీ దాటేసింది. చదవండి: ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. అక్కడ రూ.1కే మిర్చిబజ్జి ! బ్రౌనీస్ బాక్స్ డెలివరీకి 43.3 కి.మీ జర్నీ.. ► అత్యధిక దూరం ప్రయాణం చేయించిన ఆర్డర్లలో నగరానికి రెండో స్థానం దక్కింది. ఓ కస్టమర్ తన ప్రియ నేస్తానికి ఆర్డర్ చేసిన చాక్లెట్ బ్రౌనీస్ బాక్స్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అందించడం కోసం సిటీకి చెందిన డెలివరీ బాయ్ 43.3 కి.మీ ప్రయాణం చేశాడు. ► ఈ విషయంలో ప్రథమ స్థానం దక్కించుకున్న బెంగళూరులో ఫుడ్ ప్యాక్ అందించడానికి ఓ స్విగ్గీ బాయ్ ఏకంగా 55.5 కి.మీ ప్రయాణం చేశాడు. కోల్కతాలో ఓ బిర్యానీ ప్రేమికురాలు తనకు ఇష్టమైన మటన్ బిర్యానీ కోసం 39.3 కి.మీ ప్రయాణం చేయించింది. చదవండి: బిర్యానీ కోసం టెంప్ట్ అయ్యాడు, అలా ఆర్డర్ పెట్టి..ఇలా పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు మనసు దోసె... దోసెలు ఆర్డర్ చేయడంలో బెంగళూరు టాప్లో ఉంది. బటర్ దోసె ఆర్డర్లలో బెంగళూరు తర్వాత స్థానం నగరానికి దక్కగా ముంబై మూడో స్థానంలో ఉంది. నగరవాసులు అత్యధికంగా ఆర్డర్ చేసిన వాటిలో.. చికెన్ బిర్యానీ తొలిస్థానంలో ఉండగా, చికెన్ 65 తర్వాతి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో పన్నీర్ బటర్ మసాలా నిలవగా, మసాలా దోసె 4, ఇడ్లీ 5వ స్థానాల్లో నిలిచాయి. సాధారణంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఫుడ్ ఆర్డర్స్ ఎక్కువ. రాత్రి 10 గంటల తర్వాత స్నాక్స్కు ఆర్డర్స్ పెరిగాయి. 80 శాతం మంది ఆన్లైన్ ద్వారా పేమెంట్స్కు మొగ్గు చూపుతున్నారు కొద్దిమంది మాత్రమే డెలివరీ తర్వాత నగదు చెల్లిస్తున్నారు. -
హైదరాబాద్: స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ సమ్మెబాట, స్పందించిన యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ నిరసన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టనుననారు. ఈ మేరకు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన కారణంగా కనీస డెలివరీ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే యాజమన్యాలకు నోటీసులు ఇచ్చిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫార్మ్ వర్కర్స్ యూనియన్.. పలు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతోంది. సమస్యలపై చర్చించేందుకు స్విగ్గీ యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇచ్చింది యూనియన్. ఒకవేళ స్విగ్గి యాజమాన్యం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే డిసెంబర్ 5 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. స్స్విగ్గి డెలివరీ బాయ్స్ డిమాండ్స్ 1. డెలివరీ కనీస చార్జి రూ. 35గా ప్రకటించాలి. 2. ప్రతి కిలోమీటర్కు చెల్లించే మొత్తాన్ని రూ. 6 నుంచి రూ. 12కు పెంచాలి. 3. నెల రేటింగ్స్ కి 4000 బోనస్ ఇవ్వాలి. 4. కస్టమర్ డోర్ స్టెప్ డెలివరీ చార్జీ రూ.5లను పునరుద్ధరించాలి. 5. డెలివరీ పరిధిని తగ్గించడానికి సూపర్ జోన్స్ తీసేయాలి. స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసనలతో కొన్ని ప్రాంతాల్లో నిలిచిన ఫుడ్ డెవివరీ నిలిచిపోయింది. అనేక ప్రాంతాల్లో ముందుగానే స్విగ్గీ బాయ్స్ సమ్మెకు దిగారు. మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామంటున్నారు. ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోనే అధికం..! డెలివరీ బాయ్స్ నిరసనలపై స్విగ్గీ యాజమాన్యం స్పందించింది. దేశవ్యాప్తంగా ఆయా నగరాలతో పోల్చితే హైదరాబాద్లోని డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఎక్కువ మేర సంపాదిస్తున్నారు. ఎన్నడూ లేనంతగా డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ అధిక ఆదాయాలను పొందుతున్నారు. పేఅవుట్ స్ట్రక్చర్లో ఏలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. హైదరాబాద్లోని డెలివరీ ఎగ్జిక్యూటివ్లు గత ఏడాదితో పోలిస్తే గంటకు 30 శాతం ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారని స్విగ్గీ పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా స్విగ్గీ ఇంధన ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టిందని వెల్లడించింది. దురదృష్టవశాత్తూ, కొంతమంది డెలివరీ ఎగ్జిక్యూటివ్లు వాస్తవాలను గుర్తించలేకపోతున్నారని కంపెనీ అభిప్రాయపడింది. హైదరాబాద్లోని వేలాది మంది ఎగ్జిక్యూటివ్లకు మెడికల్ ఇన్సూరెన్స్, కోవిడ్ కవర్ ఎక్స్టెన్షన్, యాక్సిడెంట్ కవర్ వంటి ప్రయోజనాలతో పాటుగా విశ్వసనీయమైన, స్థిరమైన సంపాదన అవకాశాలను కల్పిస్తున్నందుకు కంపెనీ గర్విస్తోందని పేర్కొంది. -
స్విగ్గీ చేసింది.. ఆమెకు అండగా... ఆరోజులలో సెలవు!
గతంలో జొమాటో తన డెలివరీ విమెన్కు సంవత్సరంలో 10 రోజుల బహిష్టు సెలవు ప్రకటించింది. ఆ సెలవులకు జీతం స్పష్టత లేదు. కాని స్విగ్గీ తన డెలివరీ విమెన్కు ప్రతి నెల రెండు రోజుల వేతన సెలవు ప్రకటించింది. అసంఘటిత రంగాలలో ఎందరో స్త్రీలు డెయిలీ వేజెస్ మీద పని చేస్తున్నారు. వారికి బహిష్టు సమయంలో రెండు రోజుల వేతన సెలవు ఎందుకు ఇవ్వకూడదు? స్విగ్గీ చేసిన ఆలోచన ఎందుకు చేయకూడదు? ఇంట్లో పనిమనిషిని అందరూ పెట్టుకుంటారు. రోజుకు రెండుపూట్ల రమ్మంటారు కొందరు. ఒకపూట చాలంటారు కొందరు. రోజూ పని చేయిస్తారు కొందరు. ఆదివారం రానక్కర్లేదు అంటారు మరికొందరు. పనిమనిషి అప్పుడప్పుడు పనికి రాదు. పోనీలే అని మొత్తం జీతం ఇస్తారు కొందరు. రాని రోజులకు జీతం కట్ చేస్తారు ఇంకొందరు. రాని రోజులకే జీతం కట్ చేసేవాళ్లు ఆమె బహిష్టు సమయంలో నలతగా అనిపించో, నొప్పిగా అనిపించో, చిరాగ్గా ఉండో, నీరసం వల్లో పనికి రానంటే జీతం ఇస్తారా? కాని ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ ఇంటి యజమానురాలు ఏ ఆఫీస్లో అయినా పని చేస్తూ ఉంటే బహిష్టు సమయంలో సెలవు పెట్టుకుంటే ఆమె జీతం ఆమెకు వస్తుంది. కాని పనిమనిషికి రాదు. ఇది సబబా? పని మనిషి వరకూ అక్కర్లేదు. ఫ్యాక్టరీల్లో డెయిలీ లేబర్ ఉంటారు. భవన నిర్మాణరంగంలో స్త్రీలు ఉంటారు. బట్టల షోరూముల్లో, మాల్స్లో పని చేసే స్త్రీలు ఉంటారు. వీరందరికీ వారానికి సగం రోజు మాత్రమే సెలవు ఇచ్చేవారున్నారు. ఇక నెలలో ఏ రోజు రాకపోయినా ఆ రోజు జీతం కట్. వీరందరూ బహిష్టు సమయంలో కష్టమయ్యి సెలవు పెడితే ఆ రెండుమూడు రోజుల పాటు డబ్బు నష్టపోవాల్సిందే. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? కాని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ రెండు రోజుల క్రితం అందరి చూపు ఆకర్షించింది. దాదాపు 45 నగరాల్లో 45,000 హోటళ్ల నుంచి నెలకు 20 లక్షల ఆహార ఆర్డర్లు సరఫరా చేసే ఈ సంస్థకు దాదాపు లక్షన్నర మంది ఫుడ్ డెలివరీ పార్టనర్స్ (బాయ్స్/గర్ల్స్) ఉన్నారు. వారిలో 1000 మంది ఫుడ్ డెలివరీ విమెన్ ఉన్నారు. ఈ సంఖ్యను 2000కు పెంచాలని స్విగ్గీ అనుకుంది కాని కరోనా వల్ల ఆ భర్తీ మందగించింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ తన ఫుడ్ డెలివరీ విమెన్కు నెలలో రెండు రోజుల వేతన సెలవును ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఆ రెండురోజులు వాళ్లు రెగ్యులర్గా కనిష్టంగా రోజువారీ ఎంత కమీషన్ పొందుతారో అంత కమీషన్ వారికి ఇస్తారు. ‘నాకు పిరియెడ్స్. రెండు రోజులు సెలవు కావాలి’ అని మా డెలివరీ విమెన్ అడిగితే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా వెంటనే మంజూరు చేసే సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం అని స్విగ్గీ వైస్ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) మిహిర్ షా ప్రకటించారు. ఆ రెండు రోజులకు జీతం కూడా ఇస్తాం అని ఆయన తెలియచేశారు. 2014లో బెంగళూరులో ఆరు మంది డెలివరీ బాయ్స్తో మొదలైన స్విగ్గీ అనతికాలంలో మహా సంస్థగా అవతరించింది. 2016లో పూణెలో మొదటి డెలివరీ ఉమన్ ఉద్యోగంలో చేరితే 2019లో చెన్నైలో ఆ తర్వాత ముంబైలో డెలివరీ పార్టనర్స్గా చేరడం మొదలెట్టి ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికిపైగా మారింది. ‘మా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. వారు దాని ద్వారా ఎమర్జన్సీ నంబర్కు కాల్ చేసే వీలు ఉంది. వారికి తక్షణం సహాయం కావాలంటే అందుతుంది. మేము వారి కోసం శుభ్రమైన టాయిలెట్లు కల్పిస్తున్నాము. షెల్ పెట్రోల్ బంకులతో ప్రత్యేకంగా చేసుకున్న ఏర్పాటు వల్ల మా డెలివరీ విమెన్ ఆ బంకుల్లోని టాయిలెట్లను ఉపయోగించుకోవచ్చు. డెలివరీ, ట్రావెల్ రంగాల్లో కేవలం బహిష్టు సమస్య వల్ల స్త్రీలు రాకుండా ఉండకూడదు. వారికి సౌకర్యాలు కల్పించాలి. అలాగే ఆ రోజులకు వేతన సెలవు ఇవ్వాలి’ అని స్విగ్గీ ప్రతినిధి ఒకరు అన్నారు. స్విగ్గీలో పని చేస్తున్న మహిళల్లో దాదాపు 90 శాతం మంది 45 ఏళ్ల లోపువారే. వీరిలో జీవితంలో తొలి సంపాదన స్విగ్గీతో మొదలెట్టిన వారు 24 శాతం మంది ఉన్నారు. తమకు వీలున్న టైమ్లోనే పని చేసే అవకాశం ఉండటంతో చేరుతున్నారు. చాలామంది తమ సంపాదన ఇంటి అద్దెకు, కరెంటు బిల్లుకు ఉపయోగిస్తున్నారు. కొంతమంది యువతులు చదువుకోవడానికి. ‘మహిళా డెలివరీ పార్టనర్స్కు వాహనాలు లేకపోతే వారి కోసం మా సంస్థ ఎలక్ట్రిక్ సైకిల్/బైక్లను అద్దెకు ఏర్పాటు చేయడానికి ఆయా సంస్థలతో మాట్లాడుతున్నాం’ అని కూడా స్విగ్గీ సంస్థ ప్రతినిధి అన్నారు. ప్రస్తుతం నగరాల్లో ఫుడ్ డెలివరీ సిబ్బంది తమ పెట్రోల్ ఖర్చులు పోను 20 వేల నుంచి 25 వేలు సంపాదిస్తున్నారు. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? -
డెలివరీ బాయ్స్ లిఫ్ట్ ఉపయోగించకూడదట!
కరోనా మహమ్మూరి సమయంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు జోమాటో, స్విగ్గీ సంస్థలు వినియోగదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఫుడ్ని డెలివరీ చేశాయి. అంతేకాదు ఆ క్లిష్ట సమయంలో డెలివరీ బాయ్స్ తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్లి ఆహారం, నిత్య అవసరాలను ఇళ్ల వద్దకే నేరుగా తీసుకు వచ్చి అందించారు. ఈ మహమ్మారీ సమయంలో డెలివరీ బాయ్స్ హీరోల్లా సేవంలందించి అందరీ ప్రశంసలను అందుకున్నారు. కానీ ఉదయ్పూర్లోని ఒక మాల్ డెలివరీ బాయ్స్ని ఇబ్బందికీ గురి చేసేలా ఒక నోటీస్ అంటించింది. ఈ నోటీస్ చాలా మందిని కలవరపాటుకు గురి చేయడమే కాక ఈ ఆధునిక కాలంలో ఇంకా ఇలాంటి వివక్షత కొనసాగుతోందా అని ఒకింత ఆశ్చర్యపోక తప్పదేమో! (చదవండి: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి) ఇంతకీ ఆ నోటిస్ సారాంశం ఏంటంటే "జోమాటో, స్విగ్గీ ఫుడ్ డెలిరీ బాయ్స్ లిఫ్ట్ యూజ్ చేయకండి...మెట్ల వైపు నుంచే వెళ్లండి " అని ఉంది. ఈ క్రమంలో వాళ్లు వినియోగదారులకు సమయానికీ ఫుడ్ అందించలేరు, పైగా మరో ఆర్డర్ని కూడా తీసుకోలేరు. ఈ నోటిస్ని జర్మలిస్ట్ శోభనా నాయర్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో పాటు " ఆధునిక కాలపు భూస్వామ్యం" అంటూ ట్యాగ్ లైన్ జోడించారు. దీంతో ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్వుతోంది. అంతేకాదు చాలా మంది నెటిజన్లు ఆగ్రహంతో తమదైన శైలిలో ఘాటుగా కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. అందుకే ఈ దేశం ఇంకా వెనుకబడి ఉందని ఒకరు, ఇది డెలివరీ బాయ్స్ పట్ల వివక్ష, ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని...పలురకాలుగా నెటిజన్లు ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. (చదవండి: పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో తొలి హిందూ మహిళగా సనా) Modern day feudalism pic.twitter.com/edqYwQe5Qj — Sobhana K Nair (@SobhanaNair) September 18, 2021 -
జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. స్విగ్గీ, జొమాటో ఇక రెస్టారెంట్లే
లక్నో: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అత్యున్నత స్థాయి విధాన నిర్ణయ మండలి శుక్రవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఇప్పుడేమీ చర్చించేది లేదన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎక్సైజ్ సుంకం, వ్యాట్ను ఒకే దేశీయ పన్ను రేటుగా మార్చితే అది ఇటు కేంద్రం అటు రాష్ట్రాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అభిప్రాయమే దీనికి కారణం. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5% జీఎస్టీ పన్ను విధించింది. లక్నోలో శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రుల జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశం జరిగింది. భేటీ అనంతరం సీతారామన్ తెలిపిన వివరాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► కొన్ని కోవిడ్–19 ఔషధాలపై రాయితీ పన్ను రేట్లను మూడు నెలలు అంటే డిసెంబర్ 31 వరకూ పొడిగించింది. ఖరీదైన జోల్జెన్సా్మ, విల్టెప్సో వంటి కండరాల క్షీణత ఔషధాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు లభించింది. సెపె్టంబర్ 30తో ముగిసే మెడికల్ పరికరాలపై మినహాయింపులు ఇక కొనసాగవు. ► కేన్సర్ సంబంధిత ఔషధాలపై రేటు 12 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు. ► బలవర్థకమైన బియ్యం విషయంలో 18 శాతం నుండి 5 శాతానికి జీఎస్టీ రేటు కోత. ► బయో–డీజిల్ బ్లెండింగ్కు సంబంధించి రేటు 12 శాతం నుంచి 5 శాతానికి కుదింపు. ► వస్తు రవాణా విషయంలో రాష్ట్రాలు విధించే నేషనల్ పరి్మట్ ఫీజు జీఎస్టీ నుంచి మినహాయింపు ► లీజ్డ్ ఎయిర్క్రాఫ్ట్ దిగుమతి ఐ–జీఎస్టీ చెల్లింపు మినహాయింపు. ► అన్ని రకాల పెన్నులపై 18% జీఎస్టీ. ► పునరుత్పాదక రంగ పరికరాలకు 12 శాతం పన్ను విధింపు. -
అనూహ్యం.. ఇక ఫుడ్ డెలివరీ యాప్లకూ జీఎస్టీ!
జీఎస్టీ కౌన్సిల్ అనూహ్య నిర్ణయానికి సిద్ధమైంది. ఫుడ్ డెలివరీ యాప్లను రెస్టారెంట్స్ పరిధిలోకి తీసుకురాబోతోంది. జీఎస్టీ విధించే ఉద్దేశంతోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇక మీదట ఫుడ్ డెలివరీ యాప్లకు 5 శాతం జీఎస్టీ విధించే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ-కామర్స్ ఆపరేటర్లైన ఫుడ్ డెలివరీ సర్వీసులు.. జొమాటో, స్విగ్గీలాంటి ఫుడ్ సర్వీస్ స్టార్టప్లకు జీఎస్టీ భారం తప్పేలా కనిపించడం లేదు. శుక్రవారం(సెప్టెంబర్ 17న) లక్నోలో జీఎస్టీ కౌన్సిల్ కీలక భేటీ కానుంది. ఈ సమావేశంలో చర్చించబోయే 48 ప్రతిపాదనల్లో.. ఫుడ్ డెలివరీ యాప్లపైనా జీఎస్టీ విధించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ జీఎస్టీ కౌన్సిల్ గనుక ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపితే.. ఆన్లైన్ డెలివరీ యాప్లను రెస్టారెంట్ పరిధిలోకి తీసుకొచ్చి మరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వసూలు చేస్తారు. భారీ నష్టం కారణంగానే.. ఒకవేళ ఈ నిర్ణయం గనుక అమలు చేస్తే.. సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకోవడానికి సదరు యాప్లకు కొంత టైం ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ బావిస్తోంది. ఇక నిర్ణయం వల్ల కస్టమర్లపై ఎలాంటి భారం ఉండబోదని చెబుతోంది. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ రూల్స్ ప్రకారం.. ఫుడ్ డెలివరీ యాప్లను ట్యాక్స్ కలెక్టర్స్ ఎట్ సోర్స్గా భావిస్తున్నారు. అయితే గత రెండేళ్లలో ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ల అండర్-రిపోర్టింగ్ కారణంగా ఖజానాకు పన్ను నష్టం రూ .2,000 కోట్లు వాటిల్లినట్లు కేంద్రం లెక్కగట్టింది!. రెస్టారెంట్ కార్యకలాపాలను అన్రిజిస్ట్రర్ పద్ధతిలో నిర్వహించడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ట్యాక్స్ తక్కువే అయినా.. డెలివరీ వాల్యూమ్స్ ఎక్కువ కాబట్టి పన్ను ఎగవేత మొత్తం కూడా గణనీయమైనదిగా భావిస్తున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. అందుకే జీఎస్టీ విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. చదవండి: జొమాటో అతలాకుతలం -
షాకింగ్.. రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపిన స్విగ్గీ ఏజెంట్
గ్రేటర్ నోయిడా(లక్నో): స్విగ్గీకి చెందిన డెలివరీ ఏజెంట్ ఆర్డర్ సిద్ధం చేయడంలో ఆలస్యమైందని ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఓ రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి డెలివరీ ఏజెంట్ని గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘స్విగ్గీ ఏజెంట్ చికెన్ బిర్యానీ, పూరీ సబ్జీ ఆర్డర్ సేకరించడానికి ఓ రెస్టారెంట్కు వెళ్లాడు. బిర్యానీ సిద్ధంగా ఉన్నప్పటికీ రెస్టారెంట్లో పనిచేసే ఓ వ్యక్తి ఆర్డర్కు మరికొంత సమయం పడుతుందన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చదవండి: స్విగ్గీ న్యూ డెసిషన్... ఇవి కూడా డెలివరీ చేస్తుందట ఈ క్రమంలో రెస్టారెంట్ ఉద్యోగిని డెలివరీ ఏజెంట్ అసభ్యంగా దూషించాడు. కాగా రెస్టారెంట్ యజమాని సునీల్ అగర్వాల్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. అయితే డెలివరీ ఏజెంట్ అతని స్నేహితుడి సహాయంతో అతని తలపై కాల్చాడు’’ అని పోలీసులు తెలిపారు. రెస్టారెంట్ ఉద్యోగి, ఇతర సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. హత్యకు గురైన వ్యక్తిని సునీల్ అగర్వాల్గా గుర్తించారు. అతడు మిత్రా అనే నివాస సముదాయం లోపల ఓ రెస్టారెంట్ కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు. చదవండి: చికెన్.. చికెన్.. మటన్.. చికెన్ -
స్విగ్గీ న్యూ డెసిషన్... ఇవి కూడా డెలివరీ చేస్తుందట
హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ సిగ్గీ మరిన్ని సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఫుడ్ డెలివరీలో తన మార్క్ చూపించిన ఈ సంస్థ ప్రజలకు మరింతగా చేరువ అయ్యేలా ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకు తగ్గట్టే ఇటీవల భారీగా నిధుల సమీకరణ కూడా చేసింది. గ్రోసరీస్ ఫుడ్ డెలివరీ సర్వీసెస్కి సంబంధించి స్విగ్గీ మంచి పట్టు సాధించింది. జిల్లా కేంద్రాల నుంచి కాస్మాపాలిటన్ సిటీస్ వరకు డెలివరీ సర్వీసెస్లో దూసుకుపోతుంది. అయితే స్విగ్గీ వచ్చే ఆర్డర్లలో ఎక్కువ శాతం లంచ్, డిన్నర్కి సంబంధించినవే ఉంటున్నాయి. బ్రేక్ఫాస్ట్ టైంలో అంతగా డెలివరీ ట్రాఫిక్ ఉండటం లేదు. దీంతో ఉదయం సమయంలో కూడా సేవలు అందించేలా సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. కిరణా, పాలు, కూరగాయలు తదితర ఉదయాన్నే ఉపయోగించే సరుకులను కూడా డెలివరీ చేసేలా ప్లాన్ వేసింది. త్వరలోనే ఇన్స్టామార్ట్ పేరుతో గ్రోసరీస్ సేవలు అందివ్వనున్నట్టు స్విగ్గీ కో ఫౌండర్ శ్రీహర్ష తెలిపారు. దూకుడుగా కంపెనీ కార్యకలాపాలు విస్తరించేందుకు ఇటీవల స్విగ్గీ ఇన్వెస్టర్ల నుంచి 1.25 బిలియన్ డాలర్ల నిధులు సేకరించింది. వీటి సాయంతో మార్కెట్లో దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. మరోవైపు జోమాటో సైతం భారీగా నిధులు సేకరించి తమ సేవలను మరింతగా విస్తరించే పనిలో ఉంది. -
స్విగ్గీకి షాక్! రూ.4.50 జీఎస్టీకి... రూ.20వేల ఫైన్
పంచకుల(హర్యానా): ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీకి షాక్ తగిలింది! కస్టమర్ నుంచి అనుచితంగా పన్ను వసూలు చేశారంటూ వినియోగదారుల ఫోరం ఫైర్ అయ్యింది. అనవసరంగా పన్ను విధించినందుకు, వినియోగదారున్ని మానసిక వేధనకు గురి చేసినందుకు భారీగా ఫైన్ విధించింది. కన్సుమర్ గూడ్స్ యాక్ట్ 2006 హర్యానాలోని పంచకులకు చెందిన అభిషేక్ గార్గ్ స్విగ్గీ ద్వారా స్విగ్గీ మొబైల్యాప్ ద్వారా చీజ్ గార్లిక్ స్టిక్తో పాటు మూడు సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేశాడు. ఇందులో గార్లిక్ స్టిక్కి రూ. 144, కూల్డ్రింక్స్కి రూ.90లు అయ్యింది. అయితే బిల్ వచ్చిన తర్వాత పరిశీలిస్తే సాఫ్ట్డ్రింక్స్కి ప్రత్యేకంగా రూ. 4.50 జీఎస్టీగా స్విగ్గీ వసూలు చేసినట్టు గమనించాడు. కొనుగోలు చేసిన వస్తువులకు ఎంఆర్పీ చెల్లించిన తర్వాత ప్రత్యేకంగా కూల్డ్రింక్కి జీఎస్టీ వసూలు చేయడం కన్సుమర్ గూడ్స్ యాక్ట్ 2006 ప్రకారం చట్ట విరుద్ధమని పేర్కొంటూ పంచకుల వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. మా తప్పేం లేదు అయితే తాము కేవలం మధ్యవర్తులమేనని, సాఫ్ట్డ్రింక్ అమ్మకం దారు పాలసీకి అనుగుణంగానే జీఎస్టీ వసూలు చేశామని, తమ సేవల్లో లోపం లేదంటూ పేర్కొంది. అయితే స్విగ్గీ వాదనలు విన్న ఫోరం మండిపడింది. స్విగ్గీ ఏమీ ఛారిటబుల్ ట్రస్ట్ కాదని, వినియోగదారు, అమ్మందారుల మధ్యవర్తిగా ఉంటూ డెలివరీ పనులు నిర్వహిస్తోందని పేర్కొంది. రూ. 20,000 ఫైన్ కట్టండి చట్ట విరుద్ధంగా సాఫ్ట్డ్రింక్పై జీఎస్టీగా రూ. 4.50 వసూలు చేయడాన్ని తప్పు పట్టింది. అదనంగా వసూలు చేసిన రూ. 4.50 పైసలు 9 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు కోర్టు, ఇతర ఖర్చుకు గాను అభిషేక్ గార్గ్కి రూ. 10,000 చెల్లించాలంది. దీంతో పాటు జరిగిన పొరపాటుకు జరిమానాగా రూ. 10,000 హర్యాణా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ చైల్డ్ వేల్ఫేర్కి డిపాజిట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. -
ప్రముఖ హీరోయిన్కు చేదు అనుభవం.. భోజనంలో చచ్చిన బొద్దింక!
ప్రముఖ దక్షిణాది సినీ నటి నివేదా పేతురాజ్కు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం సాయంత్రం తను ఆర్డర్ చేసిన ఫుడ్లో చచ్చిన బొద్దిక వచ్చందంటూ సదరు రెస్టారెంట్పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆహరంలో ఉన్న బొద్దింక ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆ రెస్టారెంట్ పేరు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బుధవారం సాయంత్రం నివేదా చెన్నైలోని ఓ ఫేమస్ రెస్టారెంట్ నుంచి ప్రముఖ ఫుడ్డెలివరి యాప్ స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుంది. ఆర్డర్ రాగానే పార్శిల్ తెరిచి చూడగా అందులో చచ్చిన బొద్దింక దర్శనం ఇచ్చింది. దీంతో ఆమె మండిపడుతూ తన పోస్టులో ‘ప్రస్తుత రోజుల్లో స్విగ్గీ ఇండియా, ఆయా రెస్టారెంట్స్ ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నాయో అర్థం కావడం లేదు. నిన్న నేను ఆర్డర్ పెట్టుకున్న ఆహారంలో బొద్దింక వచ్చింది. ఇదేం తొలిసారి కాదు గతంలో కూడా ఇలాగే జరిగింది. ఇలాంటి రెస్టాంటెంట్స్ను రోజు తనిఖీ చేసి క్వాలిటీ లోపం ఉంటే భారీగా జరిమాన విధించడం చాలా అవసరం. ప్రస్తుతానికి అయితే ఈ రెస్టారెంట్పై ఓ కన్నేసి అది సరైన ప్రమాణాలను పాటిస్తుందో లేదో చెక్ చేయాలని కోరుకుంటున్న’ అంటూ ఆమె సదరు రెస్టారెంట్ పేరును ట్యాగ్ చేసిందే అంతేగాక తమ రెస్టారెంట్ల జాబితా నుంచి ఈ రెస్టారెంట్న తొలగించాల్సిందిగా స్విగ్గీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేసింది. చదవండి: ‘బంగార్రాజు’తో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ ! -
స్విగ్గీ డెలివరీ బాయ్ని చితకబాది.. నగదు చోరీ
బెంగళూరు: జొమాటో డెలివరీ బాయ్ సంఘటన మరువక ముందే కర్ణాటకలో అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. ఈ సారి బాధితుడు స్విగ్గీ డెలివరీ బాయ్. ఉచితంగా భోజనం ఇవ్వనన్నందుకు స్విగ్గీ డెలివరీ బాయ్ని నలుగురు యువకులు దారుణంగా చితకబాదారు. మే 28న చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. కార్తీక్ హరిప్రసాద్(25) అనే వ్యక్తి స్విగ్గీ డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత నెల 28న సాయంత్రం 4 గంటలకు రాజాజీనగర్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ క్రమంలో కార్తీక్ వారు ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకుని డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడు. అయితే ఆర్డర్ చేశాక సదరు వ్యక్తులు దాన్ని క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు. ఇక కార్తీక్ ఫుడ్ తీసుకెళ్లి వారికి ఇచ్చి.. డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరాడు. కానీ వారు తాము ఆర్డర్ క్యాన్సిల్ చేశామని.. ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కార్తీక్ అందుకు ఒప్పుకోలేదు. ఈ ఆహారాన్ని బయట ఆకలితో ఉన్న వారికి ఇస్తానని తెలిపాడు. ఈ క్రమంలో కార్తీక్కు, ఫుడ్ ఆర్డర్ చేసిన వారికి మధ్య వివాదం ముదిరింది. ఈ క్రమంలో నిందితులు కార్తీక్ను చితకబాది.. అతడి చేతిలో నుంచి మొబైల్, హెల్మెట్ లాక్కుని విసిరేశారు. ఆ తర్వాత అతడి వాలెట్ నుంచి 1800 రూపాయలు దొంగతనం చేశారు. కార్తీక్ తలపై రాళ్లతో కొట్టి.. రోడ్డు మీద పడేసి అక్కడ నుంచి పారిపోయారు. కార్తీక్ అదృష్టం కొద్ది వేరే డెలవరీ బాయ్స్ అతడిని గమనించి ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్ స్నేహితుడు ఒకరు జరిగిన సంఘటన గురించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. చాలా మంది నెటిజనులు కార్తీక్కు ధన సహాయం చేయడానిక ముందుకు వచ్చారు. ఈ సమయంలో తనకు మగాది రోడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చాలా సాయం చేశాడని.. తనతో నిరంతరం టచ్లో ఉన్నాడని తెలిపాడు. ఇక త్వరలోనే బెంగళూరుకు వచ్చి.. తన మీద దాడి చేసిన కస్టమర్ల మీద ఫిర్యాదు చేస్తానని తెలిపాడు కార్తీక్. స్విగ్గీ కంపెనీ సదరు కస్టమర్ల వివరాలు పోలీసులకు అందజేస్తుందన్నాడు. ఇక కంపెనీ, పోలీసులు తనకు మద్దతుగా నిలిచారని తెలిపాడు కార్తీక్. 4 CUSTOMERS BEAT UP DELIVERY EXECUTIVE! A delivery executive from #Swiggy was assaulted & left to bleed in #Bengaluru after customers refused to pay for food on May 28. 4 customers who failed to cancel the order, refused to pay which led to an argument.@NehaHebbs reports! pic.twitter.com/i4FkR4GCL0 — Mirror Now (@MirrorNow) June 8, 2021 చదవండి: ఆన్లైన్ మోసం.. బ్లూటూత్ బుక్ చేస్తే... స్విగ్గీ ఆర్డర్..ఇల్లు దోచేశారు! -
స్విగ్గీ.. జొమాటోకు షాక్.!
న్యూఢిల్లీ: జొమాటో.. స్విగ్గీ.. పట్టణ ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేనివి. కరోనా వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ల సేవలు మరింతగా విస్తరించాయి. వైరస్ కారణంగా ఎక్కువ మంది ఆహారం కోసం బయటకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆర్డర్ చేసి తెప్పించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే వీటి ప్రాచుర్యం మరింత పెరిగిపోయింది. ఈ పరిస్థితులను గమనించిన కొన్ని పెద్ద రెస్టారెంట్లు మనమే సొంతంగా ఎందుకు డెలివరీ చేయకూడదు? జొమాటో, స్విగ్గీలపై ఎంతకాలం ఆధారపడడం? అన్న ఆలోచనలకు వస్తున్నాయి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ)లో సభ్యత్వం కలిగిన కొన్ని రెస్టారెంట్లు డాట్పే, థ్రైవ్ వంటి టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని సొంతంగా ఆన్లైన్ ఆర్డర్ ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గూగుల్ సెర్చింజన్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపైనా ఆయా రెస్టారెంట్లు తమ ఆన్లైన్ ఆర్డర్ల లింక్లకు ప్రచారం కల్పించే మార్కెటింగ్ వ్యూహాలను కూడా అమలు చేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీలకు రెస్టారెంట్లు ప్రతీ ఆర్డర్పై ఇంత చొప్పున కమీషన్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఈ కమీషన్ 30 శాతం వరకు ఉంటుందని రెస్టారెంట్లు చెబుతున్నాయి. తామే సొంతంగా జొమాటో, స్విగ్గీ మాదిరిగా కస్టమర్లను చేరుకునే మార్గాలు తెలుసుకుంటే ఈ మేర కమీషన్ను ఆదా చేసుకోవచ్చని భావిస్తున్నాయి. ఎక్కువ మందిని చేరుకోవచ్చు.. ‘‘సాధారణంగా 7–10 కిలోమీటర్ల పరిధిలోనే అగ్రిగేటర్లు (స్విగ్గీ, జొమాటో తదితర) సేవలు అందించగలవు. సొంతంగా నెట్వర్క్ను కలిగి ఉంటే లేదా లాజిస్టిక్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే ఇంతకుమించిన దూరంలో ఉన్న కస్టమర్లను కూడా చేరుకునేందుకు వీలుంటుంది’’ అని దేవిదయాళ్ వివరించారు. హంగర్ హాస్పిటాలిటీ సైతం 80% ఆర్డర్లను సొంత ఆన్లైన్ ఆర్డర్ ప్లాట్ఫామ్ నుంచే సమకూర్చుకుంటోంది. ఈ సంస్థకు బాంబే క్యాంటీన్, ఓ పెడ్రో, బాంబే స్వీట్షాప్ తదితర బ్రాండ్లున్నాయి. థ్రైవ్ సాయంతో సొంతంగా ఆర్డర్లను స్వీకరించే టెక్నాలజీ ప్లాట్ఫామ్ను ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. సొంత డెలివరీ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని కస్టమర్లను చేరుకుంటోంది. ఈ సంస్థ ఇటీవలే రెండు ప్రత్యేకమైన బ్రాండ్లను ఆవిష్కరించింది. ఇవి స్విగ్గీ, జొమాటో ప్లాట్ఫామ్లపై అందుబాటులో ఉండవు. సొంత ప్లాట్ఫామ్పైనే వీటిని ఆఫర్ చేస్తోంది. ‘‘మార్కెటింగ్కు ఇన్స్ట్రాగామ్ సేవలను వినియోగిస్తున్నాం. దీర్ఘకాలం కోసం బ్రాండ్లను ఏర్పాటు చేసుకున్నాం కనుక మార్కెటింగ్ ఖర్చులు సహేతుకంగానే అనిపిస్తున్నాయి’’ అని సంస్థ వ్యవస్థాపకుడు యాష్ బనాజే చెప్పారు. ఢిల్లీకి చెందిన బిగ్ చిల్ కేఫ్ సైతం సొంతంగానే ఆన్ లైన్ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సేవలను అందిస్తోంది. కస్టమర్లు కోరుకున్న రుచులు రెస్టారెంట్లు సొంతంగానే ఆర్డర్లు తీసుకోవడం వల్ల కస్టమర్లకు ఇష్టమైన రుచులను అందించేందుకు వీలుంటుందని ఫుడ్మ్యాటర్స్ ఇండియా పార్ట్నర్ గౌరీదేవిదయాళ్ పేర్కొన్నారు. కస్టమర్లు కోరుకున్న ప్రత్యేకమైన రెసిపీలను తయారు చేసి డెలివరీ చేసేందుకు వీలుంటుందన్నారు. అదే జొమాటో, స్విగ్గీ ప్లాట్ఫామ్లపై ఇందుకు పరిమిత అవకాశమే ఉంటుందన్నది ఆయన విశ్లేషణ. -
స్విగ్గీలో సాఫ్ట్బ్యాంక్ భారీ పెట్టుబడులు!
సాక్షి, న్యూఢిల్లీ: ఫుడ్ ఆర్డర్లు, డెలివరీ సంస్థ స్విగ్గీలో గ్లోబల్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ ఇన్వెస్ట్ చేయనుంది. ఇందుకు రెండు సంస్థల మధ్య చర్చలు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. స్విగ్గీలో 45 కోట్ల డాలర్ల (రూ. 3,348 కోట్లు)ను ఇన్వెస్ట్ చేసే యోచనలో సాఫ్ట్బ్యాంక్ ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీల్తో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేశాయి. ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, అమన్సా క్యాపిటల్, థింక్ ఇన్వెస్ట్మెంట్స్, కార్మిగ్నాక్, గోల్డ్మన్ శాక్ 80 కోట్ల డాలర్లు(రూ. 5,862 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు ఇంతక్రితం స్విగ్గీ వెల్లడించింది. ఉద్యోగుల ద్వారా: కంపెనీ ఉద్యోగులకు వ్యవస్థాపక సీఈవో శ్రీహర్ష మాజేటి ఈ నెల మొదట్లో పంపిన ఈమెయిల్ ద్వారా స్విగ్గీ తాజా డీల్ వివరాలు వెల్లడైనట్లు తెలుస్తోంది. కాగా.. ప్రత్యర్థి సంస్థ జొమాటో ఈ ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూ చేపట్టే సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో స్విగ్గీ డీల్ అంశానికి ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
రోహిత్శర్మను ఇంతలా అవమానిస్తారా.. ‘స్విగ్గీ’పై ఫ్యాన్స్ ఫైర్
ముంబై: టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులు ఆన్లైన్ ఫుడ్డెలివరీ సంస్థ స్విగ్గీపై నిప్పులు చెరుగుతున్నారు. భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, లక్షలాది మంది యువకులకు ఆరాధ్య క్రికెటర్ అయిన హిట్మాన్ను ఇంతలా అవమానిస్తారా? అని మండిపడుతున్నారు. ‘‘ఈ అహంకారపూరిత ప్రవర్తనను సహించే ప్రసక్తే లేదు. మీకు తగిన శాస్తి చేస్తాం. ఇకపై మేము ఇలాంటి చెత్త ప్లాట్ఫాం నుంచి ఫుడ్ఆర్డర్ చేయబోం’’ అంటూ #BoycottSwiggy హాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో దిగివచ్చిన స్విగ్గీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తమకు ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదని రోహిత్ శర్మ ఫ్యాన్స్కు క్షమాపణలు చెప్పింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే... ఐపీఎల్-2021 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్ మధ్య మంగళవారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో రోహిత్ సేన కోల్కతాపై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, మ్యాచ్కు ముందు రోహిత్ను ఉద్దేశించి స్విగ్గీ ఓ ట్వీట్ చేసింది. హిట్మాన్ వడాపావ్ కోసం పరిగెత్తుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందుకు.. ‘‘తనను ద్వేషించే వాళ్లు దీనిని ఫొటోషాప్ చేసిందిగా చెబుతారు’’అంటూ క్యాప్షన్ జతచేసింది. దీంతో రోహిత్ ఫ్యాన్స్కు చిర్రెత్తికొచ్చింది. వెంటనే బాయ్కాట్ స్విగ్గీ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. కాగా, ఫిట్నెస్ విషయంలో రోహిత్ శర్మ గతంలో ఎన్నోసార్లు ట్రోలింగ్ బారిన పడిన సంగతి తెలిసిందే. ‘‘తనకు ఆట కంటే వడాపావ్ తినడమే ముఖ్యం’’ అంటూ కొంతమంది కామెంట్ చేయడం.. ఇప్పుడు స్విగ్గీ కూడా అదే తరహా ఫొటో షేర్ చేయడంతో అభిమానులు ఇలా ఆగ్రహానికి గురయ్యారు. దీంతో.. ‘‘హిట్మాన్ అభిమానులకు ఓ ప్రత్యేక సందేశం. సరదాగా ఓ ఫ్యాన్ షేర్ చేసిన ట్వీట్ను మేం రీపోస్ట్ చేశాం. ఆ ఫొటో మేం సృష్టించింది కాదు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం మాకు లేదు. మేం ఎల్లప్పుడూ పల్టన్తోనే ఉంటాం’’ అని స్విగ్గీ ట్విటర్ వేదికగా వివరణ ఇచ్చింది. #BoycottSwiggy 😠 this isn't funny @swiggy_in pic.twitter.com/cdWBp6V1ql — Abhijeet🥇 (@KING__Ro45) April 13, 2021 Shameless Big Apps can do for Publicity!😕 Running Agendas On Social Media, Defaming National Players.Huh! Should Issue Public Apology to Rohit Sharma...#BoycottSwiggy #RohitSharma pic.twitter.com/4OUoO0wTTz — Trishaᴶᵃˢᵐⁱⁿⁱᵃⁿ♡ (@Prettyxfollies_) April 13, 2021 Dear @swiggy_in disrespecting our national hero is not acceptable. Shameful act! Do apologies or will uninstall your App & #BoycottSwiggy RT pic.twitter.com/o5uGTOnzrv — Rajeev Rajput (@TheRoyalRaajput) April 13, 2021 A special message to the Hitman’s fans We reposted a fan’s tweet in good humour. While the image was not created by us, we do admit it could’ve been worded better. It was not meant to offend anyone in the least. Needless to say, we’re always with the Paltan. — Swiggy (@swiggy_in) April 13, 2021 -
కరోనా వ్యాప్తి: స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ బంద్
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ చేస్తుండడంతో మహారాష్ట్రలో మినీ లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు లాక్డౌన్ అమల్లో చేస్తున్నారు. ఇక వారాంతాల్లో (శని, ఆదివారం) పూర్తి లాక్డౌన్ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా అన్ని వ్యాపార కార్యకలాపాలు అందుకనుగుణంగా వాటి పనివేళలు మారుతున్నాయి. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా దానికి అనుగుణంగా పనివేళలు మార్చి వేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మహారాష్ట్రలో రాత్రి 8 గంటల తర్వాత తాము డెలివరీ చేయలేమని జొమాటో, స్విగ్గీ సంస్థలు నిర్ణయించాయి. వినియోగదారులు కూడా ఇదే విషయాన్ని తమకు విజ్ఞప్తులు చేశారని ఆ సంస్థలు తెలిపాయి. రాత్రి 8 నుంచి ఉదయం 7గంటల వరకు మినీ లాక్డౌన్ విధించడంతో ఈ మేరకు ఆయా సంస్థలు తమ సేవల సమయాన్ని కూడా మార్చేశాయి. ఈ మేరకు ఈ విషయాన్ని తమ వినియోగదారులకు యాప్లలో నోటిఫికేషన్ ద్వారా ఆ సంస్థలు తెలియజేశాయి. ఈ మారిన వేళల్లో భాగంగా ఉదయం 7 నుంచి రాత్రి 8గంటలలోపు మాత్రమే స్విగ్గీ, జొమాటో సంస్థలు ఆహారం అందించనున్నాయి. ఈ సందర్భంగా తాము వినియోగదారులు, తమ సంస్థ ఉద్యోగుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని, అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ డెలివరీ చేస్తున్నామని ఆ సంస్థలు తెలిపాయి. చదవండి: టిఫిన్ బాక్స్ బాంబు కలకలం -
గుడ్ న్యూస్ చెప్పిన ఫుడ్ డెలివరీ సంస్థ
సాక్షి, ముంబై: కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్ర్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు తమ సిబ్బంది అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. సంస్థకు చెందిన డెలివరీ పార్ట్నర్లు అందరికీ ఉచితంగా కరోనా టీకా అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు స్విగ్జీ సీఓఓ వివేక్ సుందర్ బుధవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ఉద్యోగుల కరోనా టీకా ఖర్చులను భరిస్తామని వెల్లడించారు. అలాగే ఆ టీకా స్వీకరణ నిమిత్తం సెలవు తీసుకుంటే ఆ రోజు జీతం కూడా చెల్లిస్తామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వీరికి టీకా కోసం తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని వివేక్ సుందర్ పేర్కొన్నారు. టీకాలు తీసుకోవడానికి ముందు తమ డెలివరీ భాగస్వాములకు వర్క్షాప్, కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా అవగాహన కల్పించనున్నామన్నారు. అలాగే తగిన జాగ్రత్తలను తెలియచెప్పేలా ఒక ఆరోగ్య భాగస్వామితో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్విగ్గీ తాజా నిర్ణయంతో సుమారు 2 లక్షల డెలివరీ పార్ట్నర్లకు ప్రయోజనం లభించనుంది. కాగా దేశవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 45 ఏళ్లు పైబడిన వారందరూ 2021 ఏప్రిల్ 1 నుంచి టీకా వేయించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement