-
సమీప భవిష్యత్తులో రూ.1.48 లక్షలకోట్ల షేర్లపై ప్రభావం..!
రానున్న 4 నెలల్లో రూ.1.48 లక్షల కోట్ల విలువైన 66 కంపెనీల షేర్లకు లాకిన్ గడువు ముగియనుంది. దీంతో ఈ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా కంపెనీలు స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అయితే సెబీ నిబంధనల ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడిపెట్టిన 90 రోజుల వరకు తమ షేర్లను అమ్మేందుకు వీలుండదు. ఆ లాకిన్ గడువు ముగిసిన తర్వాత వాటిని ఈక్విటీ మార్కెట్లో విక్రయించవచ్చు. గడిచిన కొద్దిరోజుల్లో టాటా టెక్నాలజీస్ వంటి ప్రముఖ కంపెనీలు సైతం ఐపీఓగా మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఆ ఒక్క కంపెనీ అనే కాకుండా మార్కెట్లో పేరున్న చాలా కంపెనీలు మంచి లిస్టింగ్గేయిన్స్తో స్టాక్మార్కెట్లో లిస్ట్అయ్యాయి. ఆ లాభాలంతా 90 రోజుల తర్వాత యాంకర్ ఇన్వెస్టర్ల పొందే వీలుంది. ఇదీ చదవండి: తగ్గనున్న పారుబాకీలు.. అధిక ఎన్పీఏలు ఉన్న రంగాలివే.. లాకిన్ గడువు పూర్తికానున్న షేర్లలో టాటా టెక్నాలజీస్, హోనాసా కన్జూమర్, సెల్లో వరల్డ్, జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఏప్రిల్ 1న గ్లోబల్ సర్ఫేసెస్, సాయి సిల్క్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికామ్ టెక్నాలజీస్ షేర్ల లాకిన్ ముగియనుంది. రానున్న 4 నెలల్లో దాదాపు 66 కంపెనీల లాకిన్ ముగుస్తుంది. దాంతో సుమారు రూ.1.48 లక్షలకోట్ల విలువైన షేర్లపై ప్రభావం పడనుంది. -
ఫేమస్ కంపెనీల మొదటిరోజు లాభాలు..(ఫొటోలు)
-
ఐపీఓకు రానున్న ప్రముఖ సంస్థ..?
ప్రముఖ సూపర్మార్కెట్ సంస్థగా విశాల్మార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రాబోతున్నట్లు తెలిసింది. విశాల్ మెగామార్ట్ 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్ల) నిధుల సమీకరణ కోసం తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రానుందని సమాచారం. విశాల్మార్కెట్ పలు నగరాల్లో 560 సూపర్మార్కెట్లు నిర్వహిస్తోంది. ఈ సంస్థ విలువను 5 బిలియన్ డాలర్లుగా (రూ.41,500 కోట్లు) పరిగణించి, ఐపీఓకు రావాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలిసింది. విశాల్ మెగామార్ట్లో స్విట్జర్లాండ్ పార్ట్నర్స్ గ్రూప్ పీజీహెచ్ఎన్.ఎస్, మన దేశానికి చెందిన కేదారా క్యాపిటల్కు కలిపి మెజార్టీ వాటా ఉంది. ఐపీఓలో ఈ రెండు సంస్థలు షేర్లు విక్రయిస్తాయని తెలుస్తోంది. ఇదీ చదవండి: కంపెనీని బురిడీ కొట్టించి గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే.. ఈ రెండు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు కలిపి విశాల్ మెగామార్ట్లో ఎంత వాటా కలిగి ఉన్నాయి? ఎంతమేరకు విక్రయిస్తాయనేది తెలియాల్సి ఉంది. విశాల్ మెగామార్ట్ సీఈఓ గుణేందర్ కపూర్ ఐపీఓ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. -
కోహ్లీ, అనుష్క శర్మల కంపెనీకి లైన్ క్లియర్
వ్యాపారవేత్తలే కాకుండా ప్రముఖులు సైతం కంపెనీలు స్థాపిస్తున్నారు. అందులో పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి అయ్యే మంచి బిజినెస్ మోడల్ ఉన్నవారికి ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. దాంతో ఇరువురికి లాభం జరిగేలా వ్యవహరిస్తున్నారు. అందులో కొన్ని కంపెనీలు మరింత వృద్ధి చెంది ఐపీవోగా స్టాక్మార్కెట్లోనూ లిస్ట్ అవుతున్నాయి. అలాంటి సంస్థ ‘గో డిజిట్’ ఐపీవోకు తాజాగా సెబీ ఆమోదం తెలిపింది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పెట్టుబడి పెట్టిన ‘గో డిజిట్’ ఐపిఓకి వెళ్లేందుకు లైన్క్లియర్ అయింది. అందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్లో ఇన్వెస్టర్ అయిన కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ గ్రూప్ కూడా మద్దతు తెలిపింది. ఆగస్టు 2022లో కంపెనీ ఐపీఓ కోసం ప్రిలిమినరీ పత్రాలను దాఖలు చేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) వివరాల ప్రకారం..గో డిజిట్ ఐపీఓలో రూ.1,250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా సమకూరే మూలధనాన్ని కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీవో ద్వారా నిధులు సేకరించేందుకు కంపెనీ మొదటగా ఆగస్టు 2022లో సెబీకు డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. అయినప్పటికీ, ఉద్యోగులకు సంబంధించి స్టాక్ అప్రిసియేషన్ రైట్స్ స్కీమ్లోని కొన్ని కారణాల వల్ల కొద్దికాలంపాటు నిలిచిపోయింది. సెబీ జనవరి 30, 2023న గో డిజిట్ డ్రాఫ్ట్ ఐపీఓ పేపర్లను తిరిగి ఇచ్చింది. కంపెనీ నుంచి మరింత సమాచారం కోరింది. ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ సవరించిన సమాచారంతో ఏప్రిల్ 2023లో ప్రిలిమినరీ ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అన్ని పరిశీలించిన సెబీ తాజాగా ఐపీవోకు లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. -
పెట్టుబడుల ఆశచూపి.. అందినకాడికి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్లో తాము చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. షేర్ల కొనుగోలు పేరిట అమాయకులకు గాలం వేసి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఈ తరహా ఐపీఓ ట్రేడింగ్ మోసాలు ఇటీవల పెరిగినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్)లను ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ కింద కొనుగోలు చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నట్టు పేర్కొంది. 2023లో ఈ తరహా కేసులు 627 నమోదు కాగా, బాధితులు రూ.3,91,54,683 పోగొట్టుకున్నట్టు టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాదిలో రెండు నెలల్లోనే మొత్తం 213 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.27,40,76,211 పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా మోసగిస్తున్నారు.. సైబర్ మోసగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా లింక్లు పంపుతున్నారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్పీఐ)ల వంటి ఇన్స్టిట్యూషనల్ విధానాల్లో ఐపీఓలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపితే, వారిని ఫేక్ ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు ప్రోత్సహించి తమ అదీనంలో ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకుంటారు. నకిలీ యాప్లో బోగస్ డ్యాష్ బోర్డులను సృష్టించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపుతున్నా రు. మరింత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయ ని నమ్మిస్తారు. బాధితులు చివరకు తమ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు మోసపోయిన విషయం తెలుస్తుంది. ఈ తరహా ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నా రు. ఒకవేళ తాము మోసపోయినట్టు గుర్తిస్తే బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీనంబర్లో లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. -
నేటి నుంచి 3 ఐపీవోలు
న్యూఢిల్లీ: నేటి(బుధవారం) నుంచి మూడు కంపెనీల పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం(9న) ముగియనున్న ఇష్యూల జాబితాలో రాశి పెరిఫెరల్స్, జానా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఉమ్మడిగా సుమారు రూ. 1,700 కోట్లు సమీకరించనున్నాయి. ప్రస్తుతం ద పార్క్ బ్రాండ్తో హోటళ్లను నిర్వహిస్తున్న ఏపీజే సురేంద్ర పార్క్ రూ. 920 కోట్లు అందుకునేందుకు పబ్లిక్ ఇష్యూకి తెరతీసిన సంగతి తెలిసిందే. వీటికి అదనంగా ఎంటెరో హెల్త్కేర్ సొల్యూషన్స్ ఈ నెల 9న ఐపీవోకు రానుంది. తద్వారా రూ. 1,600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. ఈ బాటలో గత నెలలోనూ ఐదు కంపెనీలు స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ ద్వారా ఉమ్మడిగా రూ. 3,266 కోట్లు సమకూర్చుకోవడం ప్రస్తావించదగ్గ అంశం! రాశి వివరాలిలా.. ఐపీవోలో భాగంగా ఐటీ, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ప్రొడక్టుల పంపిణీ సంస్థ రాశి పెరిఫెరల్స్ పూర్తిగా ఈక్విటీ జారీని చేపట్టనుంది. మొత్తం రూ. 600 కోట్ల విలువైన షేర్లను జారీ చేయడం ద్వారా అంతేమేర నిధులు సమకూర్చుకోనుంది. ఇందుకు రూ. 295–311 ధరల శ్రేణిని ప్రకటించింది. ఐపీవో నిధులలో రూ. 326 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 220 కోట్లు వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. జానా స్మాల్ తీరిదీ పీఈ దిగ్గజాలు టీపీజీ, మోర్గాన్ స్టాన్లీలకు పెట్టుబడులున్న జానా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఐపీవో ద్వారా రూ. 462 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో రూ. 108 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. మొత్తం రూ. 574 కోట్ల సమీకరణపై కన్నేసిన కంపెనీ రూ. 393–414 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా మూలధన పటిష్టతకు, కనీస మూలధన నిష్పత్తి మెరుగుకు వినియోగించనుంది. క్యాపిటల్ స్మాల్ రెడీ ఐపీవోలో భాగంగా క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 450 కోట్ల విలువైన ఈక్విటీని జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 73 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ చేయనున్నారు. తద్వారా రూ. 523 కోట్లు అందుకోనుంది. ఇందుకు రూ. 445–468 ధరల శ్రేణిని ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను భవిష్యత్ అవసరాలరీత్యా టైర్–1 మూలధన పటిష్టతకు కేటాయించనుంది. -
Hyundai IPO: ఐపీవో బాటలో హ్యుందాయ్.. రూ.27500 కోట్ల సమీకరణ!
న్యూఢిల్లీ: ఆటో రంగ దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. దేశీ అనుబంధ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్)ను స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్ చేయడం ద్వారా కనీసం 3.3 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 27,500 కోట్లు) సమీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా కార్ల తయారీకి అతిపెద్ద కంపెనీలలో మారుతీ సుజుకీ ఇండియా తదుపరి రెండో ర్యాంకులో నిలుస్తున్న హెచ్ఎంఐఎల్.. ఐపీవో ద్వారా 15–20 శాతం వాటాను విక్రయించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి 3.3–5.6 బిలియన్ డాలర్లు సమీకరించవచ్చని అంచనా వేశాయి. అంచనాలకు అనుగుణంగా హెచ్ఎంఐఎల్ పబ్లిక్ ఇష్యూకి వస్తే బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ రికార్డును అధిగమించే వీలుంది. రూ. 21,000 కోట్ల సమీకరణ చేపట్టిన ఎల్ఐసీ ఇష్యూ.. అతిపెద్ద ఐపీవోగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాలపై కంపెనీ ప్రతినిధులు స్పందించకపోవడం గమనార్హం! దేశీయంగా 1996లో హెచ్ఎంఐఎల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం విభిన్న విభాగాలలో 13 రకాల మోడళ్ల కార్లను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా 1,366 అమ్మకాల ఔట్లెట్లు, 1,549 సర్వీసు పాయింట్లను కలిగి ఉంది. -
ఐపీవోకు 4 కంపెనీలు రెడీ
న్యూఢిల్లీ: ఇటీవల కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్లో మరో నాలుగు కంపెనీలు సందడి చేయనున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతులు పొందాయి. ఈ జాబితాలో ఎంటెరో హెల్త్కేర్ సొల్యూషన్స్, జేఎన్కే ఇండియా, ఎక్సికామ్ టెలీసిస్టమ్స్, అక్మే ఫిన్ట్రేడ్(ఇండియా) చేరాయి. 2023 జూన్– అక్టోబర్ మధ్య కాలంలో ఈ నాలుగు కంపెనీలు సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. కాగా.. స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ ఐపీవో దరఖాస్తును మాత్రం సెబీ తిప్పిపంపింది. వివరాలు చూద్దాం.. ఎంటెరో హెల్త్కేర్.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు వీలుగా ఎంటెరో హెల్త్కేర్ సొల్యూషన్స్ సెబీ నుంచి గ్రీన్సిగ్నల్ను అందుకుంది. ఐపీవోలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం వీటికి జతగా మరో 85.57 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఎంటెరో హెల్త్ను 2018లో ప్రభాత్ అగర్వాల్, ప్రేమ్ సేథీ ఏర్పాటు చేశారు. జేఎన్కే ఇండియా పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించేందుకు జేఎన్కే ఇండియా సెబీ నుంచి అనుమతి పొందింది. ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం వీటికి జతగా మరో 84.21 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. అక్మే ఫిన్ట్రేడ్ ఐపీవోలో భాగంగా అక్మే ఫిన్ట్రేడ్(ఇండియా) 1.1 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఎక్సికామ్టెలీ టెలికం రంగ కంపెనీ ఎక్సికామ్ టెలీసిస్టమ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు సిద్ధపడుతోంది. దీనిలో భాగంగా రూ. 400 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 74 లక్షల షేర్లను ప్రమోటర్ సంస్థ నెక్ట్స్వేవ్ కమ్యూనికేషన్స్ విక్రయానికి ఉంచనుంది. ప్రస్తుతం నెక్ట్స్వేవ్కు కంపెనీలో 71.45 శాతం వాటా ఉంది. ఈక్విటీ జారీ నిధులను తెలంగాణలోని తయారీ యూనిట్లో ప్రొడక్షన్ లైన్ల ఏర్పాటుకు వినియోగించనుంది. మరికొన్ని నిధులను పరిశోధన, అభివృద్ధి, ప్రొడక్ట్ డెవలప్మెంట్, రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది. -
త్వరలో ఐపీవోకి.. అంతలోనే రూ.300 కోట్ల షేర్లు అమ్ముకున్న సీఈవో..
పిల్లల దుస్తులు, ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫస్ట్క్రై’ (FirstCry) త్వరలో ఐపీవోకి రానుంది. అంతలోనే ఈ కంపెనీ సీఈవో దాదాపు రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నారు. కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) ప్రకారం.. ఫస్ట్క్రై సీఈవో సుపమ్ మహేశ్వరి ఐపీవో కోసం పత్రాలను సమర్పించడానికి పది రోజుల ముందు కంపెనీకి చెందిన 6.2 మిలియన్ షేర్లను విక్రయించారు. ఒక్కొక్కటి రూ.487.44 ధరతో మొత్తం రూ.300 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. సీఈవో సుపమ్ మహేశ్వరి పబ్లిక్ ఇష్యూలో సెల్లింగ్ షేర్హోల్డర్గా కూడా నమోదు చేసుకున్నారని మనీకంట్రోల్ నివేదించింది. 6.2 మిలియన్లకు పైగా షేర్లను ఆఫ్లోడ్ చేయడానికి ముందు, సుపమ్ మహేశ్వరి కంపెనీలో 7.46 శాతం వాటాను (35,097,831 షేర్లు) కలిగి ఉన్నారు. ఇప్పుడు కంపెనీలో ఆయన వాటా 5.95 శాతానికి (28,893,347 షేర్లు) తగ్గింది. ఐపీవోకి వచ్చే నాటికి ఫస్ట్క్రై కంపెనీ విలువ 3.5 నుంచి 3.75 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. అయితే ఐపీవో తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఫస్ట్క్రై సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన సుపమ్ మహేశ్వరి అహ్మదాబాద్ ఐఐఎం నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందారు. బ్రెయిన్వీసా అనే కంపెనీతో తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన పిల్లల ఉత్పత్తుల విక్రయ సంస్థలు పరిమితంగా ఉన్నాయని గ్రహించి 2010లో అమితవ సాహాతో కలిసి ఫస్ట్క్రై కంపెనీని స్థాపించారు. ఇందులో మహీంద్ర అండ్ మహీంద్ర, సాఫ్ట్ బ్యాంక్ వంటివి కూడా పెట్టుబడులు పెట్టాయి. -
పెట్టుబడి దారులకు శుభవార్త!. టాటా గ్రూప్ నుంచి ఐపీఓకి మరో సంస్థ
పెట్టుబడి దారులకు శుభవార్త. ప్రముఖ దేశీయ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ నుంచి మరో సంస్థ ఐపీఓకి రానుంది. ఇటీవల టాటాగ్రూప్ 20 ఏళ్ల తర్వాత టాటా టెక్నాలజీస్ ఐపీఓకి వచ్చింది. దాదాపు 2 దశాబ్ధాల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ రావడంపై మదుపర్లు ఆసక్తి చూపించారు. ఇప్పుడు వారి ఆసక్తిని మరింత రెట్టింపు చేసేలా టాటా గ్రూప్లో భాగమైన టాటా ఆటోక్యాప్ సిస్టమ్ (టీఏసీఓ) ఐపీఓకి తెచ్చేలా టాటా గ్రూప్ ఆ సంస్థతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టాటా ఆటోక్యాప్ సిస్టమ్ సంస్థ వాహనాల తయారీకి కావాల్సిన విడి భాగాల్ని తయారు చేస్తుంది. ఈ సంస్థను ఐపీఓ తెచ్చే యోచనలో ట్రాప్ గ్రూప్ ఉంది. ప్రస్తుతం అవి ప్రారంభ దశలో ఉన్నాయి. 1995లో టీఏసీఓని టాటా గ్రూప్ నిర్మించింది. ఇందులో టాటా సన్స్ 21 శాతం వాటా ఉండగా.. మిగిలిన మొత్తం టాటా ఇండస్ట్రీస్కి ఉంది. -
కొత్త ఏడాది మొదలవనున్న పబ్లిక్ ఇష్యూలు..
కొద్ది నెలలుగా దుమ్ము రేపుతున్న ప్రైమరీ మార్కెట్ ప్రభావంతో మూడు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు సిద్ధపడుతున్నాయి. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి రెండు కంపెనీలు ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. సోలార్ ఈపీసీ కంపెనీ రేస్ పవర్ ఇన్ఫ్రా, సమీకృత ఐటీ సొల్యూషన్లు అందించే ఎస్కోనెట్ టెక్నాలజీస్ తాజాగా సెబీని ఆశ్రయించాయి. ఈ బాటలో ఇన్సులేటెడ్ వైర్లు, స్ట్రిప్స్ తయారీ కంపెనీ డివైన్ పవర్ ఎనర్జీ సైతం స్టాక్ ఎక్ఛ్సెంజీలలో లిస్టింగ్పై కన్నేసింది. ఆ వివరాలు చూద్దాం.. రేస్ పవర్ ఇన్ఫ్రా సోలార్ ఈపీసీ కంపెనీ రేస్ పవర్ ఇన్ఫ్రా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్కు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు ఐపీవోను చేపట్టనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 29.95 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. ఐపీవోకంటే ముందుగానే షేర్ల జారీ లేదా ప్రమోటర్లు 14.97 లక్షల షేర్లను ఆఫర్ చేయడం ద్వారా రూ. 45 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇది జరిగితే ఆమేర ఈక్విటీ జారీ తగ్గనుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. షేర్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్ట్కానున్నాయి. కంపెనీ ప్రధానంగా సోలార్ విభాగంలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్(ఈపీసీ) సరీ్వసులను అందిస్తోంది. 1,207 మెగావాట్ల పీక్ పవర్ ప్రాజెక్టుల అభివృద్ధి ద్వారా కంపెనీ దేశీయంగా సోలార్ విభాగంలోని లీడింగ్ కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. గతేడాది(2022–23) మొత్తం ఆదాయం రూ. 891 కోట్లకు చేరగా.. నికర లాభం రూ. 131 కోట్లను అధిగమించింది. ఎస్కోనెట్ టెక్నాలజీస్ ఐటీ రంగంలో సమీకృత సరీ్వసులందిస్తున్న ఎస్కోనెట్ టెక్నాలజీస్ ఐపీవో ద్వారా నిధుల సమీకరణ ప్రణాళికలకు తెరతీసింది. దీనిలో భాగంగా రూ. 10 ముఖ విలువగల 33,60,000 షేర్లను కొత్తగా జారీ చేయనుంది. ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్ఫామ్ ద్వారా కంపెనీ లిస్ట్కానుంది. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలతోపాటు.. పూర్తి అనుబంధ సంస్థ జీక్లౌడ్ సరీ్వసెస్ విస్తరణ వ్యయాలకు వినియోగించనుంది. అంతేకాకుండా మరికొన్ని నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకూ వెచి్చంచనున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. 2012లో ఏర్పాటైన కంపెనీ హైఎండ్ సూపర్ కంప్యూటింగ్ సొల్యూషన్స్, డేటా సెంటర్ సౌకర్యాలు, స్టోరేజీ సర్వర్లు, నెట్వర్క్ సెక్యూరిటీ, డేటా ప్రొటెక్షన్ తదితరాలను సమకూర్చుతోంది. గ్లోబల్ దిగ్గజాలు ఏఎండీ, అమెజాన్ వెబ్ సరీ్వసెస్, సిస్కో, డెల్ టెక్నాలజీస్, హెచ్పీ, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా సాంకేతిక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్లు ప్రాస్పెక్టస్లో పేర్కొంది. రక్షణ శాఖ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, ఐఐటీ, భారత్ ఎలక్ట్రానిక్స్ తదితరాలు క్లయింట్లుగా ఉన్నట్లు తెలియజేసింది. డివైన్ పవర్ ఎనర్జీ ఇన్సులేటెడ్ వైర్లు, స్ట్రిప్స్ తయారీ కంపెనీ డివైన్ పవర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉంది. తద్వారా సమకూర్చుకున్న నిధులతో సామర్థ్య విస్తరణ చేపట్టాలని ప్రణాళికలు వేసింది. తాజా పెట్టుబడుల వినియోగంతో 2026కల్లా రూ. 400 కోట్ల టర్నోవర్ను సాధించాలని ఆశిస్తోంది. వెరసి ఈ ఫిబ్రవరి లేదా మార్చికల్లా ఐపీవో చేపట్టే ప్రణాళికల్లో ఉంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యంతో సాగుతోంది. దీంతో 2025కల్లా ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తోంది. ప్రస్తుత రూ. 150 కోట్ల టర్నోవర్ను తొలుత రూ. 300 కోట్లకు, ఆపై రూ. 400 కోట్లకు పెంచుకునే ప్రణాళికలు అమలు చేయనుంది. కంపెనీ పేపర్ కవర్డ్, డబుల్ కాటన్ కవర్డ్ కండక్టర్లు, ఫైబర్గ్లాస్ ఇన్సులేషన్, సూపర్ ఎనామిల్డ్ ఇన్సులేషన్లను రూపొందిస్తోంది. వీటిని ప్రధానంగా ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు తదితర ఎలక్ట్రికల్ పరికరాలలో వినియోగిస్తారు. ఘజియాబాద్లో 40,000 చదరపు అడుగులలో విస్తరించిన తయారీ యూనిట్ ద్వారా రూపొందించిన ప్రొడక్టులను టాటా పవర్, బీఎస్ఈఎస్సహా పలు ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలకు అందిస్తోంది. నాల్కో, బాల్కో, హిండాల్కో నుంచి ముడిసరుకులను పొందుతోంది. -
ఎస్ఎంఈ ఐపీవోల దూకుడు
కొద్ది రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్ల ప్రధాన ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను తాకుతున్నాయి. తాజాగా ఇటు సెన్సెక్స్ 72,000 పాయింట్ల మైలురాయిని చేరగా.. పోటీగా అటు నిఫ్టీ 22,000 పాయింట్ల మార్క్వైపు కదులుతోంది. ఇటీవల ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఉత్సాహం చూపుతుండటంతో ప్రధాన ప్రైమరీ మార్కెట్ పలు ఐపీవోలతో కళకళలాడుతోంది. ఈ ప్రభావంతో చిన్న, మధ్యతరహా కంపెనీలు(ఎస్ఎంఈ) సైతం లిస్టింగ్కు క్యూ కడుతున్నాయి. వెరసి ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలు వెల్తువెత్తుతున్నాయి. దీంతో 2023లో సరికొత్త రికార్డుకు తెరలేచింది. వివరాలు చూద్దాం.. ముంబై: ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూల విభాగం దూకుడు చూపుతోంది. ఇప్పటివరకూ 166 కంపెనీలు ఐపీవోలను పూర్తి చేసుకున్నాయి. బ్రోకింగ్ సంస్థ ఫైయర్స్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం రూ. 4,472 కోట్లు సమీకరించాయి. ఇది సరికొత్త రికార్డ్కాగా.. ఇంతక్రితం 2022లో 109 ఎస్ఎంఈలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. మొత్తం రూ. 1,980 కోట్లు సమకూర్చుకున్నాయి. కాగా.. ఈ ఏడాది ఐపీవోకి వచ్చిన 166 సంస్థలలో 136 లాభాలతో లిస్టయ్యాయి. వీటిలో 24 ఎస్ఎంఈలు లిస్టింగ్ రోజున ఏకంగా 100 శాతం లాభాలను సాధించాయి. జాబితాలో గోయల్ సాల్ట్ 258 శాతం దూసుకెళ్లి టాప్ ర్యాంకును కైవసం చేసుకుంది. ఈ బాటలో సన్గార్నర్ ఎనర్జీస్ 216 శాతం, బేసిలిక్ ఫ్లై 193 శాతం జంప్చేసి తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. ఇన్వెస్టర్ల క్యూ ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూలకు ఇన్వెస్టర్లు క్యూ కడుతున్నారు. ఈ ఏడాది లిస్టయిన సంస్థలలో 51 ఇష్యూలు 100 రెట్లుపైగా సబ్ర్స్కిప్షన్ను సాధించాయి. మరో 12 ఐపీవోలు ఏకంగా 300 రెట్లు అధికంగా డిమాండును అందుకున్నాయి. ఫైయర్స్ వివరాల ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్లు చరిత్రాత్మక స్థాయిలో ఆసక్తి చూపుతున్నారు. అంతగా ప్రసిద్ధంకాని చాలా కంపెనీల ఇష్యూలలో సైతం రిటైలర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. వెరసి స్పందనలో గత రికార్డులను తుడిచిపెడుతున్నారు. అయితే ఇకపై రానున్న ఐపీవోల విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించవలసి ఉన్నట్లు ఫైయర్స్ పేర్కొంది. మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్త వహించవలసిందిగా సూచిస్తోంది. ఈ స్పీడ్ దీర్ఘకాలం కొనసాగకపోవచ్చని అభిప్రాయపడింది. కొన్ని కంపెనీల షేర్లు దూకుడు చూపుతున్నప్పటికీ ఆర్థిక పనితీరు ఆ స్థాయిలో ఉండటంలేదని ప్రస్తావిస్తోంది. వెరసి చిన్న ఇన్వెస్టర్లకు బహుపరాక్ చెబుతోంది! జోరు తీరిదీ.. బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా లిస్టయిన సంస్థలలో గోయల్ సాల్ట్ ముందునిలవగా.. లిస్టింగ్ రోజు భారీ లాభాలు ఆర్జించిన ఐపీవోల జాబితాలో పలు సంస్థలు చోటు సాధించాయి. వీటిలో సన్గార్నర్ ఎనర్జీస్(216 శాతం), బేసిలిక్ ఫ్లై స్టుడియో(193 శాతం), స్(216 శాతం), ఓరియానా పవర్(169 శాతం), ఏనియన్ టెక్ సొల్యూషన్స్(164 శాతం), సీపీఎస్ షేపర్స్(155 శాతం), శ్రీవారి స్పైసెస్(154 శాతం), ఇన్ఫోలియన్ రీసెర్చ్(142 శాతం), రాకింగ్డీల్స్ సర్క్యులర్(125 శాతం), నెట్ ఎవెన్యూ టెక్(122 శాతం), పారగాన్ ఫైన్ ఎస్(114 శాతం), విన్యాస్ ఇన్నొవేటివ్ టెక్(110 శాతం), కృష్ణా స్ట్రాపింగ్(109 శాతం), సార్ టెలివెంచర్(101 శాతం), ఇన్నోకయిజ్ ఇండియా(100 శాతం) తదితరాలున్నాయి. -
ముత్తూట్ మైక్రోఫిన్ నేలచూపు.. ఐపీఓలో మదుపర్లకు నిరాశ
ఇటీవలే పబ్లిక్ ఇష్యూకి వచ్చిన ముత్తూట్ పాపచన్ గ్రూప్ అనుబంధ సంస్థ ముత్తూట్ మైక్రోఫిన్ లిమిటెడ్ లిస్టింగ్లో ఇన్వెస్టర్లను నిరాశ పరచింది. ఇష్యూ ధర రూ. 291తో పోలిస్తే బీఎస్ఈలో 4.5 శాతం తక్కువగా రూ. 278 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 9 శాతంవరకూ పతనమై రూ. 265 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 8.5 శాతం నష్టంతో రూ. 266 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 5.4 శాతం డిస్కౌంట్తో రూ. 275 వద్ద లిస్టయ్యింది. చివరికి 8.6 శాతం క్షీణతతో రూ. 266 వద్ద నిలిచింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 4,539 కోట్లుగా నమోదైంది. 11 రెట్లుపైగా స్పందన లభించిన ఐపీవో ద్వారా కంపెనీ రూ. 960 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. ముత్తూట్ ఫిన్కార్ప్ ప్రమోట్ చేసిన కంపెనీ ప్రధానంగా మైక్రోఫైనాన్స్ సరీ్వసులు అందిస్తోంది. -
ఫస్ట్క్రైలో సాఫ్ట్బ్యాంక్ వాటాల విక్రయం
న్యూఢిల్లీ: త్వరలో ఐపీవోకి రానున్న రిటైల్ సంస్థ ఫస్ట్క్రైలో జపాన్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ 310 మిలియన్ డాలర్ల విలువ చేసే షేర్లను విక్రయించింది. రెండు విడతల్లో షేర్లను విక్రయించగా, కొందరు అత్యంత సంపన్న ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్స్తో ఫస్ట్క్రై వేల్యుయేషన్ను 3.5–3.75 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టినట్లు పేర్కొన్నాయి. 900 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో ఫస్ట్క్రైలో సాఫ్ట్బ్యాంక్ గతంలో 400 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. తాజా విక్రయానంతరం కంపెనీలో సాఫ్ట్బ్యాంక్కు ఇంకా 800–900 మిలియన్ డాలర్ల విలువ చేసే వాటాలు ఉన్నాయి. వీటిని తర్వాత విక్రయించే యోచనలో ఉంది. మొత్తం మీద ఫస్ట్క్రైలో పెట్టుబడుల ద్వారా 1.3 బిలియన్ డాలర్లు ఆర్జించడంపై సాఫ్ట్బ్యాంక్ దృష్టి పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. -
ఈవారం ఐపీఓకు రానున్న కంపెనీలు ఇవే!
న్యూఢిల్లీ: స్టీల్ ప్రొడక్టుల తయారీ కంపెనీ శ్రీ బాలాజీ వాల్వ్ కంపోనెంట్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 27న ప్రారంభంకానుంది. 29న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి షేరుకి రూ. 95–100గా ప్రకటించింది. ఆఫర్లో భాగంగా 21.6 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 21.6 కోట్లు సమీకరించనుంది. కంపెనీ షేర్లు బీఎస్ ఈ ఎస్ఎంఈ ప్లాట్ఫామ్ ద్వారా లిస్ట్కానున్నాయి. ఇష్యూ నిధులను పెట్టుబడి వ్యయాలు, అదనపు ప్లాంట్లు, మెషీన్ల ఏర్పాటు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వెచి్చంచనుంది. విద్యుత్, నిర్మాణం, చమురుగ్యాస్, ఫార్మా రంగాలలో వినియోగించే వాల్వ్ సంబంధ పరికరాలను కంపెనీ రూపొందిస్తోంది. ఆఫిస్ స్పేస్ లిస్టింగ్ బాట ఇటీవల పలు పబ్లిక్ ఇష్యూలతో కళకళలాడుతున్న ప్రైమరీ మార్కెట్ మరింత జోరు చూపనుంది. తాజాగా ఆఫిస్ స్పేస్ సొల్యూషన్స్, గ్రేటెక్స్ షేర్ బ్రోకింగ్ లిస్టింగ్ సన్నాహాలు ప్రారంభించాయి. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి తాజాగా ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ స్పేస్ సొల్యూషన్స్ అందించే ఆఫీస్ స్పేస్ ఇష్యూలో భాగంగా రూ. 160 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో కోటి ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు ఆఫర్ చేయనున్నారు. గ్రేటెక్స్ షేర్ బ్రోకింగ్ రెడీ స్టాక్ మార్కెట్ సంబంధ సరీ్వసులందించే గ్రెటెక్స్ షేర్ బ్రోకింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు సెబీకి ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. వీటి ప్రకారం కంపెనీ 1.67 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 30.96 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. మార్కెట్ మేకింగ్, స్టాక్ బ్రోకింగ్, క్యాపిటల్ మార్కెట్ ఆఫర్లకు అండర్ రైటింగ్, ఎన్ఎస్డీఎల్కు డిపాజిటరీ పారి్టసిపెంట్లుగా సరీ్వసులు సమకూర్చుతోంది. -
ఈ ఏడాది దుమ్మురేపిన టాప్ ఐపీవోలు ఇవే..
కంపెనీ స్థాపించి దాన్ని స్టాక్మార్కెట్లో లిస్ట్ చేయాలంటే 20 ఏళ్ల కింద పెద్ద సాహసంతో కూడిన వ్యవహారం. కానీ పెరుగుతున్న సాంకేతికత, నైపుణ్యాల అభివృద్ధితో మంచి బిజినెస్ మోడల్ ఐడియా ఉంటే ప్రస్తుతం కోటీశ్వరులుగా మారొచ్చు. మంచి కంపెనీని స్థాపించి ఆర్థికంగా ఎదుగుతూ, వారిని నమ్ముకున్న ముదుపర్లను సైతం ఎదిగేలా చేయొచ్చని చాలా మంది నిరూపిస్తున్నారు. అయితే 2023లో అలాంటి మంచి బిజినెస్ మోడల్ ఐడియాతో మార్కెట్లో లిస్ట్అయి ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించిన కొన్ని టాప్ ఐపీఓల గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీవోలు మంచి లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. అందులో అధిక రాబడులను అందించిన టాప్ ఐపీవోల జాబితాలో.. ఐఆర్ఈడీఏ, సియెట్ డీఎల్ఎం, టాటా టెక్నాలజీస్, సెన్కో గోల్డ్ వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే మంచి లాభాలను అందించాయి. ఇన్వెస్టర్లకు అధిక లాభాలు మిగిల్చిన ఐపీఓ లిస్ట్లో టాప్లో ఇండియన్ రెన్యూవెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్(ఐఆర్ఈడీఏ) నిలిచింది. నవంబర్లో ఈ కంపెనీ రూ.32 ఇష్యూ ధరతో ఐపీఓగా మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం రూ.109 వద్ద ఈ కంపెనీ షేర్ ట్రేడవుతోంది. పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించిన ఐపీవోగా ఈ ఏడాది సియెంట్ టీఎల్ఎం నిలిచింది. జూలై 10న మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 58 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆ తర్వాత సైతం ఐపీవో తన పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. ఐపీవో ఇష్యూ ధర రూ.265గా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.778.90గా ఉంది. ఇదీ చదవండి: ఉంటుందో..? ఊడుతుందో..? ఇక మంచి రాబడులను అందించిన జాబితాలో టాటా టెక్నాలజీస్ ఐపీవో మూడో స్థానంలో నిలిచింది. ఐపీవో 140 శాతం ప్రీమియం ధరకు లిస్టింగ్ గెయిన్స్తో బీఎస్ఈలో రూ.1199.95 వద్ద మార్కెట్లోని అడుగుపెట్టింది. తరువాతి స్థానంలో సెన్కో గోల్డ్ నిలిచింది. జులైలో ఈ కంపెనీ ఐపీగా లిస్ట్ అయింది. వాస్తవానికి కంపెనీ షేర్ల ప్రైస్ బ్యాండ్ రూ.301-రూ.317గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ రూ.725 వద్ద ట్రేడవుతుంది. -
3 ఐపీవోలకు సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల లిస్టింగ్ ప్రణాళికలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్, బీఎల్ఎస్ ఈసర్వీసెస్, పాప్యులర్ వెహికల్స్ చేరాయి. పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు ఈ మూడు కంపెనీలూ సెబీకి ఆగస్ట్– అక్టోబర్ మధ్య కాలంలో ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. తాజాగా అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం.. రూ. 1,000 కోట్లు ఐపీవోలో భాగంగా జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేసే యోచనలో ఉంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్(సీఎన్సీ) మెషీన్లను తయారు చేస్తోంది. జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ విభిన్న రంగాల నుంచి కస్టమర్లను కలిగి ఉంది. 2.41 కోట్ల షేర్లు పబ్లిక్ ఇష్యూలో భాగంగా బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్ 2.41 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఇష్యూ నిధులను టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పటిష్టపరచుకోవడం, నూతన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం, ప్రస్తుతమున్న ప్లాట్ఫామ్స్ను కన్సాలిడేట్ చేసుకోవడం తదితర కార్యకలాపాలకు వినియోగించనుంది. అంతేకాకుండా బీఎల్ఎస్ స్టోర్ల ఏర్పాటు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం వెచ్చించనుంది. వీసా, కాన్సులర్ సర్వీసులందించే బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సరీ్వసెస్కు ఇది అనుబంధ కంపెనీ. రూ. 250 కోట్ల ఈక్విటీ ఆటోమోటివ్ డీలర్షిప్స్ కంపెనీ పాప్యులర్ వెహికల్స్ అండ్ సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 1.42 కోట్ల షేర్లను బన్యన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్–2 ఎల్ఎల్సీ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. ఆటో దిగ్గజాలు మారుతీ, హోండా, జేఎల్ఆర్ ప్యాసింజర్ వాహనాల డీలర్ షిప్స్ నిర్వహిస్తోంది. టాటా మోటార్స్ వాణిజ్య వాహన డీలర్ షిప్స్ను సైతం కలిగి ఉంది. -
ఐపీవో బాటలో ఓలా, ఫస్ట్క్రై
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఓలా, ఈకామర్స్ సంస్థ ఫస్ట్క్రై పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతున్నాయి. వచ్చే వారం క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్లను దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ యాజమాన్యం దేశ, విదేశీ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు రోడ్షోలను నిర్వహిస్తోంది. ఇక ఫస్ట్క్రై కొత్త ఏడాది(2024)లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తదుపరి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్కావచ్చని అంచనా. పీఈ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ రెండు సంస్థలలోనూ పెట్టుబడులున్న సంగతి తెలిసిందే. కాగా.. రెండు కంపెనీలూ వచ్చే వారం సెబీకి ప్రాస్పెక్టస్లను దాఖలు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఐపీవో ద్వారా ఫస్ట్క్రై 50 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,150 కోట్లు) సమీకరించే అవకాశముంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం దీనిలో 60 శాతం వరకూ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనుండగా.. మిగిలిన 40 శాతం ఈక్విటీని కొత్తగా జారీ చేసే వీలుంది. కాగా.. రంజన్ పాయ్ కంపెనీ ఎంఈఎంజీ ఫ్యామిలీ ఆఫీస్, హర్ష్ మరియావాలా సంస్థ షార్ప్ వెంచర్స్, హేమేంద్ర కొఠారీ సంస్థ డీఎస్పీ ఫ్యామిలీ ఆఫీస్ ఇటీవలే ఫస్ట్క్రైలో రూ. 435 కోట్ల విలువైన వాటాలను సొంతం చేసుకోవడం గమనార్హం! -
పెట్టుబడిదారులకు శుభవార్త, ఐపీఓకి ఓలా ఎలక్ట్రిక్.. ఎప్పుడంటే?
స్టాక్ మార్కెట్లోని పెట్టుబడిదారులకు శుభవార్త. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ త్వరలో ఐపీఓకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆ సంస్థ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్ డిసెంబర్ 20న సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్ట్ (DRHP)ని దాఖలు చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఐపీఓ ద్వారా 700 మిలియన్ డాలర్లను సేకరించనున్నారు. ఓలా లక్ష్యం అదే ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్ బ్యాంక్ పెట్టుబడులున్న ఓలా సంస్థ వచ్చే ఏడాదిలో ఆ సంస్థ విలువ 7 నుంచి 8 బిలియన్ డాలర్ల మధ్య ఉండేలా ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. దానికి అనుగుణంగా ఐపీఓ ద్వారా నిధులు సేకరించి.. వాటితో ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్లో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీలను తయారు చేసే మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనుందని సమాచారం. నవంబర్ 17 నుంచే ప్రయత్నాలు ప్రారంభం ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 17న తన ఐపీఓ కోసం సన్నాహకాలు ప్రారంభించింది. కంపెనీ పేరును ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ నుండి ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్గా మార్చే ప్రయత్నాలు చేసింది. అయితే ఏదైనా కంపెనీ ఐపీఓకి రావాలంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చాల్సి ఉంటుంది. అందుకే తన కంపెనీ పేరును మార్చనుంది. -
ఐపీవోకు మరో రెండు కంపెనీలు రెడీ
క్రియోజెనిక్ ట్యాంకుల తయారీ కంపెనీ ఐనాక్స్ ఇండియా, లగ్జరీ ఫర్నీచర్ కంపెనీ స్టాన్లీ లైఫ్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూకి రానున్నాయి. ఇందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్లో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేశాయి. వీటి ప్రకారం ఐనాక్స్ ఇండియా ఐపీవోకింద 2.21 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. వెరసి ఇష్యూ నిధులు ప్రమోటర్లు, వాటాదారులకు చేరనున్నాయి. మూడు దశాబ్దాలుగా ఐనాక్స్ ఇండియా క్రియోజెనిక్ ట్యాంకుల తయారీలో కార్యకలాపాలు కలిగి ఉంది. డిజైన్, ఇంజినీరింగ్, పరికరాల ఇన్స్టాలేషన్, క్రియోజెనిక్ సిస్టమ్స్ ఏర్పాటు తదితర సర్వీసులు అందిస్తోంది. రూ. 200 కోట్ల ఈక్విటీ లగ్జరీ ఫర్నీచర్ను రూపొందిస్తున్న స్టాన్లీ లైఫ్స్టైల్స్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 91.33 లక్షల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు, వాటాదారులు విక్రయానికి ఉంచనున్నా రు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 90 కోట్లు కొత్త స్టోర్ల ఏర్పాటుకు, మరో రూ. 40 కోట్లు యాంకర్ స్టోర్లను తెరిచేందుకు వినియోగించనుంది. వీటితోపాటు ప్రస్తుతమున్న స్టోర్లను నవీకరించేందుకు రూ. 10 కోట్లు వెచ్చించనుంది. ఈ బాటలో కొత్త మెషీనరీ, పరికరాల కొనుగోలు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు రూ. 8.2 కోట్లు కేటాయించనుంది. -
టాటా టెక్నాలజీ ఐపీఓ : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ముఖ్యగమనిక!
ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి భారీ స్పందన లభిస్తోంది. ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతుండటంతో రెండో రోజు గురువారానికల్లా 15 రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ నమోదైంది. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేసింది. అయితే దాదాపు 67 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. దీంతో నేడు(24న) ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లవరకూ అందుకోనుంది. టీసీఎస్(2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 8.5 రెట్లు బిడ్స్ లభించగా.. సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 31 రెట్లు, రిటైలర్ల నుంచి 11 రెట్లు చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా మంగళవారం(21న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 791 కోట్లు సమీకరించిన విషయం విదితమే. ఫెడ్ఫినా స్పందన.. అంతంతే! రెండో రోజుకల్లా 90 శాతం బిడ్స్ : దేశీ స్టాక్ మార్కెట్లు అటూఇటుగా కదులుతున్నప్పటికీ ప్రైమరీ మార్కెట్లు పలు ఇష్యూలతో సందడి చేస్తున్నాయి. టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్, ఇరెడా పబ్లిక్ ఇష్యూలు భారీస్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రయివేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఫెడ్బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్(ఫెడ్ఫినా) ఐపీవోకు స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. ఇష్యూ రెండో రోజు గురువారానికల్లా 90 శాతమే సబ్స్క్రయిబ్ అయ్యింది. ఐపీవోలో భాగంగా 5.59 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచగా.. 5.03 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 56 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 52 శాతం చొప్పున బిడ్స్ లభించగా.. రిటైలర్లు 1.25 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. షేరుకి రూ. 133–140 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ సుమారు రూ. 1,093 కోట్లు సమీకరించా లని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా రూ. 601 కో ట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు మరో 3,51,61,723 షేర్ల(రూ. 492 కోట్ల విలువ)ను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదా రులు విక్రయానికి ఉంచనున్నారు. యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్ల జారీ ద్వారా మంగళవారం(21న) రూ. 325 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. -
ఐపీవో.. హాట్ కేక్ - తొలి రోజే మంచి స్పందన
దేశీ స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులు చవిచూస్తున్నప్పటికీ ఇటీవల ప్రైమరీ మార్కెట్లు కొత్త ఇష్యూలతో కళకళలాడుతున్నాయి. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతుండటంతో పలు కంపెనీలు లిస్టింగ్ బాట పడుతున్నాయి. తాజాగా టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్ రిఫైనరీ, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూలు ప్రారంభంకాగా.. తొలి రోజే అధిక స్థాయిలో స్పందన లభించడం గమనార్హం! వివరాలు ఇలా.. టాటా టెక్నాలజీస్ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల టాటా గ్రూప్ కంపెనీ టాటా టెక్నాలజీస్ ఐపీవో తొలి రోజే అధిక సబ్స్క్రిప్షన్ను సాధించింది. ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో ప్రారంభమైన వెంటనే భారీగా బిడ్స్ దాఖలయ్యాయి. షేరుకి రూ. 475–500 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 6.5 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. కంపెనీ 4.5 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 29.43 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. వెరసి 24న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 3,043 కోట్లవరకూ అందుకోనుంది. టీసీఎస్(2004) తదుపరి రెండు దశాబ్దాలకు టాటా గ్రూప్ నుంచి వస్తున్న ఐపీవోకాగా.. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 4 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 11.7 రెట్లు, రిటైలర్ల నుంచి 5.4 రెట్ల చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా మంగళవారం(21న) యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 791 కోట్లు సమీకరించిన విషయం విదితమే. మొత్తం 6.08 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. వీటిలో మాతృ సంస్థ టాటా మోటార్స్ 4.63 కోట్ల షేర్లను ఆఫర్ చేస్తోంది. ఫ్లెయిర్ రైటింగ్ పెన్నులు, స్టేషనరీ ప్రొడక్టుల తయారీ కంపెనీ ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్ ఐపీవో తొలి రోజే పూర్తి సబ్స్క్రిప్షన్ను సాధించింది. షేరుకి రూ. 288–304 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 2.17 రెట్లు అధిక స్పందన నమోదైంది. కంపెనీ 1.44 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 3.13 కోట్లకుపైగా షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 53%, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 2.78 రెట్లు, రిటైలర్ల నుంచి 2.86 రెట్లు చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. ఇష్యూలో భాగంగా రూ. 292 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. మరో రూ. 301 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్ గ్రూప్ సంస్థలు విక్రయానికి ఉంచాయి. 24న ముగిసే ఇష్యూ ద్వారా రూ. 501 కోట్ల వరకూ అందుకోనుంది. గాంధార్ ఆయిల్ ప్రైవేట్ రంగ కంపెనీ గాంధార్ ఆయిల్ రిఫైనరీ(ఇండియా) ఐపీవో తొలి రోజే అధిక సబ్స్క్రిప్షన్ను సాధించింది. షేరుకి రూ. 160–169 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూకి 5.5 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. కంపెనీ 2.12 కోట్లకుపైగా షేర్లను ఆఫర్ చేయగా.. 11.72 కోట్లకుపైగా షేర్ల కోసం దరఖాస్తులు లభించాయి. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 1.3 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 7.7 రెట్లు, రిటైలర్ల నుంచి 6.9 రెట్ల చొప్పున బిడ్స్ దాఖలయ్యాయి. 24న ముగియనున్న ఇష్యూ ద్వారా రూ. 501 కోట్లవరకూ అందుకోనుంది. ఇష్యూలో భాగంగా రూ. 302 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా 1.17 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. -
Tata Tech: గంటలోనే అమ్ముడైన 4.5 కోట్ల షేర్లు
ఇరవై ఏళ్ల తర్వాత టాటా గ్రూప్ నుంచి ఐపీఓ వచ్చింది. మదుపరులు ఎదురుచూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ 22న ప్రారంభమయింది. నవంబర్ 24తో సబ్స్క్రిప్షన్ ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.3042.5 కోట్లు సమీకరించనున్నారు. ఆఫర్ ఫర్ సేల్ కింద 22వ తేదీన 4,50,29,207 (నాలుగున్నర కోట్లు) షేర్లను అందుబాటులో ఉంచగా ఐపీఓ మొదలైన గంటలోనే పూర్తిగా సబ్స్క్రైబ్ అయ్యాయి. టాటా మోటార్స్కు చెందిన టాటా టెక్నాలజీస్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసెస్ సంస్థ. టాటా మోటార్స్, జాగ్వార్ ల్యాండ్రోవర్ సహా టాటా గ్రూప్లోని ఇతర సంస్థలకు ఇది ప్రధానంగా సేవలందిస్తోంది. ఐపీఓలో భాగంగా టాటా మోటార్స్ 11.4 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించనుంది. ఇతర ప్రైవేటు ఈక్విటీ సంస్థలైన ఆల్ఫా టీసీ హోల్డింగ్ 2.4 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 1.2 శాతం చొప్పున తమ వాటాలను విక్రయించనున్నాయి. ఐపీఓలో భాగంగా టాటా టెక్నాలజీస్, టాటా మోటార్స్ ఉద్యోగులకు 10 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. టాటా టెక్నాలజీస్ ఐపీఓకు జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఎన్ఎస్ఈ డేటా ప్రకారం ఉదయం 11 గంటలకు 8,73,22,890 బిడ్లు దాఖలయ్యాయి. అంటే 1.94 రెట్లు సబ్స్క్రైబ్ అయినట్లు తెలుస్తోంది. కేటగిరీ వారీగా నాన్ ఇన్స్టిట్యూషనల్ మదుపర్లు 2.72 రెట్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ మదుపర్ల 1.98 రెట్లు, రిటైల్ విభాగంలో 1.63 రెట్లు సబ్స్క్రైబ్ అయ్యాయి. మంగళవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి టాటా టెక్ రూ.791 కోట్లు సమీకరించింది. -
బంపరాఫర్, ఐపీఓకి టాటా టెక్నాలజీ.. ఒక్కోషేర్ ధర ఎంతంటే?
మదుపర్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఇంజినీరింగ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సర్వీసుల కంపెనీ టాటా టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అనుబంధ సంస్థ ఇష్యూ ఈ నెల 22న ప్రారంభమై 24న ముగియనుంది. ఇందుకు వీలుగా ఈ నెల 13న ఆర్వోసీ మహారాష్ట్రకు ముసాయిదా ప్రాస్పెక్టస్ను దాఖలు చేసినట్లు టాటా మోటార్స్ పేర్కొంది. ఐపీవోలో భాగంగా కంపెనీ ఈక్విటీలో 15 శాతానికి సమానమైన 6.08 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటిలో మాతృ సంస్థ టాటా మోటార్స్ 11.4 శాతం వాటాను ఆఫర్ చేయనుండగా.. పీఈ సంస్థ అల్ఫా టీసీ హోల్డింగ్స్ 2.4 శాతం వాటాను విక్రయించనుంది. ఇక టాటా క్యాపిటల్ సైతం 1.2 శాతం వాటాను ఆఫర్ చేస్తోంది. తాజాగా ధరల శ్రేణి, కనీస పెట్టుబడి సహా ఇతర కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఐపీఓలో ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.475-500గా నిర్ణయించింది. ఈ లెక్కన అత్యధిక ధర వద్ద కంపెనీ రూ.3,042 కోట్లు సమీకరించనుంది. కాగా.. టాటా టెక్నాలజీస్లో టీపీజీ రైజ్ క్లయిమేట్కు 9.9 శాతం వాటాను విక్రయించేందుకు గత నెలలో టాటా మోటార్స్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 1,614 కోట్ల డీల్ను కుదుర్చుకుంది. -
బిలియనీర్ జాబితాలో ఎంట్రీ.. రూ.8వేల కోట్ల సంపద.. ఎలా సాధ్యమైందంటే
మంచి బిజినెస్ ఐడియా ఉంటే కోటీశ్వరులు కావడం సులువేనని చాలా మంది నిరూపిస్తున్నారు. స్టార్టప్ కంపెనీ స్థాపించి లాభాలు పొందుతున్నారు. తర్వాత కొన్ని రోజులకు ఐపీఓ ద్వారా స్టాక్మార్కెట్లో లిస్ట్ అయి కోట్లు గడిస్తున్నారు. దాంతో ఏళ్లుగా మార్కెట్లో ఉంటున్న సంపన్నుల సరసన కొత్త బిలియనీర్లు చేరుతున్నారు. ఈ క్రమంలో తాజాగా భారత బిలియనీర్ల జాబితాలో కొత్తగా ప్రదీప్ రాథోడ్ స్థానం సంపాదించారు. అసలు ఈయన ఎవరు? ఏ వ్యాపారం చేస్తుంటారు.. వంటి అంశాల గురించి తెలుసుకుందాం. వంట గదుల్లో ఉపయోగించే వస్తువులు, థర్మోవేర్ ఉత్పత్తులను తయారుచేసే కంపెనీ సెల్లో వరల్డ్ ఛైర్మన్గా ప్రదీప్ రాథోడ్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన కంపెనీ ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. మార్కెట్లోని డిమాండ్ వల్ల పెట్టుబడిదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ స్టాక్ను కొనుగోలు చేయడంతో స్టాక్ ధర అమాంతం పెరిగింది. దాంతో తన సంపద కూడా పెరిగి బిలియనీర్గా మారిపోయారు. ఆయనకు కంపెనీలో 44 శాతం వాటా ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ప్రదీప్ రాథోడ్ వద్ద రూ.8,300 కోట్ల సంపద ఉన్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. ఆయన బడామియా చారిటబుల్ ట్రస్ట్కు ట్రస్టీగా కొనసాగుతున్నారు. జేఐటీఓ అడ్మినిస్ట్రేటివ్ ట్రైనింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సెల్లోవరల్డ్ కంపెనీ కిచెన్ వేర్, థర్మోవేర్, పెన్నులు, స్టేషనరీ ఉత్పత్తులను తయారు చేస్తోంది. 2017లో గాజు ఉత్పత్తుల తయారీలోకి కంపెనీ ప్రవేశించింది. 1974లో ఈ కంపెనీని స్థాపించారు. కంపెనీ తయరుచేస్తున్న ఉత్పత్తులు, కంపెనీ రాబడులు, వ్యాపార విస్తరణ వంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల మార్కెట్లో లిస్ట్ చేశారు. ప్రస్తుతం కంపెనీ డామన్, హరిద్వార్, చెన్నై, కలకత్తాల్లో కలిపి 13 తయారీ కేంద్రాలు కలిగి ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 30 శాతం పెరిగి రూ.285 కోట్లుగా నమోదైంది. ఇదీ చదవండి: పసితనంలోనే పొదుపు పాఠాలు.. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రదీప్ రాథోడ్ కుమారుడు గౌరవ్, తమ్ముడు పంకజ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్లుగా ఉన్నారు. రాథోడ్ కుటుంబం విమ్ప్లాస్ట్ లిమిటెడ్ కంపెనీకి ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది సెల్లో బ్రాండ్కు అనుబంధంగా ఉంటూ అనేక ప్లాస్టిక్ ఫర్నిచర్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఇది గతంలోనే బీఎస్ఈలో లిస్ట్ అయింది. ఈ కంపెనీ రూ.700 కోట్ల మార్కెట్ క్యాపిటల్ను కలిగి ఉంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement